N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday 22 April 2023

మా నండూరి వంశ చరిత్ర (Text Form) Ma Nanduri Vamsa Charitra

                
మా నండూరి వంశ చరిత్ర


                  అంకితం




F:\Siva Rao Nanduri.png


మా తాతగారు నండూరి శివరావు గారికి, మా బామ్మ నండూరి దుర్గాoబ గారికి




రచయిత నండూరి శ్రీ సాయిరాం


                  ముందు మాట

    మనం ఏ పని చేసినా, మాట్లాడినా, రాసినా, ఏదో ఒక ఉద్దేశ్యంతో ఆ పని చేస్తాం. దానివల్ల ఏమిటీ లాభం? ఎవరికీ లాభం? అనే అంశాలు కూడా ఉంటాయి. మన భారతదేశంలో ప్రతీవారికీ వారి జీవితంలో అప్పుడప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే నేనెవరినీ? ఎక్కడినుంచి వచ్చాను , ఎలా, ఎందుకు వచ్చాను? నా తల్లిదండ్రులు ఎవరు, నా తాత ముత్తాతలు ఎవరు ? వారి పూర్వీకులు ఎవరు? ఇదే ప్రశ్నని నేను పదేళ్ల వయసులో మా అమ్మని ప్రశ్నిస్తూ ఉండేవాడిని. ఇలా పెరిగి పెద్దవుతున్నప్పుడు నా అవగాహనను బట్టి మా అమ్మ అనేక సందర్భాలలో ఎన్నో ఆసక్తికరమైన, అద్భుతమైన  విషయాలు మా మాతామహుల, పితామహుల గురించిన వివరాలు చెప్తూ ఉండేది. మేము నండూరి వంశస్థులమనీ, ఆరుగొలను వాస్తవ్యులమనీ మాకు ముగ్గురు మేనత్తలనీ అలా చెప్తుండేది. మానాన్నగారితో కూడా  నేను చాలా చనువుగా ఉండేవాడిని.B.Sc చదువుతున్నప్పుడు కూడా మా నాన్నగారి ప్రక్కనే పడుకునేవాడిని. ఆయన కూడా  తన చిన్నతనం కబుర్లు చెబుతూ ఉండేవారు. అలాగే 1965 - 66  లో మా రెండో మేనత్త స్వరాజ్య లక్ష్మి అత్తయ్య ఇంట్లో అంటే బందరు లో బచ్చుపేట, కంసాలి కోటయ్య వీధిలో ఉండి హిందూ కాలేజిలో P .U .C చదువుతున్న రోజుల్లో, అత్తయ్య ద్వారా మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు విన్నాను. మా అత్తయ్య నాకు కన్నతల్లి లాంటి ప్రేమను అందించింది. నేను, మామయ్యగారు విద్యాభూషణ రావు గారు మేడ మీద గదిలో చెరో మంచం మీద పడుకునేవాళ్ళం. నాతో చాలా ప్రేమగా, సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. ఇలాగే మా అమ్మ కూడా మా అన్నలకి, అక్కచెల్లెళ్లకి  చాలా విషయాలు చెప్తుండేది. కొన్ని విషయాలు మా పెద్దన్నయ్య శివఫణిరాజు, రెండో అన్నయ్య శివ ప్రశాంత్, అక్క ప్రసన్న ద్వారా కూడా తెలుస్తుండేవి.  వీరు ముగ్గురు కూడా మా స్వస్థలమైన ఆరుగొలనులో ఉండటం సంభవించింది. బందరులో స్వరాజ్యం అత్తయ్య దగ్గర పెరిగిన మా రాణి వదిన, అత్తయ్యతో పాటు చాలా సార్లు ఆరుగొలనుకి వెళ్ళిoది. కొన్ని విషయాలు ఆవిడ ద్వారా తెలిసినాయి. కాబట్టి నేను ముందు ముందు చెప్పబోయే విషయాలలో ఎవ్వరూ ఆక్షేపించలేని ప్రమాణాలు ఉన్నాయి. 

ఇకపోతే రెండవ కారణం. నా పిల్లలు కూడా (శివ లాహిరి కాంత్, శివ కమల్ కాంత్ లు) ఎన్నో సందర్భాలలో మా వంశం గురించిన  వివరాలు అడుగుతూ ఉండేవారు.  సరిగా నేను మా అమ్మను అడిగినట్లుగా.  ఇందుమూలంగా కూడా నాకు మా వంశ చరిత్ర రాయాలనే ఆలోచన ఎప్పటినించో ఉన్నా, దానిని వాయిదా వేస్తూ రావడం వలన కార్య రూపం దాల్చ లేదు. 

మూడవ బలీయమైన కారణం . మూడవ బలీయమైన కారణం మా చిన్న తాతయ్య నండూరి సత్యనారాయణ గారి కుమారుల్లో నండూరి పార్థ సారథి బాబాయి గారు. ఈయన కొన్నాళ్ళు ఆంద్ర పత్రికలో పని చేశారు. ఆయన కూడా ఆయన చూడని మా తాతగారి మీద ఒక పెద్ద పరిశోధన, అనేక అభూతకల్పనలతో. ఊహాగానాలతో, అర్థ సత్యాలతో వాళ్ళు వీళ్ళు చెప్పినవి, ఆ పైన ఆయన సొంత తెలిసి తెలియని అసత్యాలను చాలా అందంగా, పాఠకుల నించి ఏదో ఒక ఆసక్తిని రేకెత్తించాలన్న ఉద్దేశ్యంతో (sensation కలిగించాలని) ఆయన మేధాశక్తిని, నకారాత్మకపు విషయాలను ప్రస్తావించారు అవి నిజమో కాదో వారికే తెలియవని  కూడా చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ముందుగా మా ముత్తాత ఆస్తి వివరాలు, ఆ తర్వాత మా తాత గారు తాను సంపాదించి తండ్రికి ఇచ్చినప్పుడు పెరిగిన  ఆస్తుల వివరాలన్నీ కూడా ఉంటాయి కదా ? అప్పుడు కదా ! నిజ  నిర్దారణ జరుగుతుంది. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే మా చిన్న తాతగారి పిల్లలoతా మా తాతగారు ఆస్తినంతా జామీనుల మూలంగా పాడుచేసారనే ఊహతో ఉన్నారు. నాలుగవ తరంలో ఉన్న మేమందరం కూడా  ఏ అపోహలు, అపార్థాలు  లేకుండా కలిసి ఉన్నాం. నంపాసా  గారి అభూత కల్పనలు, తాతగారి వ్యక్తిత్వం మీద ఆయన చేసిన విశ్లేషణ మూలంగా మా తాతగారి వ్యక్తిత్వం  మీద  దురభిప్రాయం పడకూడదు. అందుకే నాకు మా కుటుంబ పెద్ద అయినా మా ముత్తాత, తాతగార్ల అసలైన వాస్తవాలను  తెలియజేయాలనే బలమైన సంకల్పం నాలో కలిగింది. ఇందుకు కారణమైన నంపాసా గారికి కృతజ్ఞతలు.

నాకు 72 సంవత్సరాలు నిండాయి. నా కంటి చూపులో కూడా సమస్య ఉంది.మొన్న ఈ మధ్యనే పార్థు బాబాయితో మాట్లాడినప్పుడు తన website గురించి చెప్పగా దానిని నా శ్రీమతి సీత చదివి వినిపించింది. అది వింటున్న నేను మొదట దిగ్భ్రాంతి చెందాను. మా ఇంట్లో మా అందరికీ కూడా పార్థు బాబాయి అంటే అమితమైన గౌరవం. మా చిన్నతనం లో మా అమ్మ అయన రాసిన రాంబాబు డైరీని గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉండేది. మా నండూరి వారందరిలో మా తాతగారైన నండూరి శివరావు గారిలోఉన్న రచనా శక్తి. సాహిత్యాభిలాష ప్రస్ఫుటించాయి. ఎందుకంటే ఎక్కడ కూడా మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారు కానీ మా చిన్న తాత సత్యనారాయణ గారు కానీ రచనలు చేసినట్లుగా మాకెవరికి తెలియదు. పార్థు బాబాయి కూడా తన రచనలలో ఎక్కడా తెలియ పరచలేదు ఒక వేళ రాసి ఉంటె చాలా సంతోషం. 

మా నండూరి వంశ చరిత్రలో ముఖ్యంగా మేము మా నండూరి శివరావు తాతగారి వారసులమని అంటే మా నాన్నగారు, మా ముగ్గురు మేనత్తలు వారి సంతానం, తర్వాతి తరాల గురించి మా భావి నండూరి తరాల వారి కోసం వివరంగా రాయటం జరిగింది.ఇంకా వివరించాలంటే మా నాన్నగారు వారి సంతానం అంటే అన్నయ్యలు, అక్కచెల్లెళ్ళు. మా అమ్మ తరఫు వారి గురించి, మేనత్తలు గురించి విస్తారంగా చెప్పే ప్రయత్నం చేశాను. పైన చెప్పిన రెండు పేరాలలో నాకు ఎవరిద్వారా మా వంశస్తుల వివరాలు ప్రామాణిక పూర్వంగా తెలిశాయో (ఆధారంగా) చెప్పాను. అందుకే ఇందులో ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. సందర్భానుసారంగా ఉంటుందనే ఈ విశ్లేషణతో మీరు అసలు విషయాలు గ్రహిస్తారని ఆశిస్తాను.                                            

                                                                               

                                         -------- రచయిత నండూరి శ్రీ సాయిరాం

                              


                                             

                    

  

                                  

                                                        కృతజ్ఞతలు 

    మా నండూరి వంశ చరిత్ర రాయడం ఒక మహా తపస్సులాంటిది. దీనికోసం ప్రత్యేకంగా మా పెద్ద చెల్లెలు సూర్యలాలస బొంబాయి నుండి వచ్చి, రాత్రింబగళ్లు తెలుగులో టైపు చేసింది. నేను డిక్టేట్ చేస్తుంటే  రాసింది కూడా. దాదాపు 70  రోజులు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ముందుగా లాలసకి మా ప్రత్యేక అభివందనాలు.

నాకు ప్రత్యేకంగా తెలిసిన విషయాలు అమ్మా, నాన్న, అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లు, మా మేనత్తలు స్వరాజ్య లక్ష్మి, శాంత. పెద్ద వదిన ప్రమీలా రాణి, నాన్నగారి స్నేహితులు ఈ విధంగా ఎంతో మంది దగ్గర నుండి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు . సహాయ సహకారాలు అందించిన నా  భార్య నండూరి సీతా మహా లక్ష్మికి కూడా నా కృతజ్ఞతలు. నేను చెప్తుంటే తాను రాసింది. కొన్ని సార్లు  విషయాలు రెండు సార్లు రాయడం జరిగింది.  

నన్ను అన్ని విధాలా ఉత్సాహ పరచిన మా రాణి వదిన, నా కొడుకులు,కూతుర్లు.నా మేనల్లుళ్లు, మేనకోడళ్లు, వీరందరికీ నా కృతజ్ఞత


                                                       -------- రచయిత నండూరి శ్రీ సాయిరాం

                                                              


                                                   మనసులో మాట

                  

                                                    


    నేను కలలో కూడా ఎప్పుడూ ఊహించ లేదు నేను కూడా  అంటే మా నండూరి వంశ చరిత్ర లో పాలు పంచుకుంటానని. మధ్య అప్పుడప్పుడు వాట్'స్ అప్ లో కొన్ని కొన్ని నాకు తెలిసిన మా తాత. గారి విషయాలు, మా పూర్వీకుల వియాలు, అలాగే నాకు తెలిసిన మా మామగారి విషయాలు ఇంగ్లీష్ లో టైపు చేసి నా మనమళ్ళకి షేర్ చేస్తుండేదాన్ని. వాళ్ళతో పాటు మా అమ్మాయికి, అబ్బాయి కూడా పంపిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా పిల్లలిద్దరూ కూడా ఇవన్నీ రాసి పెట్టు అని అడిగారు. ఇంతలో మా సాయిరాం అన్నయ్య నండూరి వంశ చరిత్ర రాయడానికి సహాయం చేయమని అడిగితే సరే అని ఒప్పుకుని అన్నయ్య డిక్టేట్ చేస్తుంటే సీత వదినతో పాటుగా రాసి టైపు చేసాను. ఇది రాయడంలో మేమందరం ఎవరికీ తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పటం తో మా అందరికి ఎన్నో విషయాలు తెలిసి చాలా ఆసక్తికరంగా ఉండాలి. పని చేయాలన్నా అది ముందు ఒక్కరితో మొదలయి ఎంతో మంది సహాయ సహకారాలతో పూర్తి అవుతుంది అని చెప్పడానికి "మా నండూరి వంశ చరిత్ర " యే ఒక చక్కని ఉదాహరణ. మేము ప్రాజెక్ట్ చాలా ఎంజాయ్ చేసాం.
          నా పిల్లలకి తెలుగు చదవడం రాదు. ఏం రాసావో చెప్పమ్మా  అని మా అమ్మాయి నీరజ అడిగితే మా బామ్మ, చిన్నబామ్మల బావి, డాబా ఫార్సు చెప్పితే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది. చిన్నతనంలో మా అమ్మ కూడా చాలా చక్కగా ఎంతో హాస్యంగా నవ్వుతూ చెప్తుండేది. మా అందరికి కూడా నవ్వు వస్తుండేది. అలాగే ఇంకొక విషయం కూడా అమ్మ నవ్వుతూ సంఘటన ఎలా రక్తి కట్టిచ్చిందో చెప్తాను. మా పెద్ద అన్నయ్య అంటే శివరావు అన్నయ్యకి అప్పుడు 16  లేక 17  ఏళ్ళు ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాడు. రోజుల్లో అది మూడురోజుల ప్రయాణం. రైల్లో దొంగతనాల గురించి చెప్పి అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ట్రైన్లో టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టిక్కెట్లు చెక్  చేస్తూ అన్నయ్య దగ్గరకి వచ్చి టికెట్ అడిగాడు. అన్నయ్య ఏమి మాట్లాడకుండా కాలికి ఉన్న బూటు  లేసుని విప్పటం మొదలు పెట్టాడు. అది చూసి టికెట్ చూపమని అడిగితే బూట్లు ఎందుకు విప్పుతున్నాడు పిల్లాడు? పట్టుకుని తంతాడా ఏమిటి అని భయపడి రైల్వే పోలీస్ ని తీసుకుని వచ్చాడు.తోటి ప్రయాణీకులందరు కూడా విచిత్రాన్ని వినోదంగా  చూస్తూ కూర్చున్నారు. పోలీస్ ని పట్టుకుని వచ్చాక టికెట్ కలెక్టర్ కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్ళీ టికెట్ చూపమని అన్నయ్యని అడిగాడు. అన్నయ్య మళ్ళీ షూ లేస్ విప్పటం మొదలు పెట్టాడు. ఏమిటీ బాబూ! టికెట్ అడిగితే కాలి బూట్లు విప్పుతున్నావు? అని గట్టిగా మాట్లాడాడు. అన్నయ్య మారు మాట్లాడకుండా బూట్లు, సాక్సులు విప్పి అందులోనుంచి మెల్లగా టికెట్ తీసి టికెట్ కలెక్టర్ కి ఇచ్చాడు. అది చూసి పోలీస్, టి.సి., తోటి ప్రయాణీకులందరు ఆశ్చర్యంగా అన్నయ్యని ఎందుకలా చేసావు? అని అడిగారు. రైల్లో టికెట్ ఎవరైనా కొట్టేస్తారేమో అని అక్కడ దాచి పెట్టాను. అక్కడైతే  జాగ్రత్తగా ఉంటుందని సమాధానం చెప్పాడు.. టికెట్ అడిగితే నీవు మాట్లాడకుండా బూట్లు విప్పుతుంటే, నీ దగ్గర టికెట్ లేదేమో, నన్ను పట్టుకుని తంతావేమో అని భయపడి  పోలీస్ ని తీసుకొచ్చాను , భలే వాడివే అని వారిద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. తోటి ప్రయాణీకులందరూ అన్నయ్యని మెచ్చుకున్నారుట. మా అమ్మ కొడుకు తెలివితేటల్ని గర్వంగా, నవ్వుతూ చెప్పింది.ఇది రాస్తుంటే నాకయితే మా అమ్మ హావభావాలు, ఆవిడ ముఖం గుర్తుకొచ్చి నవ్వొస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో సంఘటనలు వివరించాం. నిజంగా చాలా ఎంజాయ్ చేసాను నేనయితే.
          మా తాతగారి పుట్టుకే ఒక విచిత్రం, ఆయన మా అందరికోసమే బ్రతికారా అని అనిపిస్తుంది. ఆయన రోజుల్లో అంటే యే సౌకర్యాలు లేని రోజుల్లో ఎలా అంత స్టాండర్డ్ అయినా  వైద్య కోర్స్ విషయాలు, వివరాలు  సేకరించారు? ఎంత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ,చక్కగా ప్లాను చేసుకుని, ఐదేళ్లు ఎవ్వరి మీదా ఆధారపడకుండా తనకు తానుగా కష్టపడి, అనుకున్నది సాధించి, విజయవంతంగా ఆరుగొలనుకి తిరిగి వచ్చారో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రోజుల్లో అయితే అన్ని వివరాలు మన చేతి వేళ్ళ మీదనే ఉన్నాయి కానీ అప్పుడు అలా కాదు కదా! అయితే తాత్తగారి స్నేహితుడి గురించి నాకెలా తెలిసిందో చెప్తాను. 1972 లో నాకు బొంబాయిలో ఒక తెలుగు ఫామిలీ పరిచయమయింది. ఆవిడ నేను ఇంకొక ఫామిలీని పరిచయం చేస్తానని ఘంటసాల ప్రసాద్ గారింటికి తీసుకుని వెళ్ళింది. నేను నండూరి వారి ఆడపడుచుని అని తెలియగానే ప్రసాద రావుగారు మహా సంతోషపడి పోయారు. నేను మా తాతగారి పేరు చెప్పగానే ఆయన ఇంకా సంతోషపడి మా నాన్నగారు, మీ తాతగారు ఇద్దరు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కలకత్తాకు పారిపోయి డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరిని ఆరుగొలనులో ఇంట్లోకి రానీయకుండా గొడ్లపాకలో పెట్టడం అన్నీ ఆయనే చెప్పారు. కానీ ఆయన చాలా చిన్నతనంలోనే హార్ట్ అట్టాక్ తో మరణించారు. లేకపోతె ఇంకా బోలెడన్ని వివరాలు వాళ్ళిద్దరి గురించి చెప్పేవారు. వాళ్ళ అమ్మగారు కూడా తాతగారి ప్రాణం పోయినప్పుడు  విజయవాడ నుండి  తాతగారి స్నేహితుడే  మా బామ్మని, అత్తయ్యలని, తాతగారి మృత శరీరాన్ని ఆరుగొలనుకి తీసుకెళ్లారని కూడా చెప్పింది. ఆయనే ఘంటసాల సీతా రామ శర్మ గారు. ఆయన భార్య దుర్గాo కూడా ఆరుగొలను నండూరి వారి ఆడపడుచు  (ప్రసాద రావు గారి తల్లి ). ఇలా అనుకోకుండా నాకు తాతగారి స్నేహితుడి కుటుంబంతో పరిచయం అయింది. తాతగారు, ఘంటసాల గారు ప్రాణ స్నేహితులయితే నేను, వారి కోడలు విజయా ప్రసాద్ అంతకన్నా ప్రాణ స్నేహితులం. మా ఇద్దరికైతే డెప్ప్రెషన్లో ఎప్పుడైనా ఉంటే  telepathy ద్వారా మెసేజెస్ అందుతుంటాయిఅప్పుడు వెంటనే ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం ఇండియా లో ఉన్నా అమెరికాలో ఉన్నా.భోపాల్ లో ఉన్నా . ప్రస్తుతం ఆవిడ భోపాల్ లో పెద్ద కొడుకైన మనోజ్ దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న కొడుకైన మహేష్ దగ్గరకి అమెరికా వెళ్తుంది.

 ఇలా రాస్తూ పోతుంటే ఎన్ని మధురమైన స్మృతులు ఉన్నాయో చెప్పలేం. రాస్తున్నప్ప్పుడు ఏదో ఒకటి గుర్తుకి రావడం అరే ! ఇది మర్చి పోయాం 1 అది రాయాలి అని ఇలా  ఇలా ఆలోచించుకుంటూ ముందుకి వెళ్లిపోయాం. అలాగే మా అమ్మ ఎప్పుడూ మాకు ''అవతల వాళ్లకి అది ఉంది అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, అయ్యో ! నా దగ్గర లేద్దని ఏడిస్తే ఇంకొక కన్ను పోయి గుడ్డి వాళ్ళం అవుతాం " అని చెప్తుండేది. జీవితంలో ఎప్పుడూ కంపేర్చేసుకుని బాధపడాలేదు ఎప్పుడు. మా అమ్మ ఏది చెప్పిన ఎంత చక్కగా చెప్పేది అంటే అవి ఎన్ని జన్మలైనా మేము మర్చి పోలేం.

ఇంక మళ్ళీ మన కథకు వస్తే నేను, అన్నయ్య ఆల్మోస్ట్ మా బాల్యావస్థకి వెళ్ళిపోయి, జనగామలో కూర్చుని కథ రాస్తూ, చక్కగా దెబ్బలాడుకుంటూ, (మా వయస్సు గురించి మర్చిపోయాం ), ఒళ్ళు మండి ఒకటి రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉండి, మళ్ళీ మర్చిపోయి, చక్కగా మా ప్రాజెక్ట్ పూర్తి చేసాం. పాపం ! సీత వదిన మా ఇద్దరి మధ్య చాలా బాలన్స్ గా ఉండి ,చాలా బాగా మా ఇద్దరి తో మేనేజ్ చేసి మాకు తన సహాయ సహకారాలు అందిస్తూ తాను కూడా మాతో పాటు ప్రయాణం చేసింది. మా ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఇప్పుడు ఆలోచిస్తే ఎలా పూర్తి చేశామా అని ఆశ్చర్యంగా ఉంటుంది.

                నేనొక్కదాన్నే దూరంగా విసిరేసినట్టు బొంబాయి లో పడ్డాను నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా ,భాష కూడా తెలియదు. మా నాన్నగారి మీద నాకు విపరీతమైన నమ్మకం. మాత్రంగా నాలుగు వేళ్ళు నోట్లో పోతున్నాయంటే అది మా అమ్మ, నాన్నగారి పుణ్యం వల్లనే అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ మధ్య ఎందుకో ముందు మా అమ్మ నాన్నగార్ల పుణ్యమే కాదు తాతగారు చేసిన పుణ్యం యొక్క ఫలితం కూడా అనే భావన కలిగింది. ఎన్ని కుటుంబాలు తాతగారి మూలంగా ఉద్ధరించబడ్డాయి, ఎంతమందికి జీవనోపాధి కలిగింది. ఖచ్చితంగా వారందరి ఆశీర్వాదాలు  మా అందరికి  అందినాయి. , అందుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా అందుతాయి, మా తల్లిదండ్రుల పుణ్యఫలితం తో పాటు . బాబాయ్ గారు రాసిన మా చరిత్ర చదివాక నా ఆలోచన సరి అయిందని ధ్రువ పడింది. ఎన్నడూ చూడని మా శివరావు తాతగారంటే హీరో వర్షిప్ లాగా అయింది

దీనితో నా ముందు మాట ముగిస్తాను. అందరికి ముఖ్యంగా సాయిరాం అన్నయ్యకి నన్ను చిన్నతనం లోనికి తీసుకు పోయినందుకు కృతజ్ఞలతో.

                                                                                 --------- సూర్యలాలస 



                        

 




                       

                         

               









                          మా నండూరి వంశవృక్షం

 

ఈ నండూరి వంశ వృక్షం, నూరేళ్ళ క్రిందటి ముత్తాత గారి గ్రూప్ ఫోటో మా పార్థు బాబాయ్ గారు రాసిన నండూరి వంశ చరిత్ర నుంచి తీసుకున్నాం. మా బాబాయ్ గారికి మనః పూర్వక కృతజ్ఞతలు                                             








1927 లో తీసిన గ్రూప్ ఫోటో (నాలుగు తరాలు)


F:\vansh Foto.png

 

          మా నాన్నగారు వారి తాత గారు, తాతమ్మ,తల్లిదండ్రులు,బాబాయి, పిన్ని, వాళ్ళతో

          

          కూర్చున్న వరుసలో: ఎడమవైపు నుంచి మా తాతగారు, వారి వెనుక మా బామ్మ 


          క్రింద కూర్చున్న వారిలో: ఎడమవైపు నుంచి మా పెద్ద అత్తయ్య, స్వరాజ్యం అత్తయ్య, శాంత    

          అత్తయ్య, మా నాన్నగారు.         

                                          

                                            

                                         మా నండూరి వంశ చరిత్ర 

                                                     అధ్యాయం 1

పరిచయం

మా ముత్తాత గారు నండూరి వరాహ లక్ష్మి నరసింహం గారు. వీరి దగ్గరనుండి మా కథ ప్రారంభo. వీరికి సూర్యనారాయణ, జానకిరామయ్య అనే ఇద్దరు తమ్ముళ్లు. మా ముత్తాత గారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద నండూరి శివరావు మా తాత గారు. మన కథా నాయకుడు. చిన్న కుమారుడు సత్యనారాయణ గారు, కూతురు వెంకాయమ్మ. మా నండూరి వారు ఆరుగొలను వాస్తవ్యులు. మాకు కరణీకం వంశ పారంపర్యంగా వస్తుండేది.ఇది సాధారణంగా పెద్ద కుమారులకు సంక్రమిస్తుంది. వరాహ లక్ష్మి నరసింహం గారు ఆరుగొలనులో కరణీకం చేస్తుండేవారు. ఈ ఊరు గుడివాడకు దగ్గరలో ఉంది.

                                   ఆరుగొలను - మా ముత్తాతగారి ఇల్లు



                                   



                  మా తాత గారు శివరావు  గారికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వారు వరసగా సీత, శ్రీ రామారావు, స్వరాజ్యలక్ష్మి,శాంతకుమారి. అంటే మాకు ముగ్గురు మేనత్తలు. సీత అత్తయ్యని భావరాజు సూర్య నారాయణ మూర్తి గారికిచ్చి వివాహం చేసారు. మా సీత అత్తయ్య పెద్ద కూతురు మీనాక్షిని మా సత్యనారాయణ తాతగారి కొడుకు మురళి బాబాయికిచ్చి వివాహం చేసారు. సీత అత్తయ్య రెండవ కూతురు పద్మ వదిన, చివరన రాజు వదిన. 

మా నండూరి వంశ చరిత్ర

మా తాతగారు నండూరి శివరావుగారు & వారి సంతానం

                                                  

ఎడమవైపునుంచి : శాంత అత్తయ్య , మా బామ్మ దుర్గాoబ,  సీత అత్తయ్య ,స్వరాజ్యం అత్తయ్

మా నాన్నగారు నండూరి శ్రీ రామారావు గారు 


నండూరి శివరావుతాత గారి జన్మ వృత్తాంతం : మా తాత గారు కారణజన్ములు. వాడుక  భాషలో చెప్పాలంటే గట్టి పిండం. ఏడవ నెలలోనే అంటే prematured  బేబీ గా పుట్టారు. మా ముత్తవ్వ సీతారామమ్మకి  21 .03.1890 సం.లో జన్మించారు. ఆ రోజుల్లో మంత్రసానులు ఇంటికి వచ్చి ప్సవాలు చేస్తుండేవారు.  వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండేవి. శిశువులో చలనం లేకపోయేసరికి మృత శిశువుగా భావించి, చెత్తకుండీలో పారవేసారుట. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. చెత్తకుండీలో విస్తరాకులు, చెత్తా చెదారం వంటివి ఉండడంతో అనేక రకాల కీటకాలు, చీమలు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు వగైరా వగైరా చేరతాయి. రాత్రంతా తాతగారు అందులో గడిపారు. ఆ చెత్తకుండీలో ఉన్న మా తాతగారిని కుక్కలు, ఎలుకలు, ఇతర హానికరమైన కీటకాలు  ఏ హాని చేయకుండా సలక్షణంగా ఉన్నారంటే ఏదో ఒక అద్భుతమైన అదృశ్య శక్తి కాపాడింది అనే ఈ విషయం అక్షర సత్యం. తెల్లవారుఝామున రోడ్డు సఫాయి చేస్తుండే మనిషికి చంటిపిల్లవాని రోదన (ఏడుపు) వినిపించింది. వెంటనే వారు ఆ పిల్లవాడిని బయటకు తీసి, రాత్రి కరణం గారింట్లో ప్రసవం జరిగింది మృతశిశువని బయట పడేసి ఉంటారని భావించి, మా ముత్తాతగారికి ఆ శిశువుని అప్పగించారు. ఏడో నెలలోనే పుట్టినప్పట్నుoచే మా తాతగారికి కష్టాలు, సవాళ్లు మొదలయ్యాయి.  

                 నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మృత శిశువు జన్మించినప్పుడు బ్రాహ్మణులలో సర్వసాధారణంగా ఎంతో కొంత కర్మకాండము జరిపించి భూమిలో పాతి  పెట్టడం జరుగుతుంది. రాత్రి పూట జరపరు. ఇక్కడ మా తాతగారికి భగవంతుడి స్వరూపమైన ప్రకృతి చాలా సహాయం చేసింది. ఎందుకంటే మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహంగారు మృత శిశువని భావించి పాతిపెట్టినట్లయితే మేమంతా ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. ఇలా నండూరి వంశ చరిత్ర రాసే అవకాశం కూడా ఉండేది కాదు.

           మా తాతగారికి చిన్నప్పుడే మేనమామ కూతురునిచ్చి వివాహం చేసారు. అంటే  చిన్న తాతగారైన సత్యనారాయణ గారికి కూడా మా బామ్మ దుర్గాoబగారు మేనమామ కూతురు. మా బామ్మ గారు ఆయన కంటే పెద్దదవటం వల్ల చనువుగా "సత్తయ్యా " అని పిలిచేదిట.

మా తాతగారి కలకత్తా ప్రయాణం ; మొదటి సంఘటన : మరి ఎక్కడో మారుమూల ఆరుగొలను అనే కుగ్రామంలో పుట్టిన మా తాతగారు కలకత్తా వెళ్ళడానికి కారణం ఏమిటి? అని నేను మా అమ్మని అడిగినప్పుడు, మా అమ్మ చెప్పిన విషయం విని విస్మయం చెందాను. మా నాన్నగారి ద్వారా మా అమ్మకి తెలిసిన విషయాలు అడపా దడపా మేము అడిగినప్పుడు చెప్తూ ఉండేది. ఒక రోజు మా తాతగారు వారి తండ్రి వరాహలక్ష్మి నరసింహం గారిని ఒక కాణి అడిగారట. ఆయన దానికి సవాలక్ష ప్రశ్నలు అడిగి చివరకి ఇవ్వ లేదు. అంటే మరి ఆ రోజుల్లోకొడుకులకి పెళ్లిళ్లయినా, ఎటువంటి ఆర్ధిక స్వాతంత్య్రం కాని వాక్ స్వాతంత్య్రం లేక తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండేవారు.

ఇక రెండవ సంఘటన : మా బామ్మ మా తాతగారు భోజనం చేసిన తరువాతే తాను తినేది. రోజూ మా తాతగారు నువ్వు తిన్నావా? అని అడిగేవారట. ఒక రోజు మా తాతగారికి ఎందుకో అనుమానం వచ్చి, అన్నం గిన్నె తీసి చూసేసరికి దానిలో అడుగంటిన మాడిపోయిన అన్నం చూసి ఆయన కళ్ళవెంట నీళ్లు వచ్చాయట. మేనకోడలు (స్వయానా అన్నగారి కూతురు) అయినప్పటికీ తన తల్లి పెద్ద కోడలైన తన భార్యని చాలా రకాలుగా బాధలు పెడ్తున్నదన్న విషయం మా  తాతగారికి అర్థమైంది. ప్రతీ మహానుభావుల జీవితచరిత్ర లో వారి మనస్సుని బాధ పెట్టే విషయాలు జరిగినప్పుడు అంటే ఘోరమైన అవమానాలు, అన్యాయాలు జరిగినప్పుడు వారిలోని స్వాభిమానం  తిరుగుబాటు చేసి, ప్రపంచంలోనే వారు ప్రఖ్యాతులు అవుతారు. ఉదాహరణకి ఒక అంబెడ్కర్, మహాత్మా గాంధీ, ఈశ్వర వరప్రసాద్ రెడ్డి(Shanta Biotech), జయంతి ధర్మ తేజ, ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామ్మోహన రావు గారి లాంటి వారెందరో మహానుభావులు. వీరందరిలో కూడా నివురు కప్పిన నిప్పు మాదిరిగా ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ప్రతిభాపాటవాలు దాగి ఉండి, విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఒక తెగింపు ధోరణిలో వారు గమ్యాన్ని వెతుక్కుంటూ బయటకి వెళ్ళిపోతారు. ఈవిధంగానే తాత గారికి ఇంట్లోని ప్రతికూల పరిస్థితులు ఆయనని బయటకి వెళ్లే పరిస్థితిని కల్పించాయి. కన్న తల్లిదండ్రుల ప్రవర్తన ఆయనకీ తరువాతి జీవితం లో ఆశీర్వాదాలు, అనుగ్రహాలుగా మారాయి. అందుకు మేము మా ముత్తాత, ముత్తవ్వలు వరాహ లక్ష్మి నరసింహం, సీతారామమ్మగార్లకి ఎంతో ఋణపడి ఉంటాం. అప్పటికే తాత గారికి సాహిత్యాభిలాష చాలా ఉండేది. కఠినమైన ఛందస్సుతో ఎన్నో పద్యాలు రాసేవారు. అప్పటికే తాత గారు తండ్రిని బ్రతిమిలాడి, ప్రాధేయపడి బందరులో మిత్రుల సహాయ సహకారాలతో F.A  చదివారు. ఆ రోజుల్లో తెలివైన విద్యార్థులే కింది తరగతుల వారికి, తోటి విద్యార్ధులకి ట్యూషన్స్ చెప్పి కొంత సంపాదించి తమ చదువులకు ఖర్చు పెట్టుకునేవారు. ఇది ఆ కాలం లో సర్వసాధారణమైన విషయమే. ఈ విధంగా తాతగారు వారి తండ్రికి ఆర్ధిక భారాన్ని తగ్గించారు. 

    సాహిత్యాభిలాష, రచనా సామర్థ్యం  వారి పిల్లలకే కాక వారి తమ్ముడి పిల్లలకు కూడా వారసత్వంగా  వచ్చాయి. తాత గారి కొడుకుకే కాక వారి మనమలు, మునిమనమలు కూడా సాహిత్యాభిలాష, పఠనాభిలాష, రచనాకౌశలం వారి వద్దనుంచే పుణికి పుచ్చుకున్నారని చెప్పడం గర్వం గా ఉంది. తాత గారు, ఇంకొక ప్రాణమిత్రుడు శ్రీ ఘంటసాల సీతారామ శర్మగారు తోడుగా కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కలకత్తాలో వైద్యవిద్య చదవాలని వెళ్లిపోయారు. తండ్రి లక్ష్మి నరసింహం గారు పిసినారి కావడం వల్ల  ఆయన వద్ద నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండానే విద్యార్థులకి ట్యూషన్స్ చెప్తే వచ్చిన డబ్బుతో ముందే ఒక ప్రణాళిక వేసుకుని, బయటి ప్రపంచంలో తన భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్లిపోయారు

     కలకత్తా అంటే సుదూరమైన, అపరిచితమైన ప్రాంతానికి వెళ్లారు తాత గారు. ఆ రోజుల్లో బెంగాలీ రచయితల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎంతో మంది మేధావులు తమ రచనలతో , కవిత్వాలతో, దేశంలోని యువకులనెందరినో, ముఖ్యంగా సాహిత్యాభిలాష ఉన్న వారిలో ఒక ప్రేరణని, దేశభక్తిని పెంపొందిస్తూ, సమాజం లోని దురాచారాలని ఖండిస్తూ ఎన్నో అద్భుతమైన రచనలు చేయటం, వాటిని అన్ని భాషలలో అనువదించటం, ఈ కారణాల వల్ల కలకత్తా (అప్పటి బ్రిటిష్ రాజధాని) సహజంగానే మాతాత గారిని ఆహ్వానించింది.

     ఈ విధంగా కలకత్తా చేరిన తాత గారు, వారి మిత్రుడు ఘంటసాల సీతారామశర్మ గారు చాలా కష్టపడి ఏం తిన్నారో, ఏం తినలేదో, ఎక్కడున్నారో తెలియదు. చాలా కష్టపడి బెంగాలీ భాషను నేర్చుకుని, ట్యూషన్స్ చెప్పుకుంటూ L.C.P.S (Licentiate of the College of Physicians and Surgeons) is a medical Degree of historical importance during the British rule in India. Some Universities conferred this qualification) వైద్యవిద్య, అక్కడ చాలా (హై స్టాండర్డ్) ఉన్నత ప్రమాణాల్లో విద్య బోధించబడింది. వీరికి సర్జరీలు కూడా చేసే ప్రావీణ్యం, అర్హత ఉంటుంది. ఈ కారణాల వల్ల మాతాతగారు కలకత్తాకు ఈ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళటం జరిగింది. నాయకత్వపు లక్షణాలున్న తాతగారు అనతి కాలం లోనే సాహితీపరులైన బెంగాలీ రచయితలను, కళాకారులను ప్రభావితం చేయగలిగారు. అప్పట్లో ఎం బి బి ఎస్ అన్న విద్య ఇంకా రాలేదు. కలకత్తా చేరిన కొద్దీ కాలానికి ఆరుగొలనులో ఉన్న తన తండ్రికి తన క్షేమ సమాచారాలు, తన విద్యా వివరాలను తెలుపుతూ కొంత డబ్బుని పంపమని రాసారు. దానికి సమాధానంగా ప్రోనోటు మీద అప్పుగా కొంత డబ్బు పంపారు. తాతగారు ఆరుగొలనుకి రాగానే తండ్రి వద్ద తీసుకున్న అప్పుని పూర్తిగా తీర్చి వేశారు. అంటే తాత గారు తండ్రి ఆర్ధిక సహాయం లేకుండా, ట్యూషన్స్ చెప్పుకుంటూ, అనేక రకాలుగా కష్ష్టపడి, నెలకు పదిహేను రూపాయలు సంపాదించుకుంటూ, ఇద్దరు మిత్రులు ఒకరికొకరు తోడుగా సహాయ సహకారాలతో, కష్టసుఖాలను పంచుకుంటూ, వైద్యవిద్యను పూర్తి చేసారు. క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యారు. మా తాతగారు, సామ్రాట్ చంద్రగుప్త వంటి ఎన్నోబెంగాలీ నాటకాలను  తెలుగులో అనువాదం చేసారు. ఎన్నో ఛందోబద్ధమైన పద్యాలనూ కూడా ఆయన రాసారు. ఇవన్నీ నా చిన్నతనం లో జనగామలో చూసాను. కాకపోతే ఈ పద్యాలూ రాసిన పుస్తకం అప్పటికే శిథిలావస్థలో ఉండింది. అవి ఏమయ్యాయో తెలియదు. వాటిని కాపాడుకోలేక పోయామని బాధ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.  మా తాతగారు కొన్ని తెలుగు సినిమాలకు మాటలు కూడా రాసారని, "పల్లెటూరి పిల్ల" అనే తెలుగు సినిమాని ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ నవల ఆధారంగా రాసారని, బహుశా బి.A . సుబ్బారావు అనే ఆయన దాన్ని మా తాతగారి పేరు  బదులు తన పేరు రాసుకోవడం జరిగింది అని మా అమ్మగారు నాకు చెప్పటం గుర్తుంది. మా తాతగారు చాలా భోళా మనిషి. అందరిని చాలా తొందరగా నమ్మేవారు. చాలామంది ఆయనకి మిత్రులుగా నటిస్తూ, ఆయనలోని కళాభిమానాన్ని, సాహిత్యాభిలాషని గమనించి, రకరకాల వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న నాటక సమాజాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ విధంగా చాలా ధనాన్ని వారు కాజేయడం జరిగింది. ఆ రోజుల్లో నాటక సమాజాలు విరివిగ, తెలుగునాడు లో లెక్కకు మించి ఉండేవి. చాలా మంది బ్రాహ్మణులు ఈ సమాజాలు స్థాపించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అభాసుపాలై అపనిందలు పడినవారు కూడా ఉన్నారు. సమాజంలో అన్ని రకాలవారు ఉంటారు కదా! మా ఇంకొక తాతగారు నండూరి రామచంద్రరావుగారి రెండవ కుమారుడైన నండూరి  సుబ్బారావు బాబాయి గారు కూడా ఇటువంటి నాటక సమాజంలో నటిస్తూ ఉండేవారు. తానే స్వయంగా ఒక నాటకాన్ని రచించి, ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ అన్నయ్య చేత నటింపజేసి, బందరులో ప్రదర్శించి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు. వారిఛ్చిన కప్పుని ఆరుగొలను స్కూల్ లో ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. అంత  చిన్న కుగ్రామంలో పుట్టి, తగినంత ఆర్ధిక స్థోమత లేక పోయినప్పటికీ, ఆయన తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ, నాటకాలు వేసుకుంటూ, ప్రైవేట్ పాఠాలు చెప్పుకుంటూ, అక్కడే co -operative సొసైటీ లో ఉద్యోగం చేస్తూ, ఎన్నో అద్భుతాలు చేస్తూ, అవకాశాలని ఆయనే సృష్టించుకున్నారు. తరువాత ఆకాశవాణి లో (అల్ ఇండియా రేడియో) విజయవాడ లో తన ప్రతిభతో ఉద్యోగాన్ని సంపాదించుకుని, ముఖ్యంగా హాస్యరసం లో మకుటం లేని మహారాజుగా ప్రపంచ ఖ్యాతిని పొందారు. దీని వల్ల, All India రేడియో లో నండూరి సుబ్బారావుగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, సమాజానికి ముఖ్యంగా యువతకి స్ఫూర్తినిచ్చే విధంగా, తన జీవితంలో చిన్న కుగ్రామం నుంచి వచ్చినా, ఆయన ఏ విధంగా సవాళ్లని చక్కటి అవకాశాలుగా ఎలా మలచుకోవాలో తెలిపారు. ఈ విధంగా ఆరుగొలను నుండి చాలా మంది మా నండూరి వారు దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇక్కడ మా నండూరి సుబ్బారావు బాబాయిగారి విషయం లో తండ్రినుంచి చక్కని సహకారం లభించింది. అప్పటికే సుబ్బారావు బాబాయి గారు తల్లిని కోల్పోయారు. రామచంద్ర రావు తాతగారు ఆరుగొలను దగ్గర ఉన్న ఒక కుగ్రామానికి కరణీకం చేస్తుండేవారు. వారి పెద్ద కుమారుడు నండూరి శ్రీరాంమూర్తి, సుబ్బారావు గారి అన్నయ్య B.Com చదివి, స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం సంపాదించుకున్నారు. అంతే కాక ఆయన తన చిన్న తమ్ముడైన కృష్ణమూర్తి గారిని స్కూల్ ఫైనల్ వరకు చదివించి స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం ఇప్పించారు. సుబ్బారావు బాబాయిగారు ఒక్కరే తండ్రికి తోడుగా వ్యవసాయ పనులలో సహాయంగా ఉంటూ ఉండేవారు. పైన చెప్పిన విధంగా అనేక పనుల చేస్తూ ఉండేవారు. బంధువులు ఒకరు రామచంద్ర రావుగారిని సుబ్బారావు గారి విషయంలో మందలించారు. ఎంతో సహృదయంతో ఆయన నండూరి సుబ్బారావు బాబాయి గారికి స్వేచ్ఛనిచ్చారు. ముందుగా మా సుబ్బారావు బాబాయ్ గారు తనకి ఆల్ ఇండియా రేడియోలో అవకాశం ఇప్పించమని మా నర్సు బాబాయ్ గారు అంటే చిన్న తాతగారైన సత్యనారాయణ గారి పెద్ద కొడుకు నరసింహా రావు గారిని అడిగారు. కాని నిజానికి బందా కనక లింగేశ్వర్ రావు గారి ప్రోత్సాహంతో ఆయన ఆలిండియా రేడియోలో చేరటం జరిగింది. మరి దీనికి భిన్నంగా మరి చాలా మంది తమ చుట్టూ ఉన్న చీకటిని తోటి మనుషులని, పరిస్థితులని, నిందిస్తూ ఉంటారు. ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తే చుట్టూ ఉన్న అంధకారం పటాపంచలవుతుంది. ఇటువంటి కొవ్వొత్తులెన్నో నండూరి సుబ్బారావు గారు, నండూరి రామ్మోహన రావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మా తాత గారు వెలిగించి సమాజం లో ఉన్న అంధకారాన్ని కూడా పటాపంచలు చేసి, వెలుగుతో నింపారు. ఒక ఆశావాది తనలోని దోషాలను సవరించుకుంటూ ప్రతికూల పరిస్థితులని కూడా తనకు అనుకూలంగా మలచుకుంటాడు.


                పద్మ వదిన, మీనాక్షి వదిన, రాజు వదిన, మామయ్య గారు, సీతత్తయ్య 

ఇక మన కథకు వస్తే మా తాత గారు డాక్టర్ పట్టా పుచ్చుకుని ఆరుగొలను వచ్చాక, తల్లిదండ్రుల నుంచి  ఎటువంటి స్వాగత సత్కారాలు లేనే లేవు. అందుకు భిన్నంగా ఆయనని ఇంటిలోనికి రానీయకుండా, పశువుల కొట్టంలోనే ఉంచారు. స్నానం వగైరాలు బయటే , భోజనం, పడక గొడ్లపాక లోనే. అంటే బయటి ప్రాంతానికి వెళ్లి వచ్చినందు వల్ల ప్రాయశ్చిత్తం అనే పేరుతొ ఒక విధంగా వెలి వేశారు. కానీ ఆయన దీనిని మౌనంగానే భరించారు. తాతగారి స్నేహితుడైన సీతారామ శర్మగారికి కూడా వారి ఇంటిలోఇదే విధమైన చేదు అనుభవం కలిగింది. మనం ప్రకృతికి ఏమిస్తామో, అది మనకు పది రెట్లు వెనక్కి తిరిగి ఇస్తుంది. మంచైనా చెడైనా అదే సిద్ధాంతం. దానికి ఉదాహరణగా ఈ సంఘటన  జరిగింది. మా తాతగారు పోయేనాటికి మా స్వరాజ్య లక్ష్మి, శాంత అత్తయ్యల వివాహాలు  కాలేదు. మా ముత్తాత అయిన వరాహ లక్ష్మి నరసింహం గారు ఆయనే స్వయంగా ఒక ముసలి వాడితో మా స్వరాజ్యమత్తయ్య వివాహం నిశ్చయించారు. ఆ పెళ్లి కొడుకుని మా అత్తయ్య కానీ, మా నాన్నగారు, మా బామ్మ ఎవరూ చూడలేదు. తీరా పెళ్ళివారు విడిదిలో దిగినప్పుడు మిగతా పెద్దవాళ్లందరితో వాళ్ళని ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ వణికిపోతున్న ముసలి పెళ్లి కొడుకుని చూసి ఏం చేయాలో మా నాన్నగారు ఇంటికి వచ్చి నిరుత్సాహంగా ఆ పెళ్ళికొడుకు ముసలివాడని మా బామ్మకి చెప్పారు. ఇలా స్వయానా సొంత  

                 

                    పెళ్ళి అప్పుడు మా స్వరాజ్యం అత్తయ్య

తాతగారే మనమరాలు గొంతు ఇంత నిర్దాక్షిణ్యంగా కోస్తారని మా బామ్మ, అత్తయ్య , మా నాన్నగారు కానీ ఎవ్వరూ ఊహించలేదు. అప్పటికే మా అత్తయ్య పెళ్లికూతురిగా తయారయి ఉండాలి. ఆవిడ అందరిలో చాలా ధైర్యవంతురాలు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. ఆవిడ ధైర్యస్తురాలు. వెంటనే ఆవిడ వరాహా లక్ష్మి నరసింహం తాతతో ," నేను ఈ ముసలివాడ్ని ఛస్తే పెళ్లి చేసుకోను,” అని కోపావేశంతో గట్టిగా అరిచింది. అక్కడ ఉన్నవాళ్ళంతా హడలిపోయారు”.  అప్పుడు మా బామ్మ కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని కూతురుని సమర్థిస్తూ “అవును మామయ్యా! నేను బావిలో దూకి నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ నా కూతుర్ని ముసలివాడికిచ్చి పెళ్లి చేయను" అని గట్టిగా ప్రతిఘటించడంతో ఆ సంబంధం తప్పి పోయింది. మా నాన్నగారు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని మా స్వరాజ్యమత్తయ్య రాణి వదినకి, నాకు చెప్పింది. ఈ విషయాన్ని నాకు చాలా చమత్కారంగా చెప్పింది. మా బామ్మ గారి ధైర్యాన్నిమెచ్చుకోవాలి. కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు.  విదేశీ మా బామ్మ గారి ధైర్యాన్ని, కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. 

                           

 స్వరాజ్యమత్తయ్య పెళ్లి విద్యాభూషణ్ రావు మామయ్య గారితో బామ్మ తమ్ముడు గూడూరు సుబ్బారావు తాతగారు కుదుర్చిన సంబంధం

అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు. మా బామ్మ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కూతురి మీద ఉన్న ప్రేమాభిమానాలని సమాజానికి భయపడి వదులుకోలేదు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదురించడం అంటే మాటలు కాదు. మా తాతగారు లేకపోయినా ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ఇద్దరు కూతుర్లకి, కొడుకుకి  అండగా నిలిచింది. ఓపికగా మంచి సహృదయత కలిగిన పరివారాలను, ఈడుజోడు సరిగ్గా ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించింది. అప్పటికే మా తాతగారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నో కార్యాలు తలపెట్టారు.  విదేశీవస్తు బహిష్కరణలో పాల్గొని ఇంట్లో ఉన్న విదేశీ వస్తువులన్నీ మంటలకి ఆహుతి చేసారు. మా నాన్నగారు మా బందరు అత్తయ్య దగ్గర ఉన్న మంచి మంచి బట్టలు మంటల్లో పడవేశారు. తాతగారు ఇలా తన ఆస్తిని కాంగ్రెస్ పార్టీకోసం స్వాతంత్య్ర ఉద్యమం కోసం కూడా ఖర్చు పెట్టారు. అలాగే ఆయన స్నేహితుడు సీతారామశర్మ గారు కూడా సంపాదించిందంతా దేశం కోసం ఖర్చు చేసారు. ఈ విధంగా మా తాతగారి మూలంగా కూడా బామ్మ లో ఆధునిక భావాలు అంకురించి ఆ ముసలి సంబంధాన్ని తిరస్కరించడంతో కనిపించాయి. మా బామ్మ ఒక ఆదర్శాన్ని మాకు చూపించింది. బామ్మకి మనమళ్ళందరి అభినందనలు. ఈ విషయంలో నాకు రేడియో నాటకం "వరవిక్రయం" గుర్తుకు వచ్చింది. అప్పటి సమాజంలో ఇటువంటి బ్రాహ్మణుల వల్ల జరిగిన అన్యాయాలను గురించి బ్రాహ్మణులలోనే, కొంతమంది మహానుభావులు తిరుగుబాటు చేసారు. ఇటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఎండగట్టారు. అందులో ఒక బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే చాలా మంది అత్తగార్లు కోడళ్ళని, బాలవితంతువుల్ని నానా రకాలుగా కష్టాలు పెట్టేవారు. దానికి ఉదాహరణే మా బామ్మ దుర్గంబగారు. మరి మా తాతగారు కలకత్తాలో ఉన్నన్నాళ్ళు ఇక్కడ తిరస్కారాలు, అవమానాలు మాత్రమే బహుమానం గా అందాయి మా బామ్మకి. ఆ రోజుల్లోనే స్వాభిమానం, ఆర్ధిక స్తోమత  ఉన్న కోడళ్ళు  అత్తగారి సాధింపుల ధోరణికి నిరసనగా  శాశ్వతంగానే అత్తగారింటికి రావడం మానేసేవారు. దీనికి  భర్తల సహకారం కూడా ఉండేది. అప్పటి బ్రాహ్మణ సమాజంలో ఉన్న ఇటువంటి దుర్మార్గాలు ఒక విధంగా చెప్పాలంటే బాధాకరమైన ప్రవర్తనలు గురించి, నేను నా చిన్నతనంలోనే అనేక గ్రంథాలు చదివాను. గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో రచనలు చేసారు. దగా పడిన బ్రాహ్మణ స్త్రీలకూ అండగా నిలిచారు. వితంతు వివాహాలని ప్రోత్సాహించారు. శారదా చట్టాన్ని తీసుకు రాగలిగారు. వారికి బ్రాహ్మణ సమాజం ఎదురుదాడులు చేయటం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, బ్రాహ్మణ సమాజం నుండి వెలివేయటం వంటివి ఎన్నో జరిగాయి. అందువల్లే కాబోలు ఈ రోజుల్లో బ్రాహ్మణులకి సరిఅయిన గౌరవం సమాజంలో లేనేలేదు. నిజంగా మా తాతగారు నండూరి శివరావుగారు, మా బామ్మ దుర్గాoబ గారిని ఎంతో గౌరవంతో మేము గుర్తు చేసుకుంటున్నాం. వారు హంస లాగా తక్కువ కాలం జీవించినా మహోన్నతంగా గడిపారు. ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం ఏమిటంటే మా తాతగారి వంశంలోని మేమందరం కూడా జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చాము. అలాగే మా చిన్న తాతగారైన సత్యనారాయణ గారి కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించి, చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే మిగతా నండూరి వంశం వారందరూ కూడా స్వయంకృషి తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నండూరి సూర్యనారాయణ గారి కుమార్తె వరలక్ష్మిగారు (బామ్మ అంటాము) ప్రపంచ ఖ్యాతి పొందిన ఇరిగేషన్ రంగం లోని డా. కే.ఎల్. రావు గారిని వివాహం చేసుకున్నారు. ఆయనే మన నాగార్జున సాగర్ డాం రూపకల్పన చేసారు. కేంద్రమంత్రి వర్గంలో మంత్రి పదవిని కూడా నిర్వహించారు. నేను 1967 వ సంవత్సరంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా శాంతత్తయ్య తో వారింటికి వెళ్లడం జరిగింది. ఆవిడ ఎంతో ఆప్యాయంగా "మా రాముడి కొడుకువా? “శివరావు అన్నయ్య మనమడివా?” అంటూ ఆనంద పడిపోయారు. దీనిని బట్టి మా తాతాగారన్నా, మా నాన్నగారన్నా వీరికి ప్రేమ,గౌరవాభిమానాలు ఉన్నాయని తెలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 

                                          అధ్యాయం 2

తాతగారు నండూరి శివరావుగారి స్వతంత్ర జీవనం 

ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రతివారికి వారి జీవితంలో, బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సంకల్పం చేసుకుంటారు. మా తాతగారు జన్మించిన అప్పటి కాల పరిస్థితులలో సరిఅయిన వైద్య సదుపాయాలు లేకుండా గ్రామంలో ఉండే ప్రజలు చాలా ఇక్కట్ల పాలవుతుండేవారు. అందుకని తాను కష్టపడి, వైద్య విద్యాభ్యాసం చేసి, ఇటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకి తనవంతుగ వైద్యాన్ని అందించాలన్న సంకల్పం మా తాతగారికి కలిగిoది. సరిగ్గా మా చిన్న అన్నయ్య శివ ప్రశాంత్ కి కూడా ఇదే సంకల్పం కలిగి, హోమియో వైద్య విద్యను అభ్యసించారు. తాను చిన్నప్పుడు రుమాటిజం తో బాధపడుతుండగా హోమియో మందు అద్భుతంగా పని చేసింది. ఆ ప్రేరణతో గుడివాడలో APH మెడికల్ కాలేజీ లో చేరి, డొమినియన్ ఫస్ట్ గా పాసు అయ్యాడు. 3 goldmedals ని సాధించాడు. ఇంటర్నేషనల్ లెవెల్ లో తాను సమర్పించిన పరిశోధనకు సంబంధించిన పేపర్లు ఎంతో ప్రశంసలు అందుకున్నాయి. (మెదడువాపు వ్యాధికి (Encephalitis) కి బెల్లడోనా (Belladona) చాలా బాగా పని చేస్తుందని తమ పరిశోధన పత్రాన్ని, ఇంటర్నేషనల్ హోమియో అసోసియేషన్, జర్మనీ వాళ్ళు అంగీకరించారు. అయితే దీనిలో డా.జి.ఎల్.ఎన్ శాస్త్రి గారు, మా ప్రశాంత్ అన్నయ్య, ఇంకొక స్టూడెంట్ కలిసి పరిశోధన చేశారు. అది వేలాది మంది ప్రాణాలను కాపాడింది),

మా తాతగారి గుడివాడ కాపురం

మా తాతగారు తన వైద్య విద్యనభ్యసించి, ఆరుగొలను వచ్చాక, మా నండూరి బంధువర్గమంతా,అంటే తాతయ్యలు, అన్నదమ్ముల పిల్లలు, వగైరా అంతా కూడా చాలా సంతోషించారు. మా తాతగారు పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎక్కడో కుగ్రామం ఆరుగొలను నుండి కలకత్తా వెళ్లిన నండూరి వంశాంకురం అప్పట్లో అత్త్యుత్తమమైన వైద్య పట్టా L C P S చదివి వచ్చినందుకు ఆరుగొలనులో పండుగ వాతావరణం తెచ్చింది. మా తాతగారి శాంతస్వభావం, పెద్దల పట్ల వారు చూపే వినయవిధేయతలు, అందరినీ ఆకర్షించాయి. తమ్ముడి ఆనందానికి  అవధులు లేవు. నండూరి వారందరూ మాకు ఇంక భయం లేదు, మా శివరావు ఉండగా మాఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు అని గర్వంగా చెప్పుకున్నారు. మరి ఆ రోజుల్లో ఇదొక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. భర్తకి చాలా ఏళ్ళు దూరంగా ఉన్న మా బామ్మ కూడా చాలా సంతోషించారు. మా తాతగారు గుడివాడలో కాపురం పెట్టారు. గుడివాడ చుట్టుపక్కల అనేక గ్రామాలనుండి వందలాది రోగులు వస్తుండేవారు. మా తాతగారు హోమ్ విజిట్స్ కి ఒక సారి గుర్రబ్బండిలో, ఇంకొక సారి కారులో, మరొక సారి నడుచుకుంటూ వెళ్లేవారు. కొద్దికాలం లోనే మా తాతగారి పేరు మారుమ్రోగింది. ఆయనకి వస్తున్న డబ్బునోట్లని లెక్కపెట్టలేనంత బిజీ గా ఉండేవారు. అసిస్టెంట్లుగా ఉన్న కాంపౌండర్లు తమ చేతివాటం ప్రదర్శించే వారు. మా తాతగారిది సాధు స్వభావం కావటంతో అందరినీ నమ్మేవారు. వైద్యులకు ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు కదా! పగలనకా, రాత్రనకా రోగులు వస్తుండేవారు. మా తాతగారు ఎన్నో స్థిరాస్తులని కూడబెట్టారు. రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్ , ముప్పైకి పైగా మలిగీలు అంటే దుకాణాలు, డెబ్బై ఎకరాలకు పైగా మాగాణీ, యాభై ఎకరాలకు పైగా మెట్ట భూములు కొన్నారు. అంతే కాక తమ్ముడు కుటుంబాన్ని కూడా తన కుటుంబoగానే భావించేవారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో ప్ర్రేమగా ఉండేవారు. తనవంతు కర్తవ్యంగా అవసరాలకు డబ్బుని తండ్రికి ఇస్తుండేవారు. మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారికి. ప్రత్యేకంగా రెండవ కొడుకు గురించి బెంగగా ఉండేది. పెద్ద కొడుకు లెక్కలేనంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఎన్నో ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. చిన్న కుటుంబం, ఒక్కడే కొడుకు, చిన్న కొడుక్కేమో బోలెడు మంది పిల్లలు. అందుకని ఆయన, మా తాతగారిని చాలా సార్లు కొడుకు సంపాదించిన స్థిరాస్తులన్నీ కూడా తన పేరు మీద బదలాయింపు (ఉమ్మడి ఆస్తిగా) చేయమని అడుగుతుండేవారు. అంతే కాక, నీ తమ్ముడు పెద్దగా చదువుకోలేదు, సంపాదన లేదు, పైగా కుటుంబం పెద్దది. అందుకని వంశ పారంపర్యంగా నా తర్వాత నీకు వచ్చే కరణీకాన్ని కూడా తమ్ముడు పేరు మీద రాసివ్వమని కూడా అడుగుతుండేవారు. ఆ రోజుల్లో కరణాలకి జీతం  అంతంత మాత్రమే ఉండేది. కానీ హోదా, ఊళ్ళో గౌరవము, పలుకుబడి హెచ్చు. కరణం గారు వస్తున్నారంటే అందరూ లేచి నిలబడాల్సిందే.

మా తాతగారు తండ్రి ప్రతిపాదనకు అంగీకరించి, సంతోషంగానే తాను సంపాదించిన ఆస్తిని తండ్రి పేరున బదలాయింపు చేశారు. అలాగే తనకి వారసత్వంగా సంక్రమించే కరణీకాన్ని కూడా, తమ్ముడికి రాసి ఇచ్చారు. ఈ ఆస్తి వివరాలన్నీ మా ముత్తాత లక్ష్మి  నరసింహం గారు,  తాతగారు,  చిన్నతాత సత్యనారాయణ గారు, మా బామ్మలు, మేనత్తలు, అతిముఖ్యంగా మా నాన్నగారి మేనమామ గూడూరు సుబ్బారావు గారికి మధ్యనే ఉన్నాయి అన్నమాట. అంతే  కాకుండా మా నండూరి పెద్దవాళ్లందరికి కూడా ఆస్తి తాతగారు డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టి రెండు చేతులా సంపాదించిన తర్వాత ఉమ్మడి ఆస్తి ఎలా పెరిగిందో , అంతకు ముందు ముత్తాత ఆస్తి ఎంత ఉందో మా బంధువర్గంలో పెద్దవాళ్ళందరికి తెలుసును. గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారందరికీ కూడా మా తాతగారంటే ప్రత్యేకమైన అభిమానం. కాలక్రమేణా ఈ వివరాలన్నీ కూడా మా నాన్నగారికి తెలియచేయడం జరిగింది.  

            తాత గారు గూడూరు మైకా గనుల్లో స్నేహితులని నమ్మి భారీగానే పెట్టుబడులు పెట్టారు. ఆయన వారినందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మారు, అది వారి మంచితనమూ, భోళాతనం . ఎటువంటి రాతకోతలు, పత్రాలు లేవు. దీనిలో బహుశా ఇద్దరు ముగ్గురు భాగస్వాములు ఉండి ఉంటారు. స్వరాజ్యం అత్తయ్య ఆ మైకా గనుల మట్టి నిండిన గాజు సీసాని తన జ్ఞాపకంగా పెట్టుకుంది. తాత గారు పరమపదించాక,  మా నాన్నగారు నండూరి శ్రీ రామారావుగారు తమ వాటాని గురించి అడిగినప్పుడు ఆ భాగస్తులు  కేవలం 1500/-  మాత్రమే ఇచ్చారట. మా నాన్న గారు ఆ డబ్బుని వారి ముఖం  మీద కొట్టి వెళ్లిపోయారు.

          తాత గారు విజయవాడకు దగ్గరలో ఉన్న గన్నవరంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అక్కడ కూడా ఆయన ప్రాక్టీస్ కొన్నాళ్ళ వరకు సజావుగానే సాగింది.  మా నాన్నగారు బందరులో హిందూ కాలేజీ లో F.A /ఇంటర్ చదివారు. చాలా స్టైలిష్ గా దర్జాగా ఉండేవారు. లాన్ టెన్నిస్, హాకీ చాలా బాగా ఆడేవారు. తాలింఖానాలో బహుశా గుడివాడలో కాబోలు వ్యాయామం చేస్తుండేవారు. తాలింఖానాలో దిగిన ఒక ఫోటోని జనగాం లో ఉన్న ఆల్బం లో చూసాను.  తాటి చెట్టంత ఎత్తునుంచి, గాలిలో మూడు పల్టీలు కొట్టి, కాలువలోకి దూకి ఈత కొట్టేవారట. అదేవిధంగా మేము కూడా జనగాం లోని మర్రి బావి, పెద్ద వ్యవసాయ భూమిలోని బావి. అక్కడ అమర్చిన మోటారుగది మీద  ఎక్కి, అక్కడ్నుంచి, మా అన్నయ్యలు, నేను బావిలోకి దూకి, బావిలో ఈతలు కొట్టేవాళ్ళం. ఆ సందర్భం లో మా నాన్నగారు తెలియచెప్పారు. అలాగే మా రెంటాల రాఘవరావు మామయ్యగారు కూడా మంచి ఈతగాడని చెప్పారు. ఒకవైపు తాతగారి ప్రాక్టీసు చక్కగా నడుస్తుంది. ఇంకోవైపు గూడూరు మైకా గనుల్లో భాగస్తులు విపరీతం గా డబ్బులు గుంజుతూ ఉండేవారు. ఈలోగా మా తాతగారికి ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటంటే తాను గూడూరులో వైద్యవృత్తి ని కొనసాగిస్తూ, అక్కడికి దగ్గరలో ఉన్న మద్రాసు లోని మెడికల్ కాలేజీ లో కొడుకుని చేర్పిస్తే, మైకాగనుల వ్యవహారాలు, తన వైద్యవృత్తి చూసుకుంటూ, అడపా దడపా మద్రాసుకి వెళ్లి కొడుకుని చూసి రావచ్చని భావించారు. అప్పటికే తాతగారు మైకా గనులలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించారు. మైకా అంటే అభ్రకం అన్నమాట.

డా.నండూరి తాత గారి స్వయంకృషి - దానశీలత : 

మా తాతగారు (తాతగారు) బాహ్య ప్రపంచంలో అనేకమంది జీవితాలను స్పృశించారు. ముఖ్యంగా చాలా మంది బీదవారు డబ్బుల్లేక, వైద్య సదుపాయాలు అందక, అనాథలుగా చనిపోతూ ఉండేవారు. అందువలన కొన్ని వేలమంది బీదవారికి ఉచితంగానే వైద్య సహాయం చేసి ఎంతో కొంత డబ్బు కూడా వారి అవసరాలకు తిరుగు ప్రయాణాలకు చేతిలో పెడుతుండేవారు. మా రెండో అన్నయ్య గుడివాడ APH medical  కాలేజీ లో చదువుతున్నప్పుడు ఎంతో మంది మా తాతగారి మంచితనాన్ని గురించి , ఆయన సంపాదించిన ఆస్తిపాస్తుల గురించి చెప్తుండేవారు. ముఖ్యంగా మా నాన్నగారి classmate డా.కామేశ్వర రావు గారు ఎన్నో సంగతులు   

        

లాలస, పిల్లలు నీరజ, ముందు శ్రీకాంత్, సాయి, అక్కయ్య, అమ్మ, వెనుక సాయిరాం, విజ్జి,(కొడుకు సుధీర్, గోపాల్ బావ, నాన్నగారు, బిందు, దుర్గ, రమణి, వెనుక పెద్దన్నయ్య, రామ్ అన్నయ్య

మా తాతగారికి సంబంధించిన స్థిరాస్తుల  గురించి, రైస్ మిల్లులు, వ్యవసాయ భూముల గురించి  తరచూ చెప్తుండేవారు. నేను కూడా ఒక సారి మా ప్రశాంత్ అన్నయ్యతో వారింటికి వెళ్లడం, అక్కడే భోజనం చేయడం, ఈ వివరాలన్నీ వినటం  జరిగింది. అప్పటివరకూ  ఈ విషయాలన్నీ మాకు అంత స్పష్టంగా  తెలియవు. మా చిన్న అన్నయ్య  ఈ విషయాలన్నీ మా నాన్నగారిని అడిగినప్పుడు అవన్నీ నిజమే అని నిర్ధారించారు. ఈ  విషయాన్ని మా స్వరాజ్యం అత్తయ్య, రాణి వదిన ధృవీకరించారు. మా నాన్నగారికి ఎప్పుడో గతించిన వైభవాన్ని, మిగతా సంగతులని తలచుకుంటూ, ఎప్పుడూ నిందారోపణ చేయటం ఇష్టం ఉండేది కాదు. మా తాతగారు  ఎంతో మందికి చేసిన ఉచిత వైద్య సేవల వలన మేలు పొందిన వారందరి ఆశీర్వాదాలు మాకెంతో లభించాయి.

మా తాతగారి ఆఖరి మజిలీ 

మా తాతగారు గుడివాడ నుండి విజయవాడకి వెళ్ళటం జరిగింది. అక్కడే మిత్రుల ప్రోద్బలంతో గన్నవరం లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.అయితే మరి గుడివాడలో అంత మంచి ప్రాక్టీసుని వదిలి అక్కడకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఆంధ్ర దేశానికి విజయవాడ నడిబొడ్డు. పెద్ద రైల్వే జంక్షను. ప్రయాణ సౌకర్యాలు చాలా ఎక్కువ మా నాన్నగారికి కూడా వైజాగ్ వెళ్ళటం చాలా సులువు. ఆయన పెరుగుతున్న తన కుటుంబ బాధ్యతతో పాటు ఆరుగొలను బాధ్యత కూడా, ఆయన సంపాదన మొదలు పెట్టినప్పట్నుంచీ కూడా ఉండేది. గూడూరు మైకా గనులలో భాగస్తులు మా తాతగారిని తెలివిగా మోసం చేసి బోలెడంత డబ్బు రాబడుతుండేవారు. వారు(భాగస్వాములు) చేసిన అప్పులకి కూడా ఈయన జమానతుగా ఉంటె భాగస్వాములు అప్పు తీర్చలేకపోతే మా తాతగారు బాధ్యులవుతారు అన్నమాట. అప్పటికే ఆయన ముందుగా చెప్పినట్లు గూడూరుకు మైకా గనుల వ్యవహారాలూ చూసుకోవచ్చన్న భావనతో, గూడూరుకు మకాం మార్చాలనుకున్నారు. అదే సమయానికి వారికి అశనిపాతంగా ఒక దుర్వార్త వచ్చింది. గూడూరు మైకా త్రవ్వకాలలో ఎటువంటి అభ్రకం బయట పడలేదని, అంతవరకూ పెట్టిన డబ్బంతా మట్టిపాలయిందని తెలిసింది. అప్పటికి మా తాతగారికి యాభై (50) ఏళ్ళు. బాగా సంపాదిస్తున్న రోజులు. సంపాదన పేరు ప్రఖ్యాతులు ఏమీ తగ్గలేదు. ఒకరోజు మే నెలలో పడక్కుర్చీలో కూర్చుని మామిడిపండు తినాలని, తీసుకురమ్మని మా స్వరాజ్యం అత్తయ్యకు చెప్పారు. ఆయనకి మామిడిపళ్లంటే చాలా ఇష్టం. మా అత్తయ్య మామిడిపండు కోసి ముక్కలు తీసుకుని వచ్చేసరికి మా తాతగారు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారని అన్నది మా చిన్న తాతగారి సభ్యులు ఒకరు అయ్యో! మా చిన్న తమ్ముడికి అన్యాయం చేసానే ! నా మూలంగా ఆస్తి అంతా పోయిందనే దిగులుతో మరణించారని రాశారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. మా తాతగారు నండూరి తాత గారు చాలా ఆరోగ్యంగా, అందంగా, బలంగా, చురుకుగా ఉండేవారు. జీవిత సమరంలో పుట్టినప్పట్నుంచే ఆయన ధైర్యంగా పోరాడారు. బందరు వెళ్లి చదువుకోవడం, ఎక్కడో దూరాన ఉన్న కలకత్తాకు ఒంటరిగా ప్రయాణం చేయటం, ఇంటికి వచ్చాక ఆయనని తండ్రి వెలివేసిన తీరు, ఆయన సంపాదించిన సంపాదనలో సింహభాగం తండ్రికి ఇవ్వటం, తండ్రి చెప్పిన విధంగానే తాను సంపాదించిన ఆస్తుపాస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తిగా రాసివ్వటం, తనకి వంశ పారంపర్యంగా వచ్చే ఎంతో అధికారాన్నీ, పెద్దరికాన్ని, హోదాని కలిగించే కరణీకాన్నితండ్రి ఒత్తిడికి, మరియూ తమ్ముడి మీద ప్రేమతో తృణపాయంగా వదిలివేసిన మహానుభావుడు. ఇటువంటి మనోనిబ్బరం కలిగిన మా తాతగారు మా దురదృష్టవశాత్తు యాభై ఏళ్ళ చిన్న వయసులోనే పోవటం చాలా బాధాకరం. మా తాతగారికి వారి తండ్రి దగ్గర నుండి పితృవాత్సల్యం కానీ, తల్లి దగ్గర నుండి మాతృవాత్సల్యం కానీ ఏమాత్రమూ లభించలేదన్నది రూఢి. మా ముత్తవ్వ కూడా ఈ విషయం లో మా ముత్తాతగారి అడుగుజాడల్లో నడిచింది. స్వంత మేనకోడలైన మా బామ్మ దుర్గామ్బగారిని చాలా రకాలుగానే బాధలు పెట్టింది. పెత్తనం అంతా ఆవిడదే. ఆశావాదులు ఎప్పుడూ కూడా తిరస్కారాలు, అపనిందలూ, అవమానాలు వేటినీ వారు ఎప్పుడూ లెక్కచేయరు. తమ గమ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకే మా తాతగారు పరమ శాంతచిత్తులు, సాదు స్వభావం కలవారని ఆయనని తెలిసినవారందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ముక్కామల నాగభూషణం గారు అప్పట్లో జర్నలిస్ట్ , విజయవాడలో ప్రతిభ/ ప్రగతి  అనుకుంటా ఆయన నిర్వహిస్తుంది. ఆయన మా తాతగారి గురించి, ఆయన గుణగణాల గురించీ, ఆయన సంపాదించినా ఆస్తిపాస్తుల గురించి మా అక్కయ్యకి ఎన్నో విషయాలు చెప్పారు. మా తాతగారి ప్రాణాలు సహస్రారం అంటే శిరస్సు ఊర్ధ్వముఖంగా పోయినాయి. రక్తపు చారలు ఆధారంగా ఈ విషయం తెలిసింది. ఈ విషయం కూడా నాగభూషణం గారి మూలంగా మాకు తెలిసింది. ఎంతో పుణ్యాత్ములకు కానీ ఇటువంటి మరణం లభించదు.

                                   


My grandfather's close friend Sri Ghantasala Sitaraama Sharma gaaru with his wife Smt.Durgamba gaaru.

He also ran away to Calcatta with my grandfather and both completed L.C.P.S , a medical Degree. He was the person who brought grandpa's dead body and grandma and auntys to Arugolanu from Vijayawada.

అధ్యాయం 3

 చీఫ్ జస్టిస్ వల్లూరి సూర్యనారాయణ రావు గారి తో పరిచయం - ఆసక్తికరమైన విశేషాలు

మా మాతామహులు వల్లూరి సూర్యనారాయణరావు గారు హైదరాబాద్ లో వకీలుగా ప్రాక్టీస్ చేస్తుండేవారు. ఆయన అఖండ మేధావి. మహా ధైర్యస్థులు. దబ్బపండు ఛాయలో ఉండేవారు. ఆయన సికింద్రాబాద్ లోని 

పారడైస్ ఎదురుగా ఉన్న వెస్లీ బాయ్స్ హై స్కూల్ లో మొదటి బ్యాచ్ లో డిస్టింక్షన్  లో పాస్ అయి గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎన్నో క్లిష్టమైన క్రిమినల్ కేసులు సమర్థవంతంగా పరిష్కరించిన ఘనత వారిది. ఆయన చేతికింద ఎంతోమంది జూనియర్ లాయర్లు , టైపిస్టులు, మున్షీలు పని చేస్తూ ఉండేవారు.ఆయన అప్పటి రోజుల్లో పదివేల వెండి రూకలు సంపాదిస్తూ ఉండేవారు. క్షణం తీరిక లేకుండా ఉండేవారు. పేరు ప్రఖ్యాతులున్న ఎంతో మంది స్వామీజీలు, సాహితీపరులు, రాజకీయవేత్తలు వస్తూ పోతూ ఉండేవారు. అందులో పప్పా రాందాసుగారు, పాండురంగడి భక్తుడు విఠల్ బాబా గారు  తరచుగా వస్తుండేవారు. మాడపాటి హనుమంత రావు, మందుముల నరసింగ రావు , బూరుగుల రామకృష్ణ  రావు గారు వంటి వారందరు కూడా, తఱచుగా అనేక మంది


                                               


  మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావు గారు

తాతగారి సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఈ కుటుంబాల మధ్య చాలా మైత్రి ఉండేది. అప్పట్లో మా తాతగారు సూర్యనారాయణ రావు గారు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో పేరుమోసిన వకీలుగా, శ్రీమంతుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. జీవితాంతం ఆయన నిజాయతీపరుడిగానే ఉన్నారు. ఎంతోమంది అమాయకమైన వారికి వారి తరఫున ఏమాత్రం డబ్బు తీసుకోకుండా వాదించి, మరణ శిక్ష పడిన అమాయకులని కూడా ఆయన రక్షించారు. అందుకు ఉదాహరణ మా నర్సింహులు తాత. 

నర్సింహులు తాతతో మా అనుబంధం 

యితడు కడు బీదవాడు. నల్గొండవాసి. అమాయకంగా ఒక హత్యకేసులో ఇరికించబడ్డాడు. అతడు మా తాతగారి కాళ్లావేళ్లా పడ్డాడు. అతడు నిర్దోషి అని గ్రహించేసిన మా తాతగారు అతని తరఫున వాదించి నిర్దోషిగా నిరూపించారు. అప్పటినుంచి అతడు జీవితాంతం “దొరా ! నీ దగ్గరే ఉంటాను”, అని చెప్పి తాతగారి దగ్గరే ఉండిపోయాడు. మా అమ్మ నండూరి రాజరాజేశ్వరికి వివాహమై జనగామలో కాపురం పెట్టినప్పుడు ఈ నర్సింహులు తాత మాతో పాటుగా జనగామకు వచ్చి చాలా సంవత్సరాలు మాతోనే ఉన్నాడు. మేమందరం "తాతా","తాతా" అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. అతని వద్ద చిన్న లెథర్ సంచి ఉండేది. దానిలో ఒక అరలో పొగాకు పొడి, ఇంకొక అరలో సన్నటి దూది, మూడో అరలో రెండు చెకుముకి రాళ్లు ఉండేవి. అతను చుట్ట  కాల్చడం చాలా గమ్మత్తుగా, గొప్పగా అనిపించేది. అతను తలపాగాలోంచి సంచిని తీసేవాడు. కోన్ షేపులో ఉన్న ఒక ఎండిన ఆకు (అది ఏమిటో తెలియదు) దానిలో ఈ పొగాకు, దూది కోరేవాడు. రెండు చెకుముకి రాళ్లు తీసి మధ్యలో కొంత దూదిని నేర్పుగా అమర్చి, చెకుముకి రాళ్లను ఒక దానితో ఒకటి దమ్ము కొడుతూ ఉండేవాడు. మధ్య మధ్యలో తగ్గిపోతున్న మంటని కొట్టినప్పుడు, రాపిడికి నిప్పురవ్వలు వచ్చి, దూది అంటుకునేది. ఈ దూది ఆకులో  రాజేస్తూ ఉండేవాడు. ఈ ప్రక్రియ అంతా చాలా తమాషాగా ఉండేది. తాత నర్సింహులుని బ్రతిమిలాడి ఆ చెకుముకి రాళ్లను తీసుకుని ఆడుతుండేవాడిని. నిప్పురవ్వల మాట దేవుడెరుగు నా చేతి వేళ్ళని గాయపరచుకుంటూ ఉండేవాడిని. దీపావళి పండగ వస్తే, అతను మాతో సమానంగా ఆటంబాంబులు కాలుస్తూ ఉండేవాడు. బాంబులు చేతిలో పట్టుకుని, దీపాలనుంచి, బాంబులు వెలిగించి చేత్తో పైకి ఆకాశం లో ఎగురవేస్తూ ఉండేవాడు. మేము ఆటంబాంబులు కాల్చే విధానాన్ని చూసి మమ్మల్ని వేళాకోళం చేస్తూ ఉండే వాడు. మా తాతగారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని తనని ఏవిధంగా కాపాడారు  వంటి  కబుర్లు కూడా చెప్తుండేవాడు. అలా చెప్తున్నప్పుడు చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకుంటుండేవాడు. మా దొర నన్నూ, మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు అని చెప్తుండేవాడు. మా అమ్మ అంటే నర్సింహులు తాతకి ఎంతో గౌరవం, ఇష్టం. రాజమ్మ దొరసాని అని ఎంతో ప్రేమగా, గౌరవంగా పిలుస్తుండేవాడు. మా అమ్మ కూడా చాలా ధారాళంగానే ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి డబ్బులు కూడా ఇస్తుండేది. పొట్టుపొయ్యి మా ఇంట్లో ఇతనే వెలిగిస్తూ ఉండేవాడు. అప్పట్లో చెక్కపొట్టు (saw dust ) ఒక బస్తా రంపపు పొట్టు మూడణాలకి గుండా అంజయ్య గారి టింబర్ మిల్లునుండి కొనేవాళ్ళం. ఒక ఇనప కుంపటి క్రిందభాగంలో చిన్న చదరపు  ద్వారం ఉంటుంది. ఈ కుంపటి మధ్యలో రోకలిని పెట్టి దాని చుట్టూ చెక్కుపొట్టుని బాగా దట్టంగా నింపేవాడు. తరువాత మెల్లగా ఆ రోకలిని బయటకి లాగే వాడు. కుంపటి మీద పాత్రలు అమర్చడానికి వీలుగా కొన్ని అమరికలు ఉండేవి. క్రింద ఉన్న చదరపు ద్వారంలో కట్టెని ఉంచి అగ్గిపుల్లతో వెలిగించినప్పుడు, ఈ కట్టెతో పాటు పొట్టులో నిప్పంటుకునేది. వంట పాత్రని కుంపటి మీద పెట్టి వంట చేయటం, వేణ్ణీళ్ళు కాచుకోవటం వంటివి అమ్మ చేస్తుండేది. ఈవిధంగా నర్సింహులు తాత, ఇంట్లో చేదోడువాదోడుగా ఉంటూ తన వయసుకు తగ్గ పనులు చేస్తూ ఉండేవాడు. వృద్ధాప్యం వచ్చాక ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఆయన్ని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లారు. అప్పటి సమాజంలో ప్రజలు అమాయకంగా, నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా అన్నింటికీ మించి నమ్మకంగా మసలుకునేవారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల గురించి మనం భావి తరాల వారికి  తెలియ పరచటం మన బాధ్యత అని భావించి, మా వంశచరిత్ర లో నర్సింహులు తాతని మా కుటుంబ సభ్యుడిగా చెప్పటం జరిగింది. ఇటువంటి పాత్రలను చూసినప్పుడు నాకు విశ్వనాథ సత్యనారాయణగారు రాసిన "వీరవల్లడు " నవలలోని ఆ వల్లడు గుర్తుకొస్తాడు. సమాజం అంటే మరి అనేక మంది ప్రజలయొక్క సమూహమే కదా ! ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే కదా సమష్టి చైతన్యం ముందుకు సాగేది.

     మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావు గారు ఈ విధంగా చాలా మందికి ఎటువంటి ఫీజు తీసుకోకుండా రక్షించిన సందర్భాలు కోకొల్లలు. మా తాతగారు తన జీవితంలో అనేక ఒడిదుడుకులతో సహవాసం చేస్తూ, చాలా కష్టపడి M.A.B.L చదివి,  జీవితంలో పైకి వచ్చారు. నేను గమనించింది ఏమిటంటే కష్టాలు, సమస్యలు, సవాళ్ల మధ్య పెరిగిన వారికి ఒక సంపూర్ణ మానసిక వ్యక్తిత్వం, విశాల దృక్పథం కలిగి ఉంటారు. అందులో మా ఇద్దరి తాతగార్ల వృత్తిలో వారికి కష్టాలు చెప్పుకున్న వాళ్ళే ఉంటారు కదా ! ఇన్ని వందల మంది  కష్టాలు, కన్నీళ్లు తుడిచే సందర్భంలో వీరికి (ఇద్దరి తాతగార్లకి) ఎంతో విశాలమైన సానుభూతితో కూడిన దృక్పథం కలగటం అనేది సహజమే కదా! మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ రావుగారు నిజాo దర్బారు లో హై కోర్టు జడ్జిగా నియమింపబడినప్పుడు, వెస్లీ బాయ్స్ హై స్కూల్ యాజమాన్యం మా తాతగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతో ఘనమైన సత్కారం చేసారు. మా తాతగారు శ్రీవిద్య, దేవీ ఖడ్గమాల ఉపాసకులు. ఆయన మడిబట్టలు ఆరవేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పూజగది ఉండేది. ఆయన మడిపంచలు ఆరవేయడానికి పైన చెక్కతో కూడిన దండెం ఉండేది. ఒక పొడవాటి కర్ర సహాయంతో మడిబట్టలని ఆరవేసేవారు. ఆయన కూర్చోవడానికి ఇత్తడితో తాపడం చేసిన పీట ఉండేది. చాలా నిష్ఠగా ఆయన ఉపాసన చేసేవారు. ఎన్నో అద్భుతమైన కీర్తనలు అమ్మవారి మీద రాశారు. వాటిని మా అమ్మగారు తన శ్రావ్యమైన కంఠంతో రాగాలు కట్టి పాడుతూ ఉండేవారు. మా అందరికి కూడా ఆ పాటలు బాగానే జ్ఞాపకం. ఈ విధంగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్దికర్ బాగ్,  హిమాయత్నగర్ ఇంట్లో వచ్చే పోయే ప్రముఖుల కోసం కొన్ని ప్రత్యేకమైన గదులు కట్టించారు. పనివాళ్ళకి కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించారు. మా తాతగారికి ఇద్దరు కొడుకులు. అశోక్ మామయ్య, ఈయన కూడా న్యాయవాది వృత్తిని చేపట్టారు. శశి భూషణ్ మా రెండో మామయ్య. ఈయన నేవీ లో చేరారు 

     మా అమ్మ రాజరాజేశ్వరి దేవి, నాన్నగారు డా.శ్రీ రామారావు  



                   
\
                                 అశోక్ మామయ్య సావిత్రత్తయ్య               

                                     

           లక్ష్మి పిన్ని, మురళీ కృష్ణ బాబాయ్ గారు

   

సుశీల పిన్ని, కామేశ్వర రావు బాబాయ్ గారు          వేదమ్మ పిన్ని, శర్మ బాబాయ్ గారు                    

   

     శశి మామయ్య,                 లలిత అత్తయ్య    





 
పద్మ పిన్ని ,చంద్రం బాబాయ్ గారు

అందరిలో పెద్ద మా అమ్మగారు నండూరి శ్రీ రాజరాజేశ్వరి, తరువాత వరుసగా వేదవతి, సుశీల, పద్మ, వరలక్ష్మి. మొత్తం ఏడుగురు సంతానం.

తెలుగు వారందరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిoపదగిన సంఘటన

 మా తాతగారు న్యాయం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని ధైర్యగుణ సంపన్నుడు. ఒకసారి నిజాం నవాబుకు సంబంధించిన ఒక అధికారి ఒక హిందువు మీద దౌర్జన్యం చేసి ఆయనని అన్యాయంగా పెద్ద కుట్ర కేసులో ఇరికించాడు. మా తాతగారు తెలుగువాళ్ళలో ప్రముఖ న్యాయవాది. దగా పడిన వారికి సహాయం చేసే గుణమున్నది కాబట్టి ఆ బాధితుడు ఈయన్ని ఆశ్రయించాడు. ఎందుకంటే మిగతా న్యాయవాదులంతా ఈయన తరఫున వకాల్తా పుచ్చుకోవటానికి భయపడ్డారు. మరి నిజాం నవాబుని ఎదుర్కొన్నట్లే కదా! మా తాతగారు ఈయన తరఫున వాదించటానికి ఒప్పుకున్నారు. మా తాతగారి శ్రేయోభిలాషులందరూ, “సూర్యనారాయణ గారూ ! ఈ కేసుని తీసుకోకండి. పరిణామాలు దారుణంగా ఉండవచ్చని” హెచ్చరించారు. అందుకు మా తాతగారు "నేను న్యాయం, ధర్మం, సత్యం కోసమే పోరాడాలని ఈ వృత్తిని స్వీకరించాను. నేను అన్యాయాన్ని ఎదుర్కోవటానికి న్యాయబద్ధమైన పోరాటాన్ని చేస్తున్నాను. అంతే కానీ వ్యక్తుల కోసం కాదు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవటానికి నేను సిద్దమే అని జవాబిచ్చారు. అప్పట్లో మా తాతగారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి కూడా ఉండేది. నిజాం పరిపాలనలో హిందువులకి న్యాయం ఎప్పుడూ జరిగేది కాదు. ఈ వ్యక్తిని రక్షించడానికి మా తాతగారు రాత్రిoబవళ్ళు పని చేశారు. అప్పట్లో ఇన్ ట్లోవారంతా కూడా చాలా భయపడ్డారు. మొత్తానికి అద్భుతమైన వాదనలతో ఈ కేసుని గెలిచారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం కలిగించింది. అందరూ భయపడ్డారు కానీ నిజాంకి అతిసన్నిహితుడైన కిషన్ పర్షాద్, మరి కొంతమంది ఈ న్యాయవాది చాలా తెలివితేటలు కలవాడు. ఆయనని మన సంస్థానంలో ప్రధాన న్యాయమూర్తి గా (చీఫ్ జస్టిస్) నియమిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అందుకు నిజాం నవాబుగారు అంగీకరించారు. ఇది మావంశ చరిత్రలోనే కాకుండా తెలుగు వారందరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిoపదగిన సంఘటన. మా తాతగారు చేసిన శక్తి ఉపాసన, శ్రీ లలిత, ఖడ్గమాలా దేవీదేవతలు న్యాయ పోరాటం చేస్తున్న మా తాతగారికి అండగా నిలిచారు. బూరుగుల రామకృష్ణా రావు గారు, మాడపాటి హనుమంత రావు గారు తదితర ప్రముఖులందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.వకీలుగా మా తాతగారి సంపాదన సామాన్య అంచనాలకి అందనంత ఎత్తులో ఉండేది. మరి ఆ రోజుల్లో వకీలుగా పదివేల వెండి రూపాయలంటే అసామాన్యం. ఆయన హైద్రాబాదులో ఐదు భవనాలని కొన్నారు. అన్నిటికన్నా పెద్ద ఇల్లు బేగంపేట లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద ఎత్తైన ప్రదేశంలో ఉండేది. విశాల ఆవరణ, అనేక ఫలవృక్షాలతో, పనివాళ్ళు, తోటమాలి, కాపలాదారులు, మందీ మార్బలంతో వైభవోపేతంగా ఉండేది. ఈ 

Valluri  tails  

Valluri Tails: Grand children  and  Great  grandchildren and great great  grandchildren of Valluri Thatha gaaru 

ఇంట్లోనే మా అమ్మమ్మ మేమంతా కక్కి అని పిలిచేవాళ్ళం. మా సీత కక్కి ఎన్నో సాహసాలు చేశారు. ఇంకొక ఇల్లు హైదరబస్తీలో ఉండేది. అదే జీరాప్రాంతం ఇంకొక ఇల్లు కోటి బ్యాంకు వీధిలో ఉండేది. మరో ఇల్లు నిజామ్ కాలేజీ వెనక బషీర్ బాగ్ లో ఉండేది. నేను నా చిన్నతనంలో మేమంతా గడిపిన ఇల్లు హిమాయత్ నగర్ హార్దికర్ బాగ్ లో ఉండేది. అది కూడా రాజభవనం లాగా ఉండేది. విశాలమైన ఆవరణ . మొదట్లో ఒక పెద్ద కొబ్బరి చెట్టు , ఎన్నో సపోటా చెట్లు, మామిడి చెట్లు, వంటవాడు నాయర్ కోసం ఇల్లు  మామిడి చెట్లను ఆనుకుని పనివాళ్ళకోసం క్వార్టర్స్ . దానెదురుగా పెద్ద జామచెట్టు. సర్వెంట్ క్వార్టర్స్ కి ఎదురుగా ఒక బావి, పక్కనే ఉసిరి చెట్టు , ఆ ప్రక్కనే గుండ్రంగా సిమెంటుతో నిర్మింపబడ్డ పెద్ద నీటి హౌస్ ఉండేది. నిజానికి మా తాతగారు తన కుటుంబాన్నే కాకుండా, వారి అన్నగారి కుటుంబ భారం కూడా మోస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి పెద్ద అన్నగారు వల్లూరి జగన్నాథ రావు గారికి ఎటువంటి చదువు అబ్బలేదు. బద్ధకస్తుడు కూడా. మా తాతగారు ఎన్ని ఉద్యోగాలు వేయించినా పట్టుమని మూడు నెలలు కూడా ఉద్యోగంలో ఉండేవారు కాదు. తమ్ముడు సంపాదిస్తూ ఉంటె ఆయన యథేచ్ఛగా కాలం గడుపుతూ, తమ్ముడి పిల్లలమీద అజమాయిషీ చేస్తూ ఉండేవారు. మా సీత కక్కి (అమ్మమ్మ) వారి స్వగ్రామం రొయ్యూరు. వారి తండ్రిగారికి కరణీకం. మా సీత కక్కి అన్నలు ఎవరికీ చదువులు అబ్బలేదు. కేవలం పెద్ద అన్నగారు అచ్యుత రామయ్య గారు మాత్రమే బాగా చదువుకున్నారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. ఒడ్డూ పొడుగ్గా ఉండేవారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెసు నాయకత్వం లో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులే ధరించేవారు. మా సీత కక్కి తండ్రి గారు కృష్ణారావు గారు (కృష్ణయ్య) వారికి రొయ్యూరు కరణీకం ఉండేది. ఈయన గురించి ఆసక్తికరమైన విషయం మా అమ్మగారు చెప్తుండేవారు. మా తాతగారికి ఐదు కార్లు ఉండేవి (Plimath,Ford,Humber,Cimca,Vaxhaul). అప్పట్లో ఆయన ప్రఖ్యాతి గాంచిన పేరు గుర్తు లేదు ఒక కారు Humber కారు అనుకుంటాను. అంటే కేవలం ఆ కారు హైద్రాబాదులో నిజాం నవాబు తర్వాత మా తాతగారి దగ్గరే (వల్లూరి సూర్యనారాయణ రావు) ఈ విలువైన కారు ఉండేది. అందులో ఒక కారు

డ్రైవరు ఉత్తర్ భారత దేశానికి చెందినవాడు. ఒకసారి ఈ కృష్ణయ్య గారు (మా అమ్మ తాతగారు) హైద్రాబాదు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి ఎంత దూరమైనా నడచుకుంటూ వెళుతూ ఉండేవారట. ధాన్యపు బస్తా నెత్తి 

                                         

మా సీత కక్కి తల్లిదండ్రులు శ్రీ రొయ్యూరు వేంకట కృష్ణయ్య,శ్రీమతి రత్నమాంబ

మీద పెట్టుకుని నాంపల్లి స్టేషన్ నుండి హిమాయత్ నగర్ లో ఉన్న హార్దికర్ బాగ్ ఇంటికి నడుచుకుని వెళ్తుండేవారట. ఒక సారి ధాన్యపు బస్తాలని ఈ కారు డ్రైవరు మోయలేక అవస్థ పడుతుంటే ఈయన ఆ మాత్రం బరువు మోయ లేకపోతున్నావేమిట్రా? అని అంటే ఆ డ్రైవరు తిరిగి కృష్ణయ్యగారితో, “మీరు బ్రాహ్మణులు, పప్పు తినేవాళ్లు. మీకేం బలం ఉంటుంది? ఇంత బరువు మోయగలరా?” అంటూ వేళాకోళంగా అన్నాడుట. ఆ డ్రైవరుని పక్కకి నెట్టి వేసి ఆ బస్తా ధాన్యాన్నిఅవలీలగా భుజానికెత్తుకొని, సామాను కొట్టులో పడేసారు. అలా ఆయన నాలుగైదు బస్తాలని ఎత్తి మోసుకెళ్లి సామాన్ల గదిలో పెట్టటం జరిగింది. ఆ డ్రైవరు మోహన్ సింగ్ కి నోట మాట రాలేదుట.  ఆ డ్రైవర్ కృష్ణయ్య గారికి (మా ముత్తాత గారు) ఇంకొక సవాలు విసిరారు. మోహన్ సింగ్ స్టీరింగ్ ముందు కూర్చుని ఉండగా కృష్ణయ్య గారు రెండు చేతులతో కారు ముందు సిద్ధంగా నిలబడ్డారు. మోహన్ సింగ్ కారు స్టార్ట్ చేసి ఆక్సిలరేటర్ని నొక్కినా, కారు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందు కదలలేదుట. ఆ డ్రైవర్ మోహన్ సింగ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఆయన అంత బలశాలి. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎవరూ లేకుండా చేసేవారట. మంచి తిండిపుష్టి కలిగి, బలమైన ఆహారం తింటూండేవారట. మా అమ్మ, అమ్మమ్మ ఈ విషయాలు చెప్తుంటే ఆసక్తిగా ఆశ్చర్యo తో  వింటూ ఉండేవాళ్ళం. 

   మా తాతగారికి ఉన్న ఐదు కార్లలో ఒక కారు మా తాతగారు వాడుకునే వారు. ఇంకో కారు మా సీతకక్కి  (అమ్మమ్మ)వాడుకునేది. మూడో కారు పిల్లల కోసం. మా తాతగారికి హైద్రాబాదు లోని అతి ధనవంతులైన బెలిదే జగదీశ్వరయ్య, పాట్నీలాంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, క్లైంట్స్ గా ఉండేవారు. మా అమ్మగారి వివాహం పశ్చిమ మారేడుపల్లి, బెలిదే జగదీశ్వరయ్య గారింట్లో ఐదు రోజులు అతి వైభవంగా జరిగింది. వివాహానికి వచ్చిన అందరికి కూడా వెండి కుంకుమ భరిణెలు తాంబూలం లో పెట్టి ఇచ్చారు అని అమ్మ చెప్పింది. నా చిన్నతనంలో నేను ఈ కుంకుమ భరిణెను చూసాను.  చార్మినార్ బొమ్మ ఉంటుంది. బహుశా అది వెండి రూక అయి ఉండవచ్చును. అప్పటి పెళ్లిపత్రిక కూడా శిథిలావస్థలో ఉండగా చూడటం తటస్థించింది. మా తాతగారు సంపాదించిన ఆస్తి విలువని ప్రస్తుతం అంచనా వేస్తె కొన్ని వేల కోట్ల పైనే ఉంటుంది. ఆయన విరివిగా ఎన్నో గుప్తదానాలు చేస్తుండేవారు. ఆధ్యాత్మిక సంస్థలకి వేలల్లో విరివిగా విరాళాలు ఇస్తుండేవారు. తెలుగు వారికి పాఠశాలలు ఉండాలనీ, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలనీ బూరుగుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంత రావు గార్లు చేసిన ఉద్యమానికి తనవంతు మాట సాయం తో పాటు, ఆర్ధిక సాయం కూడా చేసారు. ఎంతోమంది పేద విద్యార్థులైన బ్రాహ్మణులకి చదువు చెప్పించారు. అందుకు ఉదాహరణ శర్మ గారు. ఆయనని మేము పంతులుగారు అని పిలిచేవాళ్ళం. ఆయన పేద బ్రాహ్మణుడు, మంచి తెలివితేటలు కలవాడు. మా తాతగారి సహాయం అర్థించినప్పుడు, ఆయనకి తన ఇంట్లోనే అన్ని వసతులు కల్పించి , అతనికి  ఇంజనీర్ విద్యను పూర్తిగా చదివించి, తన పలుకుబడితో బిర్లా గ్రూపులో మంచి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

    నేను 1966-67 లో ఢిల్లీ కి వెళ్ళినప్పుడు మా రెంటాల రాఘవ రావు మామయ్య గారు ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఉండేవారు. 

నాకు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన : 

ఒక ఆదివారం నేను ముందు గదిలో కూర్చుని ఉండగా ఒక తెలుగు ఆయన వచ్చారు. వయసు 70  ఏళ్ళు పై చిలుకే. యథాలాపంగా నన్ను ఆయన ఎక్కణ్ణుంచి వచ్చావు?అని వివరాలు అడిగినప్పుడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, రాఘవ రావు గారు మా మామయ్య అని చెప్పగానే  ఓహో ! నిజాం వాడివా? మరి నీకు హై కోర్ట్ జడ్జి వల్లూరి సూర్యనారాయణ రావు గారు తెలుసా? అని అడిగారు. నేను ఆయన మా తాతగారు అని చెప్పగానే ఆయన అమాంతం నా కాళ్ళ మీద పడ్డారు. నేను బిత్తర పోయాను. అందుకు ఆయన “బాబూ ! మీ తాతగారు ఎంతో ధర్మాత్ముడు. ఎంతో మంది బీద

                           

                         శాంత అత్తయ్య, మా రెంటాల రాఘవరావు మామయ్య గారు

బ్రాహ్మణులకి చదువు చెప్పించారు, ఉద్యోగాలు ఇప్పించారు. అందులో మా తమ్ముడు శర్మ కూడా ఉన్నాడు. ఆయన పెట్టిన భిక్ష వల్ల కోటీశ్వరుడయ్యాడు. మీలో మీ తాతగారిని చూసాను, చూసి కృతజ్ఞాత భావంతో నమస్కారం చేశాను ” అంటూ గద్గద స్వరంతో చెప్పాడు. అప్పుడు నాకు పదహారేళ్లు. ఇలాంటి సంఘటనలు నాకు చాలా జరిగాయి. నండూరి ఇంటి పేరు చెప్పగానే నండూరి రామ్మోహన రావు గారు, నండూరి సుబ్బారావు గారు మీకేమవుతారు అని ఎంతో మర్యాదగా అడుగుతూ ఉండేవారు. అలాగే తాత గారు, వల్లూరి సూర్యనారాయణ రావు గారి గురించి కూడా అడుగుతూ ఉండేవారు. ఈ శర్మ అనే పంతులుగారిని  నేను చాలా సార్లు చూడటం జరిగింది. ఈయన మద్రాసులో ఉండేవాడు. తరచూ హైదరాబాదులోని   హార్దికర్  బాగ్  ఇంటికి  వస్తుండేవారు.

                                         అధ్యాయం 4

మా పెద్దిల్లు - హార్దికర్ బాగ్ ఇల్లు వర్ణన

 మేము వేసవి  కాలం  సెలవులకి  తరచూ హార్దికర్  బాగ్  ఇంటికి వెళ్ళుతుండేవాళ్ళం. అలాగే మా వేదమ్మ పిన్ని పిల్లలు, మా మేనమామ అశోక్ మామయ్య పిల్లలు జనగామకు అంటే మా ఇంటికి  వస్తుండేవారు. బేగం పేటలో ఉన్న మా తాతగారి ఇల్లు చాలా పెద్దదని మా మూడో బావగారు బ్రహ్మాండం గోపాలకృష్ణ గారు చెప్పారు. దాదాపు ఒక ఎకరం పైన ఖాళీ స్థలం ఉండేదనీ, మధ్యలో విశాలమైన రాజభవనం లాంటి ఇల్లు ఉండేదని మా అన్నలు కూడా చెప్పారు. ఇక్కడ హార్దికర్ బాగ్ లోని ఇల్లు కూడా 

                           

                పెద్దింట్లో పోర్టికోలో మెట్ల మీద కిషోర్ , ఖడ్గమాల, చందన్ మా అశోక్ మామయ్య పిల్లలు  

చాలా విశాలంగా ఉండటం వలన మేము, మా మామయ్య, పిన్నిగార్ల పిల్లలు, మా ఆఖరి పిన్ని వరలక్ష్మి, మేమందరమూ కూడా రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంటి వెనక గుండ్రంగా నీటి హౌసు ఇంట్లో పని వాళ్ళు అందరి బట్టలు ఉతకడానికి కట్టించారు. దానిలోనే నీళ్లు నింపి మగపిల్లలందరూ, పొట్టి లాగులు వేసుకుని, ఆ నీళ్లలో ఆడుకుంటూ ఉండేవారు. ఇల్లు చాలా పెద్దది కావటం వల్ల మా అల్లరి బయటకు తెలిసేది కాదు. హౌసు పక్కనే ఒక మల్బరీ చెట్టు ఉండేది. దాని ప్రక్కనే ఒక మామిడి చెట్టు ఉండేది. మేమంతా ఈ బొంత చెట్టుపళ్ళు తింటూ ఉండేవాళ్ళం. చాలా రుచిగా ఉండేవి. మామిడి చెట్టు వెనక భాగాన ఉన్న ఒక రెండు గదుల వాటాలో ఒక కోమటి కుటుంబం ఉండేది. వాళ్లకి దోమలగూడ లో ఒక దుకాణం ఉండేది.వారింటి ముందు పెద్ద అల్ల నేరేడు చెట్టు ఉండేది. బోలెడన్ని అల్లనేరేడు పళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉండేవి. ఊరిస్తూ ఉండేవి. ఇంట్లో పనివాళ్ళు బాలమ్మ, రాములమ్మ, పెంటమ్మ, ఇంకో ఇద్దరు ఉండేవారు. ఈ బాలమ్మ కూతురు దాని అసలు పేరు మాకు తెలియదు కానీ బోడీ అని పిలుస్తుండేవాళ్ళం. చాలా హుషారుగా ఉండేది. అదే, మా కిషోర్ బావ (అశోక్ మామయ్య రెండవ కొడుకు) , వీళ్ళిద్దరూ చకచకా అంత పెద్ద చెట్టుని ఎక్కేసి , ఆ పళ్ళన్నీ కోసి, జేబుల్లో కుక్కుకుని, మిగతావి మా కోసం క్రింద పడేస్తూ ఉండేవారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను ధైర్యం కూడగట్టుకుని ఆ చెట్టు ఎక్కాను. అంతా బాగానే ఉంది. నాకు దిగేటప్పుడు మాత్రం కళ్ళు తిరిగాయి. రెండు కొమ్మల మధ్య కూర్చుండి పోయాను. క్రింద ఉన్నవాళ్ళందరూ నాకు ధైర్యం చెప్పగా, ధైర్యం చేసి ఎలాగో అలా కిందకు దిగాను. అప్పటినుంచి నన్ను అందరూ వేళాకోళం చేస్తూ ఉండేవారు. ఆ అల్లనేరేడు చెట్టు వెనక పక్కింటి వారి ప్రహారీ గోడ ఉండేది. ఆ ఇల్లు అమ్మాణమ్మ అనే తమిళుల ఇల్లు. మా సీత కక్కి, ఆవిడ ఆ గోడ దగ్గరే మాట్లాడు కుంటూ  ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం ముందుకి వెళ్ళితే ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎండిన కాయ పగలగానే లోపల  ఉన్న గింజలు గాలిలో తేలుతూ ఉండేవి. ఒక గింజ, దానిపైన అంతా చాలా పలచటి దారపు పోగుల్లాంటివి ఉండేవి. వాటిని పట్టుకోవడానికి మేమంతా పరుగులు పెడుతుండేవాళ్ళం. దీనికి ఎదురుగానే, భవనానికి ఎడమవైపున ఇంట్లోకి వెళ్ళడానికి పక్క ద్వారం, మెట్లు ఉండేవి. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళితే, ఒక మూల కారు గారేజీ ఉండేది. దాని పక్కన ఒక పెద్ద అశోక వృక్షం, దానికి ఎదురుగా విశాలమైన పోర్టికో ఉండేది. ఇక్కడే ఇంకొక కారు పెట్టేవాళ్ళు. మొత్తం ఇల్లంతా కూడా చల్లగా ఉండేది. వేసవిలో అయినా అలాగే ఉండేది. ఇది రెండoతస్థుల భవనం గ్యారేజీ ని ఆనుకుని ఇంకొక చిన్న వాటా ఉండేది. ఆ వాటాలో కొన్నాళ్ళు మలయాళీ నాయర్ వంటవాడు, తోటమాలి కం డ్రైవరు అంజయ్య ఉండేవారు. ఆ భవనం చుట్టూతా ఎంత విశాలమైన జాగా ఉండేదంటే మేము సైకిళ్ళ మీద ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళం. మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలు ఉండేవి. ముందుగా సింహద్వారం, ఎడమవైపు, కుడివైపు, పెరటివైపు కూడా ద్వారాలు ఉండేవి. ఈ సింహద్వారానికి ముందు భాగం ఎడమవైపు, చాలా విశాలమైన ఓపెన్ విండోస్ ఉండేవి. భవనానికి కుడివైపున వెళ్తే ఎడమ దిక్కున ఒక బాల్కనీ ఉండేది. మల్లె తీగ ఉండేది. మేము ఈ బాల్కనీ  ఎక్కి అక్కడ్నుంచి లోపల విశాలమైన హాలులోకి దుంకుతూ ఉండేవాళ్ళం. ఇది చాలా పెద్ద హాలు. దీనిని టెలిఫోన్ గది అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే టెలిఫోన్ అందులోనే ఉండేది. ఈ టెలిఫోను గదిలోనే ఒక చివర ఒక విచిత్రమైన టేబుల్ ఉండేది. అది పియానో బల్లలా ఉండేది. లోపల ఎన్నో అరలు ఉండేవి. అంటే మా తాతగారు, ఆ  అరల్లో ముఖ్యమైన కాగితాలు పెట్టుకునేవారన్నమాట. ఈ అరలన్నీ కప్పుతూ ఒక ప్రత్యేకమైన స్లయిడింగ్ కవర్ ఉండేది. దానికి తాళం వేసే సౌకర్యం ఉండేది. ఎడమ పక్కన ఒక స్లయిడింగ్ వుడెన్ ప్లాంక్ ఉండేది. ఎడమవైపు, కుడివైపు, చెరో మూడు సొరుగులు ఉండేవి.ఈ సొరుగులు తెరవడానికి వీలు లేకుండా పొడవాటి చెక్కలు ఉంది, పైన తాళం వేస్తె, మిగిలిన సొరుగులు కూడా తీయటానికి వీలు లేకుండా ఉండేది. టేబుల్ అంతా ప్రత్యేకమైన రెక్సిన్ కవరుతో కప్పబడి ఉండేది. ఆ తరువాత ఈ టేబుల్ నా దగ్గర చాలా సంవత్సరాలు ఉండాలి. ఖరీదైన, నాణ్యమైన టేకు తో తయారు చేసినది. ఇటువంటి ప్రత్యేకమైన, ఖరీదైన, నైపుణ్యంతో సౌకర్యంగా చేసిన బల్ల నేను ఎక్కడా చూడలేదు. 

                          

         పెద్దింట్లో పోర్టికోలో మెట్ల మీద కిషోర్ , ఖడ్గమాల, చందన్ మా అశోక్ మామయ్య పిల్లలు  

ఇప్పుడు సింహద్వారం దగ్గరకు వద్దాం.ఈ భవనాన్ని పరిచయం చేస్తాను. పోర్టికో దగ్గర ఉన్న నాలుగైదు మెట్లెక్కితే పెద్ద వరండా.లోగడ నేను చెప్పినట్టుగా కుడివైపు, ఎడమవైపు పెద్ద ఓపెన్ విండోసున్దేవి. ఎవ్వరూ ఊహించలేనంత విశాలంగా ఉండేవి. సుమారుగా 14 అడుగుల ఎత్తు గవాక్షాలు ఉంటాయి. కుడివైపు, ఎడమవైపు, అటు పక్కకి నాలుగేసి చువ్వల్లేని పెద్ద కిటికీలు ఉండేవి. మెట్లెక్కి వస్తుండగా కుడివైపు చెక్క పోస్ట్ బాక్స్ ఉండేది. మెట్లెక్కగానే ఎదురుగుండా కచేరీ హాలు ఉండేది. మెయిన్ తలుపులు రెండూ బలిష్ఠముగా చాలా ఎత్తుగా ఉండేవి.కచేరీ తలుపులని తోయడం చాలా కష్టంగా ఉండేది. ఆ హాలులో L- shape లో ఖరీదైన సోఫా ఉండేది. సులభంగా 25  మంది కూర్చొనవచ్చును. ఆ హాలు సుమారు 2500 చదరపు అడుగులు ఉండేది. చుట్టూ గోడను ఆనుకుని ఎన్నో అద్దాల బీరువాలు ప్రత్యేకంగా తయారు చేయించినవి ఉండేవి. వీటిలో వందల కొద్దీ లెథర్ బౌండ్ తో చేసిన Law పుస్తకాలు ఉండేవి. మా తాతగారు విశాలమైన కుర్చీలో కూర్చునేవారు. ఎదురుగుండా ఖరీదైన విశాలమైన బల్ల ఉండేది. ఆ పక్కనే మున్షి టేబుల్ మీద ఒక రెమింగ్టన్ టైపు రైటర్ మీద టైపు చేస్తుండేవాడు. వెనుక గోడలమీద రవి వర్మ గారి అద్భుతమైన, అతి ఖరీదైన, లైఫ్ సైజు పెయింటింగ్స్ ఉండేవి. ఆ రోజుల్లోనే వాటి ఖరీదు లక్షల్లో ఉండేది.  ఒకటి యశోదా కృష్ణ, ఇంకొకటి ప్రకృతికి సంబంధించిన చిత్రం. దానిలో చెట్లు, నది, రెండు పెద్ద పులులు. నీళ్లు త్రాగుతున్నట్లుగా ఉంది. ఇలాంటి చాలా అందమైన ఆకర్షణీయమైన పెయింటింగ్స్ తో ఆ హాలంతా అలంకరించి ఉండేది. ఇవే కాకుండా చాలా ఖరీదైన, ప్రత్యేకమైన,అందమైన చైనీస్ పాట్స్ ఉండేవి. రాస్తుంటే దానికి అంతు ఉండదు.  ఇలాంటి ఖరీదైన వస్తువులన్నీ మా తాతగారి మిత్రులైన జాగీర్దార్ల వద్ద ఉండేవి. దీనిని బట్టి మా తాతగారికి ఎంతటి కళాత్మకమైన హృదయం, ఆ సున్నిత్వం ఉందొ మనకి యిట్టె తెలిసిపోతుంది. కచేరీ హాలులో అడుగు పెట్టగానే రసజ్ఞులకి ఆయన యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గమనించి గ్రహించగలుగుతారు. గదుల యొక్క పై కప్పు చాలా ఎత్తుగా ఉండేది. కచేరీ హాలు దాటగానే కుడివైపు నేను చెప్పిన టెలిఫోను హాలు అంటే అది ఒక పెద్ద బెడ్ రూమ్  క్రింద వాడేవారు. ఆ గదిలో ప్రత్యేకమైన మంచం ఉండేది (ప్రస్తుతం అమెరికా లో వాడుతున్న క్రిబ్ లాంటిది చిన్న పిల్లలు అటూ ఇటూ వెళ్లకుండా ముందు జాగ్రత్త కోసం దీన్ని వాడేవారు). పెద్దవాళ్ళు లేనప్పుడు మేము దీనిలో దిగి చాలా అల్లరి చేస్తూండేవాళ్ళం. కచేరీకి ఎడమవైపు వస్తే మేడ మీద వెళ్ళడానికి మెట్లు ఉండేవి. మెట్ల గదిని ఆనుకుని ఒక విశాలమైన గది ఉండేది. ఇది కూడా ఒక పడక గది (bedroom ) ఈ గదిలో మొట్టమొదటిసారిగా నేను గ్రామఫోను చూడటం జరిగింది. చదరపు పెట్టె లాగా ఉండేది. దానికి ఒక హేండిల్ కూడా ఉండేది. ఒక రెడ్ బాక్స్ లో గ్రామఫోను రికార్డులు అమర్చారు. మేమంతా చాలా ఆశ్చర్యంగా చూస్తూండేవాళ్ళం. ఆ పెట్టెలో ఎవరో కూర్చుని పాడుతున్నారని అనుకునేవాళ్లం. ఆ రికార్డు మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. ఈ కుక్క కూడా ఎలా పాడుతుందబ్బా! అని అనుకునేవాళ్లం. అందులో రకరకాల హిందీ, తెలుగు పాటలు వినేవాళ్ళం.శాంతారాం ఝణక్ ఝణక్ పాయాలు బాజే , నవరంగ్ "అరె జారే హట్ నట్ ఖట్, చోడ్ మేరా గూంగట్, పలట్ కె దుంగి ఆజ్ తుఝే గాలీ రే ...., బెగానీ షాదీ మే అబ్దుల్లా దీవానా, ప్రియా  మిలన్ కో జానా, ప్రేమ్ నగర్ మే ఘర్ .., ,సైగల్, పంకజ్ మల్లిక్, మీరాబాయి పాటలు ఎన్నోఉండేవి.  అలాగే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం, కుంతీ విలాపం,ఘంటసాల గాత్రం వింటూ ఉండేవాళ్ళం.                        

                                    మా భవాని అక్కయ్య

 ఒక్కొక్కసారి కచేరీ హాల్లో మా అశోక్ మామయ్య, మా అమ్మ,  వేదమ్మ పిన్ని, సీత కక్కి వీరందరూ కలిసి సంగీత కచేరీ మహా హుషారుగా చేస్తూండేవాళ్లు. మేమంతా చుట్టూతా కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. మా అమ్మ గారు, వేదమ్మ పిన్ని పై స్థాయిలో మీరాబాయి భజన గీతాలు పాడుతుండేవాళ్లు.మా వేదమ్మ పిన్ని గొంతు చాలా పై స్థాయిలో ఉండేది. అదే పోలిక మా భవాని (వేదమ్మ పిన్ని కూతురు) అక్కయ్యకు వచ్చింది. 'జాయియే ఆప్ కహా జాయేంగే .., కహీ దీప్ జలే, కహి దిల్.., మొహబ్బత్ కె ఝూఠీ కహానీ పే రోయె.. పాటలు చాలాబాగా పాడుతూ ఉండేది. మా మామయ్య పంకజ్ మల్లిక్, సైగల్, సి. హెచ్ ఆత్మా, పాటలు అద్భుతంగా పాడేవాడు.పనిలో పని మా సీత కక్కి కూడా అంతే హుషారుగా పాడుతుండేది. మా సావిత్రత్తయ్య (అశోక్ మామయ్య భార్య)వీరందరికి చిరుతిళ్ళూ, కాఫీలు, టీలు సరఫరా చేస్తూ ఉండేది. మెట్లకి కుడివైపున ఇంకొక గది ఉండేది. ఆ గది పక్కన మా తాతగారి ప్రత్యేకమైన పూజా మందిరం ఉండేది. ఈ గదిలో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. ఒక ప్రత్యేకమైన శ్రీ చక్రం ఉండేది. మా తాతగారు పోయినాక శ్రీ చక్రాన్ని సికింద్రాబాదు మహంకాళి గుడిలో ఇవ్వటం జరిగింది. ఈ గదికి కుడివైపున ఓపెన్ డైనింగ్ హాల్ ఉండేది. ఇక్కడ పెద్దవాళ్ళంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఈ డైనింగ్ హాల్ కి ఎదురుగుండా పెద్ద వంట గది ఉండేది. డైనింగ్ హాలు, కిచెన్ ద్వారం ఎడమవైపు భూమిలో పాతిపెట్టిన రోలు ఉండేది. దీనిలోనే మా సావిత్రత్తయ్య నా పుట్టిన రోజు కి తొక్కుడు లడ్లు చేయడానికి ఉపయోగిస్తూ ఉండేది. ఈ డైనింగ్ హాలుకి కుడివైపున ఓపెన్ స్పేస్ ఉండేది. అక్కడ బట్టలు ఆరేసుకోవటానికి ఉక్కుతో చేసిన సెమి సర్కిల్ ఆకారం లో స్టాండ్ ఉండేది. ఇది భవనం యొక్క అంతర్భాగంలోనే ఉండేది. అక్కడ తలుపు తీయగానే మనం జామ చెట్టు ఉన్న ప్రదేశానికి చేరుతాం. వంట గది చాలా విశాలంగా ఉండేది. మా సావిత్రత్తయ్య గట్టు మీద వంట చేస్తుంటే పొగ పోవడానికి పైన పెద్ద చిమ్నీ ఉండేది. అప్పట్లో వంట, వంట చెరుకు మీదే సాగేది. ఆ బాత్రూమ్ లో మేము నలుగురైదుగురు పిల్లలo చిన్న చెడ్డీలు వేసుకుని , అక్కడే కింద ఉన్న  బాత్ టబ్ లో మేమంతా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ,సర్రుమని (స్లయిడింగ్) దానిలో జారుతూ ఉండేవాళ్ళం. ఈ బాత్రూమ్ తరువాత విశాలమైన వాష్ బేసిన్, దాన్ని ఆనుకుని టాయిలెట్ ఉండేది. అప్పట్లో నీళ్లు పుష్కలంగా లభిస్తుండేవి. గండిపేట నీళ్లు తియ్యగా ఉండేవి. హార్దికర్ బాగ్ లో ఉన్న ఇంటిని మేమంతా "పెద్దిల్లు" అని పిలుస్తుండేవాళ్ళం. మా వేదమ్మ పిన్ని అంటే మా అమ్మ పెద్ద చెల్లెల్ని, తెనాలి లోని ప్రముఖ అడ్వొకేట్ కొండముది శ్రీరాములు గారి రెండవ కుమారుడైన రామ లింగేశ్వర్ గారికిచ్చి వివాహం చేయటం జరిగింది. ఆయన దోమలగూడ లో రెండు పెద్ద ఇల్లు కొన్నారు. మా పెద్దింటి సరిగ్గా ఒకఁ ఐదు నిమిషాలు నడక. ఎండాకాలం వస్తే మా సీత కక్కి బంధువులు, జనగాం నుండి మేము, మా వేదమ్మ పిన్ని పిల్లలు,అందరం ఇక్కడ చేరేవాళ్ళం. గుంటూరు నుండి మా అన్నపూర్ణ కక్కి (సీత కక్కి అక్క) తాటాకు బుట్టలో రక రకాల మామిడి పండ్లు తెస్తుండేది. వచ్చే వాళ్ళు, పోయేవాళ్లతో ఇల్లంతా మహా సందడిగా ఉండేది.మా పెద్ద ఇంటి పక్కన బోలెడంత ఖాళీ స్థలాన్ని మా తాతగారు కొన్నారు. డా. రంగాచారి గారు కొంత స్థలాన్ని కొనుక్కుని మా తాతగారి  ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్నారు.ఈయన క్లినిక్ ఫిల్ఖానా లో ఉండేది.ఆయన కూడా వైద్యంలో చాలా సంపాదించారు. ఎదురుగా ఉన్న ఖాళీస్థలాన్ని చెరువు పార్థ సారథి గారు కొనుక్కున్నారు. అప్పట్లో ఆయన ఎలెక్టీసిటీ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్.డా. రంగాచారి గారి ఇంటి పక్కన కోకా రామచంద్ర రావు, పేరు మోసిన లాయరు గారు ఉండేవారు. అక్కడ దగ్గర్లోనే A. P. స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర్ రావుగారు ఉండేవారు. ఆయన భార్య మాలతి గారు. ఒకటి రెండు సార్లు నేను మా సావిత్రత్తయ్యతో, మా అమ్మతో వారి ఇంటికి వెళ్ళటం జరిగింది.ప్రతి రోజు మా పెద్దింట్లో డా. రంగాచాగారి గారి పిల్లలు, కృష్ణాజీ, రాంజీ, కోకా రామచంద్ర రావు గారి పిల్లలు గౌతమ్, సుధాకర్,రవి, మా రామన్నయ్య,కశ్యప్, (వేదమ్మ పిన్ని pillalu), మా అశోక్ మామయ్యా పిల్లలు బోసు, కిషోర్, నేను అందరమూ చేరి లట్టు (తాడు బొంగరం ఆట) ఆడుతూ ఉండేవాళ్ళం. చెక్క బొంగరం రకరకాల రంగులతో , కింద ములికి, బొంగరం నెత్తి మీద మెరుస్తున్న పూర్ణిమ, జాలీ అంటే తాడు ఇవన్నీ కలిసి మూడణాలకి వచ్చేది. ఈ బొంగరం తో మేము రకరకాల విన్యాసాలు చేస్తూండేవాళ్ళం. గాలిలో తిప్పి అరచేతిలో బొంగరాన్ని తిప్పడం, అరచేతి నుండి మోచేయి వరకు తీసుకొచ్చేవాళ్ళం. Udantar అంటే బొంగరాన్ని కప్పగంతుల్లాగా గాలిలో దూరంగా కొడితే ఎంతో దూరం వెళ్లి అక్కడ గిర్రున తిరుగుతూ ఉండేది. ఓడిపోయిన వాడి లట్టుని నేల మీద పెట్టి వేగంగా బొంగరపు ములికి కాలికి తగిలేట్టుగా కొట్టేవాళ్ళం. ఈ విద్యలో రాంజీ చాలా నేర్పరి. అతని ధాటికి బొంగరాలు ముక్కలై పోయేవి. ఆ తర్వాత క్రికెట్టు ఆడేవాళ్ళం. కొబ్బరి మట్టంని క్రికెట్ బాటుగా, కొబ్బరి చెట్టుని స్టంప్స్ గా, చెక్క బంతి తో ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత క్యాంపు అంటే పిక్నిక్ ఆట ఆడేవాళ్ళం. అంటే ఒక డేరా వేసుకుని మాకు తోచిన వంటకాలు చేస్తూండేవాళ్ళం. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు భవాని అక్కయ్య, వరలక్ష్మి పిన్ని, ప్రసన్నక్కయ్య, రామన్నయ్య, బోసు, కిషోర్, పెద్దపాప(మా చెల్లెలు), ఖడ్గ మాల (మా మామయ్య కూతురు) కశ్యప్, చందన్ (మామయ్య ఆఖరి కొడుకు)కలిసి “ఐస్ బాయ్” (దాగుడుమూతలు) ఆడుకునేవాళ్ళం. దొంగలని పట్టుకోవటం ఆ విశాల స్థలం లో కష్టంగా ఉండేది. గోటీల ఆట, నాలుగు స్తంభాల ఆట, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అనే ఆట, గాలి గాలి నమస్తే అనే ఆట, తర్వాత గిల్లి దాండు ఆట, చెట్లు ఉన్నాయి కాబట్టి కోతికొమ్మొచ్చి, అష్టచెమ్మా వగైరా వగైరా ఈవిధంగా చాలా సరదాగా, హాయిగా, మధ్యాహ్నమువరకు ఆడుకునేవాళ్ళం. భోజనాలు చేసాక మమ్మల్నందరినీ కచేరి హాలులో పడుకోపెట్టేవారు. మేమందరమూ హాయిగా నేలమీదనే పడుకునేవాళ్ళం. పెద్దవాళ్లందరికి కాళ్ళు పడుతుండేవాళ్ళం. అరగంటయ్యాక (అశోక్ మామయ్య), ఈ పెద్దవాళ్ళందరూ ఇక్కడ కాదు ఇక్కడ అంటూ మా అందరి చేత సేవలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. మా సీత కక్కి ప్రతిఫలంగా తన Godrej బీరువాలో ఉన్న గాజు సీసాలలోంచి బఠాణీలు, పల్లీలు ఇస్తుండేది. 

                                   మా సావిత్రత్తయ్య, అశోక్ మామయ్య

 మా సావిత్రత్తయ్య సాయంత్రం 3, 4 గంటల మధ్యలో మమ్మల్ని లేపి వంటింట్లో , పెద్ద కంచంలో అన్నం, పప్పు, కూర కలిపి మా చేతిలో ముద్దలు పెడ్తుందేది. మా అత్తయ్య వంటలన్నీ చాలా రుచిగా చేసేది. వల్లూరి స్పెషల్ ఆలూభాత్ మహారుచిగా ఉండేది. కొబ్బరిపాలతో చేసిన అన్నం ఇంకా రుచిగా ఉండేది. పసిమి ఛాయ, గుండ్రటి ముఖం, ముదురు గులాబీ రంగు కుంకుమ బొట్టుతో కళ కళలాడుతూ, ఎప్పుడూ నవ్వుతూ కడిగిన ముత్యం లాగా చాలా అంటే చాలా అందంగా ఉండేది. అలాగే చాలా మంది ప్రముఖుల ఇళ్ళకి పార్టీలకి వెళ్తూ చాలా హుందాగా ఉండేది. అలాగే చాలా మంది ప్రముఖులు ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటలు చేస్తుండేది. మేమందరమూ ఇప్పటికి కూడా ఎప్పుడూ తల్చుకుంటూనే ఉంటాం. మా అత్తయ్య చేతి వంటలు మధురంగా  ఉండేవి. మా మనస్సులో ఇప్పటికి కూడా ఆ వాసనలు ఉబాళిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ప్రేమతో చేసే చిన్న చిన్న పనులు జీవితాంతం మనకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి కదా ! ఇంకొక విషయం ఏమిటంటే మా ఇంట్లో పని చేసే రాములమ్మ, పెంటమ్మ, యాదమ్మ,పార్వతమ్మ వీళ్ళందరూ రాత్రి మాకు జొన్న రొట్టెలు చేస్తూ వేడి వేడిగా మాకు పెడుతుండేవాళ్లు. అవి మహా రుచిగా ఉండేవి. తోటమాలి కం డ్రైవరు అంజయ్య పెద్ద బట్టల షాపుని పెట్టుకుని జీవితంలో పైకి వచ్చాడు. అలాగే శంకర్ రావు , సత్యం అనే వీరిద్దరినీ కూడా పెద్ద శిక్షనుంచి మా తాత గారు తప్పించారు. వీళ్ళు అబిడ్స్ సెంటర్ లో విజయా స్వీట్ భండారు అనే పెద్ద మిఠాయి దుకాణం పెట్టుకున్నారు. జనగామకు వస్తుండేవారు. పేజీలు, రకరకాల స్వీట్లు పట్టుకుని వస్తుండేవారు. మునిసిపల్ కమిషనేరు హరిశంకర్ గారు కూడా జనగామకి  వచ్చి తాతగారి గురించి కబుర్లు చెప్తుండేవారు. 

       ఇప్పుడు మిమ్మల్ని మేడ మీదకు తీసుకుని వెళ్తాను. రండి ! ఇప్పుడు మీద మీదకి వెళదాం. మెట్లెక్కి వెళ్ళగానే ముందుగా పెద్ద వరండా ఉంటుంది. మెట్లెక్కగానే కుడి వైపు విశాలమైన హాలు , దాన్ని ఆనుకుని ఒక గదిరెండు పెద్ద వాటర్ తాంక్స్ ఉండేవి. , దాని తర్వాత బాల్కనీ, బాల్కనీ నుంచి చూస్తే అశోకా చెట్టు, ముందు భాగం అంతా కనిపించేది. వరండా చివర కుడి వైపు న విశాలమైన గదులు ఉండేవి. అవి మా సీత కక్కి గదులు.

పెద్దింట్లో మీద మీద సీత కక్కి గది ముందు ఎడమవైపు నుంచి : పద్మ పిన్ని, సావిత్రత్తయ్య, సీత కక్కి, సుశీల పిన్ని, లాలస(చంటి పిల్ల)

                          

 వెనక భాగంలో స్టోర్ రూమ్ ఉండేది. అక్కడ ఐస్ తయారు చేసే ప్రత్యేకమైన ఒక బాక్స్ ఉండేది. పైన టెర్రస్ రెండు భాగాలుగా ఉండేది. ఎడమవైపు మెట్లు దిగగానే టెర్రస్ ఉండేది. అక్కడ నిలబడి చూస్తే పంజాబీ వారి ఇల్లు, అమ్మాణమ్మగారి ఇల్లు కనిపిస్తుండేది. టెర్రస్ చివర వాష్ రూమ్స్ ఉండేవి. కిషోర్ బావ ఈ వాటర్ ట్యాంక్ మీదకెక్కి మామిడి కాయలు కొస్తుండేవాడు. ఆ సాహసం మేమెవ్వరం చేసేవాళ్ళం కాదు. టెర్రస్ పైభాగానికి వెళ్ళడానికి మెట్లు ఉండేవి కావు. మా పెద్ద అన్నయ్య(శివరావు), చిన్న అన్నయ్య ప్రశాంత్ , కిషోర్, వీళ్లంతా ఎంతో  ధైర్యంతో అక్కడ ఉన్న సిమెంట్ స్తంభాలు పట్టుకుని మిద్దె మీదకు వెళ్లి అక్కడ పతంగులు ఎగిరేస్తుండేవాళ్లు. ఇప్పుడు నేను రాసిన సంగతులన్నీ కూడా మా తాతగారుపోయినాక జరిగినవి. ఆయన 16  జూన్ 1900  లో జన్మించారు . 21 . 06 .1952  లో పరమపదించారు. 

ఉమ్మడి కుటంబం - బాధ్యతలు 

చాలా ఏళ్ళ వరకు మా తాతగారు వారి అన్నయ్య జగన్నాథ రావు గారు కలిసే ఉండేవారు. అమ్మమ్మ తాలూకు వారందరూ కూడా హైద్రాబాదు లోకే మకాం మార్చారు. మా పెద్ద తాతగారి కుటుంబ సభ్యులందరూ కూడా మా తాతగారి మీదే   ఆధారపడి ఉండేవారు.మా సీత కక్కికి పోటీగా మా పెద్ద కక్కి వాళ్ళ తమ్ముళ్ళందరినీ హైద్రాబాదు కి పిలిపించుకుంది. వీళ్లందరి భారమంతా మా తాతగారిదే. ఆ తర్వాత హైదరబస్తీ లోని ఇంటిని వారి అన్నగారికి రాసి ఇచ్చారు. వారి పిల్లలందరినీ కూడా మా తాతగారే చదివించి స్థిర పరచారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. పెద్ద తాతగారైన జగన్నాథ రావు గారికి ఇద్దరు మగపిల్లలు . పెద్దబాబు మామయ్యా అని పిలుస్తాం.

                     

 పెద్ద కక్కి(వల్లూరి పెద్ద తాతగారి భార్య) తో మా నాన్నగారు, అమ్మ,వేదమ్మ పిన్ని, అశోక్ మామయ్య, సుశీల పిన్ని, చందన్, పెద్ద తాతగారి పిల్లలు, మాచెల్లెలు రమణి, మాలతి (పద్మ పిన్ని కూతురు), ఆ చిన్న పిల్లలంతా మా వేదమ్మ పిన్ని మనుమలు

ఈయనని మా తాతగారు S.B.H లో చేర్పించారు. బుచ్చి బాబు మామయ్యని R.T.C ఫైనాన్స్ మేనేజర్ గా ఉద్యోగం వేయించారు. కుమార్తెలు వరుసగా రామ్ పిన్ని, రాధమ్మ పిన్ని, లలిత పిన్ని, కృష్ణ పిన్ని. ఇందులో రామ్ పిన్నిని ఆరుగొలను మాస్టారు గారు నండూరి రామచంద్ర రావు గారి పెద్ద కుమారుడైన నండూరి శ్రీ రామ్ మూర్తి గారికి ఇచ్చి వివాహం చేశారు.

 రజాకారు ఉద్యమం

నిజాం నవాబు తన సంస్థానాన్ని భారత దేశంలో విలీనమడానికి ఒప్పుకోలేదు. నిజాం సంస్థానంలో హిందువులు అధిక శాతం. హిందువులందరినీ ఒక పథకం ప్రకారం గా చంపాలని "కాసిం అలీ రజ్వి" అనేవాడు నిజాంని రెచ్చగొట్టాడు. నిజాం అప్పటికే పాకిస్థాన్ ని సహాయం అర్థించాడు. అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తన నిస్సహాయతను ప్రకటించింది. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు అప్పటి గృహమంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ పటేల్ గారికి, ప్రధాన మంత్రి నెహ్రు గారికి తమని కాపాడమని ఎన్నో ఉత్తరాలు రాశారు. స్వామి  రామానంద తీర్థ, కమ్యూనిస్ట్ నాయకులు గ్రామ గ్రామాలు తిరిగి విప్లవాగ్నిని ప్రజ్వలించారు. లక్షలాది హిందువులని , మహిళల పై అత్యాచారాలు చేయటం, గ్రామాలు తగలబెట్టడం ఇవన్నీ కూడా కాసిం అలీ రజ్వి నాయకత్వంలో తెలంగాణా అంతా భగ్గుమంది. దీనినే రజాకార్ మూవ్మెంట్ అంటారు. ఇటువంటి భయంకర పరిస్థితులలో మా తాతగారిని నిజాం సంస్థానంలో ఉన్న అధికారులు ,"జడ్జీ సాహెబ్ ! ఆప్ జనానా కో బాహర్ భేజియే ! మామలా గంభీర్ హై ఇదర్ !" అని సలహా ఇచ్చారు. అప్పుడు మా తాతగారు మొత్తం కుటుంబ సభ్యులని ట్రైన్ లో విజయవాడ పంపించారు. రక్షణగా నిజాం పోలీసులతో ఒక ఫర్మానా పత్రాన్ని జారీ చేశారు. ప్రత్యేకమైన బోగీ లో రైలు ప్రయాణం సాగింది. గార్లా స్టేషన్ దగ్గరకి వచ్చేసరికి రజాకార్లు దాడి చేయడానికి వచ్చారు. అప్పటికే స్టేషన్లో  పెద్ద సంఖ్యలో నిజాం సైనిక అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. నిజాం గారి ఉత్తరువు వినిపించారు. వారందరూ వెంటనే వెళ్లి పోయారు. అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా రైల్లోని ప్రయాణీకులందరూ రక్షించ బడ్డారు.తాతగారు విజయవాడ పున్నమ్మ తోటలో ఒక బంగళా కొన్నారు. బంగళాకి రెండువైపులా రోడ్డు. హైద్రాబాదు లో అల్లర్లు తగ్గేవరకూ అందరూ అక్కడే ఉన్నారు. ఆ బంగళాని తర్వాత అమ్మేశారు. 

         మా తాతగారు  నిజాం దర్బారులో  చీఫ్ జస్టిస్ గా నియమించ బడ్డారు. ఆ ప్రోటోకోల్ చాలా గమ్మత్తుగా ఉంది. మా తాతగారు షేర్వానీ, పైజామా, రూమీ టోపీ పెట్టుకుని, ఒక పళ్లెంలో వెండి రూకలు, దానిపైన ఒక సిల్క్ బట్ట కప్పి,రాజ దర్బారుకి వెళ్ళాలి. దీన్ని నజరానా అంటారు.  వేదిక దగ్గరగా వెళ్లి సిద్ధంగా ఉండాలి. నిజాం నవాబు గారు రెండు చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు చేస్తూ ఈ నజరానని స్వీకరిస్తారు. ఆయన అధికారులు నియామక (అప్పోయింట్మెంట్ లెటర్) ఉర్దూ భాషలోనే రాసి ఇస్తారు. ఆ పత్రం తీసుకుని నవాబు గారికి వీపు చూపించకుండా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ ఆ దర్బారుని విడవాలి.ఈ విధంగా మా తాతగారు ఆ అధికార పత్రాన్ని స్వీకరించారు. అప్పుడు చాలామంది తెలుగు ప్రముఖులు అందరూ , " అదేమిటండీ ! తెలుగువారై నిజాం దగ్గర ఎందుకు పని చేస్తున్నారు? అని ప్రశ్నించారు. “చూడండి ! నాకు పదవి వ్యామోహం ఏమీ లేదు. నా ప్రైవేట్ ప్రాక్టీస్ తో నెలకు నేను పదివేల (10,000 సిల్వర్ కాయిన్స్)వెండి రూకలు సంపాదించుకుంటున్నాను. ఇక్కడ నాకు కేవలం 4000 వెండి రూకలు మాత్రమే ఇస్తున్నారు, కాకపోతే ఇంత పెద్ద హోదాలో ఉన్న నేను మీ అందరికీ సహాయం చేసే స్థితిలో ఉన్నాను” అని సమాధానం చెప్పారు. మా తాతగారికి ఉర్దూ, అరబ్బీ, పర్షియా భాషలలో చాలా ప్రావీణ్యం ఉంది. ఆయన హొలీ ఖురాన్ గ్రంథాన్ని అరబ్బీ భాషనుండి ఇంగ్లీష్ భాష లోకి అనువాదం చేసారు. ఆ పుస్తకం ఖరీదైన అట్టతో, పేజీల చివర బంగారు రంగులతో ఉండేది. ఒక సిల్క్ తాడు బుక్ మార్క్ గా ఉండేది. అది నేను నా చిన్నతనం లో చూసాను. కోర్ట్ లావాదేవీలన్నీ కూడా ఉర్దూ భాషలోనే ఉండేవి. ఇవన్నీ కూడా మా తాతగారు చదివి, అర్థం చేసుకుని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసేవారు. ఎందుకంటే న్యాయ శాస్త్రం Law books ఇంగ్లీష్ లో ఉండేవి. మా అశోక్ మామయ్య, మా అమ్మ గారు ఉర్దూలో మాట్లాడేవారు. నాకు గుర్తు ఉన్నవి, మా అమ్మ, సీత కక్కి, అశోక్ మామయ్య, మా ఆన్నయ్యలు ఈ విషయాలన్నీచెప్తుంటే మా అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఇంతటి మహానుభావుడు, ధర్మపరాయణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మా తాతగారి జీవితం 21 జూన్ 1952 వ సంవత్సరంలో ముగిసింది. అప్పటికే మా అశోక్ మామయ్య లా కోర్స్ పూర్తి చేసారు.

                                                         అధ్యాయం 5

మా సీత కక్కి సాహసకృత్యాలు       

                                  

 మా  సీత కక్కి కుటుంబ నేపథ్యం లోగడ చెప్పాను. రొయ్యూరు లో అన్న (అచ్యుత రామయ్య) దగ్గర వీధి బడిలో చదువుకుంది. అప్పట్లో భారతం, భాగవతం విధిగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సీత కక్కి చలాకీగా, హుషారుగా ఎన్నో కథలు, సామెతలు, పద్యాలు పాడుతూ చక్కగా అభినయం చేస్తుండేది. తన పెద్ద గోద్రెజ్ అల్మారాలో ఎన్నో తిను బండారాలు గాజు సీసాల్లో పెట్టుకునేది. మా తాతగారు ఉన్న రోజుల్లో చేతిలో పుష్కలంగా డబ్బు ఉండేది. ఒంటినిండా బంగారు నగలు, చంద్రహారం, రవ్వల గాజులు, బంగారపు గాజులు ఇలా ఎన్నో నగలు వేసుకుని ఠీవిగా కారులో బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్లి వస్తుండేది. తాతగారితో పాటు ప్రముఖుల ఇళ్ళకి వెళ్ళటం, వారితో సమానంగా అనేక విషయాలు మాట్లాడటం చేస్తూ, తెలుగు, హిందీ, ఉర్దూ ధారాళంగా మాట్లాడేది. మాడపాటి హనుమంత రావు, బూర్గుల రామకృష్ణా రావు గారు తరచూ వారి వారి కుటుంబాలతో వస్తూ పోతుండేవారు. సాధువులు, సన్యాసులు, రచయితలు, రాజకీయ నాయకులు ఇలా ఎంతోమంది వస్తూ పోతుండే వారితో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. అజమాయిషీ అంతా మా సీత కక్కిచేస్తూ ఉండేది. 

వెనుక వరుసలో; కామేశ్వర బాబాయ్ గారు, సుశీల పిన్ని(కుటుంబం)

శశి, శ్రీదేవి.(అల్లుడు,కూతురు) కార్తీక్ నందన్, ఉమ, విజయ్(మనమడు, కోడలు,కొడుకు)

          

దొంగల కథ 

బేగంపేట ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బంగళా చుట్టూ పెద్ద ఆవరణ, అందులో బోలెడన్ని మామిడి చెట్లు ఉండేవి. మా సీత కక్కి ఒకసారి రాత్రిపూట తల నొప్పితో బాధపడుతూ అమృతాంజనం బాగా తలకు రాసుకుని, తలా చుట్టూతా బట్ట కట్టుకుని, నిద్ర పట్టక, గదిలో పచార్లు చేస్తుంటే బయట ఏదో అలికిడి వినిపించింది. కిటికీ లోంచి చూస్తే ముగ్గురు దొంగలు మామిడికాయలు కోస్తూ కనిపించారు. అంతా నిర్మానుష్యంగా ఉండాలి. చుట్టుపక్కల జనసంచారం ఉండేది కాదు. మా కక్కి నెమ్మదిగా, చప్పుడు చేయకుండా టార్చి లైటుని పట్టుకుని , చాలా ధైర్యంగా, దొంగలకు కనిపించకుండా వారి వెనక నీడలో నిశ్శబ్దంగా నుంచుంది. ఆ రోజు చౌకీదారు రాలేదు. దొంగల్లో  ఒకడు చకచకా కాయలు  కోసి కింద పడేస్తుంటే, కింద ఉన్న ఇద్దరు దొంగలు అవి బస్తాల్లో నింపుతున్నారు. బస్తాలు నిండడం చూసి హఠాత్తుగా కక్కి టార్చిలైటు వేసి, "ఒరేయ్ ! చాలా కష్ట పడ్డావు. ఆవకాయకు సరిపడా కాయలు కోశారు. ఇక చాలు  దిగు అని గట్టిగా అరిచింది. అంతే కాకుండా “చోర్ ! చోర్!పకడో!  పకడో ! ఏ  రాంసింగ్ ! కహా మర్ గయా?”

“జల్దీ ఆవో !” అని గట్టిగా అరిచేసరికి  హడలిపోయిన దొంగ  ఒక్కసారి అమాంతంగా కింద పడ్డాడు. ఒకడికి కాలు బెణికినట్టుంది; కుంటుకుంటూ పారిపోయాడు. అంతకుముందే ఇంకొక దొంగ కూడా మాయమై పోయాడు. ఆ మరుసటి రోజు ఆ మామిడికాయలు ఇంట్లోకి తెచ్చి చక్కగా ఊరగాయలు పెట్టుకున్నారు. ఇది నిజంగానే ఒక సాహసకృత్యమే.ఎందుకంటే చుట్టుపక్కల దగ్గరలో ఎటువంటి ఇల్లు కూడా లేవు. మా కక్కి హావభావాలతో నవ్వు వచ్చేవిధంగా చెప్తూ ఉండేది. ఒరేయ్ సాయిరాం ! నా గురించికథలు రాయరా అని ఎప్పుడూ చెప్తుండేది. అందుకనే కాబోలు నాచేత రాయించుకుంటుంది ఇప్పుడు. నిజానికి రాసేది మా చెల్లలు సూర్యలాలస, చెప్పేది నేను. ఈ కథ మా ఇంట్లో అందరికీ తెలుసు.

రెండవ సాహసం : ఒకసారి మా తాతగారిని బెంగళూరు హాస్పిటల్ లో చేర్పించారు. అది నిర్మానుష్యమైన ప్రదేశం లో ఉండాలి. హాస్పిటల్ కి కొంచెం దూరం లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో కక్కి ఉండేది. తనతో పాటు మా అమ్మ కూడా ఉండాలి.  మా తాతగారికి మా అమ్మ అంటే చాలా ప్రేమ. రోజూ కక్కి, మా అమ్మ తాతగారిని చూడడానికి హాస్పిటల్ వెళ్లడం ఎవరో ఇద్దరు దొంగలు బహుశా గమనించి ఉంటారు. ఆ రోజూ చీకటి పడింది. ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకి ఆలస్యంగా వచ్చి గెస్ట్ హౌస్ వైపు వెళ్ళుతున్నారు. మా కక్కి కి  కూడా ఆ ఇద్దరు వ్యక్తుల మీద అనుమానంగా ఉండింది. ఆ ఇద్దరు దొంగలు వారిద్దరినీ వెంబడించి సాగారు.  మా కక్కి చాకచక్యంగా ఒంటిమీద నగలన్నీ కనపడకుండా దాచుకుని , జుట్టు విరబోసుకుని , పకపకా నవ్వుతూ , పిచ్చిదానిలాగా అరుపులు, కేకలు పెట్టుతూ, మట్టి తీసి వాళ్ళ మీద విసిరి కొడుతూ చాలా అద్భుతంగా, నిజంగా పిచ్చిదాని లాగా నటించింది. మా కక్కి పెట్టిన అరుపులకి, కేకలకి భయపడి వీళ్ళు పిచ్చి వాళ్ళని నిర్ధారించుకుని

                                                             

                           సావిత్రత్తయ్య, ఖడ్గ మాల, సీత కక్కి పెద్దింట్లో

పారిపోయారు. ఇలాగే ప్రవర్స్తిస్తూ మా కక్కి, అమ్మ ఇద్దరూ గెస్ట్ హౌస్ చేరుకుని పదే పదే ఆ సంఘటనని తలుచుకుని నవ్వుకున్నారు. కచేరీ హాలులో మా కక్కి అందరి ముందు ఈ పాత్రకి రక్తి కట్టించింది. మా పినతల్లులు, మేము, అందరమూ వింటున్నప్పుడు ముందు భయపడ్డా, ఆ తరువాత పగలబడి నవ్వాo.

 మూడవ సాహసం : అది పెన్షన్ సంపాదించుకోవడం : కార్య దక్షత 

ఎవరూ ఊహించలేనంత అసాధ్యమైన పనిని మా సీత కక్కి సాధించింది. మా తాత గారు వల్లూరి సూర్య నారాయణ రావు గారు 21  జూన్ 1952  లో దేహం చాలించారు. మరి మా కక్కికి పెన్షన్ రావలసి ఉన్నది. కానీ వేరే ఇతరత్రా కారణాల వల్ల ఎవరూ దానిని పట్టించుకోలేదు. మరి మా కక్కికి కూడా ప్రోసిజర్ అవగాహన లేదు. ఒక్క సారిగా అశోక్ మామయ్య మీద ఎన్నో సంసార బాధ్యతలు పడ్డాయి.ముగ్గురు చెల్లెళ్ళ, తమ్ముడి చదువు, పెళ్లి బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఒక్కడు కష్ట పడి  సంపాదిస్తే ఎటువంటి పనీ పాటా చేయకుండా తినే వాళ్ళు ఎక్కువ ఉండేవారు. పైగా ఎంతో  కొంత  ఈర్ష్యాసూయలతో తమని సరిగ్గాచూసుకోవటం లేదని వంకలు పెడుతుండే వారు. ఎన్ని ఏళ్ళైనా పెన్షన్ రాలేదని తెలిసి ఒక ప్రముఖుడు ఆశ్చర్య పడ్డాడు. ఆ ప్రొసీజర్ అంతా వివరించి చెప్పాడు. మా కక్కి కార్య రంగంలోకి దూకింది. బంధువులందరూ నిరుత్సాహ పరిచారు. ఎక్కడో అట్టడుగున ఉన్న ఫైల్ ఎవ్వరూ తీయరు. పైగా ఆ ఫైల్ ఉందో లేదో కూడా తెలియదు. ప్రభుత్వం లో నీతి, నిజాయితీ ఉన్నవాళ్లు ఏనాడో మటుమాయమై పోయారు. మనిషికి పదవి, సంపాదన ఉన్నప్పుడే గౌరవిస్తారు. చుట్టూ మూగుతారు. అది లేకపోతె దగ్గరి బంధువులు కూడా పట్టించుకోరు, లెఖ్ఖ చేయరు. కానీ కార్య దీక్ష , ఆత్మ విశ్వాసం ఉన్న వాళ్ళు  తాము అనుకున్న దాన్ని సాధిస్తారు.మా అమ్మమ్మ దాదాపు ఎన్నో సంవత్సరాలు చెప్పులు అరిగేలా సచివాలయం చుట్టూ తిరిగింది చివరి సారిగా తెగించి ముఖ్య మంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసింది. అడ్డు వచ్చిన అధికారులను తోసి పారేసింది. ముఖ్య మంత్రి గారితో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో అనర్గళంగా తన వాదనతో మెప్పించింది. ఆయన ముందుగా మా కక్కిని శాంత పరచి, కుర్చీలో 

                

కూర్చో పెట్టి, మంచినీళ్లు, కాఫీని ఇప్పించి చాలా ఓపికగా విన్నాడు. పెద్ద పెద్ద అధికారులందరూ చేతులు కట్టుకుని వింటున్నారు. వారం రోజుల తర్వాత రమ్మని చెప్పారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. మా అమ్మమ్మ శాంతించింది. అప్పుడు వారే కారిచ్చి ఇంట్లో దింపారు. ఒక రెండు రోజులు మా కక్కి ఆయాస పడుతుండేది. అప్పటికే ఇంకా మా తాత గారికి ఎంతో పరిచయమున్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ముఖ్య మంత్రి గారు మా తాత గారికి సంబంధించిన భోగట్టా అంతా సేకరించారు. ఇంత నిజాయతీ పరుడు, ధర్మాత్ముడు , అందులో తెలుగువారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ప్రభుత్వపు కారులో మా సీత కక్కి, అశోక్ మామయ్యా వెళ్లారు. వారికి ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు వేధించిన అధికారులందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. ముఖ్య మంత్రి గారు మా కక్కికి నమస్కారం చేసి వెంటనే పెన్షన్ వచ్చే విధం గా ఉత్తరువు  జారీ చేశారు. అప్పటికే మా కక్కి అధికార లాంఛనాలన్నీ ముందుగానే పూర్తి చేసి ఇచ్చినందు వల్ల, అప్పటికప్పుడే కక్కి సంతకాలు తీసుకున్నారు. పెన్షన్ ఎరియర్స్ తో సహా వచ్చి, అప్పట్నుంచి ప్రతి నెలా మా అమ్మమ్మకి పెన్షన్ రావటం మొదలయ్యింది. ఈ విధంగా మా కక్కి అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఇప్పటికీ కూడా ఈ సంఘటనని మా కక్కి గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే మా అత్తగారు కీ.శే.మంత్రిప్రగడ కనకదుర్గాoబ గారు కూడా ఎంతో పోరాడి,  తన భర్త పెన్షన్ ని సంపాదించుకున్నారు. ఆ పెన్షన్ డబ్బులన్నీ కూడా పిల్లల కోసమే ఖర్చు చేశారు. నేను మా వృత్తి రీత్యా ఈస్ట్ ఆఫ్రికా లో కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాల్లో వందల కొద్దీ గ్రామాలు తిరిగాను. నా ఉద్దేశం లో ఒక మహిళ కుటుంబానికే ఒక బలమైన మూల స్తంభం. కుటుంబం లో చదువు సంస్కారాలు సకారాత్మకమైన (పాజిటివ్  థింకింగ్) ఆలోచనా విధానం, ఒక బలిష్టమైన వ్యక్తిత్వం వారి అనుభవాల పునాదుల మీద నిర్మించబడుతుంది. నా జీవితం లో ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు

                               

                             సీత కక్కి, సావిత్రత్తయ్య, ఖడ్గ మాల, పెద్దింట్లో

నాలో కలిగే నిర్వేదన (డిప్రెషన్) మా అమ్మమ్మ, అమ్మ, మా అత్త గారు, ఈ ముగ్గురి కార్య దక్షత కి సంబంధించిన ఇటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే వెంటనే నాలో ఒక నూతన ఉత్సాహాం, ఆత్మ విశ్వాసం  కలిగేవి. మా అమ్మ సంగతి ప్రత్యేకంగా చెప్తాను. మా పెద్దబ్బాయి లాహిరి కాంత్ స్వీడన్  లో ఎం. ఎస్ . బయోటెక్నాలజీ చేసాడు. నేను టాంజానియా నుంచి వీడియొ చాట్ చేస్తుండేవాడిని. అక్కడ వాతావరణం మైనస్ లో ఉంటుంది. దాని వల్ల ఆత్మహత్యలు సర్వ సాధారణం. వాడికి ఎప్పుడు డిప్రెషన్ కలిగినా,  వెంటనే ఈస్ట్ ఆఫ్రికా లో నా లోన్లీ లైఫ్  వాడికి ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ గా ఉంటుంది అనేవాడు. అంటే మన పిల్లలందరూ కూడా మన వ్యక్తిత్వాలని చిన్నప్పట్నుంచీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారన్న మాట. అందుకనే మనం మన పెద్దవారి వ్యక్తిత్వం లోని ఇటువంటి విషయాలని మన భావితరo వారికి తప్పకుండా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అంతు ఉండదు. ఇది కేవలం చాలా సంక్షిప్తం. ఇవి మా అమ్మమ్మ సాహసకృత్యాలు .

                                                 అధ్యాయం 6

మా నాన్నగారు నండూరి శ్రీ రామారావు గారి జీవిత విశేషాలు.  

మా నాన్నగారి పేరు  నండూరి  శ్రీ రామారావు. వారి నాన్నగారు నండూరి శివరావు గారు, ఈయన మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారి పెద్ద కుమారుడు. ఆరుగొలనులో దాదాపు చాలా మంది నండూరి  

                   

1956 లో జనగామలో డాక్ బంగళా లో తీసుకున్న ఫోటో అప్పుడు మా విజ్జి చంటి పాప

చిన్న అన్నయ్య విజ్జిని ఎత్తుకున్నాడు పక్కన పెద్ద అన్నయ్య క్రింద వరుసలో అక్కయ్య, లాలస, సాయిరాం

 నండూరి వారే ఉండే వారు. అక్కడ ఆరు కొలనులు ఉండేవి  కాబట్టి ఆరుగొలను అనే పేరు వచ్చింది అని మా నాన్నగారు చెప్పుతుండేవారు. మా ముత్తాత గారికి కరణీకం ఉండేది. ఆ రోజుల్లో కరణీకం అంటే చాలా పెద్ద హోదా, పలుకుబడి, గౌరవం ఉండేది. ప్రతిభ ఉన్నవాళ్లు, తెలివితేటలూ, జీవితంలో పైకి రావాలనే దృఢసంకల్పం ఉన్నవారు చాలా మంది నండూరి వారు బయటకి వెళ్లి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నండూరి రాంమోహన్ బాబాయ్ గారు, పార్థు  బాబాయిగారు, నర్సు బాబాయ్ గారు, మల్లు బాబాయ్ గారు, రామచంద్ర రావు తాతగారి కొడుకులైన నండూరి శ్రీ రామ మూర్తి బాబాయ్ గారు, నండూరి సుబ్బారావు బాబాయ్ గారు, కృష్ణ మూర్తి బాబాయ్ గారు, డాక్టర్ బాబాయ్, ఇలా చాలా మంది ఆరుగొలనుకి ఒక గుర్తింపు తెచ్చారు. దీనికి  మా తాతగారు శ్రీ కారాన్ని చుట్టి వీరందరికి ప్రేరణ ఇచ్చారు. వీరందరికి స్ఫూర్తినిచ్చిన మా తాతగారు అంటే మాకు దైవంతో సమానం.మా  తాతగారు కలకత్తా లో L.C.P.S (లైసెంటిట అఫ్ ది కాలేజీ అఫ్ physicians అండ్ surgeons)  ఈ కారణం వల్ల మా తాత గారు కలకత్తా వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా హై స్టాండర్డ్ ఉన్నత విద్య బోధించ బడింది. వీరికి సర్జరీలు కూడా చేసే ప్రావీణ్యం, అర్హత ఉంటుంది. 

మా నాన్న గారి జీవితాన్ని రెండు భాగాలుగా చెప్ప వచ్చును.మొదటి భాగం : మా తాత గారు తన తండ్రి నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానీ ఆర్ధిక సహాయం లేకుండానే చాలా కష్టపడి చదువుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మా తాత గారు తన వివరాలన్నీ చెప్పి కొంత డబ్బు కావాలని ముత్తాత గారిని అడిగినప్పుడు  ప్రామిసరీ నోటు మీద సంతకం తీసుకుని డబ్బు అప్పుగా ఇచ్చారు. మా తాత గారు అప్పు తీర్చి వేసి ఆ ప్రామిసరీ నోటుని చింపి వేశారు. మా తాత గారు గుడివాడ లో ప్రాక్టీస్ పెట్టగానే చుట్టూ పక్కల గ్రామాల నుండి వందలాది రోగులు వస్తుండే వారు. క్షణం తీరిక లేకుండా ఉండేదిట. గుడివాడలో ఎన్నో స్థిరాస్తులు సంపాదించారు.  మా ముత్తాత గారి పొలాలు చాలా వరకు వివాదాల్లో ఉండేవి కానీ మా తాత గారి భూములు వివాదరహితమైనవి అని పెద్దలు తెలిపారు. అయితే మా ముత్తాత గారు పదే పదే చెప్పి ఆయన సంపాదించిన స్థిరాస్తులన్నీ ఉమ్మడి ఆస్తిగా మార్చి, వరాహ లక్ష్మి నరసింహం గారి పేరు మీదా కలిపేసుకున్నారు. కరణీకాన్ని కూడా తమ్ముడి కోసం వదులుకోమని చెప్పారు. మా  చిన్న తాతగారు, మా తాతగారు చాలా అభిమానంగా, ప్రేమగా ఉండేవారు. తమ్ముడి కుటుoబాన్ని తన కుటుంబoగానే భావించే వారు. మా చిన తాతయ్య చాలా సంస్కార వంతుడు . అన్నదమ్ములిద్దరూ కూడా తండ్రకి ఎదురు చెప్పే వారు కాదు. అందుకని మా తాతగారు తాను సంపాదించిన స్థిరాస్తులన్నీ కూడా తండ్రికి అప్ప చెప్పారు. అయితే మా తాత గారు శివ రావు గారు గూడూరు మైకా గనుల్లో అధిక మొత్తం లో బాగస్వాములని నమ్మి చాలా డబ్బుని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు, ఆ భాగ స్వాములు మా తాత గారిని ఒప్పించి వాళ్ళు ఎంతో డబ్బు అప్పుగా తెచ్చి , దానికి తాత గారిని జామీనుగా (guarantor) సంతకాలు చేయించు కున్నారు. మా తాత గారు బ్రతికి ఉన్నంత కాలం ఎటువంటి సమస్యలు రాలేదు.      


                                      

 అమ్మా నాన్నలతో మేము ఎనిమిది మంది పిల్లలంవెనుక నిల్చున్నవారిలో : నాన్నగారి వెనుక ప్రశాంత్ అన్నయ్య, ప్రసన్న అక్కయ్య, శివరావు అన్నయ్య,నాన్నగారి ఒడిలో దుర్గ, అమ్మ ఒడిలో రమణి. కూర్చున్న వారిలో సాయిరాం, మధ్య విజయలక్ష్మి, సూర్య లాలస

                       మా నాన్న గారు శ్రీ రామారావు గారిని బందరు హిందూ కాలేజీ లో ఇంటర్ చదివించాక వైజాగ్ మెడికల్ కాలేజీ లో చేర్పించారు. మా నాన్న గారు చాలా  దర్జాగా రాజా కుమారుడి లాగ పెరిగారు. హిందూ కాలేజీ లో లాన్ టెన్నిస్ , హాకీ, బ్యాడ్మింటన్ , క్రికెట్, వీటిల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. జనగామ వచ్చిన కొత్తలో మా నాన్న గారు లాన్ టెన్నిస్ ఆడేవారు. మా నాన్న గారి అక్కయ్య సీత , చెల్లెల్లు స్వరాజ్యం, శాంతలకి  మా నాన్న గారంటే అమితమైన ప్రేమ. ఆయన ఎంతో అందంగా ఉండే వారు. ప్రతి రోజు తాలిమ్ ఖానా (జిం) వెళ్లడం, కర్ర సాము సాధన చేయడం, కాలువల్లో రాఘవరావు మామయ్యా గారి తో ఈతలు కొట్టడం, సర్వ సాధారణం గా జరుగుతుండేవి. అదృష్టం ఏమిటంటే నేను కూడా మా తాత గారు, నాన్న గారు చదువుకున్న హిందూ కాలేజీ లోనే P.U.C చదువు కున్నాను. ఆ ఏడాది బచ్చు పేట, కంసాలి కోటయ్య వీధిలో, బందరులో మా స్వరాజ్యం అత్తయ్య ఇంట్లో ఉన్నాను. నేను కూడా కాలేజీ క్రికెట్ టీం లో సెలెక్ట్ అయ్యాను. అప్పటికి నాకు పదహారేళ్లు . ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ , స్లో పేస్, బౌలింగ్ చేసే వాడిని. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్లిప్ ఫీల్డింగ్ చేసే వాడిని. మిడిల్ ఆర్డర్ బాట్స్మన్ ని, చాలా అద్భుతంగా ఆడేవాడిని. కానీ స్వరాజ్యం అత్తయ్య , " ఏరా! చంటీ ! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చదువుకోవడానికా?  లేక  ఆడుకోవడానికా?´’ అని నిల దీసి నప్పుడు మళ్ళీ నేను క్రికెట్ జోలికి వెళ్ళ లేదు. మా నాన్న గారికి తండ్రి గారు బ్రతికి ఉన్నంత కాలం కష్టాలంటే ఏమిటో తెలియదు. 

మా అమ్మ వల్లూరి  శ్రీ రాజ రాజేశ్వరి గారి తో వివాహ నిశ్చయం 

                                         

ఎక్కడో మారు మూల చిన్న కుగ్రామం ఆరుగొలను. ఆరుగొలను లో మా నాన్న గారు, మహా పట్టణమైన హైదరాబాదు లో మా అమ్మ గారు ఎలా కలిశారు? చాలా ఆశ్చర్యం ! అసలేం జరిగిందంటే?

ఆరుగొలను లోని వారందరూ మాకు తాతయ్యలు, బాబాయిలు, పెద్ద నాన్న గార్లు, అందరి తో ఏదో విధం గా సంబంధం ఉంది.  ఆరుగొలను లో నండూరి రామ చంద్ర రావు తాత గారి పెద్ద కొడుకు నండూరి శ్రీ రామ్ మూర్తి గారికి హైద్రాబాదు సంబంధం  కుదిరింది. ఈయన స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ లో పని చేస్తుండే వాడు. ఈయన తమ్ముళ్లే నండూరి సుబ్బా రావు బాబాయ్, కృష్ణ మూర్తి బాబాయ్. పెళ్లి కూతురు ఎవరంటే మా పెద్ద కక్కి  అంటే మా సీత కక్కి తోటి కోడలి పెద్ద కూతురు. రాo పిన్ని అంటాం. మా పెద్ద కక్కి గుండ్రటి ముఖం తో ఎప్పుడు గల గలా మాట్లాడుతూ ఉండేది. మా రాo పిన్ని పొడుగ్గా, గుండ్రటి ముఖం తో చాలా అందంగా ఉండేది. మా రాo పిన్ని కూతుళ్లు స్వర్ణ అక్కయ్య, శ్యామల, సుధా, వరలక్ష్మి, అందరూ చాలా అందంగా ఉంటారు. స్వర్ణ అక్కయ్య తర్వాత S B H లో పని చేసింది. ఈ పెళ్లి కోసం ఆరుగొలను నుండి మా బంధువుల తో పాటు మా తాత గారు నండూరి శివరావు గారు, మా నాన్నగారి తో పాటు హైదరాబాద్ వచ్చారు. ఆ పెళ్లి లోనే మా తాత గారు, మిగిలిన పెద్దలందరూ మా అమ్మని చూసి ముచ్చట పడ్డారు. మా దగ్గరి బంధువులు మా ఇద్దరి తాత గార్ల తో పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారు. అందరూ ఈ సంబంధానికి ఇష్ట పడ్డారు. అయితే మా సూర్య నారాయణ తాత గారికి, మా నండూరి తాత గారి పేరు ప్రఖ్యాతులు, ఆస్తి పాస్తుల వివరాలన్నీ ఆరుగొలను లో ఉన్న పెద్దవాళ్ళు, మధ్యవర్తులు గొప్పగా చెప్పారు. మా సూర్య నారాయణ తాత గారు మా శివ రావు తాత గారితోటి ఎంతో వినయంగా , " ఏమండీ ! శివ రావు గారూ ! మీ అంతస్తుకి, మీ హోదాకి మేము తూగ గలమా?" అని సందేహాన్ని వెలిబుచ్చారు. దీనికి సమాధానం గా మా తాత గారు ఎంతో వినయం గా "మీరు విన్న మాట నిజమే. కానీ ప్రస్తుతం నా ఆర్ధిక లావాదేవీల్లో చిక్కు సమస్యలు ఉన్నాయి. మీరు నా సంపాదన చూసి  మీ అమ్మాయిని  మా ఇంటి కోడలిగా చేయ వద్దు. మా అబ్బాయి వైజాగ్ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ కోర్స్ లో చదువుతున్నాడు. ఇందుకు ఇష్టమైతే మీరు ఈ సంబంధం ఒప్పుకోండి." అని చెప్పారు. మా తాతగారి నిజాయతీ, ఆయన సంస్కారాన్ని మెచ్చుకుని మా సూర్య నారాయణ తాత గారు ఈ సంబంధం ఖాయం చేసు కున్నారు. 18 ఏప్రిల్ 1938 న బెల్ దే జగదీశ్వరయ్య గారి రాజభవనం లాటి ఇంట్లో ఐదు రోజులు వైభవోపేతం గా వివాహం జరిగి, వేలాది మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, తాత గారి పెద్ద పెద్ద క్లైంట్స్, తురక వారిలో ప్రముఖులు ఎంతో మంది వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి అయ్యాక కూడా మా బంధువుల్లో కొందరు హైదరాబాదు లోని విశేషమైన ప్రదేశాలు చూడటానికి ఇక్కడే ఉండిపోయారు.

మా చిన్న బామ్మ గారి మంకు పట్టు: మా అమ్మా నాన్నల పెళ్ళికి రావాలంటే నాకు నాలుగు జతల బంగారు గాజులు కొనిస్తే కానీ రానని మా చిన్న బామ్మ  లక్ష్మి నరసమ్మ గారు పట్టుబట్టారు. పాపం మా చిన్న తాత గారి నిస్సహాయ స్థితిని చూసిన మా తాత గారు నాలుగు జతల బంగారు గాజులు మరదలికి కొని పెట్టారు. ఈ విషయం

                   

ఆరుగొలనులో మా నాన్నగారు తన బంధువులతో కలిసి తీసుకున్న ఫోటో

ఎడమవైపునుంచి :నడింపల్లి శేషగిరి రావు గారు నండూరి సుబ్బారావు బాబాయ్ గారికి బావగారు మా నాన్నగారికి బావగారు , మా నాన్నగారు, సుబ్బారావు తాతయ్య గారు మా నాన్నగారికి బాబాయ్, నండూరి నర్సింహారావు బాబాయ్ గారు మా నాన్నగారి తమ్ముడు

స్వరాజ్యం అత్తయ్య , మా రాణి వదినల ద్వారా తెలిసింది. ఇలాంటి తెలియని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అంటే మా తాత గారి దగ్గర ఎంతో చనువు ఉండేది. వీటిని మనం సరదాగానే తీసుకోవాలి. ఇచ్చే వాళ్లనే కదా మనం అడుగుతాం. ఇక్కడ మా తాత గారి మహోన్నతమైన వ్యక్తిత్వం గోచరిస్తుంది. అదే పోలిక మా నాన్న గారికి, మా అందరికీ వచ్చింది. పెళ్లి తరువాత మా నాన్న గారు తన విద్యాభ్యాసం కొన సాగించడానికి విశాఖ పట్టణం వెళ్లి పోయారు. మా నాన్న గారు శెలవులకి హైదరాబాదు మామ గారింటికి వచ్చేటప్పుడు బోల్డంత లగేజీ తో  వచ్చే వారట. అప్పట్లో ట్రంకు పెట్టెలు, హోల్డాలు  వంటివి ప్రయాణం లో ఉపయోగించే వారు. ఒక్కడే కొడుకు కావటం తో తాత గారు చాలా గారాబం గా పెంచారు. ఈ డాబు, ఈ దర్జా అంతా చూసిన మా జడ్జీ తాత గారు , " ఏమే రాజూ ! హై కోర్ట్ జడ్జీనైన నా వద్దే ఇంత హంగామా లేదు. ఇన్ని రకాల చెప్పులు, బూట్లు, సాక్సులు, జేబు రుమాళ్ళు, టైలు , బౌలు, తెల్లటి దుప్పట్లు, సూట్లు", అంటూ ఆశ్చర్య పడుతూ, సరే కానీ ! అల్లుడి గారి జేబు రుమాలు ఒకటి ఇవ్వు అనే వారు. మా నాన్న గారు వచ్చారంటే ఇల్లంతా హడావుడే మా అశోక్ మామయ్యా మా నాన్న గారి కొత్త చొక్కా తొడుక్కుని    " అక్కయ్యా ! ఈ చొక్కా ఎంత బాగుందో చూడు నాకు ", అని హడావుడి చేస్తుండే వాడు. అయితే మా నాన్న గారు ఆ చొక్కాని తిరిగి వాడే వారు కాదు. మామయ్య కే ఇచ్చే వారు. మా నాన్న గారు వాడే వస్తువులన్నీ ప్రత్యేకమైనవి, ఖరీదైనవి ఉండేవిట. ఒక సారి నాన్నగారు గుడివాడ లో చదువుకుంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన బ్లాంకెట్ కావాలని మంకు పట్టు పెట్టారట. మా తాత గారు ఇప్పుడు దుకాణాలన్నీ మూసి వేశారు. రేపు ఉదయం కొని పెడతాను అని చెప్తే మా నాన్న గారు వినలేదు. మా తాత గారు విసుక్కోకుండా అప్పటికప్పుడు ఆ బట్టల వ్యాపారికి ఫోన్ చేసి, దుకాణం తెరిపించి, నాన్నగారడిగిన బ్లాంకెట్ కొని ఇచ్చారు. ఈ రకం గా మా నాన్నగారు తాత గారు బ్రతికి ఉన్నంత కాలం ఒక రాజ కుమారుడి లాగా పెరిగారు. ఆయనకి  కష్టాలంటే ఏమిటో తెలియవు.  కాలం ఎప్పుడూ ఒక్క మాదిరిగా ఉండదు కదా ! మా తాత గారు మరణించే సమయానికి నాన్న గారికి 21 ఏళ్ళు. మెడిసిన్ రెండవ సంవత్సరంలో చదువుతున్నారు. బహుశా ఆ సమయానికి మా నాన్న గారు వేసవి సెలవులకి హెదరాబాదులో ఉన్నారు. ఈ వార్త వినగానే దిగ్భ్రాoతి చెందారు. మిన్ను విరిగి నెత్తి మీద పడినట్లయింది. అప్పట్నుంచి కష్టాలు ఒక్క సారిగా చుట్టు  ముట్టాయి. మా ముత్తాత  వరాహ లక్ష్మీ నరసింహం గారికి ఉమ్మడి ఆస్తి మీద ఉన్నంత ధ్యాస చెట్టంత కొడుకు పోయాడని కానీ అనాథ అయిన పెద్ద కోడలు స్వయానా మేన కోడలైన మా బామ్మ పట్ల, పెళ్లి కాని  ఇద్దరు మనమరాళ్లు స్వరాజ్యం, శాంత అత్తయ్యలు, మెడిసిన్ చదువుతున్న మనమడు, వీళ్ళకి ఓదార్పు, ఆదరణ ఏమీ లభించ లేదు.మెడిసిన్ విద్య కష్టం తో కూడినది. అందు కోసం గూడూరి సుబ్బా రావు  తాత గారు (మా చిన్న తాత గారికి కూడా ఆయన స్వయానా మేనబావ అవుతారు ), మా నాన్న గారి తరఫున పవర్ పట్టా తీసుకుని మా నాన్న గారి వంతు వచ్చిన వ్యవసాయ భూములను అమ్మి, ఆ డబ్బు తో మా నాన్న గారి విద్యాభ్యాసం, అప్పులు తీర్చడం, ఇద్దరు అత్తయ్యలు పెళ్లిళ్లు , ఆరుగొలను కుటుంబ ఖర్చులకి వాడారు, ఈ విధంగా మా నాన్న గారి చదువు , ఆర్ధిక ఇబ్బందులతో నే సాగింది. మా  నాన్న గారికి కానీ, మా మేనత్తలకి కానీ మా ముత్తాత గారి నుంచి ఎటువంటి ఆదరణ, ఆప్యాయత లభించ లేదు. ఒక సారి నేను మా అమ్మతో  “అమ్మా ! మా సూర్యనారాయణ తాత గారు అంత ధనవంతుడు కదా ! మరి మా నాన్న గారికి ఎందుకు సహాయం చేయ లేదు?" అని అడిగాను.  "మీ నాన్న గారికే తన తండ్రి సంపాదించిన ఆస్తి ఎంతో ఉంది. కాబట్టి ఆ అవసరం ఆయనకి  కలగ లేదు. అయినా మీ నాన్న గారికి స్వాభిమానం ఎక్కువ ", అని చెప్పింది.

             


                             
నేను (సాయిరాం), అక్కయ్య పెద్దింట్లో



                                                  అధ్యాయం 7

ఆరుగొలను లో మా అమ్మ గారు

మా అమ్మ గారి పెళ్లి ఐన రెండేళ్లకే మా తాత గారు పోయారు.  ఆరుగొలను ఇల్లు రెండు వాటాలుగా చేశారు. డాబా మీదకు వెళ్లే మెట్ల గది మా బామ్మ వాటాకి, బావికి వెళ్లే గది మా చిన్న తాత గారి వాటాకి వచ్చింది. మా చిన్న బామ్మ గారికి వాళ్ళు మా తాతగారి మూలంగా ఏదో నష్టపోయారని అపోహ ఉండేది. కానీ మా చిన్న తాతగారు నెమ్మదస్తుడు.  కొంతమంది అలాగే ఉంటారు. ఆవిడకి కోపం వచ్చినప్పుడల్లా బావి దారికి వెళ్లే గదికి తాళం వేస్తుండేది. మా బామ్మ గారు దానికి సమాధానం గా మెట్ల గదికి తాళం వేసేవారు. బావి గదికి తాళం వేయటం వల్ల మా అమ్మ, మా మేనత్తలు అందరూ కూడా బిందెలతో బయటనుండి చుట్టూతా తిరిగి, దాదాపు ఒక ఫర్లాన్గ్ దూరం నడిచి, బావినుంచి నీళ్లుతోడుకొని తెచ్చుకునే వారు. నీళ్లు లేకుండా గడపటం చాలా కష్టం. సాయంత్రాలు డాబా మీదకి వెళ్లక పోయినా 

                             

నష్టం లేదు. నీళ్లు తోడుకోకుండా అడ్డు పడటం మానవత్వమేనా? అటువంటి సందర్భం, ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలలో జరగటం పరిపాటి. మా అమ్మ ఆగర్భ శ్రీమంతురాలు. స్కూలుకి కూడా కార్లలోనే వెళ్లేది. ఇంటిలో నౌకర్లు - చాకర్లు బోలెడంత మంది ఉండేవారు. ఇక్కడ ఆరుగొలనులో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా కూడా మా అమ్మ చాలా చక్కగా సర్దుకు పోయారు. ఒక సారి మా చిన్న అన్నయ్య (ప్రశాంత్ అన్నయ్య) చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆరుగొలను లో జ్వరం వచ్చి పాలకోసం ఏడుస్తుండగా పాలు పట్టడానికి ఆ రోజు పాలవాడు రాలేదు. ఇంట్లో పాలు లేవు. మా అమ్మ గారికి తప్పనిసరిగా మా చిన్న బామ్మగారి తలుపు తట్టవలసి వచ్చింది.  మా చిన్న బామ్మ గారి తలుపు తట్టి , " అత్తయ్య గారూ ! మా చంటి పిల్లవాడికి జ్వరం వచ్చింది. పాలవాడు రాలేదు. అందుకని కొంచెం పాలు ఇస్తారా?" అని అడిగింది. పాలు లేవని మా చిన్న బామ్మ విసురుగా  అంది. అక్కడే పడక్కుర్చీ లో కూర్చున్న చిన్న తాత గారు సానుభూతిగా ," పోనీ లేవే !  కొంచెం పాలు ఇవ్వు . పిల్లవాడు ఏడుస్తున్నాడు. పైగా జ్వరం గా ఉంది అని నచ్చ  చెప్పితే , ఆవిడ విసా విసా లోపలి వెళ్లి  సరిగ్గా ఒక ఉగ్గు గిన్నెడు పాలు తెచ్చి "ఢాం" అని క్రింద పెట్టి , ఇంకొకసారి అడగ వద్దు అని గట్టిగా అరిచినట్టు చెప్పి విసుగ్గా తలుపు మూసి వేసింది. ఆ విసురుకి సగం పాలు కింద పడి పోగా, ఆ మిగిలిన కొంచం పాలలో నీళ్లు కలిపి అవి మా అన్నయ్య చేత తాగించింది. మా అమ్మది కూడా చిన్న వయస్సే. చిన్నప్పట్నుంచి దయా గుణం, దానగుణం పుష్కలంగా ఉండేది. ప్రతి రోజూ ఇంటికి కొంత మంది యాచకులు మా అమ్మ వేసే భిక్ష కోసం వస్తుండే వాళ్ళు. ప్రతి రోజూ మా అమ్మ వారందరికీ  బియ్యం  ఇస్తుండేది. మా అమ్మ పెద్ద నాన్న గారు చాలా సందర్భాల లో తిట్టడం, కొట్టటం చేస్తుండే వాళ్ళు. ఇది గమనించిన తాత గారు నెలకి ఒక బస్తా బియ్యం ప్రత్యేకంగా దానం చేసుకోవడానికి మా అమ్మకి కేటాయించారు. అందుకని మా అమ్మకి ఒక గుక్కెడు పాల కోసం జరిగిన రాద్ధాంతం చాలా ఆశ్చర్యం, బాధను కలిగించాయి. ఈ విషయాన్ని మాకు చెప్తున్నప్పుడు మా అమ్మ కళ్ళు చెమర్చేవి. 

మా చిన్న తాత గారి పిల్లలందరూ కూడా అంటే మా నర్సు బాబాయ్, రాంమోహన్ బాబాయ్, మురళీ బాబాయ్, మల్లు బాబాయ్, సీత అత్తయ్య, సుబ్బారావు బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయం గా "వదినా" అంటూ చుట్టూతా కూర్చుని మా అమ్మ చేత హిందీ పాటలు పాడించుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మ చాలా శ్రావ్యంగా పాడుతుండేది. వీళ్లంతా చిన్న వాళ్ళే కాబట్టి ఆ పసి హృదయాలలో స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, వదిన అనే ఒక గౌరవ భావం ఉండేది. అంతే ప్రేమగా వీళ్ళు మా స్వరాజ్యం, శాంత అత్తయ్య, నాన్నగార్లతో ఉండే వారు. మా నాన్న గారిని "రాముడన్నయ్య" అని ఎంతో అభిమానం తో పిలుస్తుండే  వాళ్ళు. మా చిన్న తాత గారు కూడా పిల్లలతో చాలా సరదాగా ఉండేవారట. అలాగే మా మేనత్తలన్నా కూడా మా సత్యం తాత గారికి చాలా అభిమానం. ఒక మహా కవి రాసిన " పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్ల కపటమెరుగని కరుణామయులే", పాట గుర్తుకి  వస్తుంది. పెద్ద వాళ్లందరికీ ముసుగులు ఉంటాయి., కాని  చిన్న పిల్లలకి ఉండవు. చిన్న చిన్న తగాదాలు వచ్చినా వెంటనే వారు మరచి పోతారు. మా అమ్మ అత్తగారింట్లో  పడుతున్న అవస్థలను చూసిన మా చిన్న తాత గారు మా అమ్మను ఉద్దేశించి, " రాముడూ !   కోడలి అవస్థ నేను చూడ లేక పోతున్నానురా ! హైదరాబాదు కి పంపివేసెయ్ ! అని మా నాన్న గారికి చెప్తూండే వారు. ఏది ఏమైనా మా అమ్మకి ఆరుగొలను లో తన మరుదులతో సరదాగా గడిపిన తీపి గుర్తులున్నాయి. మా రామ్మోహన్ బాబాయ్ చాలా సున్నితమైన , నిర్మలమైన మనస్సు కలవాడు. చక్కటి కవితలు రాస్తుండే వాడు. ఆయన ఆధ్యాత్మిక స్థాయి చాలా ఎక్కువ.  బాబాయ్ గారు రాసిన  " మా భాష గానమ్ము లేక గంభీర మౌనమ్ము ", " యవ్వనమా ! ఓ ....ఓ.....పూ వనమా .. "      ఇవి మా అమ్మ ఎంతో శ్రావ్యంగా పాడుతుండేది. సుబ్బారావు బాబాయ్ గారు , " వదినా !  పాటలు పాడుతూ , డాన్సులు చేస్తూ నేను బోలెడంత డబ్బు సంపాదిస్తాను నీవు చూస్తుండు" అని అనేవారట. నండూరి వారి జన్యు కణాల్లో రచనా కౌశల్యం, ఆధ్యాత్మికత, కళాభిరుచి, బహుముఖ ప్రజ్ఞలు పుష్కలం గా ఉన్నాయి.

హైదరాబాదులో మా నాన్నగారు ప్రాక్టీసు పెట్టడం - అబిడ్స్ 

నాన్న గారు విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ప్రాక్టీస్ హైదరాబాదులో అబిడ్స్ లో ప్రారంభించారు. ఎదురు గుండానే మూడు గదుల ఇల్లు తీసుకున్నారు. అతి త్వరలోనే ప్రాక్టీస్ వేగం పుంజుకుంది. మా తాత గారి లాగానే మా నాన్నగారి హస్తవాసి కూడా చాలా బాగుండేది. మా జడ్జీ తాత గారికి కూడా మా నాన్న గారె వైద్యం చేస్తుండేవారు. బొగ్గుల కుంట (రామ్ కోటి) లో మా నాన్న గారి క్లాస్ మెట్ ప్రాక్టీస్ చేస్తుండే వారు. అప్పుడప్పుడు మా నాన్న గారు ఆయన క్లినిక్ కి వెళ్తుండే వారు. ఆ డాక్టర్ గారి దగ్గరకి ఒక సారి మా నాన్న గారు వెళ్ళినప్పుడు జనగామ నుండి అల్లాడి రామయ్య  అనే ఒక వైశ్య ప్రముఖుడు వచ్చాడు. ఆయన " మా ఊరు జనగామ లో M.B.B.S  డాక్టర్లు లేనే లేరు. చుట్టుపక్కల నలభై, యాభై గ్రామాలకి జనగామ ఒక కేంద్రం. ఇక్కడికి రైళ్ల, బస్సుల సర్వీసులు కూడా ఉన్నాయి. సరి అయినా వైద్యం అందుబాటులో లేక చాలా మంది, ముఖ్యం గా పేదవారు చాలా అవస్థ  పడుతున్నారు. వైద్యం కోసం వాళ్ళు హైదరాబాదు రావలసి వస్తుంది. M.B.B.S డాక్టర్లెవరైనా మా జనగామ కి వస్తే వారు మాకు ఎంతో మేలు చేసినట్లుగా భావిస్తాం. దవాఖాన, ఇల్లు అన్నీ చూసి పెడతాం”.  అని చెప్పారు. కాక పోతే పట్టణం లో ఉండే సౌకర్యాలు ఈ ఊరికి అందుబాటు లో లేవు. అంటే విద్యుచ్ఛక్తి  లేదు. సౌకర్యవంతమైన మంచి ఇండ్లు లేవు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు లేవు. అందుకని ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఇష్ట పడరు అని వివరించారు, మా నాన్న గారి స్నేహితుడే నీవు అక్కడకి వెళ్లకూడదా? అని సలహా ఇచ్చాడు. మా నాన్న గారు వెంటనే నిర్ణయం తీసుకో లేక పోయారు. హైదరాబాదుకి దూరం గానే స్వతంత్రం గా ప్రాక్టీస్ పెట్టి బామ్మని తీసుకు రావాలని అనుకున్నారు. అప్పటికే తెలంగాణా లో కొన్ని ప్రాంతాలు చూసి వచ్చారు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పట్టణం లో ఒక క్లినిక్ కోసం అడ్వాంస్ ముందుగానే ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. నిజానికి జగిత్యాల జనగామ కన్నా పెద్ద ఊరే. కాకపొతే రైళ్ల సౌకర్యం లేదు. ఇక్కడ అబిడ్స్ లో ప్రాక్టీస్ బాగానే ఉంది.అన్నయ్యలిద్దరూ కూడా అబిడ్స్ లోనే మెథడిస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నారు. మా అక్కయ్య అప్పుడు చిన్న పిల్ల. ఈ విధం గా పరిస్థితులు కుదుట పడుతున్న సమయం లో మా జడ్జీ తాత గారు 1952 వ సంవత్సరం లో జూన్  21  న హఠాత్తు గా 52  ఏళ్ళ వయస్సులో కన్ను మూశారు.  

    మా నాన్న గారిని జనగామ వాస్తవ్యుడు అల్లాడి రామయ్య  గారు పదేపదే జనగామకు రమ్మని ప్రాధ్యేయ పడ్డారు. హైదరాబాదులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జనగామ ఒక పెద్ద పల్లెటూరు. సరైన స్కూళ్ళు, ఇల్లు కూడా ఉండవు. చివరకి ఆ పల్లెటూరి ప్రజలకే వైద్యం చేయాలి అని ఆయన నిశ్చయించుకుని అక్కడికి వెళ్లారు ప్రాక్టీస్ పెట్టడానికి. జనగామ వాసులు నాన్న గారి దగ్గర వైద్యం తీసుకున్న వారందరికీ నాన్న గారి హస్తవాసి మీద గురి కుదిరింది. అప్పుడు మా నాన్నగారికి  తాత గారు చెప్పిన, ఇచ్చిన సలహా గుర్తుకి వచ్చింది. మనం వైద్య సేవ ముఖ్యంగా పేదవారి కోసం , డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేని వారి  కోసం చేయాలి. మరీ ముఖ్యంగా మన దేశం లో వేలాది కుగ్రామాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక ఎంతో మంది చని పోతున్నారు. వైద్య వృత్తి అన్నది సమాజ సేవ కోసమే తప్ప , డబ్బు సంపాదించడం ముఖ్య లక్షణం కాకూడదు. అని ఆయన చెప్పిన సలహాలు, తండ్రి గారి జీవితం లోనే ప్రత్యక్ష అనుభవాలను దగ్గరగా చూసారు. తండ్రి వద్దకు వైద్యసేవ కోసం వచ్చిన వారికి తాత గారు చేస్తున్న సేవనే, దుఃఖంతో వచ్చిన రోగులు, నవ్వుతూ వెళ్తూ, వారిచ్చిన ఆశీర్వాదాలు  “డాక్టర్ బాబూ ! మీరు , మీ కుటుంబం అంతా చల్లగా నూరేళ్లు బతకాలి. మా లాంటి పేద వారి కి మీరు కొండంత అండ," అని చెప్తూ ఉండడం వంటివి మా నాన్న గారి మనోఫలకం మీద మెదిలాయి . ఆయన చివరకి జనగామ వెళ్లాలని  నిశ్చయించుకున్నారు. జనగామ వాస్తవ్యులు అందరూ కూడా చాలా సంతోష పడ్డారు. చివరకి ఆయన జనగామ కి వెళ్లాలని కానీ మా నాన్న గారు  తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాదు లోని అత్తగారి వైపు బంధువులెవరికీ కూడా నచ్చ లేదు. “మేమంతా ఇక్కడే ఉన్నాం.

హైదరాబాదు లో సౌకర్యాలు మెండు.  అబిడ్స్ సెంటర్ లో మీ ప్రాక్టీస్ కూడా చక్కగా వృద్ధి చెందుతుంది.  ఆ చిన్న కుగ్రామం లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎలా బ్రతుకుతారు?  మా అమ్మాయి ఇన్ని సౌకర్యాల మధ్య పెరిగింది. ఆ పల్లెటూళ్ళో ఎన్ని ఇబ్బందులు పడుతుందో?" అంటూ నానా రకాలుగా నిరుత్సాహ పరిచారు. మా అమ్మ మాత్రం నాన్న గారి నే  సమర్థించింది. చిన్నప్పట్నుంచీ మా అమ్మకి  బీదవాళ్లంటే చాలా జాలి. ఇంట్లో ఏది కనిపిస్తే అది అవసరమైన వారికి ఇచ్చేస్తూ ఉండేది. చివరకి మా నాన్న గారి నిర్ణయమే  నెగ్గింది. 1953 వ సంవత్సరం జూన్ నెలలో జనగామ లో కాపురం పెట్టారు. పోలీస్ స్టేషన్ ఎదురు గుండానే క్లినిక్ కి మంచి ఇల్లు దొరికింది. ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు  ప్రముఖ బట్టల వ్యాపారి చీలా రాజయ్య గారిది  అద్దెకు దొరికింది. జనగామ గ్రామం రెండు భాగాలు గా చెప్పు కోవచ్చును.

                                              

జనగామలో డాక్ బంగళా లో తీసిన ఫోటో:    

సుశీల పిన్ని, చేతిలో విజ్జి ,పద్మ పిన్ని శశి మామయ్య

ప్రశాంత్ అన్నయ్య, కిశోర్ బావ, రాం అన్నయ్య, కాశ్యప్,శివరావు అన్నయ్య

వరలక్ష్మి పిన్ని, ప్రసన్న అక్కయ్య, సూర్యలాలస, సాయిరాం , భవాని అక్కయ్య

 రైల్వే స్టేషనుకి ఇవతల ఒక భాగం, అటువైపున ఇంకొక భాగం గా చెప్పుకో వచ్చును. రైల్వే స్టేషనుకి వెనుక బాగానే బస్టాండు ఉంది . హైదరాబాదు నించి, వరంగల్  వైపు వెళ్లే బస్సులు ముఖ్యం గా పాసెంజర్ బస్సులు హై వే నించి లోపలి కి వచ్చేవి. కొన్ని ఎక్స్ ప్రెస్  బస్సులు ఊళ్లోకి రాకుండానే వెళ్లిపోయేవి . రైల్వే స్టేషనుకి వెనుక భాగాన్నే రైల్వే క్వార్టర్లు ఉన్నాయి మార్కెట్టు అంతా ఇటువైపే ఉంది. అంటే హోటళ్ళూ, కిరాణా, ఫాన్సీ దుకాణాలు , పుస్తకాల దుకాణాలు, గవెర్నమెంటు, ప్రైవేటు స్కూళ్ళు, ఇంకొక గవర్నమెంటు స్కూలు జిల్లా పరిషత్ స్కూల్ గా  మారింది. చుట్టూ పక్కల గ్రామాల నుండి , చాలా మంది వైశ్యులు వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. అన్ని వ్యాపారాలు వాళ్ళే నిర్వహిస్తూ ఉండే వారు. పోలీసు స్టేషనుకి ఎడమ పక్క ఉన్న సందు నుంచి వెళ్ళితే, అక్కడ రాజశ్రీ టాకీసు ఉంది. మురళీ బాబాయ్ నవయుగ  ఫిలిమ్స్ లో పని చేస్తున్నప్పుడు, వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వస్తుండేవారు. కుర్చీలు, బెంచీలు, నేల తరగతులు ఉండేవి శనివారాలు స్టూడెంట్లకి కన్సెషన్ ఇచ్చేవారు.  మూషిక రాజులు యథేచ్ఛగా తిరుగుతుండేవి. సింగల్ ప్రొజెక్టర్ కావటం వల్ల రీలు మార్పు కోసం విరామాలు ఉండేవి . అక్కడ టెక్నీషియన్ బషీర్, మాకు డాక్టరు గారి పిల్లలని చెప్పి ప్రొజెక్టర్ రూము లోకి తీసుకెళ్లి అన్నీ చెప్తుండేవాడు. మధ్య మధ్య లో ఆ ఫిలిం రోలు తెగి పోతున్నప్పుడల్లా తెర మీద " రీలు మార్పు , నిశ్శబ్దం " అని వచ్చేది. మళ్ళీ బషీరు దానిని అతుకుపెట్టి సినిమాని నడుపుతుండే వాడు. ఆయనే మా జనగామ లో ఏకైక రేడియో  రేపైరు షాపు ఓనరు. ఆ తెగి పోయిన రీళ్లను మాకు ఇస్తుండే వాడు. దానిని వెలుతురు లో పెట్టి చూస్తే, సినిమా వాళ్ళ ముఖాలు కనిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత వ్యూ మాస్టర్ అనే ఒక చిన్న బొమ్మ ప్రొజెక్టర్ అమ్మే వారు. ఈ తెగి పోయిన ఫిలిం ముక్కలని ఒక సైడుకి అమర్చి, ఈ వ్యూ మాస్టర్ నొక్కినప్పుడు , కన్నం గుండా చూస్తే బొమ్మలు స్పష్టంగా కనిపించేవి. అంతే కాకుండా ఊళ్లోకి అప్పుడప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రొజెక్టర్ (Bi-scope) లో తమాషా పాటలు పాడుతూ ఈ సినిమా (రీళ్లు) బొమ్మలు చూపిస్తుండే వారు. ఇదంతా మాకు చాలా తమాషా గా ఉండేది . ఈ మార్కెట్టు ప్రాంతం లోనే బీటు బజారు . ఇక్కడ ధాన్యం కొని అమ్మే వాళ్ళు ఏజెంట్ల తో చాలా హడావుడి గా ఉండేది . పోలీసు స్టేషన్ పక్క సందు లో ఇంకొంచెం ముందుగా వెళ్తే  ఎడమ వైపున బుచ్చి రామయ్య పంతులు గారి పాఠశాల ఉండేది. దాని తర్వాత చిన్న కేశవ స్వామి ఆలయం. ఈ ఆలయానికి నేను మా అమ్మతో తరుచూ వెళ్తుండే వాడిని. ఆ గుడి పూజారీ గారు  మా అమ్మ గారు రాగానే పరిగెత్తుకు వచ్చే వారు. మా అమ్మని అందరూ డాక్టరమ్మ గారు, డాక్టర్ దొరసాని అని పిలిచే వారు. ఇంకాస్త పైకి వెళ్తే , Z.P.H.S లో పని చేసే మాస్టర్ల ఇళ్లన్నీ వరుసగా ఉండేవి.  అంత వరకే నేను వెళ్తుండే వాడిని . అక్కడే అల్లాడి రామయ్య  గారి రైసు మిల్లు పెద్దది ఉండేది. మా నాన్న గారి క్లినిక్ పోలీసు స్టేషన్ కి ఎదురుగానే ఉండేది. నాన్న గారు రివాల్వింగ్ చైర్ లో కూర్చునే వారు . పోలీసు స్టేషన్  పక్కనే దిగువ భాగాన మెట్లు దిగి వెళ్తే చాకలి వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళుంటారు. మా ఇంటి చాకలి నరసింహులు , అబ్బ సాయిలు , తర్వాత చాకలి లక్ష్మి, ఆమె కూతురు చంద్రి వస్తుండే వారు. వీరంతా మా ఆస్థాన చాకలి వాళ్ళు. లక్ష్మి, చంద్రి మా ఇంట్లో స్వతంత్రం గా ఉండేవారు. మా అమ్మ వాళ్లకి ధారాళం గా చీరలు, డబ్బులు, వారి ఇంట్లోకి కావలసిన సామాన్లు, పండగలకి, పబ్బాలకి డబ్బులు ఇస్తుండేది. క్లినిక్ కి  కొంచెం ముందుగా వెళ్తే నెహ్రూ  పార్క్ వస్తుంది. అక్కడ నెహ్రూ గారి బొమ్మ ఉంటుంది. ఎడమ వైపు వెళ్తే వరంగల్, కుడి వైపు వెళ్తే హైదరాబాదు `హై వే వస్తుంది. అక్కడే ఎడమ వైపు వెళ్తే అల్ సెయింట్స్ స్కూల్ బ్రాంచ్ ప్రిస్టిన్స్టిట్యూట్ స్కూల్ ఉంది. చాలా పెద్ద భవనం. ఇంగ్లాండు నుంచి క్రైస్తవ మత ప్రచారకులు ఇక్కడే ఉండేవారు. నేను  1964 - 65  లో నా H.S.C (11th class) పరీక్ష అక్కడే రాసాను. అదే మార్గాన కొంచెం పైకి వెళ్తే వసంత వాగు బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి మీదనే అతి ఘోరమైన రైలు ప్రమాదం అర్ధ రాత్రి సమయం 1955 లో జరిగింది . అర్ధ రాత్రి వర్షా కాలం, ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షం. ఇంజను తో పాటు రెండు బోగీలు, ఆఖరి రెండు బోగీలు తప్ప మిగిలిన అన్ని బోగీలు పడిపోయాయి. నిజానికి అది చాలా చిన్నవాగు. అక్కడ జలప్రవాహ వేగానికి బోగీలు కొట్టుకు పోయాయి. హృదయవిదారకంగా దృశ్యాలు ఆర్తనాదాలు జనగామ అంతా ప్రకంపనలు, పెద్ద చప్పుళ్ళు అందరూ  ఉలిక్కి పడ్డారు. మా నాన్నగారు, ఇంకా ఊళ్లోని ప్రజలందరూ కూడా హుటాహుటీన ప్రమాద స్థలానికి వెళ్లారు. మా నాన్న గారు ఆ రోజు రాత్రంతా, ఆ మర్నాడు సాయంత్రం వరకూ వైద్య సహాయం చేస్తూనే ఉన్నారు. జనగామ రైలు ప్రమాదం అనే శీర్షిక తో అన్ని పత్రికలలో (వార్తల్లో) వచ్చాయి. అది మా పాఠ్య పుస్త్తకాల్లో కూడా మేము చదువుకున్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం లో రైల్వే శాఖ మంత్రి గా పని చేస్తున్న లాల్ బహాదుర్ శాస్త్రి  గారు తన పదవికి ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేశారు. అందుకే ఇంత వివరం గా చెప్పవలసి వచ్చింది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మర్నాడు మా పని వాడు జెమ్మయ్య తన భుజాల మీద కూర్చో పెట్టుకుని నన్ను ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అప్పట్లో నాకు అంత అవగాహన లేదు. లీలగా కొన్ని దృశ్యాలు గుర్తు ఉన్నాయి. మా నాన్నగారి కంపౌండర్ శంకరయ్య పెద్ద మొత్తం లో బోలెడన్ని మందులు, ఇతరత్రా సామాన్లు చేరవేస్తూనే ఉన్నాడు  అక్కడ ఉన్న M.B.B.S  డాక్టర్లు ఇద్దరే. మా నాన్నగారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు. చాలా మందికి నాన్న గారు సమయానికి వైద్యం చేసి ఎంతో మందికి ప్రాణ దానం చేశారు. ఈ విధం గా మా నాన్న గారు ఈ జనగామ అనే చిన్న గ్రామానికి రావడం బహుశా ఇంత మందికి వైద్య సేవ చేసి, ప్రాణ దానం ఇవ్వడానికే కాబోలు ! దాదాపు ఒక వారం రోజులపాటు నిద్రాహారాలు మాని జనగామ హాస్పిటల్ లో చేరిన శరణార్థు లందరికీ  వైద్య సేవ అందించారు. ఈ సంఘటనతో మా నాన్నగారి పేరు మారు మ్రోగింది. అల్లాడి రామయ్యగారు, ఇతర ప్రముఖులందరూ 

           

నాన్నగారు ,ఒళ్ళో నీరజ, పక్కన శ్రీకాంత్ (లాలస పిల్లలు )              నాన్నగారు, శ్రీకాంత్ 

వచ్చి, మా నాన్నగారికి ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులో స్థిర పడిన తన ప్రాక్టీసుని, అన్ని సౌకర్యాలను కూడా వదులుకొని, మా తాతగారు చెప్పిన విధంగా తండ్రి బాటలో నడిచి తన త్యాగశీలతను నిరూపించుకున్నారు. మా తాత గారు నండూరి శివ రావు గారు, ఆయన కుమారుడిగా మా నాన్న గారి వంశం లో జన్మించిన మేమంతా చాలా అదృష్టవంతులం. మా నాన్న గారు తన పూర్వ వైభవాన్ని ఎప్పుడో ఆరుగొలను లోనే  వదిలి  వేశారు. జనగామ లో చాలా నిరాడంబరంగా జీవించారు. మా ఇల్లు స్టేషన్ కి ఇవతల వైపు ఉంది. రైల్వే స్టేషన్ కి ఇవతల వైపు పెద్ద పెద్ద రావి చెట్లు వరసగా ఉంటాయి. తిన్నగా వెళ్తే మెయిన్ రోడ్డుకు కుడి వైపున సేల్స్ టాక్స్ (కమర్షియల్ టాక్స్) ఆఫీసు . ఎడమ వైపు బేకరీ మలయాళీ ముస్లిం అతనిది, డబల్ రొట్టి తయారు చేస్తుండే వాడు. బన్ను ఒక అణా, డబల్ రొట్టి డబల్ డెక్కర్ లాగా ఉంటుంది  నాలుగు  అణాలు . ఒక కుర్ర వాడు బుట్టలో ఇవి పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండే వాడు.ఈ బేకరీ పక్కనే రామయ్యర్ గారి హోటల్ ఉండేది. దాని పక్కన ఐస్ క్రీం తయారు చేసే దుకాణం ఉండేది. దానిలో రంగు రంగుల ఐస్ ఫ్రూట్లు రెండు పైసలకు ఒకటి , పాల ఐస్ ఫ్రూట్ ఒక అణాకి, కప్ ఐస్ క్రీం నాలుగు అణాలకి అమ్ముతుండే వారు. ఈ ఐస్ ఫ్రూట్ నే ఐస్ క్యాండీ అంటారు. మేము రోజూ  ఎన్ని తింటూ ఉండే వాళ్ళమో ! ఇక పొతే మా జనగామ లో మేమున్న వైపే గవర్నమెంటు  ఆసుపత్రి, గవర్నమెంటు  ఆడ పిల్లల బడి , తహసీల్దారు  ఆఫీసు, పిల్లల ఆట స్థలం, యువజన గ్రంథాలయం, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్, B.D.O ఆఫీసు, ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాల అనే ప్రైవేటు స్కూలు, రంగప్ప చెరువు, గీతాశ్రమము, బాణాపురం ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. అయితే జూన్ 1953 లో మా నాన్నగారు ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టినప్పుడు కరెంటు లేదు. మా చిన్నతనం లో మేము గుడ్డి దీపాల్లో, పెట్రోమాక్స్ లైటు లో చదువుకున్నాం బహుశా 1959  లో మా ఇంట్లో మొట్ట మొదటి సారిగా కరెంటు వచ్చింది. ఇప్పుడు మన ఇంటికి వెళదాం. పెద్ద చౌరస్తా , చిన్న చౌరస్తా దాటినాక మా ఇల్లు రోడ్డుకు కుడి వైపున, స్టేషన్ నుంచి ఐదు నిమిషాల దూరం లో ఉంటుంది.. మొత్తం ఐదు గదులు. ఇంటికి రెండు వైపులా అరుగులు, ముందు పెద్ద గది దానికి రెండు దృఢమైన తలుపులు, అది మా నాన్న గారు పేషెంట్లనీ చూడ దానికి కావలసిన ఏర్పాట్లు, ఆడ పేషెంట్లనీ చూడడానికి పెద్ద టేబుల్ , పరదా ఉంది. నాన్న గారి విక్రమార్క సింహాసనం, టేబుల్, కొన్ని కుర్చీలు కూర్చోవడానికి ఉన్నాయి. అక్కడే గోడలో బీరువా పుస్తకాలు పెట్టుకోవడానికి, ఆ పెద్ద బల్లకి కూడా మూడు బీరువాలు లాగా ఉండేవి. ముగ్గురు పిల్లల పుస్తకాలు పెట్టు కోవడానికి. తరువాత మండువా గది . పెద్ద మండువా అక్కడ ఎప్పుడు ఒక బకెట్ లో నీళ్లు ఉండేవి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి. మేమందరం అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ గదిలో మేము పడుకునే వాళ్ళం. నాన్న గారి మందుల బీరువా పెద్దది, ఆయన బట్టల బీరువా, మంచాలు ఒక వైపు, ఇంకొక వైపు  చిన్న బీరువా నాది, దాని పైన కూడా నాన్న గారి మెడికల్ ఎక్విప్మెంట్స్, గోడ అల్మారా లో రేడియో ఉండేది. మండువాకి నాలుగు స్తంభాలు ఉండేవి. తరువాత గదిని మధ్య గది అనేవాళ్ళం. అక్కడ ఒక మంచం అది మా అమ్మా నాన్నగార్ల గది, దానిని ఆనుకుని స్టోర్ గది కం పూజ గది. రక రకాల దేవుళ్ళ ఫోటోలు ఉండేవి. అన్ని వెచ్చాలు (provisions), ఊరగాయలు అంటే పచ్చళ్ళు వగైరా వగైరా ఉండేవి. మా అమ్మ అక్కడ కూర్చుని గంటలు గంటలు ధ్యానం చేస్తుండేది. మధ్య గదిని ఆనుకుని ఒక పెద్ద మెట్టు దిగి కిందకి వెళ్తే వంట ఇల్లు. దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. మంచి నీళ్ల  బిందెలు పెట్టుకోడానికి గట్టు,గిన్నెలు, డబ్బాలు పెట్టుకోవడానికి షెల్ఫులు ఉన్నాయి.ఇంకొక వైపు  గట్టు మీద పొట్టు పొయ్యిల మీద, బొగ్గుల కుంపటి మీద అమ్మ వంట చేసేది మడి కట్టుకుని, అక్కడే మేము పీటల మీద కూర్చుని భోజనాలు చేసే వాళ్ళం. వంట గదికి  తలుపులు ఉన్నాయి. వంటింటికి బయటి వైపు ఒక పెద్ద మెట్టు ఉంది. అది దిగితే పెద్ద ఆవరణ. అదంతా బండలతో  కప్పబడి ఉంది కుడివైపున ఒక గది రేకుల కప్పు, అక్కడ కట్టెలు పెట్టె వాళ్ళం. అందులోనే నర్సింహులు తాత, సోమడు వాళ్ళ ట్రంక్ పెట్టె పెట్టుకునే వాళ్ళు.  ఆ అరుగుల మీద రోజూ సాయంత్రం బాగా నీళ్లు పోసి కడిగేది మా పని మనిషి రాంబాయమ్మ. అప్పుడు రాత్రి పడుకోడానికి చల్లగా ఉండేది. కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి, గాన కచేరీల కోసం. మళ్ళీ ఒక మెట్టు కిందకి వెళ్తే కొంచెం దూరం లో స్నానాల గది , దాన్ని ఆనుకుని బావి ఉంది. అక్కడ ఒక వైపు బాయిలర్ ఉండేది. అక్కడే గిన్నెలు కడిగేది పని అమ్మాయి. అక్కడి తలుపు తీసుకుని బయటకి వెళ్తే పెద్ద పెరడు. అది మా పెద్దన్నయ్య తోట అన్న మాట. రక రకాల పూల చెట్లు, కూర గాయల చెట్లు , అలా ఎన్నో వెరైటీ చెట్లతో నిండి పోయి ఉండేది. ఎడమవైపున కొంచెం ఎత్తులో విశాలమైన స్థలం ఉండేది. అక్కడ పెద్దన్నయ్య పావురాల కోసం గోడ మీద రెండు పెద్ద డబ్బాలు ఫిక్స్ చేశాడు. పెద్ద వేప చెట్టు దాని క్రింద రెండు టాయిలెట్స్ ఉండేవి.  వంట గదికి పైన పెంకుల కప్పు ఉండేది. డాబా ఎక్కడానికి మెట్లు లేవు. మా పక్క వాటాలో కూడా ఐదు గదులు రైలు డబ్బాల లాగా వరుసగా  ఉండేవి. వారి ఇంటి ముందు రేకుల షెడ్డు ఉండేది. ఆ రేకుల షెడ్డు కి ఉన్న సపోర్ట్ త్రికోణాన్ని పట్టుకుని ఊగి, రేకుల మీద కి ఎగిరి మా అన్నయ్యలు, నేను డాబా మీదకి దూకే వాళ్ళం. ఇది మేము మా చిన్న తనం లో ఉన్న మొదటి ఇల్లు.

విశ్వనాథ సత్యనారాయణ గారు శార్వరి నుండి శార్వరి దాకా అనే అద్భుతమైన నవల రాశారు. ఆయన ఒక గ్రామాన్ని ఎన్నుకుని శార్వరి నుండి శార్వరి దాకా అరవై ఏళ్లలో ఆ గ్రామం లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ మార్పులు ఎలా జరిగాయో సమాజం లోని సనాతన ధర్మానికి విరుద్ధం గా వ్యవస్థ ఎలా మార్పు చెందిందో అనేదే ఇతివృత్తం .అదే మాదిరిగా జనగామ లో కూడా ఇలాంటి మార్పులే రావటం నేను గమనించాను. చుట్టు పక్కల ఒక వంద కుగ్రామాలకి కేంద్రం జనగామ . చిన్న చిన్న ఊళ్ళ లోని కరణాలు, రెడ్డి దొరలు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉండే వారు. మా ఇంట్లో పూజలు నిర్వహించడానికి వడ్లకొండ , బచ్చన్న పేట నుండి బ్రాహ్మణులు వచ్చి, పూజలు చేయిస్తుండే వారు. మా నాన్నగారి దగ్గరకి వైద్యం కోసం నెల్లుట్ల, జాఫర్ గడ్, పెంబర్తి, ఆలేరు, నిడిగొండ, కొన్నే, వల్లంపట్ల, చేర్యాల, పెండ్యాల, ఖిలాసాపూర్, రఘునాథ పల్లి, తరిగొప్పుల, దేవర కొండ, బొందుగుల, శామీర్ పేట్, పసరుమడ్ల, గానుగ పహాడ్, ఘనపూర్, మద్దూరు, ఇలాంటి ఇంకా ఎన్నో చుట్టు పక్కల గ్రామాల నుండి, ఎడ్ల బండ్లు కట్టుకుని నాన్న గారి దగ్గరకి వైద్యం కోసం వస్తుండే వారు. వీరిలో చాలా మంది కడు పేద వారు. నాన్న గారు వీరిలో చాలా మందికి ఉచితం గా వైద్యం చేస్తుండే వారు. చాలా సార్లు వారు మా ఇంట్లోనే ఆశ్రయం తీసుకునే వారు. వారికి మా అమ్మ గారు భోజనాలు పెట్టే వారు .



             

జనగామలో వెనక పెద్ద పెరట్లో తీసిన ఫోటో. మా రమణి చంటి పిల్ల 

సాయిరాం, నాన్నగారు ఒళ్ళో రమణి , పెద్ద పాప, దుర్గ , విజ్జి (అటు చివర)

  

              

  

              పద్మ పిన్ని మా అమ్మ సీత కక్కి లక్ష్మి పిన్ని వెనుక సాయిరాం పెద్ద పాప

ఊళ్ళో అందరికీ మా అమ్మ అంటే ఎంతో గౌరవం. డాక్టరమ్మా అని పిలుస్తుండే వాళ్ళు. ఊళ్లోని తురక వారంతా కూడా నాన్న గారి దగ్గరకి వైద్యానికి వస్తుందే వారు . మా నాన్న గారు ఉర్దూలో సంభాషించే వారు. కానీ మా అమ్మ ఉర్దూ చాలా చక్క గా మాట్లాడేది. ధనికులకన్నా పేదవారికే నీతి, నిజాయతీ, మర్యాద, కృతజ్ఞత ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు మా ఇంటికి కూరగాయలు, జున్ను పాలు ఎంతో కృతజ్ఞతా భావం తో ఇస్తుండే వారు. చిన్న పిల్లల వ్యాధులకు మా నాన్న గారి వైద్యం, హస్తవాసి బ్రహ్మాoడం గా పని చేసింది. మా నాన్న గారు చాలా శాంత స్వభావులు. కోపం అనేది మేము ఎప్పుడూ చూడ లేదు. జనగామలో భోజన సౌకర్యం లేనందు వల్ల మా నాన్న గారి వద్దకు వచ్చే అనేక మంది మెడికల్ representatives కి మా ఇంట్లోనే భోజనం. అన్నపూర్ణా దేవి సాక్షాత్తు మా అమ్మ రూపంలో ఇరవై నాలుగు గంటలు అతిథి అభ్యాగతులకి భోజనం అందిస్తూ ఉండేది. ఇప్పటికీ కూడా చాలా మంది నాకు తెలిసిన వారు ఈ విషయాన్ని అంటే మా అమ్మ గారి ఆతిథ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ  నాతో చెప్తూ ఉంటారు ఈస్ట్ ఇండియా కంపనీ మేనేజరు ఎన్.ఎల్.శాస్త్రీ గారు ఆయన వయసు 83 సంవత్సరాలు. నాతో ఇప్పటికీ తరచూ మాట్లాడుతూ ఉంటారు. నాతో ఈ విషయమే చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఇదే ఈస్ట్ ఇండియా ఫార్మా కంపనీ లొ రాంమోహనరావు బాబాయ్ రెండవ అల్లుడు పూర్ణచంద్రరావు నేను పని చేసాము. అప్పట్లో నాన్నగారు ఎక్కువగా టింక్చర్లు, తరువాత టాబ్లెట్లు పొడి చేసి పొట్లాలు కట్టి ఇస్తుండేవారు. ఆర్థిక స్తోమత ఉండి కారు కొనుక్కోగల స్తోమత ఉన్నాఫిలిప్స్ సైకిలునే వాడేవారు. నేను నాన్నగారి డిస్పెన్సరీ లో పెజిల్ అండ్ మోర్టారు (కల్వం) దానిలో టాబ్లెట్లు వేసి పొడి చేసి పొట్లాలు కడుతుండేవారం. మాకు అదొక సరదా. పొద్దున్న 9 గంటల నుండి ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి 9 గంటల వరకు క్లినిక్ తెరచిఉండేది. ఇంట్లో పుష్కలంగా బ్రిటానియా బిస్కట్లు ఇంకా ఏవేవో మిఠాయిలు తెస్తుండే వారు. మా నాన్న గారు రాగానే నేను, మా అక్కయ్య, చెల్లెలు లాలస మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని సిద్ధంగా ఉండేవారం. నాన్న గారి మెడికల్ బాగు తీసుకుని లోపల పెట్టటo, నాన్నగారు మా ముగ్గురి వైపు చూసి, మూడు గ్లాసుల నుండి నీళ్ళు కొంచెం కొంచెం తాగి ఇచ్చేవారు. మేమంతా ఆనంద పడి పోయేవారం. నాన్న గారు బట్టలు మార్చుకుని వచ్చేలోపుగా మేము పెరటి దగ్గర ఒకళ్ళు  చెంబు,ఒకరు సబ్బు, ఒకరు తువ్వాలుతో సిద్ధంగా ఉండేవారం. తర్వాత అందరం కలిసి భోజనం చేసేవారం.  మా ఊళ్ళో రోజూ మేము బజారుకి వెళ్తున్నప్పుడు జనాలు అందరూ మర్యాదపూర్వకంగా పక్కకు తప్పుకునేవారు. నమస్కారం చేస్తుండేవారు. నాన్నగారు మధ్యాహ్నం పడుకునేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పుస్తకం చదువుతుండే వారు.  చదువుతూ చదువుతూ నిద్ర పోయే వారు. నాలుగు గంటలకి నిద్ర లేవగానే మా అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగి, తయారయి ఐదు గంటల కల్లా దవాఖాన కి వెళ్లే వారు, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు, చేతిలో టార్చి లైటుతో మిత్రులతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవారు.కాంపాండారు సైకిల్ తీసుకు వచ్చి ఇంట్లో పెడుతుండేవాడు. నాన్నగారు బట్టలు మార్చుకుని, అన్నం తినేసి, ఏదో ఒక పుస్తకం చదువుకుని రాత్రి ఎప్పుడో ఒంటిగంటకు పడుకునేవారు. చాలా మంది ఇంటికి కూడా మందుల కోసం వస్తుండేవాళ్లు. ఇంటి నిండా మందులు ఉండేవి. మందులు పెట్టుకోడాని కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద చెక్క  బీరువా దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు చేయించారు. పొద్దున్న మా అమ్మ మా కోసం రొట్టెలు చేసి పెడ్తుండేది, మేము వాటిని ఫెరడాలు కాని సిరి మాల్ట్ తో కాని తినేవారం. హార్లిక్స్, ప్రోటిస్యూల్స్, ఓవళ్టిన్  అన్నీ తాగుతూ ఉండేవాళ్ళం. జనగామకు వచ్చినప్పుడు మా పెద్ద అన్నయ్యకి 12 ఏళ్ళు, మా చిన్న అన్నయ్యకి తొమ్మిది ఏళ్ళు , మా అక్కయ్యకి ఐదు ఏళ్ళు , నాకు మూడేళ్లు, మా చెల్లెలు లాలస ఆరు నెలల చంటి పాప. అంటే అప్పుడు మేము ఐదుగురు పిల్లలం. తరువాత 1960 నాటికి ఎనిమిది మంది పిల్లలం అయ్యాము. ఆ సమయం లో అంటే 1953 జూన్ నాటికి జనగామ లో కరెంటు లేదు. కుళాయిలు లేవు. బావులు ఉండేవి. పొట్టు పొయ్యి, బొగ్గుల కుంపటి, తర్వాత ప్రైమర్ స్టవ్, తర్వాత వొత్తుల జనతా స్టవ్ మీద అమ్మ వంట చేస్తుండేది. నిప్పు రాజేయడానికి గొట్టం తో ఊదటం, బొగ్గుల కుంపటి దగ్గర విసన కర్రతో విసరటం, మా అమ్మకి పొగ మూలంగా కళ్ళలో నీళ్లు, మాకేమో దగ్గు, కళ్ళు మంటలు ఉండేవి. కాని మా అమ్మ ఏనాడు కూడా ఫిర్యాదు చేయలేదు. స్నానాల కోసం పెద్ద కాగుతో నీళ్లు కట్టెల   పొయ్యి మీద కాచే వారు.  ప్రతి ఆదివారం కుంకుడు కాయ, శీకాకాయతో అందరం తల స్నానాలు చేసేవాళ్ళం. ఆ తరువాత నీళ్ల కాగు స్థానంలో రాగి బాయిలర్ స్నానాల కోసం వాడేవాళ్ళం. కాని   మా అన్నయ్యలిద్దరూ హైదరాబాదులో ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకున్నారు.  జనగామలో ఇంగ్లీష్ మీడియం స్కూలు లేనందున తప్పనిసరిగా తెలుగు మీడియం లోనే చదువుకున్నారు. మొదట్లో వారికి చాలా కష్టం అయింది అన్ని విషయాలు  తెలుగులోనే చదువుకోవాలంటే. మా అమ్మే అప్పుడు ఇంట్లో తెలుగు బాగా నేర్పించింది. చాలా తొందరగానే వారిద్దరూ తెలుగు భాష నేర్చుకున్నారు. కరెంటు  లేనందువల్ల మా చదువులన్నీ చిన్నప్పుడు కిరసనాయిలు ఎక్కా దీపం, హరికేన్ లాంతరు, దీపాలతో సాగాయి. తరువాత  పెట్రోమాక్స్ లైటు వచ్చింది. అందుకని భోజనాలు చీకటి పడక ముందే చేసేవాళ్ళం. మొదట్లో ఇంట్లో మండ్రకప్పలు చాలా వస్తుండేవిట. బహుశా 1960 ప్రాంతంలో మా ఊరికి కరెంటు వచ్చింది. మొట్ట మొదటి సారిగా కరెంటు మా ఇంటికి  వచ్చింది. అలాగే సిమెన్స్ రేడియో మా ఊరిలో మా ఇంటికే ఫస్టు వచ్చింది. రైల్వే కూలి హుస్సేన్ ఆ డబ్బాని నెత్తి మీద పెట్టుకుని రావటం నాకు బాగా గుర్తు. ఆ రోజు ఇంట్లో నానా హడావుడి పడ్డాం. డాబా మీద అంటినా, భూమిలో ఏదో వైరు పెట్టి ఎర్తింగ్ చేశారు. ఎవెరెడీ బాటరీ సహాయం తో వివిధ భారతి, బాలానందం, బినాకా గీత్ మాలా , అల్ ఇండియా రేడియో నాటకాలు, క్రికెట్ కామెంటరీ వింటూ ఉండేవాళ్ళం. నాన్న గారికి క్రికెట్ కామెంటరీ అంటే చాలా ఇష్టం. ఒక పుస్తకంలో స్కోరు రాస్తూండేవారు. అప్పట్లో పంకజ్ రాయ్ , నారీ కాంట్రాక్టర్ ఓపెనింగ్ బాట్స్మన్ గా వచ్చేవారు. సిగ్నల్స్ వీక్ గా ఉన్నప్పుడు నాన్న గారు స్టెతస్కోప్ పెట్టుకుని వినేవారు. పొద్దున్న పూట మరియూ రాత్రి తొమ్మిది గంటలకి మాత్రం తప్పకుండా వార్తలు వినేవారు. ఆ సమయంలో మటుకు మేము చాలా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళం. అప్పుడే మేము గణపతి నాటకం ద్వారా మొట్టమొదటి సారిగా నండూరి సుబ్బా రావు బాబాయ్ గారి హాస్యాన్ని చవి చూసాం. వారానికి ఒక్క సారి మాత్రమే ఈ ప్రోగ్రామ్ వస్తుండేది. మేము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తుండే వాళ్ళం. గణపతిగా నండూరి సుబ్బారావు బాబాయ్, తల్లిగా సీతా రత్నం బామ్మ ఆ నాటకానికి జీవం పోశారు. ఆ సందర్భంలోనే ఆరుగొలనులో తన అనుభవాలు సుబ్బారావు బాబాయ్ గారి చమత్కార మాటలు, చేష్టలు గురించి చెప్పారు 

                                              అధ్యాయం 8

                                            

                                రంగప్ప చెరువు దగ్గర పెద్ద పాప (లాలస), దుర్గ

మా నాన్న గారి సాహిత్యాభిలాష :అప్పట్లో ప్రచురించబడ్డ అనేక తెలుగు వార పత్రికలు, పక్ష పత్రికలు (fortnights) మాసపత్రికలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెప్పిస్తుండేవారు. ఆంధ్ర ప్రభ, పత్రిక, ప్రజామత, యువ, ఆంధ్ర జ్యోతి, స్వతంత్ర, భారతి, చంద మామ, బాలమిత్ర, భవన్స్ జర్నల్, రీడర్స్ డైజెస్ట్, కృష్ణా పత్రిక, ఆ తర్వాత బాల జ్యోతి, స్వాతి( monthly) సనాతన సారథి, ఇంకా అనేక మ్యాగజైన్స్ తెప్పిస్తూ ఉండే వారు. అంతే కాక విశ్వనాథ సత్యనారాయణ,అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి, చిలకమర్తి, పానుగంటి, శరత్ చంద్ర, విశ్వ ప్రసాద్, తవ్వాలి నరసింహ రావు, ఎమెస్కో పుస్తకాలు, ఇంటింటా  స్వంత  గ్రంథాలయం స్కీం కింద కొన్ని వందలాది పుస్తకాలు, పిల్లల కోసం ఊట్ల కొండయ్య, శ్రీ శుభ రాసిన  బాల సాహిత్యం , డిటెక్టివ్ నవలలు, ఒకటి కాదు వైవిధ్యం కల అన్ని పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి. నేను బుచ్చి రామయ్య పంతులు గారి బడిలో చదువుతున్నాను. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, తెలుగు సంవత్సరాలు, గుణింతాలు, సుమతి, వేమన, భాస్కర శతకాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, అన్నీనేర్చుకున్నాను. అక్కడ చదువు చాలా తొందరగా వస్తుంది. అల్లరి పిల్లలను గోడ కుర్చీ, కోదండం ఎక్కించేవారు. అంటే అల్లరి పిల్లవాడు దూలాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండాలి. కింద ముళ్ల కంప పెట్టె వారు. ఆ పిల్ల వాడు "సార్ ! సార్ ! తప్పయింది. ఇంక ఎప్పుడూ నేను అల్లరి చేయను", అని బ్రతిమిలాడుతుంటే వాడు పట్టు జారి కింద పడే సమయానికి చటుక్కున ఆ ముళ్ల కంప లాగేసే వారు. బుచ్చి రామయ్య గారు చాలా లావుగా ఉండే వారు. ఆయన ఒక పడక్కుర్చీలో కూర్చుని , నిద్ర నటిస్తూ ఉండేవారు. పక్కనే రబ్బరు తాళ్ల కుప్ప ఉండేది. అల్లరి చేస్తున్న పిల్లల మీద ఈ రబ్బరు బ్యాండ్లని సాగా తీసి వదిలే వారు. అది తగిలిన పిల్లవాడు, " చచ్చానురా ! బాబోయ్ !" అని ఆయన దగ్గరకి   వెళ్ళగానే, ప్రత్యేకమైన పేము బెత్తం  (ఇది మాయా బజారు దుకాణం లో దొరుకుతుంది) తో నాలుగు దెబ్బలు వేసేవారు. అంతే సంగతి ! నాకు వెంటనే చదువు బ్రహ్మాoడం గా వచ్చేసింది. అందువల్ల విశ్వనాథ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు మొదలైన వారి పుస్తకాలు నేను పదేళ్ల వయసులోనే చదివాను. పురాణ వైర గ్రంథ మాల విశ్వనాథ గారి పన్నెండు గ్రంథాలహారం నాకు, మా అక్కయ్యకి అర్థం కాని విషయాలని మా నాన్న గారు విశ్లేషణ చేసి చెప్పే వారు. విమర్శనాత్మకంగా ఆ సన్నివేశాన్ని లేదా ఒక పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి అన్నది మాకు మా జీవితంలో ఎంతో ఉపయోగ పడింది. చందమామ రాగానే పోటీలు పడి పరిగెత్తుకుని వెళ్లే వాళ్ళం. ముందుగా మా చిన్న అన్నయ్య, తరువాత సీనియారిటీ ప్రకారం మా వాంతులు వచ్చేవి. తెలుగు సాహిత్యమే కాకుండా ఇంగ్లీషు క్లాసిక్స్, ఫిక్షన్స్, మిస్టరీ, అడ్వెంచరస్ (సాహసకృత్యాలు)కి సంబంధించిన గ్రంథాలు, ఇంకా బోలెడు ఇంగ్లీషు నవలలు ఇంట్లో ఉండేవి. త్రీ మస్కటియర్స్ , హెడ్లీ  ఛేజ్, కెన్ ఫోల్లెట్, పెర్రీ మాసాను, కౌంట్ అఫ్ మార్క్ ట్వైన్, త్రీ మెన్ ఇన్ అ బోట్, టేల్ అఫ్ టూ  సిటీస్, ఇలాగ వందలాది సంఖ్యలో వెస్ట్రన్ పుస్తకాలు కూడా ఉండేవి. ముఖ్యంగా లూయి ఎల్.ఎం.ఔర్ ఇవన్నీ విరివిగా చదివాము. అప్పట్లో ఆంధ్ర పత్రికలో మా రామ్ మోహన్ బాబాయ్ గారు రాసిన టామ్ సాయర్, హాక్ల్ బెర్తి,  కాంచన ద్వీపం, యాత్ర , విశ్వాకుల నరసింహం గారు రాసిన అద్దె బోటులో ముచ్చటగా ముగ్గురు, ముళ్ళపూడి వారి బుడుగు, ఇంకా 80 రోజుల్లో భూ ప్రదక్షిణం , రెండు మహా నగరాలు, పంచతంత్రం, ఇలాంటివన్నీ మేము ఎంతో ఆసక్తిగా పోటీలు పడి చదివే వాళ్ళం.  మా రామ్మోహన్ బాబాయ్, ముళ్ళపూడి, బాపు గారి సాహిత్యాల ప్రభావం మా మీద చాలా పడింది. అప్పట్నుంచీ మా అందరికీ కూడా రామ్మోహన్ బాబాయ్ గారు, ముళ్ళపూడి గారు, బాపు గారు, నండూరి సుబ్బారావు బాబాయ్ గార్లందరికీ మా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.  మా నాన్న గారికి ఒక ప్రత్యేకమైన కిట్ ఉండేది. అందులో ట్వైన్ దారపు ఉండ, పెద్ద సూది, దబ్బనం, జిగురు ఉండేవి. మధ్యాహ్నం భోజనం చేశాక, తీరిగ్గా కూర్చుని, అన్ని పత్రికలలో నుంచి పైన చెప్పిన సీరియల్స్ అన్నింటిని చక్కగా కత్తిరించి, అవి ముగియగానే చక్కగా పుస్తకంగా కుడుతుండే వారు. మాతో సమానంగా ఇవన్నీ చదివి ఆనంద పడుతుండే వారు. ఇలాగే జ్యోతి, యువ, చందమామ, బాలమిత్ర మొదలైన మాస పత్రికలలో నుంచి కూడా సీరియల్స్ ని కూడా  పుస్తకాలుగా కుడుతుండేవారు. ఈ విధంగా మా అందరికీ కూడా తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలంటే  అభిలాష కలిగింది. ఒక రోజు మా నాన్న గారు మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుతూ , మధ్యలో పకపకా నవ్వుతున్నారు. కింద పడుకున్న నేను వెంటనే లేచి, : నాన్న గారూ ! ఎందుకు నవ్వుతున్నారు?" అని అడిగితే నాన్నగారు నవ్వు ఆపి P. G. Woodhouse పుస్తకాన్ని పరిచయం చేశారు. అప్పట్నుంచి నేను  P. G. Woodhouse వీరాభిమాని నయ్యాను.

                                    

                రంగప్ప చెరువు దగ్గర గడ్డివాములో సాయిరాం, పెద్ద పాప, దుర్గ, అక్కయ్య, విజ్జి

మా నాన్న గారి సాహిత్య గోష్ఠి 

ప్రతి ఆదివారం సాయంత్రం మా ఇంటికి ఆంధ్ర భాషాభివర్ధని ఉన్నత పాఠశాలలో మాకు చదువు చెప్పే మాస్టర్లందరూ వస్తుండేవారు. అప్పట్లో తెలంగాణలో టీచర్ల కొరత ఉండేది. ఆంధ్రా నుంచి వచ్చిన ఉపద్రష్ట శాస్త్రి గారు, తెలుగు మాస్టర్ గారు ఈ స్కూలు వ్యవస్థాపకులు. మాకు చదువు చెప్పిన టీచర్లందరూ కూడా ఆంధ్రానుంచి వచ్చిన వాళ్ళే. అందువల్ల మా ఉచ్చారణ స్వచ్ఛంగా ఉంటుంది. ఆదివారం సాయంత్రం మా ఇంట్లో సమావేశం లో సాహిత్య గోష్టి జరుగుతుండేది. పానుగంటి వారి సాక్షి, విశ్వనాథ వారి “దమయంతీ స్వయంవరం”, “విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు”, “హాహా హూహూ” ఇలాంటి పుస్తకాల మీద చర్చలు జరుగుతూ ఉండేవి. మా నాన్న గారు చదువుతూ ఉండేవారు.

      

హెడ్ మాష్టారు గారి వెనుక ప్రశాంత్ అన్నయ్య 6వ తరగతి ,ఎడమవైపున బందేలి ప్యూన్ ,కుడివైపున సత్తార్, అబ్బాస్ ప్యూన్లు

జి.కే.మూర్తి మాస్టారు గారు, రమణ మూర్తి మాస్టారు గారు నశ్యం పీలుస్తుండే వారు. ముని మాణిక్యం యాజ్ఞ వల్క్య శర్మ మాస్టారు గారు అంటే మునిమాణిక్యం  నరసింహారావు గారి కొడుకు ఆయన రాసిన పుస్తకాలు చదివి వినిపిస్తుండేవారు. నవ్వులతో సరదాగా ఉండేది ఆ సాహిత్య గోష్టి. మా అమ్మ వేడి వేడిగా పకోడీలు, బజ్జీలు, కాఫీలు చేస్తే మేము వారికి అందిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నేను కూడా కూర్చుని వింటుండేవాడిని. సెట్స్, బ్రిడ్జి ఆటలు ఆడుతుండేవారు. వేయించిన లేత మొక్కజొన్న గింజలు, మొక్క బుట్టలు, ఉడకపెట్టిన వేరు సెనగ కాయలు, మిరపకాయ బజ్జీలు మా అమ్మ చేసి పెడ్తుండేది. ఈ విధంగా మా నాన్నగారు మా అందరిలో పుస్తక పఠనం (బుక్ రీడింగ్) అలవాటు చేశారు.  



ఆటలు 

ఆటల్లో నాన్న గారు మా అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. ఆదివారాలు స్కూల్లో మాతో పాటు బాడ్మింటన్ ఆడేవారు. నేను లెఫ్ట్ ఫ్రంట్, నాన్న గారు సెంటర్ లేకపోతే బ్యాక్ లో ఆడుతుండే వాళ్ళం. అప్పుడప్పుడు నాతో క్రికెట్ కూడా ఆడుతుండేవారు. మా అన్నదమ్ముల్లో ఒకరు క్రికెట్ కెప్టెన్ గా ఉండే 

వారు. మా ఆట చూడడానికి తహసీల్దారు, మాజిస్ట్రేటు, డి ఎస్ పి., సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన పెవిలియన్ ఏర్పాటు చేసే వాళ్ళు. మా పెద్ద అన్నయ్య చాలా దృఢం గా అందంగా ఉండేవాడు. పేస్ బౌలరు, బాటింగ్ లో కూడా నాలుగైదు సిక్సర్లు కొట్టి వెళ్లిపోయే వాడు. మా చిన్న అన్నయ్య డిఫెన్సె ఆటగాడు. రన్స్ చేయడు. అవుట్ కాడు,  నేను అల్ రౌండర్ ని.  నాన్నగారు నాకు "లాంగ్ హేండిల్ కేనన్ ఇంగ్లీష్ విల్లో బాట్" కొనిచ్చారు. ఇంటికి వచ్చాక ఆడిన ఆటని విశ్లేషణ చేస్తుండేవారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చే వారు. హాకీ కూడా చాలా బాగా ఆడేవారు. నేను అండర్ నైన్టీన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్, వరంగల్ లో మా టీం తో సహా వెళ్లి ఆడేవాడిని. దానికి మా నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉండేది. మా అమ్మ పొద్దున్నే లేచి చపాతీలు కానీ పూరీలు కానీ, కూర చేసి  పెట్టేది. తెల్లవారు ఝామున ఆరు గంటలకే మేము బస్సులో వరంగల్ వెళ్లే వాళ్ళం. తిరిగి సాయంత్రం నాలుగైదు గంటలకల్లా ఇంటికి (జనగామ) వచ్చేవాళ్ళం. మా జట్టులో గాయపడ్డ వారికి మా నాన్నగారే వైద్యం చేస్తుండేవారు.మా జనగామ క్రికెట్ టోర్నమెంటులో ఆడడానికి నల్గొండ, సిద్ధిపేట, హనుమకొండ నుంచి వచ్చిన ఆటగాళ్లకు పొద్దున్న మా అమ్మ  ఫలహారాలు చేసి  పెడుతుండేది. ఆటల్లో లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్  ఉండేవి. అన్నింటిలో మా ఇంట్లో అందరికీ ప్రథమ లేక ద్వితీయ బహుమతులు వస్తుండేవి. ఈ విధంగా మా అమ్మా, నాన్నగారు మాకు అన్ని రంగాల్లో ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. 

వినోదాలు 

మా నాన్నగారు మా అందరితో సరదాగా మమ్మల్ని ఆటపట్టిస్తూ ఉండేవారు. వేసవి సెలవుల్లో మా మేనమామ పిల్లలు, మా వేదమ్మ పిన్ని పిల్లలు, అందరూ వచ్చేవాళ్ళు మా ఇంటికి. అందరికీ మా అమ్మ రాజక్కయ్య, నాన్నగారు బావగారు. ప్రతి రోజు డిస్పెన్సరీ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారు రకరకాల బిస్కత్తులు, చాకోలెట్లు తెస్తుండేవారు. ఒక పెద్ద డ్రం నిండా మా అమ్మ వేపుడు బియ్యం లో ఉప్పు, ఉలవలు, ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు, పుట్నాల పప్పులు, కరివేపాకు,వేసి చేస్తుండేది. నువ్వులుండలు, పల్లీలుండలు, చక్కిలాలు, జంతికలు, చేగోడీలు, ఇవన్నీ పెద్ద పెద్ద పారిస్ డబ్బాల్లో ఉండేవి. ఇవన్నీ ముందు లచ్చవ్వ  తరువాత తరువాత ఆండమ్మ చేస్తుండేది. ఇవన్నీ మా ఇంట్లో స్టోర్ గదిలో  తాళం వేసి  ఉండేవి. తాళం చెవి  పని చేసే మా సోమయ్య చేతిలో ఉండేవి. మా పనివాడు జెమ్మయ్య తమ్ముడు ఈ సోమయ్య. వాడే మా అమ్మకి దత్తపుత్రుడు. అందరికీ ఆత్మ బంధువు. వాడికి మేము తెలుగు రాయటం, చదవటం నేర్పించాం. ఒక రోజు మా నాన్నగారు సరదాగా ఒక పందెం వేశారు. ఈ పందెంలో మా పిన్ని కొడుకులు శ్రీ రామ్, కశ్యప్, డుంబు, మా మేనమామ పిల్లలు కిశోర్, చందన్, బోసు నేను పాల్గొన్నాం. ఎవరైతే 20 ఇడ్లీలు తింటారో వాళ్లకి ఐస్క్రీమ్ ప్లస్ సినిమా కి పంపిస్తారు అనేది పందెం. అమ్మ ఆరోజు చాలా ఇడ్లీలు  చేసింది సాంబారు చట్నీ తో సహా. ఇవన్నీ చ్చేసి అమ్మ బయటకు వెళ్ళింది. ఈ పందెం అమ్మ ఇంట్లో లేనప్పుడు నాన్నగారు చేయించారు. రామ్ అన్నయ్య, నేను, కశ్యప్ ఈ పందెం లో దిగాం. నాన్న గారు కావాలని నెయ్యితో కలిపారు. 

                                                           

   రాం అన్నయ్య                                                                     కశ్యప్

నేను ఐదు  ఇడ్లీలకి, కశ్యప్ పది ఇడ్లీలతో అవుట్. రాం అన్నయ్య పదిహేను దాకా వచ్చాడు. 15 తర్వాత కాస్త ఇబ్బంది పడ్డాడు.  కడుపు ఉబ్బి పోయింది. కళ్ళు కొంచెం తేల వేశాడు. ఒక ఐదు  నిమిషాలు విరామం ఇచ్చాడు. నేను, కశ్యప్ పచార్లు మొదలు పెట్టాం. కిశోర్, బోసు నాలుగు ఇడ్లీలకే అవుట్ అయ్యారు. వాళ్ళు సాంబారు గుమ్మరించి తిన్నారు ఇడ్లీలని. నాన్నగారి ముసిముసి నవ్వులు చూసి రామన్నయ్యకి పంతం ఎక్కువ అయిపోయింది. నా భుజాలు పట్టుకుని "అమ్మయ్య " అంటూ అటూ ఇటూ పచార్లు చేయటం మొదలు పెట్టాడు. ఆ ఇడ్లీలు కూడా మామూలు సైజు లో లేవు. పాతకాలంవి. చాలా పెద్ద సైజులో ఉండాలి. సోమయ్య తమాషా చూస్తున్నాడు. దానితో రామన్నయ్యకి ఒళ్ళు మండింది. "పదరా ! ఆఖరి పట్టు పడతాను", అని అన్నాడు. అందరం తమాషా చూస్తున్నాం. 16 , 17 , 18 ....  దాకా లాగించాడు. పొట్ట చాలా ఉబ్బింది. ఆపసోపాలు పడ్తున్నాడు. "పెద్ద నాన్నగారూ ! ఒక్క ఐదు నిమిషాలు , ప్లీజ్ !" అని ప్రాధేయ పడ్డాడు. నాన్నగారికే కాస్త భయం వేసింది.  "చాలు రా ! పందెం నీవే గెలిచావు". అని అన్నారు. కాని రామన్నయ్య మాత్రం ఒప్పుకోలేదు. మొత్తానికి ఆ రెండు కూడా లాగించేసాడు. అందరం చప్పట్లు కొట్టాం. కాని అన్నయ్య పరిస్థితి చూసి భయపడ్డాం. పాపం ! లేవలేక చతికిల పడ్డాడు. అందరం కలిసి పట్టి లేపాం. ముందుగా వాష్ రూమ్ కి పరిగెత్తాడు. ఇంతలో మా అమ్మ వచ్చింది. అందరం దిగాలుగా ఉన్నాం. రామన్నయ్య ఆపసోపాలు పడుతున్నాడు. కడుపు బాగా ఉబ్బింది. "అమ్మయ్య'' అని అంటున్నాడు. అమ్మ నాన్నగారిని మందలించింది పిల్లలతో ఇదేమి పందెం అని. వీడు ఇంతకు తెగిస్తాడని నేను అనుకోలేదు. అని నాన్నగారు అన్నారు. అమ్మ వాము కాషాయం ఇచ్చింది. నాన్నగారు ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు. ఆయనకి ఒక్కసారిగా జాలి కలిగింది అన్నయ్య మీద.

             నేను, రామన్నయ్య రంగప్ప చెరువు కట్టపైకి వెళ్లాం. అక్కడే మర్రి బావి ఉంది. అక్కడే మేము పంట కాలువలో ఈతలు కొట్టేవాళ్ళం. "అమ్మా" ,"అమ్మా" అంటూ అక్కడే ఒక గంటసేపు వాడితో పాటు నేను కూడా  పచార్లు కొట్టాను. ఆ తరువాత కాస్త కుదుట పడ్డాడు. ఆ తరువాత మెల్లగా ఇంటికి వెళ్లాం. నాన్నగారు వాడిని చూసి కాస్త నెమ్మదించారు. "పెద్ద నాన్నగారూ ! మీరు నన్ను మోసం చేశారు. చాలా నెయ్యిలో ఇడ్లీలు ముంచేశారు. అమ్మ రామన్నయ్యవైపు వకాల్తా పుచ్చుకుంది. ఆ మర్నాడు మా అందరికీ నాన్నగారు ఐస్క్రీమ్ తినిపించారు. ఎందుకంటే ఆరోజు అన్నయ్య పొట్టలో జాగా లేదు. సినిమాకి కూడా ఆ మర్నాడే పంపించారు. సరిగ్గా ఇలాంటి పందెం నాన్నగారు సీత తో వేశారు. నా పెళ్ళైన కొత్తలో జనగామలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. మామా కోడళ్ళిద్దరికీ ఆవడలు చాలా ఇష్టం. ఆ రోజు ఎందుకో అమ్మ ఆవడలు చేసింది. నాన్నగారు తింటూ సీతని "ఇంకా తిను," "ఇంకా తిను", అని ప్రోత్సాహించారు. సీత ఎక్కువగా తిని ఆపసోపాలు పడుతుంటే అమ్మ నాన్నగారిని కోప్పడింది. పోటీ ఆపింది. 


దొంగ బూచాడు 

వేసవి సెలవుల్లో మా సీత కక్కి, పద్మ పిన్ని, వరలక్ష్మి పిన్ని, అమ్మ, మా చెల్లెళ్ళు అందరూ వెనక దొడ్లో మంచాల మీద కూర్చుని ఏవో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. పెట్రొమాక్స్ లైటు వెలుగుతుంది. నాన్నగారు డిస్పెన్సరీ నుండి వచ్చాక బట్టలు మార్చుకుని పెట్టుడు గడ్డం పెట్టుకుని, తలపాగా చుట్టుకుని, మాట్లాడవద్దని నాకు సైగ చేసారు. చేతిలో ఒక కర్ర పట్టుకుని చప్పుడు చేయకుండా పెరటిలోకి నడిచారు. అందరూ అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. నాన్నగారు హఠాత్తుగావారి ముందు దూకి గట్టిగా అరిచారు. అంతే ! అరుపులు, కేకలు, ఏడుపులు, అంతా గందరగోళం ! వరలక్ష్మి పిన్ని స్ప్రుహ తప్పి పడిపోయింది. పద్మ పిన్ని ఏడుపు. మా అమ్మకి నోట మాట రావటంలేదు. దొం ..... దొం .... దొం ... అని అంటుంది. సీత కక్కి మాత్రం గట్టిగట్టిగా "ఎవడ్రా నీవు?" అని అరచింది. దెబ్బకి మా నాన్నగారు గడ్డం, తలపాగా, మీసాలు తీసేశారు. అప్పుడు అందరూ వచ్చింది  దొంగ కాదు మా నాన్నగారే అని తెలిసి కుదుట పడ్డారు. కృత్రిమ గడ్డాలు, మీసం హైదరాబాదులో నుమాయిష్‌ లో కొన్నారు. వేషంలో మా నాన్నగారి ఫోటో కూడా ఉంది.

నాన్నగారి సామాజిక సేవ

 మా ఇంట్లో మా  అమ్మగారే మాకు ఇంగ్లీషు చదువు చెప్పేవారు. ఎందుకంటే మాది తెలుగు మీడియం స్కూలు కదా! నాన్నగారి ఆధ్వర్యంలో జనగామలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీషు బోధన ప్రాథమిక స్థాయిలో .బి.వి. చిల్డ్రన్ ఇంగ్లీష్ స్కూలు ప్రారంభించారు. బ్రాహ్మణ సమాజం కూడా ప్రారంభించారు

గ్రంథాలయం

నాన్నగారు పుస్తకాల మాధ్యంగా ప్రజలకి అంటే అన్ని వర్ణాలవారికి విజ్ఞానం కలుగుతుందని భావించి ప్రప్రథమంగా గ్రంథాలయం స్థాపించి వేల కొద్ది తెలుగు, ఇంగ్లీషు ప్రసిధ్దికెక్కిన పుస్తకాలని విరాళంగా ఇచ్చారు. చాలాసార్లు మా స్కూలు వార్షికోత్సవ సభలకి ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించేవారు. క్లాసు తరగతులన్నింటికి వెళ్ళి అక్కడ విద్యార్థులు ప్రదర్శించిన  వైజ్ఞానికప్రదర్శన తణిఖీ చేసి, విద్యార్థులను ప్రశ్నలు అడిగి, బహుమతులు ప్రకటించేవారు. సైన్సుమాస్టరు మునిమాణిక్యం యాజ్ఞవల్క్య శర్మ గారు మార్గదర్శనం చేసేవారు. విద్యార్థులంతా వారివారి తరగతి గదులను శుభ్రంగా కడిగి, గోడలకు సున్నాలు వేసి, రంగు రంగుల కాగితాలతో అలంకరించేవాళ్ళం. మేము రాత్రి అక్కడే పడుకునేవాళ్ళం. అంతా పండగ వాతావరణంలాగా ఉండేది. అలంకరణలో మాత్రం ఆడపిల్లలదే పై చేయి. స్కూలు పాలకవర్గంలో నాన్నగారి సలహాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. స్కూలు గ్రంథాలయానికి కూడా ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. నేను ఇంట్లో కూర్చుని ఎంతో కష్టపడి పెరిస్కోపు తయారు చేశాను. నాన్నగారు మా తరగతికి వచ్చి నన్ను దాని గురించి ఎన్నో ప్రశ్నలు వెశారు. మాస్టర్లందరూ చాలా ఆసక్తిగా గమనించేవారు. అవి మధురమైన క్షణాలు. సెంట్రల్ ఎక్సైజ్ , కమర్షియల్ టాక్సు ఆఫీసర్ , ఎఫ్.సి. , ఎస్. బి.హెచ్. పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టరు, వారందరూ మా నాన్నగారిని ముఖ్యాతిథిగా వాళ్ళ ఫంక్షన్సుకి పిలిచేవారు. మా నాన్నగారు వీళ్ళందరికీ ఫామిలీ డాక్టరు అన్న మాట. వీళ్ళందరూ ఆదివారాలు మాఇంటికి వచ్చి మా అమ్మగారి ఆతిథ్యం తీసుకునేవాళ్ళు. ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. .బి.వి.హై స్కూలు గవర్నమెంటు ఎయిడెడ్స్కూలు కావడం వల్ల టీచర్లకి నెలసరి జీతాలు సరిగ్గా వచ్చేవి కావు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒక్కసారి జీతాలు వచ్చేవి. అందుకని మా నాన్నగారు వీళ్ళందరికీ వైద్యం చేసి, వాళ్ళ జీతాలు వచ్చేదాకా ఏమి అడిగేవారు కాదు. వీళ్ళందరూ కూడా ఆంధ్రా నుంచి పొట్ట కూటి కోసం జనగామ వచ్చి మాకు విద్యాదానం చేశారు.

                                               అధ్యాయం 9

నాన్నగారు మగ పిల్లలు ప్రశాంత్, శివరావు,సాయిరాం

                               

నాన్నగారు మాకు ఇచ్చిన స్వేచ్చ 

మేమంతా మాకు కావలసిన పుస్తకాలు, బిస్కత్తులు అన్నీ కూడా పొద్దుటూరి శ్రీహరి, వీరమల్ల యాదయ్య దుకాణాలలొ యథేచ్చగా కొనుక్కునేవాళ్ళం. అంతా నాన్నగారి ఖాతాలోకి వెళ్ళేది. చాలాసార్లు అవసరాలు మించి కొనుక్కునేవాళ్ళం. కాని నాన్నగారు ఏనాడు మమ్మల్ని ప్రశ్నించలేదు. మా టెక్స్ట్ పుస్తకాలకి చక్కగా అట్టలు వేసి, పేర్లు రాసి మాకు ఇస్తుండేవారు. మాకు ఇష్టమైన రంగంలో వెళ్ళడానికి ప్రోత్సహించేవారు. సాధారణంగా మగపిల్లలకన్నా ఆడపిల్లలకే ఇంటి పరిస్థితులు, సమాజంపట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది. మేమంతా కూడా మాకు తెలియకుండానే మా అమ్మా నాన్నల చేతలద్వారా ఎన్నో విషయాలు, వారి విశిష్టమైన వ్యక్తిత్వంలోని సంస్కారాలు మాలో కలిపేసుకున్నాం. కాస్త పెద్దవాళ్ళం అయ్యాక వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం. అమ్మా నాన్నల ప్రేమ స్వభావం మమ్మల్నే కాదు మా మామయ్య, పిన్నులు, వారి పిల్లలందరికీ జనగామ మా ఇల్లు ఆకర్షణ కేంద్రంగా మారింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను.

                                          మా వేదమ్మ పిన్ని కొడుకు డుంబు

 మా వేదమ్మ పిన్ని కొడుకు డుంబు, నా కన్నా చిన్నవాడు. మా నాన్నగారితో ఎంత చనువుగా ఉండేవాడంటే వాడి ప్రేమకథలు సీరియల్ గా చెప్తుంటే మా నాన్నగారు పగలబడి నవ్వుతుండేవారు. నెను పక్కనేఉండి చాలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాడిని. ఎంత ధైర్యం !! రోజుకొక ప్రేమకథ అల్లుతుండేవాడు. వాడి వయస్సేమిటీ ?వాడి ధైర్యానికి ఆశ్చర్యపడుతుండే వాణ్ణి. వాడి పెళ్ళి అయ్యాక మా నాన్నగారు వాడికి ఉత్తరం రాశారు. "నో మోర్ లవ్ స్టోరీస్ !! నో మోర్ అడ్వెంచర్స్ !!" ఈవిషయాన్ని వాడు నాకు ఎన్నోసార్లు చెప్తుండేవాడు. మా మామయ్య పిల్లలు, మా పిన్నివాళ్ళ పిల్లలు కలిసినప్పుడు అందరం జనగామ రాజక్కయ్య _ పెద్దనాన్నగారి విషయాలే గంటలు గంటలు మాట్లాడుకుంటాం. అన్ని మంచి జ్ఞాపకాలు మాకు ఉన్నాయి. మాలో చాలామంది 70 ఏళ్ళ పడిలో ఉన్నాం. అయినా మేము కలిస్తే రాజక్కయ్య _ పెద్దనాన్నగారి విషయాలే (జనగామ విషయాలే) గంటల తరబడి మాట్లాడుకుంటాం. నేను దాదాపు పదిహేడేళ్ళు ఈస్ట్ ఆఫ్రికాలో నివసించాను. ఉగాండా, కెన్యా, టాంజానియా దేశాల్లో విస్త్రుతంగా ప్రయాణం చేసాను. దాదాపు పదిహేను ఫారిన్ ఫార్మా కంపెనీలకి కన్సల్టంట్ గా, ట్రైనింగ్ మానేజరుగా చిన్న గ్రామాలు పర్యటించి 500 క్లనికల్ మీటింగ్స్ ని నిర్వహించాను. ఏడేళ్ళ నుండి దివాలాలో ఉన్న ఫార్మసీకంపెనీలని రెండేళ్ళలో ప్రాఫిటబుల్ కంపెనీలుగా మార్చాను. చిన్నకంటైనర్స్ ఉన్న ఆఫీసులో నాలుగు ఉద్యోగులు ఉన్న కంపెనీలో వంద మందిని  చేశానుపని చేసే కంపెనీ బాగా అభివ్రుద్ధి చెందింది. ఎక్కడో చిన్న కుగ్రామం జనగామలో చదువుకున్న నేను ఆఫ్రికా అంతా విస్తారంగా పర్యటించాను. సెల్ఫ్ డ్రివెన్, లక్జరియస్ కార్లలో లక్షలమంది జీవితాలని స్పర్శించాను. 120 మందికి శిక్షణ ఇచ్చాను. వారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో పని చేసున్నారు. జర్మన్స్, బ్రిటిషర్స్, ఆఫ్రికన్స్, బెల్జియన్స్, ఇజ్రయెలిస్, ఇంకా ఇతరత్రా విదేశీయులతో నేను వ్యాపార సంబంధాలు, ప్రశంసలు పొందాను. ఆధ్యాత్మిక సాధన కోసం వేల కొలది పుస్తకాలు చదవగలిగాను. రేకి, హీలింగ్ కోసం వందలకొలది ఆఫ్రికన్లు నా ఇంటికి వైద్యంకోసం వచ్చేవారు. 40 - 50 రకాల పాట్‌అయాన్స్ తయారుగా ఉండేవి. జీవితం ఎప్పుదూ ఒకే మాదిరిగా ఉండదు. నేను చాలా అష్టకష్టాలు పడ్డాను. కాని నేను ఎప్పుడూ కుంగిపోలేదు. కష్టాలు, అడ్డంకులు, శత్రువులు, అనేవారు మన చిన్నదైన అనుభవాల పరిధిలో (లొవెర్ చొన్స్చిఔస్నెస్స్) ఉంటాయి. పైన చెప్పినవన్నీ కూడా మనల్ని బలవంతులను చేయడానికి పనికివస్తాయి. దిక్కు తోచని పరిస్థితులలో మాకు అమ్మా, నాన్నగారు ఒక కథ చెప్పారు. అది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. మా ఎనిమిది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళందరికీ అవి స్ఫూర్తిదాయకం అయ్యాయి. అందరం పైకి వచ్చాం. జరిగిపోయిన వైభవాలు, తాతముత్తాతల ఆస్తులగురించి మా నాన్నగారు ఎప్పుడో మరిచిపోయారు                                                      

నాన్నగారు చెప్పిన కథ

ఒక ఊళ్ళో ఒక పెద్ద రైతు ఉండేవాడు. కొన్నివేల ఎకరాల భూస్వామి. అతనికి వ్యవసాయం చేయాలంటే చాలా  కష్టం అనిపించింది. అందుకని అతడు దేవుడి గురించి తపస్సు చేసాడు. చివరకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రైతు నమస్కరించి, "దేవుడా ! ఈవ్యవసాయం చేయడం కష్టంగా ఎప్పుడూ భూమి దున్నడం, విత్తనాలు చల్లడం, నీరు అందించడం, పురుగు పుట్రా పక్షులను కట్టడి చేయడం ఈపనులన్నీ చేయటం నా వల్ల కాదు. కాబట్టి పనులలో అడ్డంకులు లేకుండా విత్తనాలు చల్లగానే వాటంతట అవే  పెరిగి, పుష్కలంగా ధాన్యపుకంకులు రావటం, భూమిలో పురుగు పుట్రా లేకుండా, పక్షులు రాకుండా, గాలి వర్షం రాకుండా పంటలు పండాలి. "అని అడిగాడు.

  



మా  నాన్నగారు

                            

దానికి దేవుడు "నాయనా ! నీవు ప్రకృతికి విరుద్ధమైన కోరికను కోరుతున్నావు. కాబట్టి మరొక్కసారి ఆలోచించుకో. ప్రకృతి ఒక సామూహికబలం ఇచ్చి పుచ్చుకోవటానికి పని చేస్తుంది. పరస్పరం అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ సుఖంగా ఉండేవిధంగా వ్యవస్థ తయారు చేయబడింది." అని నచ్చచెప్పాడు. కాని రైతు వినలేదు. దేవుడు " సరే! నీ ఇష్టం. తరువాత నన్ను నిందించకూడదు." అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. రైతు సంతోషంగా ఉన్నాడు. ఇక మీదట పొలాలు దుక్కి దున్నక్కరలేదు. ఎద్దులు అవసరం లేదు. గాలి వానలు అయన పొలాల జోలికి రావటం లేదు. భూమిలో వానపాములు, క్రిమికీటకాదులు రావటం లేదు. పిచ్చుకల గొడవ లేదు. పాలెగాళ్ళ, నౌకర్ల సహాయం అక్కరలేదు అని ఆయన మిగతా రైతులు పడుతున్న  కష్టాలగురించి జాలి పడుతూ వారిని హేళన  చేస్తుండేవాడు. రైతు వ్యవసాయ భూముల్లో కంకులు చాలా ఏపుగా పెరిగాయి. మిగతా రైతులు కాస్త ఆశ్చర్య పడ్డారు. మన భూస్వామి కంకులు కోయడానికి సిద్ధపడ్డాడు. ధాన్యపు పొట్టు తీయగానే ధాన్యపు గింజలు లేని శూన్యం కనిపించింది. మొక్కలు, కంకులు అన్నీ చక్కగా ఉన్నాయి కాని ధాన్యపు గింజలు లేవు. రైతు లబోదిబో అన్నాడు. దేవుడిని తిట్టి పోశాడు. మళ్ళీ దేవుడిని ప్రార్థించాడు. దేవుడు ప్రత్యక్షమైనాడు. రైతు తన గోడు చెప్పుకున్నాడు. దేవుడు ఇలా చెప్పాడు. సృష్టి అంతా ప్రకృ తి నియమాలకి అనుగుణంగా ఒక వ్యవస్థ ఏర్పాటు అయింది. భూమిని సారవంతం చేయడానికి కోట్లాది క్రిమికీటకాలు, వానపాములు భూమిని గుల్ల చేస్తాయి. అప్పుడు గింజలు భూమిలోకి చక్కగా వెళ్తాయి. గింజల క్రిందుగా వేళ్ళు మొలుస్తాయి. ఇవి భూమి పొరలలో విస్తారంగా వ్యాప్తి చెంది అవసరమైన నీరు, ఖనిజాలు మొక్క పై భాగానికి చేరుస్తాయి. ఆకర్షణ వికర్షణ ఒక శక్తి పైకి లాగుతుంటే ఇంకొక శక్తి క్రిందకి లాగుతూ సమతూకాన్ని ఏర్పాటు చేస్తాయి. నీవు గాలి వద్దన్నావు. గాలి వీచినప్పుడు మొక్కలు వంగుతాయి. వెంటనే వేళ్ళు ఇంకా బలంగా, దృఢంగా భూమిలోకి చొచ్చుకుని పోయి మొక్కను నిలబెట్టుతాయి. అలాగే నీవు వర్షం వద్దన్నావు. నీళ్లు లేకపోతే భూమి గట్టి పడుతుంది. గట్టి పడిపోవడం వలన వేళ్ళకి భూమిలోనికి వ్యాపించే బలం ఉండదు. అందుకని మొక్కకు బలం ఉండదు. అలాగే గింజలు తయారవడానికి కావలసిన ఖనిజాలు అందవు. గింజలు అంటే ఖనిజాల సముదాయమే కదా !   పిచ్చుకలు ధాన్యం తిని ప్రతిఫలంగా సారవంతమైన రెట్టని భూమికి సమార్పిస్తుంది. అంతా ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ. సమస్యలు, బాధలు అన్నీ కూడా ఇటువంటి పిచ్చుకలు, వానపాములు లాంటివి. అయితే రాబోయే సుఖాలకు ఇవి మనం నాటిన గింజలలాంటివి. అలాగే సమాజంలొ తారసపడే శత్రువులు, పరిస్థితులు వాస్తవానికి మనకి ఎన్తో మేలు చేసే ప్రకృతిసిద్ధమైన స్నేహితులు అన్న నిజం నేను తెలుసుకున్నాను. నాన్నగారి విశ్లేషణ విజ్ఞానదాయకంగా ఉంది. అందుకనే కష్టాలు, అడ్డంకులు వస్తే నేను సంతోష పడేవాడిని. ఈవిధంగా దేవుడు  రైతుకి సమాధానం చెప్పి మాయమయ్యాడు. రైతు తన తప్పుని తెలుసుకుని తర్వాత పంటను ప్రకృతి నియమాల ప్రకారంగా వేశాడు. భూమిని పూజించాడు. అలాగే ఎద్దులను, నాగలిని పూజించాడు. భూమాతని ప్రార్థించాడు. ఈసారి పంట బాగా పండింది. రైతు ఎంతో సంతోషించాడు. అందుకే ప్రయత్నలోపం లేకుండా ముందుకి సాగాలి. ఫలితాలు ఎలా ఉన్నా నిరాశ కూడదు.

హరికథా పితామహుడు

సుప్రసిద్ధ హరికథా పితా మహుడు ఆదిభట్ల నారాయణదాసుగారు ఒకసారి విజయనగరం నుండి మా ఊరు వచ్చారు. మా ఇంటిలోనే ఆయన బస చేశారుఊరంతా చాటింపు వేశారు. రోజులలో పెద్దవాళ్ల ఇంటిలో విశాల మైన, దృఢమైన  పెద్ద పెద్ద బల్లలు తప్పనిసరిగా ఉండేవి. రెండు పెద్ద బల్లలు మా ఇంటిముందు వేయించారు. జనాలు కూర్చునేందుకు కింద జంపఖానాలు వేశారు. హరికథా కాలక్షేపానికి అందరూ భోజనాలు చేసి తీరికగా వచ్చేవారు. చాలామంది జనాలు హరికథ వినడానికి వచ్చారు. పెట్రొమాక్సు లైట్లు వెలిగించారు. అమ్మ రెండు ఫ్లాస్కులనిండా మిరియాలతో చేసిన టీ సిద్ధం చేసింది. హరికథ ఆయన చెప్తుంటే రసవత్తరంగా ఉండి సమయం తెలియకుండా గడిచిపోయింది. మధ్య మధ్యలో ఎన్నో పిట్టకథలు, హాస్యాలు చెప్తుంటే నిద్రాదేవత పారిపోయింది. మధ్యలో విరామం. దాసుగారు వేడి వేడి టీ తాగి ఉత్సాహంగా మళ్ళీ కథ మొదలు పెట్టారు.

                            

మా అమ్మా నాన్నగారు

కథ య్యే సరికి తెల్లవారుఝాము 4.30 అయింది. ఆదిభట్ల వారి అపారమైన కౌశల్యం, వారి వాగ్ధాటి, ఆయన చెప్పిన పిట్టకథలు, చమత్కారాలు నకు ఇప్పటికీ గుర్తు. ఆయన మా ఇంటిలో ఆతిథ్యం తీసుకోవటం అదృష్టం. ఊరికి బుర్రకథ చెప్పేవాళ్ళు, తోలుబొమ్మలాటవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు ,వస్తుండేవారు. బుడబుక్కల, గంగిరెద్దు మేళాలు, సోది చెప్పేవాళ్ళు, కోతులు ఆడించేవారు, సాతాన్లు, జంగందొరలు, ఇలా అందరూ వస్తుండేవారు. వారికి తోచిన పాటలు, కీర్తనలు, తత్వాలు, చెప్తుండేవారు. పట్టణాలలో ఇంత వైవిధ్యమున్న సంస్కృతి మనకు లభ్యం కాదు. పల్లెటూళ్ళ ప్రజలకి మన జీవన విధానం, సమాజం పట్ల ఎంతో అవగాహన ఉంటుంది. అవి స్వయంగా ఆచరించి మానాన్నగారు మాకు గురుతుల్యులు అయ్యారు.  1955-56 వరకు మా అమ్మ మడి కట్టుకుని వంట చేసేది. వండిన పదార్థాలు దేవుడికి నైవేద్యం పెట్టాక మాకు భోజనం పెడ్తుండేది. తర్వాత మా అమ్మ పడ్తున్న ఇబ్బందులు చూసి మా నాన్నగారు మాన్పించేసారు. అంటే కొంతవరకు నిష్టగా ఉండటం వంటివి తగ్గించారు. తర్వాత పార్వతమ్మగారని ఒక వంటావిడ వంట చేస్తుండేది. ఆవిడ విధవరాలు (బాల వితంతువు). గలగలా మాట్లాడుతుండేది. అమ్మ ఆవిడని గౌరవంగా చూసేది. గురజాడ, కందుకూరి ఇలా ఎంతో మంది బాల వితంతువుల గురించి రాసిన సాహిత్యం విన్నప్పుడు నాకు బ్రాహ్మణ సమాజంపట్ల ఏహ్యభావం కలిగింది. ఇంకా ఇతర అగ్రకులాలవారు వారిమీద చేసిన ఆత్యాచారాలు మనస్సుని కలత పెట్టేవి. మా తాత తాతగారిని ప్రాయశ్చిత్తం పేరుతో గొడ్లపాకలో ఉంచటం లాంటివి వింటుంటే మనసు కలత చెందేది. దీనికి విరుద్ధంగా మా నాన్నగారు అంటరాని వారుగా ముద్ర వేయబడినవారిని ఎందరినో సమభావంతో చూసేవారు. మా ఇంటిలో పని చేసినవాళ్ళు నర్సింహులు తాత, జెమ్మయ్య, సోమయ్య వీరందరూ నిమ్నజాతికి చెందినవారే ! కాని వారందరూ మా ఇంట్లో యథేచ్చగా  తిరిగేవారు. వీరిలో జెమ్మయ్య మాకు రకరకాల ఆటలు, పాటలు నేర్పిస్తుండేవాడు. తర్వాత జమ్మయ్య తమ్ముడు సోమయ్య, వాడికి పదేళ్ళ వయసున్నప్పుడు మా ఇంట్లో పనివాడుగా కాకుండా సహాయకుడిగా వచ్చి, ఒక దత్తపుతృడిలా, ఆత్మబంధువుగా మారాడు. మా అమ్మ చేసే తినుబండారాలన్నీ పూజగది కం సామాన్ల గదిలో పెట్టి తాళం వేసి, తాళం చెవి తన ఆధీనంలో పెట్టుకునేవాడు. తినుబండారాలన్నీ పెద్ద మధ్యరకం ఇనుప డబ్బాలలో నిలవ ఉంచేవాళ్ళు. సాయంత్రం స్కూలు నుంచి రాగానే సోమయ్య మా అందర్కీ ఇవి తినటానికి ఇచ్చేవాడు. మా ప్రసన్నక్కయ్య వాడికి అక్షరాభ్యాసం చేసింది. కొద్ది కాలంలోనే వాడు చందమామ వంటి పుస్తకాలు చదివేవాడు. మాతో సమానంగా వాడికి బట్టలు కుట్టించడం వంటివి మామూలే. ఇటీవల కాలంలో మా రమణి రెండవ కొడుకు కార్తిక్ వివాహానికి సోమయ్య, ఆయన భార్య 

                 

సాయిరాం, రాణి వదిన, మాతో పాటుగా మా ఇంట్లో పెరిగిన మా సోమయ్య ,అయన భార్య వజ్రమ్మ ,రమణి, లాలస, వెనుక సోమయ్య మనమడు కార్తీక్ (రమణి చిన్న కొడుకు) పెళ్ళిలో

వజ్రమ్మ ఇద్దరూ వచ్చారు. రమణి దంపతులకి బట్టలు పెట్టి పాదాభినందనం చేసిందిమా ముత్తాతగారి హయాంలో ఉండే అర్థంలేని చాదస్తాలు, సంకుచిత స్వభావాలకి, మాతరంలో మా తల్లిదండ్రుల నించి వచ్చిన సంస్కరాలకి ఎంత వ్యత్యాసం అని అనుకుంటూ ఉంటాను. తరానికి చెందిన మనం విశాల దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప్రియమైన వస్తువుని మనం పొందినఫ్ఫుడు ఉండే సంతోషం, అది లేకుండా పోయినఫ్ఫుడు ఉండే మన మానసిక పరిస్థితి నిర్వేదంగా ఉంటుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. మా నాన్నగారి విషయంలో తన తండ్రి దగ్గరనుంచి పొందిన పితృవాత్సల్యం ఎంతో అపురూపమో తెలుసు. మా నాన్నగారు చిన్నతనంలోనే అనిర్వచనీయమైన పితృ వాత్సల్యాన్ని కోల్పోయారు. విలువ ఆయనకి తెలుసు కాబట్టి, మా అందరికీ కూడా అంతులేని ప్రేమ, అభిమానం, పితృవాత్సల్యాన్ని పుష్కలంగా ఇచ్చారు.

జనగామలో ఉన్న అన్ని సంవత్సరాలు చాలా క్రమశిక్షణతో ఉండేవారు. డిస్పెన్సరీకి సైకిలు మీద వెళ్ళటం, వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావటం, మధ్యాహ్నం గ్రంథ పఠనం చేయటం చేస్తూ ఉండేవారు. మా పాఠ్య పుస్తకాలకి, నోటు  పుస్తకాలకి అట్టలు వేయటం, కుట్టటం ఇలా ఏదో ఒక పని చేస్తూ సమయాన్ని ఎప్పుడు వృథా చేయలేదు

                         అధ్యాయం 10    పండుగలు :  వినాయక చవితి

 

శ్రీకాంత్ (లాలస కొడుకు), రిషబ్ (లాలస మనమడు)

నాన్నగారు చాలా ఉత్సాహంగా ఈపండగ చేసేవారు. పెద్ద పెద్ద గోనె సంచులు పట్టుకుని పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నేను, సోమయ్య పత్రి కోసం ఊరంతా తిరిగి రకరకాల పత్రి సేకరించేవాళ్ళం. చిన్న, పెద్ద, అన్ని రకాల చెట్లు ఎక్కుతుండేవాళ్ళం. అంటే బోలెడంత పత్రి అన్నమాట. ఇంట్లో అందరం  కలిసి కోసుకొచ్చిన కొమ్మల ఆకులను శుభ్రం చేసి విడివిడిగా పెట్టేవాళ్ళం. రంగురంగుల వినాయకుడిని , మట్టి వినాయక విగ్రహాలను తెచ్చేవాళ్ళం. కంసాలి రఘు వాళ్ళు రకరకాల పరిమాణాల్లోమట్టి వినాయక బొమ్మలు చేసేవాళ్ళుగురువింద గింజలని కన్నులుగా అమర్చేవారు. మేము పొద్దున్నే స్నానం చేసి , మా పుస్తకాలని వినాయకుని పక్కనే ఉంచేవాళ్ళం. చెక్కబల్ల మీద విగ్రహాలను ఉంచేవాళ్ళం. సన్న బొంగు కట్టెలతో పాలవల్లి (పందిరి) తయారు చేసి పైనుంచి వేలాడతీసేవాళ్ళం. దానికి ఆకులు, కొమ్మలతో పాటు ఉన్న సీతాఫలాలు, జామకాయలు వేలాడతీసేవాళ్ళం. మధ్యన దేవుడిమీద లైటు పడేటట్టుగాబల్బుని పెట్టేవాళ్ళం. అయ్యగారు వచ్చి పూజ చేయించేవారు. తరువాత అమ్మా, నాన్నగారు అన్ని పూజా 

కార్యక్రమాలు నిర్వహించేవారు. మేమంతా గణపతి, సరస్వతి శ్లోకాలు చేతులు కట్టుకుని చెప్పేవాళ్ళం. మొత్తం పూజ, శ్లోకాలు నాన్నగారు చెప్తే అమ్మ అష్టోత్తరాలు అందరివి చదువుతుండేది. అందరం పత్రి

                                             

 

దేవుడికి నమస్కారం చేస్తూ రిషబ్ (లాలస మనమడు ,శ్రీకాంత్ కొడుకు)

వస్తుండేవాళ్ళం. నాన్నగారు ప్రతి నామం చెప్తుంటే "జయ మంగళం నిత్య శుభ మంగళం" అంటూ మేమంతా వంత పాడేవాళ్ళం. రొజు బోలెడన్ని పిండి వంటకాలు  ఉండ్రాళ్ళు, తమ్మికూర, చింతచిగురు, పులిహోర,పాయసం, గారెలు, తప్పనిసరి. పూజ చాలా సేపే పట్టేది. తరువాత మేమంతా భోజనాలు చేసాక అయ్యగారు శమంతక మణి కథ వినిపించేవారు. అక్షతలు, మంత్రపుష్పం చెప్పినాక దేవుడిమీద, మా శిరస్సున అక్షతలు వేసుకునేవాళ్ళం. రోజు సాయంత్రం అయ్యాక మా స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం, వినాయకుడికి మొక్కడం ఇలాగే కనీసం 9 గణపతులని చూడాలని పెద్దలు చెప్పేవాళ్ళు. విధంగా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, ఒక ఆధ్యాత్మిక చింతన, మన సంప్రదాయాల విలువ, ఒక క్రమశిక్షణ అలవడే మాదిరిగా పండుగ విధివిధానాలను మన మహర్షులు ఏర్పరచి మనకు అందించారు. పత్రి సేకరణ మిషతో ప్రకృతితో పరిచయం, రకరకాల ఆకులలో దాగిన ఆరోగ్య రహస్యాలు, కనిపించని కోట్లకొలది క్రిముల సంహారం అన్నీ కూడా మనం దేవుడిమీద వేస్తాం. అలాగే రోజు మనం పదార్థాలన్నీ ముందు వినాయకునికి నివేదన చేసి చదివే మంత్రాలు, వాటినుంచి సూక్ష్మమైన జీవ అయస్కాంత కిరణాలు (బయో ఎలెక్ట్రిక్ మాగ్నెటిక్ రేస్) మనకి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శాంతిని కలుగచేస్తాయి అని నాన్నగారు మాకు చెప్తుండేవారు. ఆచమనం చేస్తూ కేశవాయ, నారాయణాయ, మాధవాయస్వాహా అని చెప్తుంటే అరచేతిలోని నీళ్ళకి ఆరోగ్యకరమైన ప్రాణశక్తి నీటిలో ప్రవహిస్తుందని , నీళ్ళు మన

బావగారు శైలేంద్ర, నీరజ (మేనకోడలు)

విస్తరాకు చుట్టూ చల్లినప్పుడు అక్కడ ఏర్పడే వలయాకార అయస్కాంత క్షేత్రంసూక్ష్మ క్రిములని నిరోధిస్తుందని వివరణ ఇచ్చేవారు. పండగ రోజులలో ప్రత్యేకంగా చేసే వంటకాలు మన శరీరంలోని త్రి-దోషాలు - వాతం, పిత్త, కఫదోషాలను హరించిశరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయని చెప్పేవారు.

మా ప్రసన్నక్కయ్య, "నాన్నగారూ ! మరి చెవులు పట్టుకుని గుంజీలు ఎందుకు తీయాలి?" అని అడిగింది. దానికి సమాధానంగా, " మన చెవుల ఆకారం మనం తల్లి గర్భంలో ఉండే పిండాకారాన్ని పోలి ఉంటుంది. చెవులకి, మెదడుకి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా చెవి తమ్మెలు (ఇయర్ లోబులు). మనం మన ఎడమ చేతితో కుడి చెవి తమ్మె, అలాగే కుడి చేతితోఎడమ చెవి తమ్మె పట్టుకున్నప్పుడు మన మెదడు లోని లెఫ్ట్ బ్రెయిన్, అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. అంటే సృజనాత్మక శక్తి (క్రియెటివ్), క్రియాశక్తి రెండూ సమానంగా ఉత్తేజింపబడతాయి. అంటే కేవలం ఊహించడమే కాదు, దాన్ని అంటే సృజనాత్మక శక్తిని ఆచరణలో పెట్టడం అన్నమాట. ఇంకా అర్థం కావడానికి నాన్నగారు కాగితం మీద బొమ్మలు వేసి నిదానంగా ఒకటికి రెండుసార్లు వివరించేవారు. మన చేతివేళ్ల చివరి భాగంలో నాడులు చాలా సున్నితంగా ఉంటాయి. చెవితమ్మెలకి చివర్లు తగిలినప్పుడు (ఇయర్ లోబ్స్)శరీరంలోని 72000 నాడులలో వ్యాపించి ఒక దైవికమైన ప్రాణశక్తి ప్రవహిస్తుందన్నమాట అని నవ్వుతూ చెప్పారు. అప్పుడు మా పెద్ద చెల్లెలు లాలస ఇలా ప్రశ్నించింది. "మరి నాన్నగారూ ! దేవుడి పూజలు అమ్మ అక్షతలతో చేస్తుంది కదా ! మరి వినాయకచవితిలో పత్ర పూజ ఎందుకు చేస్తారు?" అని అడిగింది. నాన్నగారు లాలస వైపు చూసి కాస్త ఆశ్చర్య పడ్డారు. అసాధ్యురాలివే అని చెప్పి. "చెప్తాను వినండి" అని అన్నారు. మనకి వినాయకచవితి భాద్రపదమాసంలో వస్తుంది. అంటే ఎండాకాలం పోయి వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది. మార్పుకి మన శరీరం తట్టుకోలేదువాతావరణం చల్లబడేసరికి కంటికి కనిపించని సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. కఫం, వాత లక్షణాలు పెరుగుతాయి. మనకు శక్తి మనం తినే కూరగాయలు ఫలాలే కదా! అవే మనకు శక్తినిస్తాయి. అందుకని మనం వినాయకచవితి రోజు ప్రకృతిని ఆరాధిస్తాం. మనలోని కఫం, వాతం తగ్గించుకోవటానికి ముఖ్యంగా ఏకవింశతి (21లీవ్స్) పత్రాలతో దేవుడి పేరు చెప్తూ, మన చేతిలో ఉన్న ఆకు పేరు చెప్పుతూ దేవుడి పూజ చేస్తాం. మనం ఆకును చేతిలో పట్టుకున్నప్పుడు ఆకులలోని ప్రాణశక్తి, మన చేతులలోని ప్రాణశక్తితో కలిసి శరీరంలోని దోషాలను హరించి వేస్తుంది. అలాగే చింతచిగురు, తమ్మికూర మొదలైన ఆకుల మూలంగా రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది. ఇంకా అర్థం కావడానికి నాన్నగారు కాగితం మీద బొమ్మలు వేసి నిదానంగా ఒకటికి రెండుసార్లు వివరించారు. "మరి శమంతక మణి కథ ఎందుకు వినాలి?" అని లాలస అడిగిన మరో ప్రశ్నకి నాన్నగారు ప్రశంసాపూర్వకం గా చెల్లెలి వైపు చూశారు. మేమందఱము కూడా  ఆశ్చర్యపడ్డాం. "సరే ! వినండి ! ఈమొత్తం కథ సారాంశం ఏమిటంటే మనం నిజ నిర్ధారణ చేసుకోకుండా ఇంకొకరి మీద అబద్ధాలు, నిందలు వేయకూడదు. సత్యం తెలుసుకోకుండా మనం ఎవరినీ దూషించకూడదు. కాని రోజుల్లో జనమంతా ఒకళ్ళ మీద ఒకళ్ళూ చాడీలు చెప్పటం చేస్తున్నారు. అందుకని కనీసం వినాయక చవితి రోజున మనం చేస్తున్న తప్పుల్ని సవరించుకోవటం కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని మనం కథని వింటూ ఉండాలి". అని చెప్పారు. మీరు కూడా మీ ముందు లేని వ్యక్తి గురించి చెడు మాట్లాడకండి. అని హితబోధ చేశారు. ఈవిధం గా ప్రతి ఏడు మేము వినాయక చవితి పండగ వేడుకగా జరుపుకునేవాళ్ళం


దీపావళి పండుగ  

మేము పండుగ చాలా ఆర్భాటంగా చేసేవాళ్ళం. ఆరోజున వ్యాపారస్తులు తమ కొత్త పుస్తకాలకి లక్ష్మి పూజ చేసాక  కొత్త  ఖాతాలను అంటే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దుకాణలన్నీ కూడా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. నాన్నగారు  అందరి దుకాణాలకు వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తుండే వారు. బోలెడన్ని మిఠాయి డబ్బాలు వస్తుండేవి. మా పెద్దన్నయ్య హైదరాబాదు నుండి బోలెడన్ని టపాకాయలు తెచ్చేవాడు. రోజు మేమందరము రైల్వేస్టేషన్ కి వెళ్ళేవాళ్ళం. రైల్వేకూలీలు కొమరయ్య, హుస్సేన్ తరచుగా మా లగేజీలు తెస్తుండే వాళ్ళు. అన్నయ్య వాళ్ళకి తన లగేజీ ఇచ్చేసి నా చెల్లెలు లాలసని, విజయలక్ష్మిని భుజానికి ఎత్తుకుని  నడిచేవాడు. నేను పక్కనే నడుస్తూ అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఇంటికి రాగానె అమ్మ అన్నయ్యకి దిష్టి తీసేది. అందరూ అన్నయ్య చుట్టూ తిరుగుతూ నానా గొడవ చేస్తుండేవాళ్ళం. అన్నయ్య ఎప్పుదు పెట్టెలు తెరుస్తాడో చూడాలని ఆత్రుత అన్నమాట. అమ్మ మమ్మల్ని శాంతపరచి , అన్నయ్య స్నానం చేసాక, అల్పాహారం సేవించాక తీరిగ్గా మా దగ్గరకి వచ్చి అల్లరి చేసేవాడు. ఆఖరికి డబ్బాలు సూటుకేసులు తెరవగానే అందరం గట్టిగా అరిచేవాళ్ళం. "అమ్మ బాబోయ్ ! ఆటంబాంబులు ! బూడిద బాంబులు!, సీమ టపాకాయలు, చిలక బాంబులు, లక్ష్మీ బాంబులు, బాస్కెట్ బాంబులు, ఉల్లి బాంబులు, మతాబులు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, కాకర పువ్వొత్తులు, చిచ్చు బుడ్లు, చుర్ చుర్ కాకర పువ్వొత్తులు, అగ్గిపెట్టెలు రంగురంగులవి, కాకర పువ్వొత్తి అగ్గిపెట్టెలు........ ఇలా.... పెద్ద లిస్ట్....... నానా గొడవ........ అన్నమాటఅన్నయ్య తెచ్చిన టపాకాయలు కాకుండా నాన్నగారు కూడా బోలెడన్ని టపాకాయలు కొని పెట్టేవాళ్ళు. రకరకాల మిఠాయిలు, ముఖ్యంగా ఫేణీ మాత్రం తప్పనిసరిగా తినాల్సిందే. నాన్నగారు కూడా చాలా ఉత్సాహంగా ఉండేవారుటపాకాయలు బాగా ఎండపెట్టాక అన్నయ్యలిద్దరూ మా అందరికీ టపాకాయలు పంచేవారు. అవి మేము దాచుకునేవాళ్ళం. నరక చతుర్దశి తెల్లవారు ఝామున మా అన్నలిద్దరూ మా పక్కన కట్టెటపాకులు కొట్టి మమ్మల్ని హడలు కొట్టేవారు. కట్టె పుల్లకు చివర ఒక గుండు మాదిరిగా మందు కూరతారు. నేల మీద గట్టిగా కొట్టేసరికి అది బాంబులాగా గట్టిగా చప్పుడు చేస్తుంది. చప్పుడికి మేము భయపడుతుంటే అది చూసి వాళ్ళు నవ్వుతుండేవాళ్ళు. తర్వాత నాన్నగారు, మగపిల్లలం మేమందరం                                     

అమ్మా, నాన్నగార్లతో ఆడపిల్లలం


     అక్కయ్య,రమణి, అమ్మ, నాన్నగారు, విజయలక్ష్మి, దుర్గ, లాలస    

పీటలమీద కూర్చునేవాళ్లం. మా అందర్కీ ఆడపిల్లలు హారతి ఇచ్చేవాళ్ళు. అమ్మ "జయ మంగళం, శుభమంగళం, నందనందనా నీకు మంగళం", గోపాలక జయ హారతిదే గోపకిశోరా, నీకెపుడు దయా కలుగునయా  యమునవిహారా", సీతా మనోహర మంగళం, శ్రీ రామచంద్రా మంగళం", అనే మంగళ హారతి పాటలు పైస్థాయిలో పాడుతుంటే మేమందరం వంత పాడుతుండేవాళ్ళం. తరువాత నాన్నగారు ఆడపిల్లలందరికీ డబ్బులు ఇచ్చేవారు. అమ్మ మా అందరి తలలకి నూనె అంటేది. తరువాత ఒకరి తర్వాత ఒకరికి చక్కగా ఒళ్ళంతా సున్నిపిండితో  నలుగు పెట్టి, అమ్మ, రాంబాయవ్వ కుంకుడుకాయలరసంతో మాకు తలంటి స్నానాలు చేయిస్తుండేవారు. తర్వాత అందరం సంప్రదాయకంగా కొత్తబట్టలు వేసుకుని పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కి నమస్కారం పెట్టి వారి ఆశీస్సులు అందుకునేవాళ్ళం. అటు తర్వాత అందరం ఫేణీ పాలతో కాని పంచదారతో కాని తినేవాళ్ళం

ఆలూభాత్ : ప్రత్యేకమైన వంటకం, మా అమ్మ పుట్టింటి వారికి కావలసిన ఖచ్చితమైన, రుచికరమైన వంటకం. గారెలు, సార పలుకులు, జీడిపప్పులు వేసి చేసిన పాయసం, పులిహోర, పప్పు, పప్పు పులుసు, పచ్చళ్ళు, అన్నము, పూర్ణం బూరెలు వగైరా వగైరా రుచికరమైన పిండి వంటలతో రెండు రోజులు గడిచేవి. ఇవికాకుండా రవ్వలడ్డులు, కజ్జికాయలు, మైసూరుపాక్, మిక్స్చర్, మురుకులు ఇలా ఎన్నో స్వీట్లు చేయించేది లచ్చవ్వ, ఆండమ్మలతో. చాలా భాగం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం అన్నమాట. మాకు కూడా చాలా మంది ఫలాహారాలు పంపుతూ ఉండేవారు. ఈఫలాహారాలన్నింటికీ మా సోమన్న అధికారి. ఏవి కావాలన్నా వాడిని బ్రతిమాలుకోవాల్సిందే. బయట తలుపుకి రెండు పక్కలా చిన్న గూళ్ళు ఉండేవి. సాయంత్రం ఆడపిల్లలు ప్రమిదలు వెలిగించి గూట్లో , కిటికీలమీద పెట్టేవాళ్ళు. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు మా లాలస వేస్తుండేది. ఆడపిల్లలందరూ చక్కగా సిల్కు పరికిణీలు (లంగాలు) వేసుకుని, కుచ్చులతో పెద్ద జడలు వేసుకుని, ముఖానికి ఎర్రని కుంకుమతో అటు ఇటు తిరుగుతూ చిన్న అమ్మవారిలాగా కనిపిస్తుండేవాళ్ళు. తాము దాచుకున్న టపాకాయలు తెచ్చి కాల్చేవాళ్ళు. బాంబులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు కాకర పువ్వొత్తులతో అంటిస్తే , పెద్ద అగరుబత్తితో రాకెట్లు, తారాజువ్వలు, ఆటంబాంబులు, బూడిద బాంబులు కాలుస్తుండేవాళ్ళం. రాకెట్లు తిన్నగా అంటే స్ట్రెయిట్టుగా వెళ్ళేందుకు దాన్ని సీసాలో కాస్త మట్టి వేసి, అందులో రాకెట్టుని ఉంచి అగరుబత్తితో వెలిగిస్తూ ఉండేవాళ్ళం. అది సుర్ సుర్ అని వెలిగి , ఆకాశంలో ఎంతో ఎత్తు ఎగిరి అక్కడ పేలుతూ ఉండేది. నేను మాత్రం బాంబులు కాల్చడానికి భయపడుతుండేవాడిని. కాగితం మధ్యలో బాంబుని పెట్టి , కాగితం అంచుని నానా తంటాలు

                       

పెద్దన్నయ్య,రమణి, సాయిరాం,దుర్గ, సీత

నాన్నగారు, శిరీష్,సాయి శివకుమార్ (పెద్దన్నయ్య కొడుకులు), అమ్మ

పడి అంటించేసి, దానంతట అది పేలే లోపల ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి రెండు చెవులు మూసుకునేవాడిని. పైన డాబా మీదంతా మూడు వైపులా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, సోమడు కలిసి దీపపు ప్రమిదలు వెలిగించి అలంకరించేవాళ్ళు దృశ్యం ఎంత బాగుండేదో !! దీపాల వరుసతో మా ఇల్లు ఎంతో అందంగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉండేది. భూచక్రాలు, సుదర్శన చక్రాలు, చిచ్చుబుడ్లు మాత్రం మా నాన్నగారు దవాఖాన నుంచి వచ్చాక  నాన్నగారి ముందు కాలుస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. మా అక్కయ్య, లాలస, విజ్జి, దుర్గ, రమణి వీళ్ళందరూ కాకర పువ్వొత్తులు, మెగ్నీషియమ్ తీగలు, రంగురంగులు వెదజల్లే అగ్గి పుల్లలు, కరకర చప్పుడు చేసే కాకర పువ్వొత్తులు, మతాబులు కాలుస్తుండేవాళ్ళు. వారి స్నేహితులు వస్తే వారితో పాటు ఆనందంగా కాలుస్తుండేవాళ్ళు. బీద పిల్లలు వస్తే వాళ్ళకి కూడా పటాసులు  ఇచ్చి వాళ్ళ చేత కాల్పించే వాళ్ళం. అమ్మ వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెడ్తుండేది. మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వారి వారి మందుగుండు సామగ్రితో రంగ ప్రవేశం చేసేవారు. దాదాపు ఒక గంట సేపు మా వీథి అంతా బాంబుల చప్పుళ్ళతో, ఆకాశంలోజువ్వున ఎగిరే తారాజువ్వలతో, తాజ్ మహల్ సీమటపాకాయల మాలల టపటప పేలుళ్ళతో మారుమ్రోగుతూ ఉండేది. వాళ్ళిద్దరూ ధైర్యంగా పెద్ద పెద్ద బాంబులు చేత్తో పట్టుకుని డైరెక్టుగా దీపాలతో వెలిగించి , పైకి విసిరి వేయగానే అవి ఆకాశంలో పేలి కాగితాలన్ని వర్షం లాగా కింద పడేవి. గంట సేపు అందరూ మా ఇంటి                 

                                                                                                                      

జియా విశ్వామిత్ర                                                     శ్రీకాంత్ ,జియా

చుట్టూ నించుని ఆనందిస్తూ ఉండేవారు. నాన్నగారు చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు కాలుస్తుండేవారు అది కూడా మేము వెంట పడితే. అమ్మ కూడా దేవుడిముందు కాకరపువ్వొత్తులు కాల్చేది. దాదాపు దీపావళి పండగ అయిపోయినాక కూడా 15 రోజుల వరకు మా ఇంటి ముందు టపాకాయలు మోగుతుండేవి. "అరే ! డాక్టర్ సాబ్ కే బచ్చే ఫటాకే ఫోడ్ రహే హై ! అంటూ మళ్ళీ  పిల్లలందరూ మా ఇంటి ముందు గుమిగూడేవారుమా సోమయ్య వాళ్ళు కూడా కాలుస్తూ ఉండేవాళ్ళు

పండుగ విశిష్టత: దీపావళి నాడు పండుగ భోజనాలు అయినాక మేమందరం నాన్నగారి చుట్టూతా చేరేవాళ్ళం. మా రెండో చెల్లెలు విజ్జి (విజయలక్ష్మి) "నాన్నగారూ ! నరక చతుర్దశి , దీపావళి పండుగ నాడు అన్ని దీపాలు వెలిగించి అన్ని టపాకాయలు ఎందుకు కాలుస్తాం?" అని అడిగింది. మన పండుగలన్నింటిలో  జ్ఞానం, విజ్ఞానం దాగి ఉన్నాయి. ఋతువులు మారుతున్నప్పుడల్లా మన వాతావరణంలో మనకు కీడు కలిగించే మార్పులు ఎన్నో వస్తాయి. అనేక కోట్ల హానికరమైన సూక్ష్మ క్రిములు గాలిలో తిరుగుతూ ఉంటాయి.మన శరీరానికి ముఖ్యంగా ఊపిరితిత్తులు అంటే శ్వాసక్రియ మీద దుష్ట ప్రభావాలు కల్పిస్తాయి. పూర్వం నరకాసురుడనే దుష్ట శక్తులున్న రాక్షసుడు ప్రజలను హింసిస్తుండేవాడు. తనను తప్ప వేరే దేవుడిని కూడా పూజ చేయరాదని ప్రజలందరినీ బాధ పెడ్తుండేవాడు. వాడి బాధలు తట్టుకోలేక అందరూ అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారే సత్యభామ. శ్రీకృష్ణుడితో కలిసి నరకాసురునితో యుద్ధం చేయడానికి వెళ్తుంది. శ్రీకృష్ణుడు మూర్ఛపోగా, సత్యభామ యుద్ధం చేసి నరకాసురుడ్ని వధిస్తుంది. అది ఆశ్వయుజ మాసం , చతుర్దశి కావడంవల్ల అందరూ నరకచతుర్దశి పండుగ చేస్తారు. రోజే  అందరూ లక్ష్మి పూజ చేసి వ్యాపారం ప్రారంభిస్తారు. అందుకని నరకచతుర్దశి రోజు   అందరూ దీపాలతో ఇళ్ళని, దుకాణాలని అలంకరిస్తారు. మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని వాడినప్పుడు దీపాల కాంతిలో వాతావరణంలోని సూక్ష్మజీవులని నాశనం చేస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు చీకటిలో శక్తిని కలిగి ఉంటాయి. విధంగా దీపాల మనందరినీ రక్షిస్తుంది. మట్టి నిండా ధాతువులు, నూనె నిండా ధాతువులు, అలాగే దూది నిండా ధాతువులు కలిసినప్పుడు ఒక అద్భుత పదార్థాలు  సూక్ష్మసంహారకమైన పదార్థాలను తయారు చేయకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మట్టిలో మన శరీరానికి పనికి వచ్చే

                                                                                                    

అమ్మ రమణి తో పాటు కార్తీక్                            జియా విశ్వామిత్ర (లాలస మనమరాలు)

18 రకాల ధాతువులు ఉన్నాయి. అందుకని ప్రమిదలు మట్టితో చేస్తారు. మట్టి  మన కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. టపాకాయలు ఎందుకు కాల్చాలి? అంటే టపాకాయలు కాల్చినప్పుడు ధ్వని తరంగాలు వాతావరణంలో ప్రసరిస్తాయి. వాతావరణంలో కొన్ని రకాలైన సూక్ష్మక్రిములని ధ్వని తరంగాలు నశింపచేస్తాయి. అందుకని మనం టపాకాయలు కాలుస్తాం. పూర్వం టపాకాయలు ఇంత విపరీతం గా కాల్చేవారు కాదు. ఇప్పుడు విపరీతం గా కాలుస్తున్నారు. దీనివల్ల విషపూరితమైన రసాయనాలు (కెమికల్స్)విడుదల అయి వాతావరణాన్ని కలుషితం చేసి, మన ఆరోగ్యాలను పాడుచేస్తున్నాయి. అంతే కాక మితిమీరి కాల్చడంవల్ల అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఒళ్ళు కాల్చుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మా నాన్నగారి దగ్గరకి చాలామంది ఒళ్ళు కాలి వైద్యం కోసం వచ్చేవారు. ఇదంతా వింటున్న మా అన్నయ్యలిద్దరూ కూడా అర్థమైనట్టుగా తలలూపుతూ ఉండేవారు. కాని మాకు అర్థమైన విషయం ఏమిటంటే టపాకాయల మూలంగా ప్రకృతికి హాని కలుగుతుందిఅందుకని మా నాన్న గారితో విజ్జి ," అయితే నేను టపాకాయలు కాల్చను" అని అంది. తరువాత మా అన్నయ్యలిద్దరూ నాన్నగారు చెప్పిన దాన్ని చక్కగా వివరించారు. ఈవిధంగా మా సమావేశం ముగిసింది

ఏకగ్రీవ తీర్మానం:

అంతా విన్నాక మేమందరం ఒక అంగీకారానికి వచ్చాం. ఇక ముందు టపాకాయలు కాల్చము అని ఒక తీర్మానానికి వచ్చాం

మహా శివరాత్రి పండుగ :

  పండుగ రోజు ఆయ్యవారు మా ఇంటికి వచ్చి మా నాన్న గారితో రుద్రాభిషేకం చేయించేవారు. దాదాపు ఇది మూడు నాలుగు గంటలపాటు జరిగేది. మా నాన్నగారు దీనిని ఎంతో ఆసక్తిగా చేసేవారు. శివరాత్రి, వినాయక చవితి రెండు పండుగలు మా నాన్నగారికి చాలా ఇష్టమైన పండుగలు. రోజు నాన్నగారు మధ్యాహ్నం 3 గంటల దాకా ఏమి తినేవారు కాదు. అమ్మ, విజ్జి మటుకు కటిక ఉపవాసం చేసేవారు. రాత్రి అంతా జాగరణ కార్యక్రమం. మా వీథిలో ఉన్నవారంతా,ఇంకా తెలిసినవారంతా మా ఇంట్లో కూర్చుని తెల్లవారేదాకా భజనులు చేస్తుండేవారు. అంటే రాత్రంతా భగవంతుని ధ్యాసలో గడిపేవారు. వైకుంఠపాళి, వామనగుంటలు లాంటి ఆటలు కూడా ఆడుతూ ఉండేవాళ్ళం. ఉపవాసం పేరుతో ఒక రోజు మన జీర్ణమండలానికి రెస్టు.                                                            

దసరా -బతుకమ్మ పండుగ

తెలంగాణాలో దసరా నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ చేస్తారు. తంగెడు పూలు, గుణగ పూలను ఒక ప్లేటులో అమర్చేవారు. ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటలనుండి రాత్రి 7.30 వరకు ప్రతి ఇంటి నుండి మహిళలు వారి వారి బతకమ్మలను తీసుకుని మాడిశెట్టి గిర్నీ (మా ఇంటిదగ్గరే ఉంది) లో జమ కూడి బతుకమ్మలన్నీ మధ్యలో పెట్టి చుట్టూ ఒక వృత్తాకారంలో నిల్చుని కాసేపు కోలాటం, కొంచెంసేపు "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అని పాట పాడుతూ, చప్పట్లు కొడుతూ గాలికి కూడా ప్రవేశం లేనంతా దగ్గర దగ్గరగా ఒకళ్ళనొకళ్ళని అంటుకుని ఆడుతూ ఉండేవారు. మేము మా ఇంట్లో బతుకమ్మలని చేసేవాళ్ళం కాము. కాని ఎదురుగుండా ఉన్న కనకయ్య శేటు ఇంట్లో వాళ్ళు చేసే బతుకమ్మకి మా అక్కయ్య, మా లాలస సాయం చేస్తుండేవారు. తెల్ల గొణుగ పూలకి రకరకాల రంగులు వేసి చక్కగా బతుకమ్మని చేసేవారు. రాత్రి 8 తరువాత మళ్ళీ ఆడవాళ్ళంత మాడిశెట్టి వారి డాబా మీద వారి వారి టిఫిన్ కారేజీలతో చేరి కాసేపు మళ్ళీ బతుకమ్మ

       

బతుకమ్మ                                      సద్దుల బతుకమ్మ  (ఆఖరి రోజు)

ఆట ఆడుకుని టిఫిన్లు పంచుకుని తినేవారు. ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ. రోజు మాత్రం పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి రంగప్ప చెరువు దగ్గర గుంపులు గుంపులుగా చేరి ఆడ్తుండేవారు. రోజు మా ఇంట్లోనే కాకుండా అందరి ఇళ్ళల్లో  కూడా ఎండు కొబ్బరితో అన్నం, పెసరపొడితో అన్నం, దద్ధోజనం చేసేవారు. 10 రోజు దసరా పండుగ. మా ఇంట్లో అమ్మ మటుకు దేవి నవరాత్రి పూజ సింపుల్ గా చేసేది. రోజు చాలా పిండివంటలు చేసేది.

సాయంత్రం మగవారందరూ ఊరి చివరకి వెళ్ళి పాలపిట్టను చూసినాక జమ్మి ఆకులు కోసేవారు. చిన్న కాగితాలమీద శ్లోకాలు రాసి ముళ్ళకి గుచ్చేవాళ్ళు. జమ్మి ఆకులని బంగారం అని పిలిచేవారు. అవి ఇచ్చిపుచ్చుకుని ఒకళ్ళనొకళ్ళు హత్తుకునేవాళ్ళు. పెద్దవాళ్ళ పాదాలు మొక్కి నమస్కారాలు చేసేవాళ్ళం.                 

సారి మా నాన్నగారు మా మెదడులో అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి అని గ్రహించి మేము అడగక ముందే దసరా పండుగ యొక్క విశిష్టత అంటే scientifically explanation ఇచ్చారు. మన సనాతనధర్మం లో మన ఆహార విహారాదుల విషయం లో ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది. మన మహర్షులు కూడా మహా గొప్ప శాస్త్రజ్ఞులుమన భారతీయులందరికీ కూడా వారు మార్గదర్శకులు. మన సంప్రదాయాలు,సంస్కారాలు, ఆచారాలు, వేషధారణ, భాష, పండుగలు మొత్తం ఒక సమతుల్యమైన సమాజంగా ఉండేవిధంగా రూపొందించారు. దసరా పండుగ వర్షాకాలం ముగిసిన తర్వాత మనకి శరత్కాలం లో వచ్చే పండుగ. అంటే శరదృతువు అన్న మాట. ఋతువులు మారే సందర్భం లో ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతుంటాయి. దానికి తగినట్టుగానే మనం పండించే ధాన్యాలు మారుతూ ఉంటాయి.


                                                     

                                                                                                                                                           

                                                                        

  ధృవ్ (నా మనమడు, కమల్ కాంత్ చిన్న కొడుకు)పాల పిట్టని, జమ్మి చెట్టుని చూస్తున్నాడు పరీక్షగా                                                            

అదేవిధంగా కూరగాయాలు, పళ్ళు మొదలైనవి కూడా వాతావరణాన్ని బట్టి పండుతుంటాయి. విధంగా ప్రకృతి ఇచ్చిన ఆహార పదార్థాలు మనం చేసే వంటల్లో తిన్నప్పుడు మనలో ఉన్న రోగనిరోధక శక్తి అపారంగా పెరుగుతుంది. ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో అనేక రకాల సూక్ష్మక్రిములు కూడా పుడుతూ ఉంటాయి. అందుకనే దీనిని ఒక వేడుక మాదిరిగా అందరూ సంతోషంగా ఒక చోటికి చేరి, రకరకాల తినుబండారాలను తింటూ, సరాదాగా, ఒక ప్రత్యేకమైన పూలతో అందంగా అలంకరిచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. దీనివల్ల సమాజంలో మన బాంధవ్యాలు పెరుగుతాయి. మా అందరికీ దసరా పండుగలో అంతరార్థం తెలిసింది.

     మధ్య కాలంలోనే వైరస్ ని మన భారతీయులు ధైర్యంగా ఎదుర్కొనగలిగారు. కేవలం మనం తీసుకునే ఆహారాల వల్లసాధ్యమైంది అనేది దీనికి తార్కాణం.

భోగీ పండుగ -సంక్రాంతిభోగీ పండుగ వస్తోందంటే ఒక నెల రోజుల ముందుగానే మా ఇంట్లో సందడి మొదలవుతుంది. మా అమ్మ స్నేహితురాళ్ళు లచ్చవ్వ, అండమ్మ అనే వైశ్య మహిళలు ఇంటిలో చక్కిలాలు చేసే పిండిని దంచుతూ ఉండేవాళ్ల్లు. మొదటి చక్కిలం, నువ్వులడ్డుకి పసుపు కుంకుమ రాసి దారాలు కట్టేవారు.ముందుగా వాటిని భక్తిభావం తో పూజించి , తర్వాత వాటిని తయారు చేస్తుండేవారు. ప్రకృతి మాత దయ వల్ల ఇటువంటి ఆహార పదార్థాలు కృతజ్ఞతా భావంతో మొదట అమ్మవారికి ప్రసాదంగా  సమర్పిస్తారు. ఆనవాయితీ అన్ని పండుగలకు వరిస్తుంది. తినుబండారాల్లో ఎక్కువగా నువ్వులు వాడేవారు. ఎందుకంటే వాతావరణంలో ఇంకా చల్లదనం ఉంటుంది కాబట్టి మనకి  కఫం పెరిగి మన ఊపిరితిత్తుల్లో చేరుతుంది. దాన్ని కరిగించాలంటే పైత్యం అంటే వేడిని కలిగించే పదార్థాలు మనం తినాలి. పైగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరంలో సంకోచం (కాంట్రాక్షన్) ఏర్పడుతుంది. దీనిమూలంగా సంధి వ్యాధులు అంటే కీళ్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మోకాళ్ళ సందుల దగ్గర కీళ్లు , సులభంగా కదలాలంటే అక్కడ ఉన్న నూనె పదార్థాలు తగినంత పరిమాణంలో ఉండాలి. అప్పుడే మన కీళ్లు సందుల కదలిక సమతూకంలో ఉంటుంది. అందుకోసం నూనెని విపరీతంగా వాడవలసి వస్తుంది. దీనిలో ప్రత్యేకమైన ఔషధగుణాలు ఉంటాయి. ఉదాహరణకి నువ్వులు బాగా నమిలి తింటున్నప్పుడు నువ్వుల నూనె మన ఎముకల సందులలో తగినంత నూనెని అందజేస్తుంది. కాబట్టి కీళ్లనొప్పులు ఉండవు. నువ్వులలో చాలా మోతాదులో సహజంగానే కాల్షియం లభిస్తుంది. కాబట్టి మన పండుగలలో రకరకాల వంట, తిను బండారాలని తయారు చేస్తుంటారు

                 

సూర్య క్షితిజ్ లహరికాంత్ , ఆదిత్ కమల్ కాంత్, ధృవ్ కమల్ కాంత్ భోగి పళ్ళు పోయించుకున్నాక

బోగీ పండుగకి మా ఇంటికి చాలా మంది పేరంటాళ్ళు వస్తుంటారు. పిల్లలకి బోగీ పళ్ళు పోయటం ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. సంక్రాంతి రోజులలో బొమ్మల కొలువు పెట్టడం, ఆడపిల్లలు కళ కళ లాడుతూ, లంగా ఓణీలతో, చేతులకి గాజులతో,కాళ్లకు పట్టీలు వేసుకుని ఎంతో అందంగా కనిపిస్తారు. మేము మా అమ్మతో పేరంటానికి వెళ్ళినప్పుడు, ఒక నిబంధన చెప్పేది. అక్కడ అందరితో మర్యాదగా ఉండాలి. వారిచ్చే తినుబండారాల కోసం ఎగబడి కూడదు. అలా  అయితేనే నాతో  తీసుకెళ్తానంటే సరేనని మాటిచ్చే వాడిని. తీరా అక్కడికి వెళ్లేసరికి బోగీ పళ్లతో పాటుగా కిందపడ్డ పైసలు కూడా ఏరుకునేవాణ్ణి. అమ్మకు తల కొట్టేసినట్టై కళ్ళతోనే హెచ్చరించేది. ఇలా రెండుసార్లు జరిగాక మా అమ్మకి కోపం వచ్చింది. దేవుడి దగ్గర కూర్చోబెట్టి, ఇంట్లో నేనేమీ చేసి పెట్టనట్లు బయటికి వెళ్ళినప్పుడు ఎగబడతావు. ఇన్ని చేసినా, ఎందుకు లేకిగా ప్రవర్తిస్తావు? వీళ్ళమ్మ ఏమి చేసి పెట్టదు అన్నట్టుగా అడుగుతావు అంటూ మా అమ్మ  కోపం గా అన్నది ".దేవుడా! నేను బయటకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ఎగబడి అడగను. వారు ఇస్తే కానీ తీసుకోను" అని   చెప్పించి, అగరబత్తి తీసి చేతి మీద వాత బెట్టింది. ఆ రోజు నుంచి , వేఱే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారేమిచ్చినా తీసుకునే వాడిని కాను. అడిగేవాడిని అసలే కాను. మా అమ్మ ఎంత ఓర్పుగా, ప్రేమగా ఉంటుందో క్రమశిక్షణ విషయంలో కఠినంగానే ఉండేది.

                                            














                                                               అధ్యాయం 11

నా జ్ఞాపకాలు:

                         

సాయిరాం, లహరి కాంత్, కమలకాంత్ (కొడుకులతో)

నాన్నగారి దగ్గర ఫిలిప్స్ సైకిలు మేడ్ ఇన్ ఇంగ్లండ్ ఉండేది. నేను హైదరాబాదు న్యూసైన్స్ కాలేజిలో బి.ఎస్.సి. చదువుతున్నాను. సైకిలు కావాలని పట్టు పట్టాను. నాన్నగారు వద్దురా ! వద్దు. నీకు నిర్లక్ష్యం ఎక్కువ అని అన్నారు. కాని నేను వినలేదు. అమ్మ నాకు వత్తాసు . సరే ! జాగ్రత్తగా వాడుకో! అని చెప్పి నాకు సైకిలు హైదరాబాదు తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నేను హిమాయత్ నగర్ లో ఉండేవాడిని. కాలెజి దగ్గరే కాని సైకిలు మీద వెళ్ళేవాడిని. ఒక రోజు వేదమ్మ పిన్ని ఇంటికి వెళ్ళి, సైకిలుని గేటు బయట  స్టాండు వేసి పెట్టి లోపలికి వెళ్ళాను. ఒక గంట అయ్యాక చూస్తే అక్కద సైకిలు లేదు. దొంగతనం జరిగింది. రోజు సైకిలు తాళం వేయకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయాను. సైకిల్ పోయింది. రోజు చాలా బాధ పడ్డాను. అమ్మకి ఉత్తరం రాశాను. రెండు రోజులు పోయాక నాన్నగారు వేదమ్మ పిన్ని ఇంటికి వచ్చారు. నేను డాబా మీద కూర్చుని ఏడుస్తున్నాను. నాన్నగారు కిందకి రమ్మని కబురు చేశారు. నాకు నాన్నగారిని చూడడానికి ముఖం చెల్లక అక్కడే డాబామీద ఉండి పోయాను. రామన్నయ్య చాలా బతిమిలాడాడు. పెద్ద నాన్నగారు ఏమీ అనరు రా! కిందకి రా అని. నాన్నగారు వెళ్ళిపోతూ చిన్న ఉత్తరం రాసారు. "జరిగింది మర్చిపోఇక ముందు వస్తు జాగ్రత్త నేర్చుకో అని. అప్పుడు నాకు మా నాన్నగారి మీద చాలా కోపం వచ్చింది. నన్ను కోప్పడితే బాగుండును కదా ! ఒక్క మాటన్నా నన్ను అనలేదు. కృష్ణా పత్రిక యజమాని  ముదిగొండ సుబ్రహ్మణ్యం గారు హిమాయత్ నగర్ లోనే ఉండేవారు. ఆయనకి భ్రమర, పద్మ అని ఇద్దరు మనమరాళ్ళు. వాళ్ళకి ట్యూషన్ చెప్తావా ? అని అడిగారు. మాలతి పద్మనాభం గారి కొడుకు విజయ్ అడిగాడు. ఆరుగొలను నండూరి వారి రివాజుగా 18 ఏళ్ళకే టీచర్ నయ్యాను. పిల్లలిద్దరూ గ్రామర్ స్కూల్లో చదువుతుండేవారువారి నాన్నగారు కాంగ్రెస్ ఎమ్.పి. ఢిల్లీ లో ఉండేవారు. మొదటి రోజు వాళ్ళింటీకి వెళ్ళగానే పద్మ నన్ను చూసి ఒకటే ఏడుపు. నేను పాఠాలు చెప్పడానికి రాలేదు ఆడుకోవటానికే వచ్చాను అని చెప్పి డాబామీద కాసేపు వాళ్ళతో ఆడుకుంటూ మెల్లగా పాఠాలు చెప్పేవాణ్ణి. ట్యూషన్ డబ్బులతో మళ్ళీ నేనొక స్పోర్ట్స్ సైకిల్ కొన్నాక అప్పుడు నేను జనగామ వెళ్ళి నాన్నగారి కాళ్ళు మొక్కాను. మనం తప్పు చేస్తే పెద్దవాళ్ళు కోప్పడి ఒక దెబ్బ వేస్తే సరికి సరి కదా ! ఏమి అనకపోతే అది భరించలేని శిక్షగా ఉంటుంది. మన పెద్దవాళ్ళ స్వభావాల ప్రభావం పిల్లల మీద వారికి తెలియకుండా ప్రభావం చూపుతుంది. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు మొదటి పేజీ అంతా దైవ ప్రార్థన రాసి, తర్వాత మా నాన్నగారి మీద చిన్న నవలిక రాసాను. నాన్న పేరు పరంధామయ్య. మా అమ్మకి చూపించాను. ఒకటే నవ్వు. నాన్నగారి కి చూపిస్తే ఆయన కూడా బాగా నవ్వారు


నా కథలో పాత్ర అయిన పరంధామయ్యగారి నుదుటి మీద (మానాన్నగారికి ఉన్నట్లే) మూడు ముడతలు ఉండేవి. ఒక్కో గీత ఆయన అనుభవానికి ప్రతీకగా ఉంటుంది అని  సాగుతుంది కథ. నాన్నగారి విశాలమైన ప్రేమ తత్వం మాలో తెలియని కవితా, రచనా శక్తిని వెలికి తీసింది. మా తాతగారు శివరావుగారి పోలిక కూడానేమో ! ది ఏంజెల్ ఆఫ్ ది వ్యాలి టైటిల్ మీద 100 పద్యాలు రాసాను. అనేక చిన్న చిన్న కవితలు రాస్తుండేవాడిని. మా .బి.వి.హై స్కూల్లో హెచ్.ఎస్.సి. వరకు తరగతులు ఉండేవి. అప్పట్లో బీద విద్యార్థులు ఒక ఆర్జీ పట్టుకుని ప్రతి తరగతికి వెళ్ళి విరాళాలు  అర్థించేవారు. ఒక సారి మా అక్కయ్య తరగతి గదిలోకి ఒక పేద విద్యార్థి వచ్చి ఒక్క రూపాయి చదువుకోసం అర్థించాడు వెంటనే మా అక్కయ్య లేచి అలా వచ్చిన పేద విద్యార్థిని సంబోధిస్తూ, బాబూ ! నీవు ఎవర్ని అడగవద్దు. నాతో పాటు మా ఇంటికి రా ! మా నాన్నగారు నీ ఫీజు మొత్తం ఇస్తారు", అని ధైర్యంగా చెప్పి విద్యార్థిని ఇంటికి తీసుకొచ్చింది.వెంటనే అమ్మ విద్యార్థికి భోజనం  వడ్డించింది. నాన్నగారు రాగానే అతని వివరాలు, అతని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మొత్తం ఫీజు ఇచ్చి, పుస్తకాలు అన్నీ కొని ఇవ్వటమే కాకుండా అన్నయ్యలవి బట్టలు కూడా ఇచ్చారు, ఇలా మా అమ్మ నాన్నగార్లు ఎంతమందికో చదువుకోసం సాయం చేస్తుండేవారు.

మా పెద్ద అన్నయ్యకి అన్ని విషయాలలో జ్ఞానం ఉండేదిదొడ్లో (పెరటిలో) మేమంతా రాత్రుళ్ళు కూర్చున్నప్పుడు ఆకాశం లోని నక్షత్రాల ఆకారాలు, పేర్లు చెప్తుండేవాడు. మేషరాశి, వృషభ రాశి, మిథునం అలా అన్ని ఆకారాలు చూపిస్తూ చెప్తుండేవాడు. తర్వాత జ్యోతిష శాస్త్రం క్షుణ్ణంగా అభ్యసించాడు. రాశి చక్రం, నవాంశ చకచకా లెక్ఖలు కట్టేవాడు. చిత్రలేఖనం, ఆయిల్ పెయింటింగ్ , వుడ్ కార్వింగ్, రకరకాల చెట్లు పెంచేవాడుమా నాన్నగారు చెప్పిన విషయాలన్నీ ఇద్దరన్నయ్యలు వివరించి చెప్పేవాళ్ళు. భారతి మాస పత్రికలో అన్నయ్య కవితలు ప్రచురించబడేవి. నాన్నగారు, అన్నయ్యలిద్దరూ నాకు బయాలజీ పాఠాలు చెప్పేవారు


                                             


                              


                                                      అధ్యాయం 12

మా అమ్మ శ్రీమతి నండూరి రాజరాజేశ్వరి  దేవి 

అమ్మ అనే పదంలోనే అమృతం నిండి ఉంది. అమ్మ పుట్టింటి వారు "వల్లూరి". అమ్మ అందరికన్నా పెద్ద. తాత గారు వల్లూరి సూర్యనారాయణ రావు గారు లలితా అమ్మవారు, దేవి ఖడ్గమాలా ఉపాసకులు. అందుకని అమ్మకు శ్రీ రాజరాజేశ్వరి అని పేరు పెట్టుకున్నారు. తాతగారికి మా అమ్మంటే అమితమైన ప్రేమ. చిన్నప్పట్నుంచి దయ, ఉన్నత సంస్కారాలు అమ్మ రక్తంలో జీర్ణించుకు పోయినాయి. కర్ణాటక సంగీతం, హార్మోనియం, వీణ నేర్చుకుంది. తాతగారు లలితా అమ్మవారి మీద రాసిన కీర్తనలు చాలా అద్భుతంగా పాడేది. మా అందరికీ కూడా పాటలు వచ్చును. చాలా గారాబంగా పెరిగింది. కీస్ హై స్కూలు, తర్వాత కొత్వాల్ సుందర్ రెడ్డి స్కూలు లో చదువుకుంది. ఏవో కొన్ని మెడల్స్ కూడా అందుకుంది. ఇంతే కాదు అమ్మ తమిళ  భాష కూడా నేర్చుకుని తమిళభాషలో భాగవతం పుస్తకం చదువుతుండేది. అమ్మా, నాన్నల దాంపత్యం చాలా ఆదర్శప్రాయంగా ఉండేది. ఒక్క రోజు కూడా వారు వాదోపవాదాలు చేసుకోలేదు. అన్ని భోగభాగ్యాల  మధ్య  గారాబంగా పెరిగిన మా అమ్మ, భర్త నిర్ణయానికి అనుగుణంగానే నిస్సంకోచంగా, సంతోషంగా మా నాన్నగారిని అనుసరించింది. అండగా నిలబడింది. గడిచిన తన వైభవోపేతమైన పాత రోజులని వర్తమానంలో కలవనివ్వలేదు. అనుకూలమైన భార్యగా, ప్రేమించే తల్లిగా, చక్కటి శిక్షణ ఇచ్చే గురువుగా, సనాతన ధర్నాన్నిబోధించి, ఆచరించే ఆధ్యాత్మికవేత్తగా,ఇరవైనాలుగు గంటలూ ఆతిథ్యమిచ్చే మాతా అన్నపూర్ణగా, సమాజంలో వంచించనడుతున్న వివాహిత స్త్రీలకు అండదండలు గా నిలిచి, అందరిచేత డాక్టరమ్మగా, సహనానికి ప్రతిరూపంగా ఇలా అనేక పాత్రలు అమ్మ చాలా సహజంగా నిర్వర్తించింది. ఆ పాత్రల్లో జీవించింది. మా అందరికి కూడా ఇంగ్లీషులో ఒక గట్టి పునాదిని కల్పించింది. రెన్  అండ్ మార్టిన్ గ్రామరు మా అమ్మకి కంఠతా వచ్చును. 

ఒకసారి బి.ఎస్.సి రెండవ సంవత్సరం హైదరాబాదులో చదువుతుండగా, ఇద్దరు మిత్రులతో జనగామకు వెళ్ళటం జరిగింది. ఇద్దరు మిత్రులకి పల్లెటూరి వాతావరణం వింతైన అనుభవాన్ని ఇచ్చింది. అమ్మ పెట్టే రకరకాల ఫలాహారాలని తీసుకోవటం, హాయిగా ఊరంతా తిరగడం చేస్తుండగా, ఒక రోజు అమ్మ మా అమ్మ ఇద్దరిని పిలిచి, మీ చదువులు ఎలా సాగుతున్నాయి? సరే ! నేను ఒక ప్రశ్న వేస్తాను. జవాబు చెప్పండి అని అంది. ప్లీజ్ define an అడ్వేర్బ్  అని అడుగగా ముగ్గురం అవాక్కయి పోయాం. నీళ్లు నములుతూ కూర్చున్నాం. అప్పుడు అమ్మ ఏం చదువులురా మీవి? అంటూ డెఫినిషన్ గడగడా చెప్పేసింది. ఆ ఉన్న మూడు రోజులు ఇంగ్లీషు  గ్రామర్  పాఠాలు నేర్పించింది. వెళ్ళేటప్పుడు నా మిత్రులిద్దరికీ బట్టలు కొనిచ్చిoది. వారిద్దరూ మా అమ్మ కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చారు. మా అమ్మ కన్నా మీరు ఎంతో ప్రేమనిచ్చారు. ఇటువంటి ఆతిథ్యాన్ని మేము ఎప్పుడు తీసుకోలేదు. అంటూ కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. హెచ్. ఎస్.సి. లో నాకు సెంటరు లో ఇంగ్లీషులో ఫస్టు మార్కులతో పాసు అయ్యాను. అది నాకు అమ్మ పెట్టిన భిక్షే. ఇంగ్లీషు డిక్షనరీ ఎలా వాడాలో నేర్పించి, ప్రతి రోజు ఐదు కొత్త ఇంగ్లీషు పదాలు నేర్చుకోవటం, దానితో వాక్య నిర్మాణం చేయటం తప్పనిసరి. మా మేనమామ కొడుకు బోసు, అమ్మ మూడో చెల్లెలు పద్మ పిన్ని కొన్నాళ్ళు జనగామలో చదువుకున్నారు. 

హిందీ ప్రేమీ మండలి - దక్షిణ భారత హిందీ ప్రచార సభ కేంద్రం

గౌరిపెద్ది రామకృష్ణారావు గారు మా హిందీ మాష్టారు.. చాలా చక్కగా హిందీ పాఠాలు చెపుతుండేవారు. ఆయనకి పరిచయం ఉన్న దక్షిణ భారత హిందీ  ప్రచార సభ నిర్వాహకులు వేమూరి రాధా కృష్ణ మూర్తి గారు, మా  హిందీ మాష్టారు గారి ఇంటికి  వచ్చారు. వారిద్దరూ కలిసి, అమ్మతో మాట్లాడి జనగామ లో "హిందీ ప్రేమి మండలి" స్థాపించారు. అమ్మని నిర్వాహకురాలిగా నియమించారు.  అప్పటికే అమ్మ హిందీ ప్రాథమిక పరీక్షలో మొత్తం సెంటరు లో ఫస్టు క్లాసులో పాస్ అయింది. గానుగ పహాడ్ గ్రామ దొరగారు శ్రీ హర్కారే శ్రీనివాస రావు గారింటిలో


సీత,రమణి, లాలస, సాయిరాం, జ్యోత్స్న వదిన, చిన్న అన్నయ్య, బావగారు శైలేంద్ర

హిందీ ప్రేమీ మండలి ,దక్షిణ భారత హిందీ ప్రచార సభ కేంద్రంగా  ఏర్పాటు చేశారు. మా అమ్మ ఎంతో ఉత్సాహంగా కొన్ని వందల మందిని ప్రోత్సాహించింది. చాలా మంది స్త్రీలకి పాఠ్య పుస్తకాలను కొని ,  వారందరికీ తానే స్వయం గా ఫీజు కట్టలేని పేదవారికి ఫీజు కూడా కట్టి పరీక్షలకు పంపింది. అమ్మ కూడా హిందీ విశారద వరకు చదివింది. జనగామ సెంటరు ని ప్రథమ స్థానంలో నిలబెట్టింది. చాలా మంది మహిళలు మెట్రిక్ దాకా చదివి, భర్తలతో బాధలు పడి, పుట్టింట్లో నానా కష్టాలు పడుతుండేవాళ్లు. వీరందరూ చక్కగా అమ్మ దగ్గర చదువుకుని , కొంత మంది బి.ఎడ్ పరీక్షలు పాసై , టీచరు  ఉద్యోగాలు సంపాదించుకుని , వారి జీవితాల్లో స్థిరపడి పోయారు. మా అమ్మ మెట్రిక్ వరకు మాత్రమే చదువుకుంది. ఆ రోజుల్లో నిజాం నవాబు గారు హిందువులని అణచి వేయటం కోసం అరబ్బు దేశాల నుండి హంతకులని పిలుచుకున్నాడు. వీళ్ళని ఛావుస్ అంటారు. వీరందరు ఒరలో కత్తి పెట్టుకుని , హిందువులని అమానుషంగా నడి రోడ్డు మీద చంపుతుండేవారు. ఇంటి పిట్ట గోడల మీద కూర్చుని స్త్రీలని వేధిస్తూ ఉండేవారు. ఒక రోజు అమ్మ స్కూల్ దగ్గర ఉండగా ఒక చావూస్ వెంట పడ్డాడు. అప్పటినుంచి అమ్మ ఆ భయానికి స్కూలుకి వెళ్ళటం మానేసింది. జనగామలో ఎనిమిదిమంది పిల్లలతో   ఉంటూ హిందీ విశారద వరకు  తానూ చదువుకోవటమే  కాకుండా చాలా మందికి విద్యాబోధన చేసింది. ఇంటి నిండా బోలెడన్ని హిందీ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, ప్రేమ్ చంద్, మైథిలీ శరణ్ గుప్త, ఇంకా ఎంతో మంది హిందీ సాహిత్య రచయితల పుస్తకాలు ఉండేవి. చివరకి మా అమ్మ తన మనవళ్ళకి కూడా హిందీ పాఠాలు చెప్పేది.

అమ్మ ఆధ్యాత్మిక ప్రయాణం

మా తాతగారు వల్లూరి సూర్యనారాయణ గారి హయాంలోనే ఇంటికి సాధువులు, సన్యాసులు వస్తుండేవారు. వీరందరికి మా అమ్మ సేవ చేస్తుండేది. వారిలో ప్రముఖుడు పప్పా రాందాసు గారు. ఇతను మహారాష్ట్రకు చెందిన సాధువు. రామభక్తుడు. ఆ రోజుల్లోనే షిరిడి సాయిబాబా గురించి జనం చెప్పుకుంటూ ఉండేవారు. అమ్మ నేను చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు , మా రెండో అన్నయ్య ప్రశాంతు తో షిరిడి ప్రయాణం చేసింది. అష్ట కష్టాలు  పడి చేరుకుంది. ఆ కాలం లో ప్రయాణ సౌకర్యాలు అంత బాగా ఉండేవి కావు. మా చిన్న అన్నయ్య కూడా చిన్నవాడే. ఈ విధంగా మా అమ్మకి షిరిడి సాయిబాబా తో అనుబంధం ఏర్పడింది. నా మొదటి పేరు సూర్యనారాయణ. అమ్మ షిరిడి వెళ్లి వచ్చాక నా పేరుని "సాయిరాం" గా మార్చి వేసింది. రామ్ అంటే పప్పా రాందాసు గారిలో రామ్ , షిరిడి సాయిబాబా లోని సాయి కలిసి "సాయిరాం" గా పెట్టింది. ప్రతి నెల షిరిడి నుంచి ప్రత్యేకంగా విబూది ప్రసాదం పోస్టులో వచ్చేది. 

             

వెనుక నిల్చున్నవారు:కశ్యప్, సాయిరాం,లాలస, పద్మపిన్ని, సాయి  క్రింద వరుసలో దుర్గ, రమణి, మాలతి,విజ్జి, సోమయ్య మధ్యలో: బావగారు, చిన్న అన్నయ్య, నాన్నగారు, అమ్మ, చిన్న వదిన, అక్కయ్య.


జనగామలో మొట్టమొదట ఉన్న చీలా రాజయ్యగారి ఇంట్లో దయ్యాలు ఉన్నాయని పిల్లలతో ఉన్నారు ఇక్కడ ఉండవద్దని అందరు సలహా ఇచ్చారు. అయినా అమ్మా నాన్నగారు పట్టించుకోలేదు. ఒకసారి మా అమ్మ పడుకుని నిద్రపోతుంటే వేపచెట్టు మీద నుంచి తెల్లని చీర కట్టుకుని ఒక స్త్రీ వచ్చి అమ్మని తట్టి లేపి రమ్మని చెపుతుండాలి. కానీ అమ్మ శ్రీ రామ శ్రీ రామ అని అనుకుంటుంటే అది మళ్ళీ చెట్టు మీదకి వెళ్లి పోయి తిరిగి కనిపించలేదు. ఈ విధంగా మా అమ్మ చేసిన పూజలు, దైవం మీద అచంచలమైన నమ్మకం మూలంగా దయ్యాలు కానీ, తేళ్లు, పాములు కానీ మా జోలికి రాలేదు. ఇంతే కాదు ఎప్పుడు షిర్డీ సాయిబాబా గారు కనిపిస్తుండేవాళ్లు. అమ్మ విజ్జిని కడుపుతో ఉన్నప్పుడు బాబా గారు కలలో కనిపించారు. ఒక పళ్ళ బుట్టని చూపించి ఏదో ఒక పండు తీసుకో అని చెప్పారు. అందులో అన్ని పళ్ళు పచ్చిగా ఉండాలి. ఒక్కటి మటుకు పండింది కానీ ఒక చోట కాస్త కుళ్లింది. అమ్మ ఆ పండే తీసుకుంది. అయ్యో! ఎందుకది తీసుకున్నావు? అది కుళ్ళపోయింది వేరే కాయ తీసుకో అని బాబాగారు చెప్పారు. ఫరవాలేదు! నా కదే కావాలి అని అమ్మ ఆ పండుని తీసుకుంది. ఈ కల కి అర్థం ఏమిటో మా విజ్జి 26 ఏళ్లకే పోయినప్పుడు అమ్మకి మాకు తెలిసింది. బాబా గారు పుట్టబోయే పిల్లకి ఆయుష్షు లేదని సూచించారు అని. అమ్మ అర్థం చేసుకోలేక పోయింది అని చెప్పింది. అలాగే ఇంకొక సంఘటన కూడా జరిగింది. బాబా గారు అమ్మకి కలలో ఎపుడవు కనిపిస్తూ ఏదో మాట్లాడుతుండేవారు. 

                                       

పరమహంస యోగానంద గారు                  మహావతార బాబాజీ .క్రింద యోగానంద గారు.ఎడమవైపు లాహిరి        

                                                              మహాశయ గారు, ఇంకొకవైపు శ్రీ యుక్తేశ్వర గిరి స్వామి గారు

అయితే అమ్మ మటుకు ఒకసారి ఆయన కనబడాలి అని పట్టుబట్టింది. కలలో కనిపించి పాయసం ఇచ్చారు తాగడానికి. కాని అమ్మ మటుకు నేను తాగను మీరు నాకు కనిపించాలి అని పదే పదే చెప్పింది. ఆయన కూడా చాలా సేపు అమ్మని బ్రతిమిలాడారు. అమ్మ వినిపించుకోక పొతే," సరే! నీ కర్మ" అని చెప్పి వెళ్లి పోయారు. ఆ తర్వాత అమ్మకి కనిపించలేదు. అమ్మ ఎంత బాధ పడిందో. ఇలాగే తర్వాత తర్వాత పరమహంస యోగానంద గారు, బాబాజీ గారితో అనుభవాలు. ఒకసారి ఏమయిందో తెలియదు కానీ మహావతార బాబాజీ గారి మీద పాట రాసి పాడింది. సాయి అంటే మా పెద్దన్నయ్య కొడుకుకి అస్సలు ఒంట్లో బాగా లేకపోతె వాడి గుండె మీద చేతితో రాస్తూ ఆ పాట అమ్మ పాడుతున్నప్పుడు వింటుంటే కడుపులో, గుండెల్లో మాకు విపరీతంగా బాధగా ఉండాలి. " నా పిలుపే వినలేవా మహావతార బాబాజీ, నిన్నే నమ్మినానయ్యా, నన్ను బ్రోవగా రావయ్యా " అనే పాట. ఆ రోజుల్లో మా అమ్మ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ ఉండేది. ఈ విషయాలు మా పెద్ద చెల్లెలు లాలస చెప్పింది.

ఏ సాధువు మా ఊరికి వచ్చినా మా ఇంట్లోనే వసతులు కల్పించే వారు. ఆ రోజుల్లో మడి కట్టుకోకుండా వంట చేసేవాళ్ళు కాదు కదా ! ఉదాహరణకి హరికథా భాగవతార్ గారు, కుసుమకుమారి భక్తురాలు ఇలా ఎంత మందో !! మా నాన్నగారు పూజలు చేసేవారు కాదు వినాయక చవితి, శివరాత్రి తప్ప కానీ అమ్మకి పూర్తిగా సహకారాన్ని ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయిస్తుండేవారు.మా అమ్మ చేసిన పూజలు, జపాలు, ధ్యానాల వల్ల  మా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా వ్యాపించి చాలా ప్రశాంత వాతావరణం తో నిండి పోయి ఉండేది.  ఇంటికి చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండేవారు. అదే మాట చెప్తూండే వారు. కాస్త  ప్రశాంతంగా ఉండాలంటే, వాళ్ళ బాధలని మర్చిపోవాలంటే మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు మా బంధువు లందరూ.

గీతాశ్రమంలో మా దుర్గ, రమణి 5 గంటలకి సుప్రభాతం చదవడానికి వెళ్ళ్తుండేవాళ్లు కొంత మంది ఆడపిల్లలతో. అందుకని మూడు గంటలనుంచి వాళ్ళిద్దరిచేతా అమ్మ, నాన్నగారు ప్రాక్టీస్ చేయిస్తుండేవారు. అమ్మ అయితే లక్ష్మి సహస్ర నామాలు, లలితా సహస్ర నామాలు ఇవన్నీ చదువుతుండేది. ప్రతి పూర్ణిమ రోజు ఎనిమిదేళ్ల లోపుగా ఉన్న చిన్న పాపలైన దుర్గ , రమణికి పూజ చేసి కొత్త ఫ్రాకులు తెచ్చేవారు.మా అమ్మ చేసిన పూజల వల్లే ఆ దయ్యాల కొంప లో మేమందరమూ హాయిగా, ఏ బాధలకి  గురి అవకుండా సలక్షణంగా  ఉన్నాము.

శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి అమ్మవారి ముఖాన్ని  పిండి తో తయారు చేసి, చక్కగా అలంకరించి, పట్టు చీర కట్టి చాలా బాగా చేసేది, ఆఅమ్మవారి ముఖం ఎంత కళ గా ఉండేదో చెప్పలేం. మా చిన్నప్పుడు అన్ని రోజులు అమ్మ ఉపవాసమే ఒక్క ఆదివారం తప్ప. నాన్నగారు వేళాకోళం చేస్తుండేవారు ఆ ఒక్క రోజు కూడా ఉపవాసం చేయి అని. ప్రతి శుక్రవారం నాడు స్పెషల్ గా  గళ్ళు వేసి లెక్క ప్రకారం రంగు రంగుల చుక్కలు పెట్టి, దాని మీద పెద్ద దీపాన్ని చక్కగా పూలతో అలంకరించి పూజ చేస్తుండేది. దానికోసం నాన్నగారు చిన్న చెక్క బల్ల చేయించి దాని మీద మా డ్రాయింగ్ మాస్టారుతో చిన్న చిన్న  చదరపు గళ్ళు చేయించి పెట్టారు. దానితో అమ్మకి కాస్త శ్రమ తగ్గింది. ఇద్దరూ ఎంత చక్కగా కలిసి ఉండేవారంటే మేమెవ్వరం వాళ్ళు మాట మాట అనుకోవడం చూడలేదు. ఊళ్ళో అందరూ వారిని పార్వతి పరమేశ్వరులు అని అంటుండేవారు. ఇదే కాకుండా శ్రీ రామకోటి ఎన్ని కోట్లు రాసిందో చెప్పలేం. ఆ పుస్తకాలన్నీ నాన్నగారు భద్రాచలానికి పంపారు. అక్కడ కట్టిన గుడి పునాదుల్లో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి.

                 మాకు ఎప్పుడైనా జ్వరం వస్తే అమ్మ యూడీకోలోన్  వేడి నీటితో కలిపి, మెత్తటి తువ్వాలుతో ఒళ్లంతా  శుభ్రంగా తుడిచి, ఒంటి నిండా రేమి, క్యూటిక్యురా టాల్ కం పౌడర్ రాసేది.. బాబా విబూది నుదుటన బెట్టి, కొంత నోట్లో వేసి పడుకోబెట్టుకుని, సాయిబాబాబా పాటలు, అమ్మవారిమీద పాటలు పడుతూ జో కొడుతూ మమ్మల్ని నిద్ర పుచ్చేది. ఎంతో హాయిగా అనిపించేది మాకు అమ్మ స్పర్శ. రెండు రోజులలోనే  మేము కోలుకునేవాళ్ళం. ఒకసారి 1993 లో టాంజానియాలో పని చేస్తున్నప్పుడు ఒక పెద్ద కారు ప్రమాదంలో గాయపడి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు , గోడ మీద ఆ సాయిబాబా ఫోటోని చూస్తుంటే మా చిన్నప్పటి అనుభవాన్ని, మా అమ్మ స్పర్శని, అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటే, శరీరానికి, మనస్సుకి ఎంతో ఊరట కలిగింది. తీవ్రమైన నొప్పులనుండి ఉపశమనం కలిగింది. 



అమ్మ చెప్పిన కథ 

పూర్వం ఒక ధర్మాత్ముడైన రాజు తన రాజ్యాన్ని ప్రజలని ఎంతో సమర్థంగా పరిపాలిస్తూ, ప్రజలందరి మన్ననలు పొందాడు.  రాజ్యం సిరిసంపదలతో తులతూగుతుండేది. శత్రు బాధ లేదు. చోర భయం లేదు. ఋణ బాధ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. 

          ఒక ఏడు వర్షాలు లేక పంటలు పండ లేదు. అలా నాలుగేళ్లు వరసగా అనావృష్టితో క్షామ   పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజ్యంలోని ధనాగారం, ధాన్యాగారం ఖాళీ అయ్యాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. 

        రాజు గారు ఒక రోజు మగత నిద్రలో ఉండగా ఒక దేవతా స్వరూపం తన ఎదుటినుంచి బయటికి వెళ్తూ కనిపించింది."ఎవరు నీవు, తల్లీ?" అని రాజు గారు అడిగితే "నేను ధనలక్ష్మిని, నీ రాజ్యం లోని క్షామ పరిస్థితులకి నేను నిలవలేను" అని తెలిపింది. సరే అని రాజు గారు మౌనంగా అంగీకరించారు. తర్వాత ఒకరి వెనక ఒకరు ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి అలా ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపో సాగారు. చివరగా వెళ్లిపోతున్నా దేవతామూర్తిని  చూసి, నీవెవరవు, తల్లీ ? అని అడుగగా "నేను ధైర్యలక్ష్మిని అనగానే ఆ రాజు గారు ఒక్క ఉదుటున లేచి, "తల్లీ ! నిన్ను చూసుకునే నేను ఇంత ధైర్యంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొన గలుగుతున్నాను. నీవులేని నాకు ధైర్యమెక్కడిది, తల్లీ ?  నీవు వెళ్ళవద్దు " అని ఆ రాజు గారు  ప్రార్థించారు. 

                   

వెంటనే ధైర్యలక్ష్మి "మహా రాజా ! సరే ! నేను నీ వెంటనే ఉంటాను, నిన్ను విడిచి వెళ్ళను" అని లోపలకు నడిచింది. వెనువెంటనే మిగిలిన ఏడుగురు లక్ష్ములు తిరిగి రాజ్యంలో ప్రవేశసించారు. వర్షాలు కురిసి, పంటలు పండి తిరిగి ఎప్పటివలె రాజ్యం సుభిక్షంగా, సుఖసంతోషాలతో తులతూగింది.ఎటువంటి పరిస్థితిలోనైనా, కష్టంలోనైనా, దుఃఖం లో ఉన్నా సరే ధైర్యాన్ని వీడ రాదనీ మా అమ్మ చెప్పింది. పరిస్థితులు బాగా ఉన్నప్పుడే మనం అన్ని విధాలుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనగలుగుతాం అని సలహాఇచ్చింది. 

             ఇది నా జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడల్లా అమ్మ ఇచ్చిన ఈ సందేశం నాలో ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించేవి.

ఉగాండా రాజధానైన కంపాలాలో నేనున్నప్పుడు ఒక రాత్రి దొంగలు పడి,సర్వం దోచుకుపోయారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను మా అమ్మ చెప్పిన విధంగానే ధైర్యాన్ని మాత్రం నా అధీనం లో నే ఉంచుకున్నాను. ప్రతికూల పరిస్థితులని ముందుగానే ఊహించుకుని, ముందుగానే జాగ్రత్త పడ్డాను.          

                 

    అమ్మ ఎదురుగానే ఉండి ధైర్యం చెప్తున్నట్టుగా భావన కలిగేది. ఒక నాలుగు నెలల్లోనే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నాకు అనుకూలంగా మారిపోయాయి. అప్పటినుంచి నా నిఘంటువులో కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు అనే పదాలకి స్థానం లేకుండా చేశాను. కష్టాలు మనకి జీవితంలో మంచి పాఠాలు నేర్పడానికి వస్తాయి. మనకి పడని వ్యక్తుల వల్ల వారు సృష్టించే పరిస్థితుల వల్ల మనకి ఎప్పుడూ కూడా పది రెట్లు లాభమే ఉంటుంది అన్న జీవిత సత్యాన్ని నేర్చుకున్నాను. అప్పటినుంచి నా జీవితంలో అన్నీ విజయాలనే సాధించాను. ఇందుకు కారణమైన మా అమ్మని నేనెప్పుడూ ఆరాధిస్తూ ఉంటాను. 

అమ్మ మాకిచ్చే వింత శిక్ష 

జనగామ ఇంట్లో మా నుయ్యి పై భాగాన ఉన్న ఒక అంచు నుండి ఇంకో అంచుకి మా పెద్దన్నయ్య దూకుతూ ఉండేవాడు. అది చాలా ప్రమాదకరమైన ఆట. అమ్మ ఎన్నో సార్లు వారించింది. కానీ అన్నయ్య వినలేదు. ఈ క్షణమే నువ్వు ఈ పని మానకపోతే, ఈ రోజు నుండి నేను నిరాహారంగా ఉంటాను అని అమ్మ హెచ్చరించింది. అన్నయ్య మొదటి రోజు పట్టించుకోలేదు. అమ్మ కూడా అన్నయ్యని కోప్పడకుండా ప్రశాంతంగానే ఉంది. నాన్నగారితో సహా మేమందరం అన్నయ్యని అలా చేయవద్దని ప్రాధేయ పడ్డాం. రెండో రోజు మా అన్నయ్య పశ్చాత్త్తాప పడ్డాడు. " అమ్మా ! నేను నిజంగానే తప్పు చేసాను. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కోప్పడతారు. కొడతారు కూడా ! ఆ శిక్షే బాగుంటుంది. కానీ నీవేమి అనకుండా నేను చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు. ఈ శిక్షని నేను భరించలేకుండా ఉన్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయను అంటూ భోరున ఏడ్చేశాడు. మేమంతా కూడా వంత పాట పాడాం. అమ్మ అన్నయ్యను దగ్గర తీసుకుని  కన్నీళ్లు తుడిచింది. పద ! ఈ రోజు నీకిష్టమైనది వండి పెడతాను. అందరూ లేవండి అని అందరి మనసులు తేలిక చేసింది. ఈ విధంగా అమ్మ, నాన్నగారు, మేము ఏ తప్పులు చేసినా ప్రేమ తత్వంతోటె మాలో మార్పు తెచ్చారు. అంతే తప్ప ఏ రోజూ కోప్పడటం కానీ, ఒక దెబ్బ వేయటం కానీ చేయలేదు. సాధారాణంగా మన భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లి ఒక మంచి స్నేహితురాలిగా ఉంటుంది. మన తప్పొప్పులని నిస్సంకోచంగానీ అమ్మతో మనం చెప్పుకోగలుగుతాం. తల్లి ప్రేమకు వాక్కు ఉంటుంది. ఓర్పు ఉంటుంది, పిల్లలు విసుక్కున్నా, అలిగినా, ఒక మాట అన్నా కూడా, తల్లి ఏమీ పట్టించుకోదు  తండ్రి ప్రేమ గంభీరంగా ఉంటుంది. వాగ్దేవి మౌనంగానే ప్రేమని కళ్ళ ద్వారా చేతులద్వారా వ్యక్త పరుస్తుంది. మౌనం లోనే మహా శక్తి దాగి ఉంటుంది. అమ్మ "మా బాష గానము" అయితే తండ్రి "గంభీర మౌనము" అన్న మాట. 


               

      2వ బావగారు శైలేంద్ర, లాలస, జ్యోత్స్న(చిన్న వదిన ), సీత, చిన్న అన్నయ్య, నేను

నేను హైదరాబాదులో బి. ఎస్. సి. చదువుతున్న రోజుల్లో ఒక రోజు కాలెజి ఎగ్గొట్టి స్నేహితులతో పాటు సినిమా కి వెళ్లాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ట లేదు. తప్పు చేశాననే భావన . చివరకి మా అమ్మకి నేను చేసిన తప్పుని రాసి, ఇక ముందు ఇలాంటివి చేయను అని రాసిన ఉత్తరం పోస్టు చేసేంతవరకు నాకు మనస్థిమితం లేకపోయింది. ఈ విధంగా మా అమ్మా, నాన్న వేసే శిక్షలు మనంతట మనమే బాధ పడి, పశ్చాత్త్తాప పడి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండే సంస్కారాలని ఇచ్చేవి. తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తె అది హాయిగా ఉంటుంది.సరికి సరి అన్న మాట. తప్పుకి బదులు మనకి ప్రేమ ప్రతిఫలంగా వస్తే, అది శిక్ష కన్నా దారుణంగా ఉంటుంది. అనే సూత్రాన్ని మేము నేర్చుకున్నాము. 

               ఒక సారి మా ఇంటికి ఒక అతిథి వచ్చారు. నాన్న గారు మా అక్కయ్యని అతనికి భోజనం వడ్డించమని చెప్పారు. మా అక్కయ్య అతను చూస్తే దొంగ లాగా ఉన్నాడు. నేను అతనికి వడ్డన చేయను అని చెప్పింది. "మనింటికి ఆకలితో ఎలాంటి వారైనా సరే , వారికి మనం నిస్సంకోచంగా నే మంచి ఆతిథ్యం ఇవ్వాలి" అని చెప్పారు.

నాటకాలు  -  పాటలు

1962 వ సంవత్సరం లో చైనా తో మన దేశానికి యుద్ధం వచ్చింది. అప్పుడు మాకు  దేశ భక్తికి సంబంధించిన నాటికలు, గేయ రూపకాలు ఎన్నో మా అమ్మ మాకు నేర్పించింది. ఇంట్లో ముందు గది లో మా నాన్నగారు రోగులను పరీక్షించడానికి ఒక తెరని ఏర్పాటు చేశారు. అదే  మా డ్రామా వేదిక అన్నమాట. అమ్మ నాకు , నా స్నేహితుడికి రాజు - పేద అనే గేయ నాటికను నేర్పించి, రిహార్సల్స్  చేయించింది. నేను రాజుగా, అశోక్ (నా ఫ్రెండ్ ,క్లాసు మేట్) పేద రైతుగా నటించాం. ఇదే నాటిక మా పెద్ద అన్నయ్య రాజుగా, మా పద్మపిన్ని పేద రైతుగా వాళ్ళ స్కూల్ వార్షికోత్సవాలు లో చిన్నప్పుడు నటించి ప్రశంసలను అందుకున్నారు. అదే నాటికను మేము ప్రదర్శించాం. రారాజు వేసుకునే కిరీటం, కత్తి వంటివి అమ్మే స్వయంగా ఇంట్లో చేసింది. "రాజుని రా , నే రాజుని రా , నా సరసన నీవెవడవు రా?"..... అని అమ్మ హార్మోనియం మీద అద్భుతంగా పాడి, హావభావాలు ఎలా ఉండాలో అన్నీ చెప్తుండేది. 25 పైసలు టిక్కెటు పెట్టి, ఈ నాటకాన్ని, గీతాశ్రమం లో కూడా ప్రదర్శించాం.

     

   పెద్దన్నయ్య,  సాయిరాం, దుర్గ,  అమ్మ, నాన్నగారు  


         అమ్మ లహరికాంత్ కమలకాంత్ లతో


అలాగే "తప్పి పోయిన గోపి"అనే చిన్న నాటికను నేనే రాసాను. రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన పోస్టాఫీస్ వంటివి అమ్మ చాలా ప్రోత్సహించేది. ఇలాగే నారాయణ రావు మామయ్య గారింట్లో కూడా శీనయ్య, సత్తెలు తో కలిసి "బ్రహ్మయ్యా, ఓ బ్రహ్మయ్యా " అనే గేయ నాటికను ప్రదర్శించి , మేమందరం అంటే మా చెల్లెల్లు, సోమయ్య, మా  స్నేహితులంతా కలిసి విరాళాలు  కలెక్ట్ చేసి "దేశ రక్షణ నిధి"కి పంపాము. నలభై ఏళ్ళ తర్వాత నేను మా పెద్దన్నయ్య కలిసి మా అక్కయ్య ఇంట్లో మేమందరం కలిసినప్పుడు ఇదే నాటకాన్ని గుర్తు చేసుకుని పెద్దన్నయ్య రాజుగా, నేను పేదగా నటించాం. మా అమ్మ తన చిన్నతనంలో స్కూల్ లో నాటకాలు  వేస్తుండేది, పాటలు కూడా పాడ్తుందేది. అంటే ఆల్ రౌండర్ అన్న మాట. చదువులో, ఆటల్లో  కూడా ఎప్పుడూ తరగతిలో ప్రథమ ర్యాంకు అన్నమాట. 

జనగామలో  "శ్రీ రామ నవమి ఉత్సవాలు" బీటు బజారులో చాలా ఘనంగా జరిగేవి. అంతటా పందిళ్లు వేసి, లైట్లు అమర్చి చాలా బాగా ఉత్సవాలు నిర్వహించేవారు. అక్కడ కూడా మేము అప్పుడప్పుడు ప్రోగ్రాములు ఇచ్చేవాళ్ళం. మా ఆక్కయ్య,  మా ముగ్గురు చెల్లెళ్లకి "మోహిని భస్మాసుర" అనే నృత్య నాటిక ను నేర్పించింది. ఇందులో మోహినిగా మా విజ్జి, శివుడిగా దుర్గ, భస్మాసురుడిగా మా పెద్ద చెల్లెలు లాలస డాన్సు చేస్తుండే వాళ్ళు. ఇదే నృత్యాన్ని మా విజ్జి, దుర్గ, విజ్జి స్నేహితురాలు పద్మ కలిసి ఈ ఉత్సవాల్లో ప్రదర్శించారు. నేను మొట్టమొదటి 

సారి హీరోయిన్ పాత్రలో ఏకపాత్రాభినయం చేసాను. పెయింటర్ పుల్లయ్య గారు నాకు అద్భుతంగా మేకప్

                                                                                                                                                      

   వంశీ,రవిశంకర్, స్మిత, సీత, సాయిరాం, ధృవ్, అదిత్, అవని, అపర్ణ, సుధా,కిరణ్, వినయ్            


చేశారు. నాటకం అయిపోయి మేము ఇంటికి వెళ్తుండగా చాలా మంది మగ పిల్లలు నా వెంట పడ్డారు. దారిలో పోస్టు మాస్టారు గారి ఇంట్లో కాసేపు కూర్చుని తర్వాత ఇంటికి క్షేమంగా చేరాను. అలాగే మా ఆఖరి చెల్లెలు వెంకట రమణి "విప్ర నారాయణ" నాటకం లో దేవదేవి పాత్రని అద్భుతంగా గా పోషించింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ డ్రామా పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చుకుంది. స్కూలు చదువు  నిర్లక్ష్యం అవుతుందని మూడు నాలుగు ప్రదర్శనల తర్వాత నాన్న గారు అనుమతి ఇవ్వలేదు.

ఇంట్లో భజన కార్యక్రమం - ఒక అద్భుతమైన లీల

అప్పట్లో హరనాథ కుసుమకుమారి అనే దంపతులని భగవంతుని అవతారం గా భావించేవాళ్లు. వారు పరమ యోగులు. వారి పరమ భక్తురాలు ఒక సారి మా ఊరికి వచ్చింది. కొంతమంది ఇళ్లల్లో భజన కార్యాక్రమాలు నిర్వహించింది. మా వీధిలో ఉన్న పెద్దలు, మా నాన్నగారు, మా స్కూలు టీచర్లందరూ కలిసి మా ఇంట్లో రాత్రంతా ఈ భజన ప్రోగ్రాము చేయాలని నిశ్చయించి, మా ఇంటిలో భజన ఏర్పాటు చేశారు. మా అమ్మకి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రాములు అంటే చాలా ఇష్టం. ఆ భక్తురాలు హరనాథ, కుసుమకుమారీల ఫొటో ఒకటి తెచ్చి, దాన్ని చక్కగా ఏర్పరచిన మంటపం మీద పెట్టి, పూలతో అలంకరించారు. ఒక పెద్ద వెండి గిన్నెలో స్వచ్ఛమైన వెన్నని నింపి ఆ ఫొటో ముందు ఉంచారు. భజన అంతా అయ్యాక ఆ పాఠం ముందు ఉంచిన వెన్నలో పాదాలు కనిపిస్తాయని ఆ భక్తురాలు చెప్పారు. ఆ రోజు మా మేనమామ కొడుకు కిషోర్ కూడా ఉన్నాడు. అతనికి కంజర వాయించడం లో అనుభవం ఉంది. రాత్రి 9 గంటలకి తాళాలతో భజన మొదలయింది. అమ్మ అల్లం టీ తయారు చేసి ఉంచింది. రాత్రంతా భజన చేస్తూ జాగారం చేయాలన్న మాట. ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మా ముందు గదంతా నిండి పోయింది. భజన కార్యక్రమం "జయ హరనాథ జై , కుసుమకుమారి జై" తో మొదలయింది. ఇదే పాట మెల్ల మెల్లగా మొదలై స్పీయేడు గా కొంచెం సేపు, మళ్ళీ నిదానంగా అలా వివిధ పద్ధతుల్లో భజన సాగింది. ప్రతీ గంటా రెండు గంటలకి ఐదు నిమిషాలు విరామం.

                                      

                                     హరనాథ,కుసుమకుమారి దంపతులు

భజన అంతా అయ్యాక ఆ పాఠం ముందు ఉంచిన వెన్నలో పాదాలు కనిపిస్తాయని ఆ భక్తురాలు చెప్పారు. ఆ రోజు మా మేనమామ కొడుకు కిషోర్ కూడా ఉన్నాడు. అతనికి కంజర వాయించడం లో అనుభవం ఉంది. రాత్రి 9 గంటలకి తాళాలతో భజన మొదలయింది. అమ్మ అల్లం టీ తయారు చేసి ఉంచింది. రాత్రంతా భజన చేస్తూ జాగారం చేయాలన్న మాట. ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మా ముందు గదంతా నిండి పోయింది. భజన కార్యక్రమం "జయ హరనాథ జై , కుసుమకుమారి జై" తో మొదలయింది. ఇదే పాట మెల్ల మెల్లగా మొదలై స్పీయేడు గా కొంచెం సేపు, మళ్ళీ నిదానంగా అలా వివిధ పద్ధతుల్లో భజన సాగింది. ప్రతీ గంటా రెండు గంటలకి ఐదు నిమిషాలు విరామం. అప్పుడు అందరూ కాస్త టీ త్రాగి మళ్ళీ భజన మొదలు. అందరూ రాత్రంతా ఇనుమడించిన ఉత్సాహంతో రాత్రంతా భజన చేశారు. ఎవ్వరూ మధ్యలో విడిచి వెళ్ళలేదు. పిల్లలం మేమంతా కూడా ఉత్సాహంతో, ఆసక్తితో భజనలో పాల్గొన్నాం. గది మొత్తం అగరుబత్తుల సువాసనలతో నిండి పోయింది. తెల్లవారుజామున అమ్మ శ్రావ్యంగా మంగళ హారతులు పాడింది. ఎవ్వరికీ అలసట అనిపించలేదు. హారతి అయినాక అందరూ ఆ వెన్న పెట్టిన గిన్నె వైపు ఆ దంపతుల పాదాలు కనిపిస్తే చూద్దామని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ భక్తురాలు ఆ వెండి గిన్నెని, అందులో ఉన్న వెన్నని చూసి ఆశ్చర్య చకితురాలయింది. ఆనందంతో "భక్తులారా ! ఇక్కడ పరమ అద్భుతం జరిగింది. " అంటూ సంభ్రమాశ్చర్యాలతో అందరినీ గట్టిగా పిలిచింది. ఆ వెండి పాత్రలో  ఉన్న వెన్న మీద హరనాథ కుసుమకుమారి దంపతుల ఆకారాలు, వారి వెనుక ఏడు తలల సర్పం యొక్క ఆకారం చాలా స్పష్టంగా కనిపించింది. కను ముక్కు తీరు, కాళ్లూచేతులూ అన్నీ అక్కడి చిత్ర పటం లో ఉన్న వాటితో పోలి ఉన్నాయి. చాలా మంది ఇళ్లల్లో, చాలా ఊళ్ళల్లో  ఇటువంటి భజన కార్యక్రమాలు చేశాను కానీ ఇక్కడ ఒక్క చోట అంటే మన డాక్టరు గారింట్లో మాత్రమే ఇలా పూర్తి ఆకారం కనిపించి అద్భుతమైన లీల జరిగింది, మీ జనగామ వాసులంతా చాలా అదృష్టవంతులు అని పలుమార్లు అందరితో ఆవిడ చెప్పింది.  ఇది చూడడానికి మా జనగామ లో ఉన్నవారంతా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి ఇది దర్శించి వెళ్లిపోయారు. ఈ డాక్టరుగారు దంపతులు ఎంత పుణ్యాత్ములో అంటూ మహా ఆనంద పడిపోయింది. అప్పటికే మా అమ్మ నాన్నగార్లకి ఊరిలో చాలా మంచి పేరు ఉండింది. ఈ సంఘటనతో వారిద్దరూ ఎంత పుణ్య దంపతుల్లో అన్నది ఊళ్ళో అందరికీ తెలిసి వారి మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. సాయంత్రం ఆ వెన్న ప్రసాదం, అమ్మ చేసిన పులిహోర, అరటిపళ్ళు  అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాం. అందరూ సంతోషంగా , తృప్తిగా ప్రసాదాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఇటువంటి కార్యక్రమాలు మేము చిన్నప్పట్నుంచి చూడడం, పాల్గొనటం వల్ల మా అందరిలో భక్తి బావాలు, మన సనాతన సంస్కారాలు, సమాజం పట్ల ఒక విశాలమైన దృక్పథం అన్న బీజాలు మాకు తెలియకుండానే మా మనస్సులలో నాటబడ్డాయి. అమ్మా నాన్నల వ్యక్తిత్వం నేను ఎంతవరకు వర్ణించగలను?

మహాభారతం లో  ధర్మరాజు గారు యక్ష ప్రశ్నలలో జవాబు ఇచ్చినట్లుగా తండ్రి ఆకాశం, తల్లి భూమి   అయితే , మన చిన్న దృష్టి కోణంతో అంత అనంతమైన శక్తిని కొలవగలమా? మా అందరిలో నే కాకుండా, చిన్నప్పట్నుంచి మాతో పాటు పెరిగిన మా సోమయ్య లో కూడా ఈ బీజాలు దృఢం గా  నాటుకుని, వాటి అంకురాలు మా వయస్సుతో పాటు పెరుగుతూ, మాలో అంతర్లీనంగా దాగియున్న సామర్త్యాలు అన్నీ బయట పడ్డాయి. 

         

నాన్నగారు, అమ్మ ,శ్రీకాంత్ (చంటి పాప)మా అమ్మ మనమడు శ్రీకాంత్ తో

 బావగారు శైలేంద్రలాలస

అన్నపూర్ణ పాత్ర 

నా చిన్నతనంలో మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఇత్తడి పాత్ర ఉండేది. మా అమ్మ ప్రతిరోజూ అందులో గుప్పెడు బియ్యం వేస్తూ ఉండేది. అన్నపూర్ణ పాత్ర అని దానికి పేరు పెట్టారు. ఇంటికి వచ్చే హరిదాసు, గంగిరెద్దు మేళాలు, బుడబుక్కల వాడు, బిక్ష చేసుకునే సాధువులు, మిగతా బిచ్చగాళ్ళకి  ఈ పాత్ర నుండి బియ్యం తీసి ఇస్తూ ఉండేవారు. వాడని దుప్పట్లు, చీరలు, పాత చొక్కాలు, ప్యాంట్లు అన్నీ బీదవారికి ఇస్తుండేది. చాల మంది స్త్రీలు తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి, సలహాల కోసం వస్తుండేవారు. 

                                                                 అధ్యాయం 13

ఇంటికి వచ్చిన బంధువులు

నా చిన్నతనం లో మా శాంత అత్తయ్య రెండు సార్లు ఫణి బావ, దుర్గా ప్రవాళి, ఉమలతో కలిసి వచ్చింది. శాంత అత్తయ్య, మా అమ్మకి ఆడపడుచు అయినా ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆరుగొలనులో అత్తయ్యకి ఒంట్లో బాగా లేనప్పుడు ఎంతో సేవ చేసింది మా అమ్మ. మా వదిన అంటూ తరచూ గుర్తు చేసుకుంటుండేది. ఎప్పుడూ వదినా వదినా అంటూ నవ్వుతూ, సరదాగా  ఉండేది. ఇద్దరూ కలిసితెలుగు పాటలు, హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవారు. మూడు పెద్ద పెద్ద బిస్కట్ డబ్బాలో  ప్రత్యేకంగా తయారు చేసిన మూడు రకాలైన బిస్కట్లు తెచ్చేది.మా నాన్న గారిని అన్నా అన్నా అంటూ ప్రేమగా పిలిచేది. ఫణి భావని నేను జనగామ అంతా తిప్పి చూపిస్తూ ఉండేవాడిని. బావ బాగా అల్లరి చేస్తుండేవాడు. షోలాపూర్ లో మెడిసిన్ చదివి ఎం. డి. Community medicine చేసి మణిపాల్ లో మెడికల్ కాలేజీ లో Dean గా పని చేసి రిటైర్ అయి అక్కడే స్థిర పడి పోయాడు.



శాంతత్తయ్య పిల్లలు  ఉమ, ప్రవాళి , ఫణి బావ ( Dr. R. S. Phaneendra)

భార్య లక్ష్మి కూడా డాక్టరు, కూతురు శృతి, అల్లుడు కూడా డాక్టర్లే. దుర్గా ప్రవాళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక నేవీ ఆఫీసరు ను వివాహం చేసుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి బి.ఎడ్ పూర్తి చేసింది. తాను కూడా మణిపాల్ లోనే స్థిర పడి పోయింది. ఇద్దరు ఆడ పిల్లలు మధురిమ, అనుపమ. ఉమ మాత్రం విజయ నగరం మహా రాజా మహిళా కాలేజీ లో B.Ed చేసి, తర్వాత ఎం.ఎడ్ కూడా చేసి ఢిల్లీ లో టీచర్ గా పని చేసి రిటైర్ అయింది. ప్రస్తుతం తాను కూడా మణిపాల్ లో స్థిర పడింది అన్న తో పాటుగా ఉంది. అందరూ చక్కగా స్థిర పడ్డారు. మా ఫణి బావ, ప్రవాళి కూడా హిందీ పాటలు చాలా బాగా పాడతారు. వీళ్ళందరికీ రఫీ ఫేవరైట్ సింగర్. బావ అయితే రఫీ పాటలు పాడుతుండేవాడు. తర్వాత తర్వాత తలత్ మెహమూద్ పాటలు పాడుతుండేవాడు.


శాంతత్తయ్య రెండవ కూతురు ప్రవాళి, అల్లుడు సుబ్బారావు

ప్రవాళి అయితే చాలా బాగా పాడుతుంది. "ఛోడ్ దే సారి దునియా కిసీ కే లిఏ " పాట విని మా సుశీల పిన్ని అయితే ఏడ్చేసింది. శాంత అత్తయ్య మమ్మల్ని పెద్దా, చిన్నా, చంటి అని పిలుస్తూ ఉండేది మా అన్నదమ్ముల్ని. నేను ఢిల్లీ లో రెండు మూడు నెలలు ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయం గా చూసుకునేది. రాఘవ రావు మావయ్య గారికి బంధు ప్రీతి ఎక్కువ. నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. నా చిన్నతనంలో రెండు మూడు సార్లు జనగామ రావటం జరిగింది. చాలా సహృదయుడు. నిర్మలమైన హృదయం కలిగి, నిరాడంబరంగా ఉండేవారు. 

భావరాజు సూర్యనారాయణ మూర్తిగారు మా నాన్న గారికి పెద్ద బావగారు. ఆయన బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీ లో పని చేస్తున్నప్పుడు రావటం జరిగింది. ఈ మామయ్య గారు కూడా హుషారుగా గలగలా మాట్లాడుతుండేవారు. ఈయనకి జ్యోతిషం లో కూడా ప్రావీణ్యం ఉండేది. ఇంకొకసారి వల్లూరి కృష్ణ మోహన్ అంటే వల్లూరి శకుంతల, రుక్మిణి గార్ల అన్నగారు. వీరంతా మా నాన్నగారికి మేనత్త పిల్లలు. తురగా భాస్కర్ రావు గారు కూడా జనగామ లోని మా ఇంటికి ఒకసారి వచ్చారు. నేను విజయవాడ లో ఉన్నప్పుడు మా పెద్ద అన్నయ్య తో పాటు గా వల్లూరి కృష్ణ మోహన్ గారింటికి వెళ్ళటం జరిగింది. అలాగే విజయ వాడ లో పెద్ద అన్నయ్య తో పాటు నండూరి విజయ్ బాబాయ్ గారింటికి కూడా వెళ్ళటం జరిగింది. 1966 లో నేను బందరు లో చదువుకునేటప్పుడు భావరాజు సూర్యనారాయణ మామయ్య గారు బందరు రావడం జరిగింది. తర్వాత మురళీ బాబాయ్ గారు సికింద్రాబాద్ కింగ్స్  వే లో ఉన్నప్పుడు అక్కడ కూడా వారిని కలవటం తటస్తిoచింది. అప్పుడు రాజు వదిన రెడ్డి కాలేజీ లో చదువుకుంటుండేదని గుర్తు. రాజు వదిన చాలా అందంగా ఉంటుంది. 

               

   మా స్వరాజ్యం అత్తయ్య భర్త విద్యాభూషణ్ రావు గారు. స్వరాజ్యం అత్తయ్య            

 మా స్వరాజ్యం అత్తయ్య భర్త విద్యాభూషణ్ రావు గారు.  చాలా అందగాడు. గిరజాల జుట్టు, కళ్ళకి కాటుక, పది వేళ్ళకి ఉంగరాలతో చాలా హుందాగా ఉండేవారు. చాలా సాదు స్వభావి. మా స్వరాజ్యం అత్తయ్యకి మా ముత్తాత వరాహ లక్ష్మి నరసింహం గారు ఒక ముసలి వాడి సంబంధం తెచ్చినప్పుడు మా అత్తయ్యకి బాధ కలిగి, చేసుకోనని చాలా హడావుడి చేసింది. మా నాన్న గారు అప్పటికే ఇంకా చిన్నవారే. మా ముత్తాత గారు కుదిర్చిన ముసలి పెళ్లి కొడుకు సంబంధం తిరస్కరించాక మా స్వరాజ్యం అత్తయ్యకి పెళ్లి సంబంధం కుదరటం కష్టం అయింది. ఈ రోజుల్లో ఆవిడ ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకునేవాళ్లే. కానీ ఆ రోజుల్లో ఎవ్వరూ ఆవిడతో ఏకీభవించ లేదు. ఫలితంగా చాలా సంబంధాలు మా గూడూరు తాతగారైన సుబ్బారావు గారు చూడాల్సి వచ్చింది. ఇలా సంబంధాలు వెతుకుతున్న సమయంలో మా రెండవ మామయ్యగారైన విద్యాభూషణ రావుగారి తండ్రి గారు విజయవాడ రైల్వే స్టేషన్ లో తాతగారిని కలవడం జరిగింది.మాటల్లో ఆయన కూడా తన కొడుక్కి సంబంధాలు చూస్తున్నట్టుగా చెప్పారు. మా తాతగారు మా అత్తయ్య సంగతి చెప్తే, అది విని మా అత్తయ్యను చూసి సంబంధం కుదుర్చుకున్నారు. ఆ విధంగా వారిద్దరి వివాహం జరిగింది. అప్పుడు మామయ్య గారు బొంబాయిలో పని చేస్తుండేవారు. తర్వాత బందరులో స్థిర పడి పోయారు.అలా వారిద్దరి వివాహం జరిగిందని నాకు మా రాణి వదిన ద్వారా తెలిసిన విషయం. మా స్వరాజ్యం అత్తయ్య మాటల సందర్భంలో తన పెళ్లిని గురించిన విషయం చెప్పింది. విద్యాభూషణ రావు  మామయ్య గారు బందరులో ఆంధ్ర సయింటిపిక్ కంపెనీలో పని చేసే వారు. అమ్మవారి ఉపాసన, కుండలినీ సాధన చెస్తుండే వారు. అప్పుడే నేను కొంత కుండలినీ విద్య గురించి మావయ్య ద్వారా తెలుసుకున్నాను. రాణి వదిన నాకన్నా ఒక క్లాసు సీనియర్. హిoదూ హై స్కూలు మల్టీ పర్పస్ లో చదివింది. పరీక్షా ఫలితాలు వచ్చాక న్యూ ఢిల్లీ కి శాంత అత్తయ్య దగ్గరకి వెళ్ళింది . 

         అదే విధంగా గూడూరి తాతగారు మా శాంత అత్తయ్య పెళ్లి రాఘవ రావు మామయ్య గారితో కుదిర్చారు. చిన్నప్పట్నుంచి తెలిసిన కుటుంబమే.పైగా మా నాన్నగారికి కూడా అయన స్నేహితుడే.మా నాన్నగారి చదువు, ఇద్దరు అత్తయ్యల పెళ్లిళ్లు, ఆస్తి వ్యవహారాలూ అన్నీ సక్రమంగా నాన్నగారి చదువు పూర్తి అయ్యేంతవరకు నిలబడి బాధ్యత గా కళ్ళు కనిపించని చెల్లెలిని  సపోర్ట్ చేశారు. మహానుభావుడు !!

                    మొదటి మూడు నెలలు, బందరులో నేను ఉన్నప్పుడు మా అత్తయ్యతో మాట్లాడింది లేదు. ఎందుకంటే జనగామలో మా ఇల్లు, హైదరాబాదులో మా తాత గారు వల్లూరి సూర్యనారాయణ రావు గారిల్లు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు. లోక జ్ఞానం శూన్యం. ఆంధ్రా ప్రాంతం నాకు అసలే తెలియదు. చాలా బెరుకుగా ఉండేది. రాణి వదిన ఢిల్లీకి వెళ్ళాక మేమిద్దరమే ఉండేవాళ్ళం. కాబట్టి అత్తయ్య తో మెల్లి మెల్లి గా అలవాటు పడ్డాను. ముక్తసరిగా మాట్లాడేవాడిని. మా అత్తయ్య చూపిన మాతృ ప్రేమ, మనసు నిండా ఉన్న అభిమానం, మాటల్లో వాత్సల్యం తో నాలో ఉన్న బెరుకుతనం పూర్తిగా పోయింది. ఆ అత్తయ్యతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేను.  చదువంతా క్రింది గదిలోనే ఏర్పాటు చేసింది. పడక మేడ మీది గదిలో మావయ్య గది అన్న మాట. నా బట్టలు కూడా స్వయంగా ఉతికేది. మొట్టమొదటి సారిగా నా జీవితం లో నాకు చదువుపట్ల శ్రద్ధకలిగింది. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి ఎంత కష్ట పడతారో అన్న విషయం నాకు  అర్థమైంది. మొదట్లో మేడ మీద నేను చదువుకునే టప్పుడు, మా అత్తయ్య చడీ చప్పుడు లేకుండా, నేను చదువుతున్నానా లేదా అని నిఘా వేస్తుండేది. ముందు నడక చప్పుడు విని నేను దయ్యం అని భయ పడేవాడిని. తర్వాత ఒక రోజు ధైర్యం చేసి చూస్తే, మా అత్తయ్య మెల్లిగా మెట్లు దిగుతూ కనిపించింది. పెందరాళే పడుకుంటే మా నాన్న గారు కలలో కనిపించే వారు. “ఏరా! హోమ్ వర్క్ చేసుకోకుండానే పడుకుంటున్నావా?” అని కలలో ప్రశ్నిస్తున్నట్టుగా అనుభూతి కలిగేది. అప్పటి నుంచి తెల్లవార్లూ చదివేవాడిని. అత్తయ్య చదువుకునే ఏర్పాట్లు కిందకి మార్చింది. రాత్రి పన్నెండు గంటలకోసారి హార్లిక్స్ ఇచ్చేది. “పడుకోరా! ఆరోగ్యం పాడవుతుంది”, అని మందలించేది. బందరు నేల సరస్వతి నిలయం (విద్యానిలయం) అనుకుంటాను.  అత్తయ్య మావయ్యల పట్ల నాకు అంతు లేని అభిమానం , ప్రేమ, గౌరవం కలిగాయి. కాలేజ్, ఇల్లు తప్ప వేరేధ్యాస ఉండేది కాదు. అత్తయ్యతో బోల్డన్ని కబుర్లు కూడా చెప్తూండే వాడిని. అప్పుడే మా సీత అత్తయ్య కూతురు పద్మ వదిన బందరు రావటం జరిగింది. వారిద్దరూ చాలా అభిమానంగా మాట్లాడుకునే వారు. అలాగే అత్తయ్య హైదరాబాదు వచ్చినప్పుడు మురళీ బాబాయ్ ఇంటికి వెళ్తుండేది. ఒక సారి నేను కూడా వెళ్లాను. మీనాక్షి పిన్నికి , అత్తయ్యకి ఒక అవినాభావ సంబంధం ఉండేది. నేను వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని చూడగానే మీనాక్షి పిన్ని కళ్ళల్లో ప్రేమ వర్షం కురిసేది. కళ్ళు ఆనందంతో మెరిసేవి. స్వచ్ఛమైన ప్రేమకి బాష అక్కరలేదు. మా మీనాక్షి పిన్నికి మా నాన్నగారంటే చెప్పలేనంత అభిమానం అని యిట్టె తెలుస్తుంది. మురళీ బాబాయ్ లోని మంచి లక్షణాలని పిన్ని నాతో చెప్తుండేది. బాబాయికి చాలా క్రమశిక్షణ, నిరాడంబరంగా ఉండేవాడు. నెమ్మదిగా మాట్లాడేవారు. నండూరి వారికి పుస్తకాల వారధి అనేది ఒక దగ్గర అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. సుఖబోధానంద గారి ఉపన్యాసాలు, బాబాయి గారు చదివిన CD లు మీనాక్షి పిన్ని నాకు ఇచ్చింది. బాబాయి చాలాసార్లు నవయుగ ఫిలిమ్స్ వారి చిత్రాలు చూడటానికి పాసులు ఇస్తుండేవారు. ఆయన వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించింది. వారింట్లో జరిగిన హోమానికి వచ్చిన పద్మ, రాజు వదినలని చాలా ఏళ్ళ తర్వాత చూడటం జరిగింది. కలిగిన ఆనందం అంతా అవ్యక్త స్థితిలోనే ఉండేది.

                                         అధ్యాయం 14

                     

                     శాంతత్తయ్య ,సీత అత్తయ్య, స్వరాజ్యమత్తయ్య


సీత అత్తయ్య గురించి  మా అక్కయ్య జ్ఞాపకాలు 

మా తాతగారి పెద్ద కూతురు సీత అత్తయ్య. మా అక్కయ్య గుంటూరులో ఉభయ భాషా  ప్రవీణ , శారదా నికేతనంలో చదువుతున్నప్పుడు మా పెద్ద మామయ్య భావరాజు సూర్యనారాయణ మూర్తి గారు  గుంటూరు లామ్ ఫారం  అనుకుంటాను. అగ్రికల్చరల్ సంస్థ అనుకుంటాను చాలా విశాలమైన ఆవరణలో ఉంది. అక్కడ పని చేస్తుండేవారు.    మా అక్కయ్య అచ్చం మా నాన్నగారి లాగానే ఉంటుంది. నిన్ను చూస్తే రాముడ్ని చూసినట్టుగా ఉంటుంది అని ఎప్పుడూ అనేది. చాలా ప్రేమగా, వాత్సల్యంగా, చాలా అభిమానంగా  చూసుకునేది. ప్రతి శని, ఆదివారాల్లో తన దగ్గరకు పిలిపించుకునేది. ప్రతి శనివారం కంపెనీ కారులో రాజు వదిన వచ్చి శారదానికేతనం నుండి  అక్కయ్యని తన వెంట వాళ్ళింటికి తీసుకుని వెళ్తుండేది.  శని, ఆదివారాలు మీనాక్షి, పద్మ, రాజు వదినలతో కబుర్లు, ఆటలతో గడిపి, సోమవారం  పొద్దున్నే మళ్ళీ కాలేజీ లో అక్కయ్యని .దింపేవాళ్లు. మీనాక్షి వదిన   కాస్త ఆట పట్టిస్తుండేది. పద్మ వదిన కాస్త తక్కువగా మాట్లాడేది. రాజు వదినతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేది అక్కయ్య. అత్తయ్య స్టూల్  మీద కూర్చుని వంట చేస్తుండేది. పని వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడేది. మామయ్యగారు గలగలా చాలా హుషారుగా మాట్లాడుతుండేవారు. అక్కయ్యని చూడగానే సీత అత్తయ్య కళ్ళలో ఎంతో ప్రేమ వెల్లి విరిసేది. కళ్ళు మెరుస్తుండేవి. మోస్ట్ లవబుల్ అత్తయ్య అని అక్కయ్య చెప్పింది. మా అక్కయ్యలో తన తమ్ముడ్నిచూసుకుంటుండేది. తమ్ముడ్ని చూడడానికి ఒక్కసారే జనగామకు వచ్చింది. తమ్ముడు ఎంత కష్టపడి పోతున్నాడో అని బాధ పడుతుండేది. అనారోగ్య కారణంతో గుంటూరు హాస్పిటల్లో చేర్పించినప్పుడు తమ్ముడ్ని చూసినట్టుగా ఉంటుందని అక్కయ్యని పిలిపించుకుంది. అక్కయ్యని దగ్గరగా పిలిచి, కూర్చోపెట్టుకుని, నవ్వుతూ, తృప్తిగా కన్ను మూసింది.  నాతో చెప్తుంటే అక్కయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. సీత అత్తయ్య ఇంగ్లీష్ లో పద్యాలు కూడా రాస్తుండేది భగవద్గీతపై  కామెంట్స్ ను రాసుకుంటుండేది. ఇవన్నీ పెళ్లి కాక ముందు చేస్తుండేది. ఇవన్నీ మా బందరు అత్తయ్య మా అక్కయ్య రాసింది అని భద్రంగా దాచుకుంది అని రాణి వదిన చెప్పింది. సీత అత్తయ్య మా నాన్నగారికి అక్కయ్య, స్వరాజ్య లక్ష్మి మరియూ శాంత అత్తయ్యలు చెల్లెళ్ళు   వీరు ముగ్గురు కూడా మా నాన్నగారికి ఎనలేని ప్రేమని పంచి పెట్టారు. తండ్రి  పోయి వీళ్ళందరూ అనాథలయినప్పుడు మా నాన్నగారు ముత్తాత వరాహ లక్ష్మీ నరసింహం గారి నుంచి పొందవలసిన ప్రేమను అక్క చెల్లెళ్ళ దగ్గర్నుంచి పొందారు.


శాంత అత్తయ్య, ఫణి బావ

శాంత అత్తయ్య personification of positive లవ్ అండ్ ఎనర్జీ. అక్కయ్య ఢిల్లీలో శాంత అత్తయ్య దగ్గర మూడు నెలలపాటు అక్కడే ఉండింది. అక్కడ అందరితో చాలా సరదాగా గడిపింది. అంటే ఫణి బావ, ప్రవాలి వదిన, రాణి వదిన, ఉమ, పెద్దన్నయ్యల తో అన్న మాట. రాఘవరావు మామయ్య గారు రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్తుండేవారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ లో కూడా చక్కగా అన్ని సబ్జక్ట్స్ నేర్పిస్తుండేవారని అక్కయ్య చెప్పింది.

స్వరాజ్యం అత్తయ్య ధైర్యంగా, నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడుతుంది అని అక్కయ్య చెప్పింది. ముగ్గురికీ కూడా  అన్న అంటే మా నాన్నగారంటే అమితమైన  ప్రేమ.


నేను వరంగలు లో ఉన్నప్పుడు  నా శ్రీమతి సీతకి ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం  లో ఆడిషన్ కి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బహుశా అది 1979 వ సంవత్సరంలో అనుకుంటాను. అంతకుముందు చిన్నప్పట్నుంచీ సీత ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే టి .వి. దూరదర్శన్ కేంద్రంలో కూడా కాంట్రాక్టు బేసిస్ మీద యాంకరింగ్ చేసింది. ఆల్  ఇండియా రేడియో ఆడిషన్ రాగానే సీత మా అమ్మతో పాటు విజయవాడ కి  వెళ్ళటం జరిగింది. అక్కడ పున్నమ్మ తోటలో మొట్టమొదటి సారిగా మా నండూరి  రామ్ మోహన్ బాబాయి గారి ఇంటికి వెళ్ళటం జరిగింది.  వాళ్లింట్లోనే  ఉన్నారు. రెండు రోజుల తర్వాత నేను , సీత వాళ్ళ ఆఖరి అన్నయ్య అంజు అంటాం కలిసి విజయవాడ బాబాయి గారింటికి వెళ్లాం. అక్కడ బాబాయి గారింటిలో

                                 


నండూరి రాం మోహన్ రావు బాబాయ్ గారు,సీనియర్ జర్నలిస్ట్

ఒక పండుగ వాతావరణం లాగా ఉండాలి. మా అమ్మ కొన్నేళ్ల క్రితం ఆరుగొలనులో మరుదులందరితో కలిసి ఉంది కదా! అప్పుడు వీళ్లంతా మా అమ్మ చుట్టూ "వదినా", "వదినా" అంటూ తిరుగుతుండేవారు. రోజూ సాయంత్రం డాబా మీద కూర్చునేవాళ్ళు. మా అమ్మ చేత రోజూ పాటలు పాడించుకుంటూ వినే వాళ్ళు. 25 ఏళ్ళ తర్వాత మా అమ్మని చూసి మా బాబాయి గారు, పిన్ని ఎంతో సంతోషించారు. చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్నారు. వారి పిల్లలు నిర్మల  సత్యవతి కూడా చాలా ఆప్యాయంగా, ప్రేమగా మొదటిసారిగా మా అమ్మని చూస్తున్నా ఎప్పటినుంచో మా అమ్మతో పరిచయం ఉన్నట్టుగా కలిసి పోయారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆరుగొలనులో బాబాయి గారు రాసిన పాటలు మళ్ళీ మా అమ్మ పాడింది. మా భాష గానమ్ము ...., తర్వాత యవ్వనమా ..... ఓ..ఓ.. ఓ..పువ్వనమా ...., ఈ పాటలు అమ్మ పాడుతుంటే రామ్మోహన్ బాబాయి గారు ఆశ్చర్య పోయారు. అంతకంటే ఎక్కువగా ఆనందించారు. వదినా! ఎప్పుడో ఆరుగొలనులో పాడిన ఈ పాటలు నీకు ఇంకా గుర్తున్నాయా? అని ఆశ్చర్యంగా అడిగారు. పిల్లలందరూ కూడా అమ్మ పాటలు విని ఆనందించారు. లోగడ నేను చెప్పినట్టుగా ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో అప్పట్లో బాబాయి రాసిన టామ్ సాయర్ , ఎనభై రోజుల్లో భూ ప్రదక్షిణంముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు, పార్థు బాబాయిగారు రాసిన రాంబాబు డైరీ చదువుతుండేవాళ్ళం. మా అమ్మ వీళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్తుండేది.మా అందరికి నండూరి వంశంలో పుట్టినందుకు గర్వంగా, చాలా సంతోషంగా ఉంది . రేడియో నాటిక గణపతి కూడా మా అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. అందులో నండూరి సుబ్బారావు బాబాయి గారు గణపతి పాత్రలో నటించారు. మేమందరం రేడియో చుట్టూ గుమిగూడే వాళ్ళం ఆ నాటకం వినడానికి. నేను అన్ని రోజుల తర్వాత వచ్చినందుకు బాబాయి ఎంతో సంతోషించారు. కాస్త ముందే సీత ఆడిషన్ కోసం వెళ్లాం కాబట్టి సుబ్బారావు బాబాయి గారు ఎలా చదవాలి, వాయిస్ modulation , ఎక్కడ మాట ఆపాలి,  ఇలా ఒకటి కాదు చాలా ఓపికగా ఎన్నో విషయాలలో శిక్షణ ఇచ్చి ఆడిషన్ కి తయారు చేశారుమా రాముడన్నయ్య  పిల్లలు, మా పెద్ద నాన్న శివరావు గారి పిల్లలని  సుబ్బారావు బాబాయ్ గారు కూడా ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా చూసారు. అంతకు ముందు కూడా నేను ప్రశాంత్ అన్నయ్యతో పాటు వాళ్ళిoటికి వెళ్లాను. అప్పట్లో ఆయన మా తాతగారి గురించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. నండూరి రామ్ మోహన్ బాబాయ్ గారిని ఆల్ ఇండియా రేడియో, విజయవాడలో జడ్జీగా పిలిచారు. సీత ఆడిషన్ చక్కగా పూర్తి చేసింది.  రామ్ మోహన్ బాబాయ్ గారు చాలా గట్టిగా రికమెండ్ చేశారు. మరి సుబ్బారావు బాబాయ్ గారు కూడా రికమెండ్ చేసారు. ఫలితం ఏమైందంటే ఆ ఉద్యోగం వేరే వారికి అంటే ముందరే  సెలెక్ట్ చేసుకున్న కాండిడేట్ కి ఇచ్చారు. నేనక్కడే ఉన్నాను రామ్ మోహన్ బాబాయ్ గారికి ఎంత కోపం వచ్చిందో చెప్పలేం. అబ్బా ! ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది. వాయిస్ modulation కూడా ఎంత బాగా చేసింది. ఉచ్చారణ చాలా చాలా బాగుంది అయినా ఏం చేస్తాం? అన్నీ రాజకీయాలే ! అని బాధ పడ్డారు. నండూరి సుబ్బారావు బాబాయ్ గారు కూడా చాలా బాధ పడ్డారు. ఏం చేస్తాం? పరిస్థితులన్నీ  మారిపోయాయి. ఉఛ్ఛారణ సరిగ్గా లేకపోయినా, తెలుగు భాష రాకపోయినా అలాంటివారికే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు అని వారిద్దరూ సానుభూతి వ్యక్త పరిచారు. ఆ సందర్భంలోనే చెల్లెలు నిర్మల ఇంటికి వెళ్లాం. పూర్ణచంద్ర రావు తో చాలా సేపు మాట్లాడాను. ఇదివరకు చెప్పినట్టుగా నేను, పూర్ణచంద్ర రావు ఈస్ట్ ఇండియా కంపెనీ లో కలిసి పని చేసాము. ఆయన విజయవాడలో ఇంచార్జి గా ఉండేవారు. నేను హైద్రాబాద్ బ్రాంచ్ లో పని చేస్తుండేవాడిని. తర్వాత ఇంకొకసారి సీత అత్తయ్య అంటే రామ్ మోహన్ బాబాయి గారి చెల్లెలు వాళ్ళింట్లో కలిసాను అని లీలగా గుర్తు. సీత అత్తయ్య కూతురే అనుకుంటాను నాకు సరిగ్గా తెలియదు. చాలా అందంగా ఉంటుంది. చాలా శ్రావ్యంగా క్లాసికల్ పాట పాడి వినిపించింది. చాలా బాగా పాడింది. అక్కడ అప్పుడు గడిపింది కొన్ని రోజులైనా అవి జీవితంలో ఎన్నడూ మరువలేని, మధురమైన  స్మృతులుగా నిలిచిపోయాయి. బాబాయ్ చాలా సంతోషించారు. తన ఆటో గ్రాఫ్ తో హరివిల్లుఅనే పుస్తకం ఇచ్చారు. మా అందరికీ "మా భాష గానమ్ము", "యవ్వనమా" పాటలు వచ్చు, నేను మా అమ్మ దగ్గర చిన్నప్పుడే మా భాష  గానమ్ము పాట నేర్చుకున్నాను. "యవ్వనమా" పాట కష్టంగా ఉండాలి. అల్ ఇండియా రేడియో ఆర్టిస్టు శ్రీమతి మాలతి పద్మనాభ రావు గారి ముందు "మా  భాష గానమ్ము " పాట పాడాను. అప్పుడు ఆవిడ నన్ను ఆ పాట అర్థం అడిగింది. నాకు అప్పట్లో ఆ పాట  అర్థం తెలియదు. అందుకని నాకు తెలియదని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు ఆ పాట యొక్క భావం తెలుసును. అది ఆధ్యాత్మిక పరంగాను, చాలా లోతైన విషయాలను గురించి తెలుపుతుంది. రామ్ మోహన్ బాబాయ్ గారి మానసిక స్థితి ఎంత పరిపక్వత చెందిందో అంచనా వేయటం మనకి చాలా కష్టం. ఇప్పుడు కూడా వయస్సులో పెద్ద వాళ్ళు ఆ పాటకి అర్థం చెప్పగలరా అన్నది నాకు అనుమానాస్పదమే. బహుశా చెప్పలేరు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లే ఈ పాటని అర్థం చేసుకోగలరు. వాళ్ళందరినీ చూసాక, నా భార్య సీతకి కూడా చాలా మంచి అభిప్రాయం కలిగింది. మా నాన్నగారు పోయినప్పుడు అందరి కన్నా ముందు మా రామ్ మోహన్ బాబాయ్ గారి దగ్గర్నుంచే హన్మకొండ  అడ్రస్ కి  టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నాన్నగారు నాతో పాటు హన్మకొండలో ఉన్నారు. నాన్నగారి 


                           


కార్తీక్ (రమణి కొడుకు), సాయిరాం,శ్రీకాంత్,నీరజ(లాలస పిల్లలు), స్మిత(విజ్జి కూతురు),సుధ(చిన్న అన్నయ్య కూతురు)

ప్రాణం వైజాగ్ లో అక్కయ్య దగ్గర పోయినా కర్మకాండ పెద్దన్నయ్య, నేను కలిసి హన్మకొండ లో చేసాం. మా నండూరి వారి ప్రత్యేకత ఏమిటో నాకు తెలియదు కానీ కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఉత్తరాలు రాసుకోవటం ఉండదు కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది, చక్కగా, ఆనందంగా మాట్లాడుకుంటాం. నండూరి వాళ్ళు అనగానే  మా అందరి కణ కణంలో సంతోషం, ఆనందం పెల్లుబుకుతుంది. అలాగే మాకు నండూరి వారి  అల్లుడైన ముళ్ళపూడి వెంకటరమణ  గారంటే కూడా మనస్సులో ఒక గాఢమైన ముద్ర పడిపోయింది. ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో రమణ గారి బుడుగు ప్రతివారం వస్తుండేది. బుడుగులో పిచుకలు మాట్లాడుకుంటుండేవి. మా  పక్క ఇంట్లో పిచుకలు వస్తుండేవి. అది చదివినాక నేను కూడా ఆ పిచుకలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండేవాడిని. ముఖ్యంగా ఆయన పిల్లలకోసం రాసేవారు. అవి పిల్లలనే  కాకుండా పెద్దవాళ్ళని కూడా చాలా ప్రభావితం చేశాయి. నిజానికి మా రామ్ మోహన్ బాబాయి గారి పేరు రామ్ మోహన్ కాకుండా సమ్మోహన రాము లేక సమ్మోహన రాంబాబు అని పెట్టి ఉంటే బాగుండేది అని నేననుకుంటాను. అప్పట్లో ఉన్న మేధావులందరూ ఆయన రాసిన సాహిత్యాన్ని మేము చదివాము అని చెప్పుకుంటారు. చిన్న జీయర్ స్వామి గారు కూడా చెప్తుంటారు టామ్  సాయర్, ఎనభై రోజుల్లో భూ ప్రదక్షిణం. కాంచన ద్వీపం, ఇవన్నీ చదివానని . చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రచనలన్నీ చదివామని  చెప్తుంటారు. 83 సంవత్సరాల వయసున్న మా ఈస్ట్ ఇండియా కంపెనీ మేనేజర్ ఎన్. ఎల్. శాస్త్రి గారు కూడా ఇవన్నీ నేను చదివాను అని  ఎప్పుడూ చెప్తుంటారు. ఈ నవలలు  చదవటం వల్ల మాకు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. అంతే కాకుండా రామ్ మోహన్ బాబాయ్ గారు ఒక అద్భుతమైనటువంటి, బహుశా నేననుకుంటాను ఆయన పూర్వజన్మ లో తపస్సు చేసి ఉంటారు, పరిశోధన చేసి ఉంటారు అందుకనే ఆయన విశ్వరూపం, విశ్వ దర్శనం, నరావతారం వంటి అద్భుతమైన, సైన్సుకి సంబంధించిన  గ్రంథాలు రాశారు. మరి బాబాయ్ గారు సైన్సు చదవలేదు. ఆర్ట్స్ B.A.  చదివారు. అలాంటప్పుడు అంత క్లిష్ష్టతరమైన, అద్భుతమైన సైన్సుకు సంబంధించిన విషయాలు విజ్ఞానపరంగా ఈ గ్రంథాలలో ఎలా  చెప్పగలిగారు? అలా చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అది లోపల మన జన్యు కణాల్లో ఎన్నో జన్మలనుండి చదివినటువంటి  శాస్త్రపరమైన విజ్ఞానమంతా ఆయనకి ఈ జన్మలో వచ్చాయని నేను భావిస్తాను. అటువంటి ప్రతిభాశాలి ఈ భూమ్మీద మళ్ళీ మళ్ళీ దొరకడం చాలా కష్టం.. అంతే కాకుండా మన ప్రధాని P.V, నరసింహా రావు గారి దగ్గర్నుంచి మంచి “Best Journalist” గా బహుమతిని అందుకుని మా నండూరి వంశానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారు. అందుకనే నాకు నండూరి రామ్మోహన్ నండూరి సమ్మోహన రాం బాబాయంటే చాలా గౌరవం, ఇష్టం. 

                 అలాగే ముఖ్యంగా చెల్లెలు నిర్మల  అన్నా నాకు చాలా ఇష్టం. నేను విజయవాడలో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చాలా సమయం గడిపాను. మా అబ్బాయి కమల్ పెళ్ళికి పూర్ణచంద్ర రావు, నిర్మల ఇద్దరూ కూడా వచ్చారు. వాళ్ళ ప్రభావం చిన్నప్పట్నుంచీ మా మీద ఉందన్నమాట. ఇవన్నీ మనస్ఫూర్తిగా మా హృదయాలోంచి వస్తున్న మాటలు. మా ఆఖరి చెల్లెలు రమణి వరకు ఈ పుస్తకాలు మేమందరం మా చిన్నతనంలో చదువుతుండేవాళ్ళం.  ఆయన నండూరివారి గురించి, అంటే ఆరుగొలను గురించి  అపుడప్పుడు కొంచెం చెప్పినా కూడా ఆయనకున్న ప్రేమని, అభిమానాన్ని మనస్సులోనే పెట్టుకునేవారు. నేను మా నాన్నగారిని ఒక మహర్షిలాగానే భావిస్తాను. చాలా తక్కువగా మాట్లాడుతారు. మాట్లాడినా, ఆ ఒక్క వాక్యంలో అంతరార్థం, సందేశం అన్నీ  ఉంటాయి.

నేను అనుకోకుండా హైద్రాబాదు వచ్చి, మొదట బాకారం లో ఉన్నాను తర్వాత మాఱేడు పల్లి, సికింద్రాబాదు లో స్థిరపడి పోయాను. మా ఇంటికి దగ్గర్లోనే మురళీ బాబాయ్ గారు, మీనాక్షి పిన్ని వాళ్ళు ఉండేవారు. మా అమ్మ తరచుగా వాళ్ళింటికి మా పెద్ద అబ్బాయి లాహిరికాంత్ ని తీసుకుని వెళ్తుండేది.

ఒక సారి స్వరాజ్యం అత్తయ్య కూడా వచ్చింది. నేను గమనించింది ఏమిటంటే మీనాక్షి పిన్ని, మా అమ్మ తో చాలా ప్రేమగా, సంస్కారవంతంగా మాట్లాడుతుండేది.  ఆ తర్వాత పదిహేడేళ్లు ఆఫ్రికాలో ఉండి వచ్చాక మురళీ బాబాయ్ తో కొంచెం చనువు ఏర్పడింది.అంతకుమునుపు హోటల్ సరోవర్ లో ఏదో ఒక పెళ్ళికి వెళ్లాం. మురళీ బాబాయ్ కాస్త మితభాషి లాగా కనిపించేవారు. కానీ నేను కాస్త పెద్దవాడిని అయినాక బాబాయ్ కి నాకు పుస్తకాల గురించి చర్చ జరిగింది. నేను చెప్పిన ఆధ్యాత్మిక  విషయాలు ఆయన శ్రద్ధగా, ఆసక్తికరం గా విన్నారు.  తరువాత తరువాత నాకు బాబాయ్ తో చనువు పెరిగాక , నేను ఆఫ్రికా లో నా అనుభవాల గురించి చెప్పాక , "సాయిరాం ! నీవు మా సొసైటీ లో మాట్లాడు. మేము ప్రతి  ఆదివారం కలుస్తాం.ఒకటో  రెండో ఉపన్యాసాలు ఉంటాయి. నాకు చెప్పిన విషయాలన్నీ అక్కడ అందరికీ చెప్తే బాగుంటుంది కదా !" అని అడిగారు. అది విని నేను ఆశ్చర్యపోయాను. 

మీనాక్షి పిన్ని(మా పెద్దత్తయ్య కూతురు), మురళి బాబాయ్ గారు చిన్న తాతగారి కొడుకు మా నాన్నగారికి తమ్ముడు)

        

నేనేదో నా ధోరణిలో చెప్పుకుంటూ వెళ్తుంటే, ఒక పెద్ద మనిషి హుందాగా ఉండి, మితభాషిగా ఉంటె వారి ముందర మనం మాట్లాడలేం. బాబాయ్ నా స్థాయికి దిగి నాతో  చక్కగా మాట్లాడుతుంటే నా బెరుకు పోయి  నేనేదో  నాన్నగారితో కానీ స్నేహితుడితో మాట్లాడినట్టుగానే ఎటువంటి సంకోచం లేకుండా చాలా అంటే చాలా చక్కగా అనిపించింది.  ఆయన ఎంతో   సిన్సియర్ గా మా సొసైటీ లో మాట్లాడు అని  చెప్తే నాకు అందరి ముందర మాట్లాడే ధైర్యం రాలేదు. మీనాక్షి పిన్ని కూడా బాబాయ్ కంటే ఎక్కువగా బాబాయ్ గురించి గొప్పగా చెప్పేది. చాలా క్రమశిక్షణ గా ఉంటారు. బాగా కష్టపడి పని చేస్తారు, అనవసరమైన దుబారా ఖర్చులు చేయరు అని గొప్ప ఆదర్శాలు ఉన్న వ్యక్తి అని చెప్తుండేది. బాబాయ్ సుఖబోధానంద గారు రాసిన పుస్తకాలకి వ్యాఖ్యానం రాశారు. అది ఆయన ఎంత బాగా చదివారంటే చెప్పలేమని మీనాక్షి పిన్ని  చెప్పింది. అంతకు ముందే బాబాయ్ చిన్నప్పుడు నండూరి మురళి అనే పేరుతో ఆల్ ఇండియా రేడియో లో నాటకాల్లో పాల్గొంటుండేవాడని నాకు అప్పుడు తెలిసింది. అలాగే శ్రీదేవి అత్తయ్య కూడా నండూరి సుబ్బారావు బాబాయ్ రాసిన నాటకాల్లో పాల్గొనేది అని తెలిసింది. ఆల్ ఇండియా రేడియో లో కార్యక్రమాలు చేసేవారని తెలిసింది.         

                                                    అధ్యాయం 15

నండూరి వారి గెట్ టు గెథెర్



సాయిరాం, సీత ముళ్ళపూడి వెంకటరమణ మామయ్య గారు, శ్రీదేవిఅత్తయ్య



పార్థు బాబాయ్ గారు, సీత, సాయిరాం, మురళి బాబాయ్ గారు

నండూరి వారి గెట్ టు గెథెర్ కి పిలిచారు. శ్రీదేవి అత్తయ్య వాళ్ళింట్లో ఆ గెట్ టు గెథెర్ కి నేను, సీత, ప్రశాంత్ అన్నయ్య, జ్యోత్స్న వదిన వెళ్లాం. మొట్టమొదటిసారిగా మా నండూరి వాళ్ళందరిని చూడటం జరిగింది. లీల అత్తయ్య పేరు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. మొదటిసారిగా లీల అత్తయ్య కూతురు భట్టిప్రోలు విజయలక్ష్మిని చూసాను. మొదటిసారిగా విజయలక్ష్మి వదిన తో మాట్లాడుతున్నా ఎప్పట్నుంచో పరిచయమున్నట్లుగా అనిపించింది. అలాగే ఇంకొకసారి మా బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళిలో విజయలక్ష్మి వదిన కనిపించింది. అప్పుడు కూడా మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. వదినతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. విజయలక్ష్మి వదిన ఆ శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రంలో అమ్మ నామాల వివరణ ఎంత  అద్భుతంగా, ఎంత చక్కగా చెప్పిందంటే మాటల్లో మనం చెప్పలేం. ఇలాంటివి చెప్పటం అంటే చాలా కష్టం. చాలా శ్రద్ధగా, నిష్ఠగా, సాకార నిరాకార పర తత్వాన్ని సాకారంగా ఎంత చక్కగా సామాన్య జనులకి అర్థమయ్యేటట్టుగా వివరించిందంటే మెచ్చుకోదగ్గ విషయం. దాని  గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే మనకి పెద్దవాళ్ళిచ్చిన వారసత్వపు లక్షణాలు విజయలక్ష్మి వదినకి వచ్చాయని నాకు అనిపిస్తుంది.  ఇంత చిన్న వయసులో ఆవిడ సమాజానికి పనికి వచ్చే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రాసింది అంటే అది నిజంగా ఆవిడ పూర్వ జన్మ  సంస్కారమే ప్లస్ నండూరి జన్యుకణాల్లో ఉన్న సకారాత్మక శక్తి  అని నేను భావిస్తాను. 

స్వచ్ఛమైన జర్నలిజానికి మారు పేరు శ్రీ నండూరి రామ్ మోహన రావు గారు. చిన్న కుగ్రామమైన ఆరుగొలను లో పుట్టి, దేశవిదేశాల్లో నండూరి వంశ పతాకాన్ని దిగ్విజయంగా ఎగురవేసిన అఖండ మేధావి, సవ్యసాచి. రామ్మోహన రావు గారు సమ్మోహన రావు అన్న పేరుని సార్థకం చేసిన చిరస్మరణీయుడు. ఎందరో మహానుభావులు.  భౌతికంగా మనకి లేకపోయినా అనేక లక్షలాది మంది దేశ వాసుల హృదయాల్లోనే కాక,  విదేశాలలోని లక్షలాది మంది మనస్సులలో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక మహానుభావుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతుడు. నీతీ, నిజాయతీ, సత్యాన్ని మాత్రమే సాహసించి వ్రాయగలిగిన ఒక నిజాయతీ జర్నలిస్టు అని మేధావులచే ప్రశంసించబడినవాడు. 

మా రాణి వదిన జ్ఞాపకాలు 

                 

                        పెద్దన్నయ్య , రాణి వదిన

మా రాణి వదిన చిన్నప్పుడు స్వరాజ్యం అత్తయ్యతో పాటు ఆరుగొలనుకి తరచూ వెళ్ళుతుండేది. అక్కడ ఉన్నప్పుడు చిన్న తాతగారు సాయంత్రం అయ్యేసరికి పిల్లందరినీ కూర్చో పెట్టుకుని కథలు చెప్తుండేవారు. చాలా ఆసక్తికరంగా ఆ కథలు ఉండేవి. పిల్లలందరూ ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు తాతయ్యా కథలు చెప్తారా అని ఎదురు చూస్తూండేవారు. ఆయన రాగానే అందరూ కథ చెప్పండి అని ఆయన చుట్టుతా  కూర్చునే వాళ్ళు. ఆయనకి అస్సలు కోపం లేదు, చాలా సరదాగా ఉండేవారని రాణి వదిన చెప్పింది. అలాగే శంకరం బాబాయ్ గారు ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు శాంత అత్తయ్యకి ఒక చీర పెట్టాడు. ఆ చీరని మా తమ్ముడు పెట్టాడు, మా తమ్ముడు పెట్టాడు అని పలుమార్లు అనుకుంది. పుట్టిన రోజునో, ఏదో పండుగ పూటనో సంతోషంగా తమ్ముడు పెట్టిన చీర అని గుర్తు తెచ్చుకుంటూ ఆ చీర కట్టుకుంది. పైగా అత్తయ్య ప్రాణం  పోయిన రోజున ఆవిడ ఒంటి మీద తమ్ముడు పెట్టిన చీరె ఉండాలి.  

       ఒక సారి మా బామ్మ శాంత అత్తయ్యను పురుటి కోసం బొంబాయి నుండి వైజాగ్ కి తీసుకుని వస్తుండాలి. విజయవాడలో నర్సు బాబాయ్ గారు కలిసి ఆయన కూడా వైజాగ్ దాకా వస్తానని రైలెక్కారు. మధ్యలోనే సామర్లకోట స్టేషన్లో మా రాణి వదిన మా తాతగారి లాగానే                   ఏడవ నెలలో రైల్లో పుట్టింది. సామర్ల కోట హాస్పిటల్ లో అడ్మిట్ చేసి తర్వాత వైజాగ్ లో వారిద్దరినీ దింపారు. 

మన నండూరి వంశానికి మూలం ఆరుగొలనే కదా ! అంటే మన వంశం అక్కడనుంచే మొదలయింది. కానీ మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, అక్కయ్య,మా రాణి వదిన అంటే మా శాంత అత్తయ్య కూతురు కానీ స్వరాజ్యం అత్తయ్య పెంచుకుంది. తను నాకన్నా ఒక ఏడాది పెద్దది వీళ్ళందరికీ చాలా చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా చాలా విషయాలు మీ అందరికీ  తెలియవు. బహుశా మా అత్తయ్యల గురించి కొంచెం తెలుసేమో కానీ మా కుటుంబం గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. మా నాన్నగారు జనగామలో స్థిరపడి పోయాక ఆరుగొలను వైపు  వెళ్ళ లేదు. రాకపోకలు లేవు. ఎవరి జీవితాలలో వారు మునిగిపోయారు. అప్పుడప్పుడు నండూరి వాళ్ళ కబుర్లు చెప్పుకోవడం, పత్రికలలో సీరియల్స్ చదవటం, వాటి గురించి చర్చించుకోవటం వల్ల అందరి గురించిన విషయాలు మాకు తెలుసును కానీ ప్రత్యక్షంగా ఎవరినీ కలవలేదు. మా గురించి ఒక్కొక్కళ్ళని నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. మేము మొత్తo ఎనిమిది మంది పిల్లలం . వరుసగా శివ ఫణి  రాజ్, శివ ప్రశాంత్, లక్ష్మీ  ప్రసన్న కుమారి, నేను సాయిరాం, సూర్యలాలస, విజయ లక్ష్మి, దుర్గేశ్ నందిని, వెంకట రమణి. ముందు ఆడపిల్లల్ని పరిచయం చేస్తాను. ఆడపిల్లల్లో ప్రసన్నక్కయ్య పెద్దది.

మా ప్రసన్నక్కయ్య: ప్రసన్నక్క య్య అచ్చూ మా నాన్న గారి లాగానే చాలా సున్నితంగా, నాజుకుగా, చాలా అందంగా ఉంటుంది. క్రమశిక్షణకి మారుపేరు. చదువుల్లో, ఆటల్లో చాలా చురుకు గా ఉంటుంది. నామీద మరియు మా అక్క య్య మీద విశ్వ నాధ వారియొక్క ప్రభావం ఎంతో ఉంది. తరచూ మేము                  

సాయిరాం, సీత ,ఎడమవైపు నుంచి అపర్ణ (అక్కయ్య కూతురు), బిందు మాధవి(పెద్దన్నయ్య కూతురు), సుధా ప్రశాంత్ (చిన్న అన్నయ్య కూతురు)                                      అక్కయ్య

ఆయన రచనల గురించి ఎంతో విశ్లేషణ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో మా అమ్మ, నాన్న గారి పుణ్యం వలన వందల వేల సంఖ్యల్లో తెలుగు హింది, ఇంగ్లీష్, పుస్తకాలు, వార, మాసపత్రికలు ఉండేవి. మేమందరం కూడా పుసక్త పఠనాన్ని మా జీవితాల్లో ఒక ప్రధాన అంశంగా భావించే వాళ్ళ o. సహజంగానే ఆడపిల్లలకి సంగీతమో, సంప్రదాయ నాట్యమో నేర్పించాలని అనుకుంటూ ఉంటారు. అవి నేర్పించేవారు మా ఊరు జనగామలో ఎవరూ లేరు. కాబట్టి మా అమ్మకి పెద్దమ్మ   అయిన అన్నపూర్ణమ్మ గారి ప్రోత్సాహంతో మా అక్కయ్య గుంటూరు కి వెళ్లి ఆవిడ పర్యవేక్షణలో భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత జనగామలో నే తన  చదువుని  కోన సాగించింది. H.S.C లో చాలా మంచి మార్కులు సాధించింది. అలాగే హింది  పీజీ వరకు చదివి సెంటర్ లో ఫస్ట్ మార్కు సాధించింది. కంపెనీలో  ఆంగ్లం నుంచి రష్యన్  భాషలోకి అతిగోప్య మైన సాంకేతికపర మైనట్టి అంశాలను తర్జుమా చేసేది. అందుకోసం బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి ఆ సాంకేతిక పదాలు చదివి, అర్థం చేసుకుంటూ ఉండేది. అక్కడ కూడా పై అధికారుల మన్ననలను, ప్రశంసలను పొంది, తన ప్రత్యేకతను చాటుకుంది. ఎం.ఏ. ఆంధ్రా యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అంతర్జాతీయ శ్రేణిలో జైన మతాని కి సంబంధంచిన రెండు ఆధ్యాత్మిక గ్రంథాలను గుజరాతీ భాషనుంచి ఆంగ్లంలోకి అనువాదించి పెద్దలందరిచేత ప్రశంసలను అందుకుంది. ప్రసన్నక్కయ్య గుంటూరు లో భరతనాట్యం తో పాటు ఉభయ భాషా ప్రవీణ అంటే తెలుగు, సంస్కృత భాషలలో ఉత్తీర్ణురాలైంది. సంస్కృతంలోని శ్లోకాలకు తెలుగులో అర్థాలు చెప్తుండేది. హైద్రాబాదులో పుల్లా రెడ్డి కాలేజీ లో డిగ్రీ విద్యార్థులకి విద్యాబోధన చేసి, విద్యార్థులనుంచి, యాజమాన్యం వరకు ఎన్నో ప్రశంసలను పొందింది. ఎప్పుడు చాలా చలాకీగా, సరదాగా ఉంటూ హాస్యాన్ని  పండించే కథలు రాస్తుంటుంది.వాతావరణాన్ని యిట్టె ఆహ్లాదకరంగా మార్చేస్తుంటుంది. చాలా సీదాసాదాగా ఉంటుంది. చదువులోనే కాక వక్తృత్వ పోటీలు, ఎన్నో ఆటల్లో బహుమతులు గెలుచుకుంది.

         నా తర్వాత నా చెల్లెలు సూర్యలాలస. అది బి.ఎస్.సి మొదటి సంవత్సరం పూర్తి చేసుకోగానే పెళ్లి చేసేశారు. అది పెళ్లి అయ్యాక బి.ఏ. చదివింది. పెళ్లి నాటికే అది కూడా అక్కయ్య తో కలిసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ , మద్రాసు నుండి హిందీ భాషా ప్రవీణ పూర్తి చేసింది. అది పెళ్లి అయినా మర్నాడే రెండు రోజులు హిందీ ప్రవీణ సెకండ్ పార్ట్ పరీక్ష రాసింది అక్కయ్య తో పాటు. తర్వాత ఎం.ఏ., ఆ తర్వాత   

                   

లాలస, కొడుకు శ్రీకాంత్ ,విజ్జి, సాయిరాం, దుర్గ,      నీరజ(లాలస కూతురు),గౌరవనీయులైన ప్రెసిడెంట్ 

వెనుక రమణి, స్నేహితులు                                      శ్రీ ఆర్.వెంకట్రామన్                                                    


బి.ఎడ్ కూడా పూర్తి చేసింది. అలాగే బి.ఎడ్ పరీక్షలు ఐదు రోజులుంటే మొదటి రెండు రోజులు పేపర్రాసి, ౩వ రోజు ఆదివారం కావడంతో కూతురి పెళ్లి చేసి , పంపి మిగతా మూడు రోజులు కూడా పరీక్ష రాసి థియరీ లో ఫస్ట్ క్లాసు, ప్రాక్టీకల్స్ బి గ్రేడ్ తో పాస్ అయింది.  అక్కడ ముంబయి లో డొంబివలి  అనే ప్రాంతం థానా డిస్ట్రిక్ట్ లో హై స్కూల్ చేసి, దాదాపు ౩౦ ఏళ్ళు గడిపింది. చాలా అద్భుతంగా నడిపింది. 

దుర్గ, సీత కక్కి, విజ్జి, లాలస, అమ్మ,రమణి, శ్రీదేవి( సుశీల పిన్ని కూతురు), ముందు వరుసలో మాలతి (పద్మ పిన్ని కూతురు), అంజమ్మ పనమ్మాయి కూతురు



స్కూల్ చిన్నదైనా మంచి పేరున్న స్కూలుగా తయారు చేసింది. నేను నైరోబీలో ఉన్నప్పుడు ఒక సారి అనుకోకుండా వాళ్ళ స్కూల్ వార్షికోత్సవ  ప్రోగ్రాం కోసం నన్నే ముఖ్య అతిథిగా మాట్లాడుకున్నారు. ఆ ప్రోగ్రాములు, పిల్లలు ప్రదర్శించిన ప్రతి ఐటెం కూడా మన హైందవ సంస్కృతీ, సభ్యతలు రిఫ్లెక్ట్ అవుతుండాలి. ఒక ఆదర్శం , ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్. వీటన్నిటీ వెనక మా బావగారు శైలేంద్ర మూల 

 

నీరజ కొడుకు వేదాంత్, శ్రీకాంత్ కొడుకు రిషబ్ 

(లాలస మనమళ్లు)

స్తంభంగా ఆ స్కూలుని తీర్చి దిద్దారు. ఈ రోజుకి కూడా ఆ పిల్లలే కాదు, వారి తల్లిదండ్రులు కూడా ప్రతి రోజు వీరిద్దరినీ స్మరిస్తూ ఉంటారు. వారి కొడుకు నా మేనల్లుడు శ్రీకాంత్ బి.ఎస్.సి. పాస్ అయ్యాడు  బోస్టన్ ఇన్స్టిట్యూట్ లో, ఐ.టి కోర్సులు కాకుండా ముంబై ఐ.ఐ.టి లో చాలా సర్టిఫికేట్ కోర్సులు చేసుకుని ప్రస్తుతం అమెరికన్ బేస్డ్ ఐ.టి కంపెనీలో పని చేస్తున్నాడు. భార్య డి.ఏ.వి. స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. పాటలు బాగా పాడుతాడు. సోమయా కాలేజీ (ముంబై) లో చదువుకునేటప్పుడు కాలేజీ తరఫున ఇంటర్ కాలేజీ సింగింగ్ స్పర్ధలలో పాల్గొని ఎన్నో బహుమతులు తెచ్చుకున్నాడు. అందరూ కాలేజీ లో వాడ్ని బినాకా గీత్ మాలా అని పిలుస్తుండేవాళ్లు. ఇప్పుడు కూడా రీజెన్సీ సొసైటీ లో , బెంగాలీ అస్సోసియేషన్ లలో పాటలు పడుతుంటాడు. కిషోర్ కుమార్ పాటలు చాలా బాగా పాడుతాడు. ఇవన్నీ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ట్రైనింగ్ మాత్రమే. బెస్ట్ అంటే Padosan లో పాట "ఏక్ చతుర్ నారి కర్ కె సింగార్ " తరువాత రఫీ పాడిన "మన్ తడ్ పత్ హరి భజన కో ఆజ్ "

Srikanth with his wife Purvi, son Rishabh and daughter Jiya
శ్రీకాంత్ కి ఒక కొడుకు
, ఒక కూతురు. కొడుకు కూడా బీ.టెక్ లో గేమ్స్ డిజైన్ చేసి యూ.కే. వెళ్ళడానికి పై చదువుల కోసం ప్రయత్నిస్తున్నాడు. కూతురు జియా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది. ఇద్దరికీ ఫైన్ ఆర్ట్స్ లోనే ఇంట్రెస్టు. పోతే నీరజ లాలస కూతురు. ఫైన్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ప్రస్తుతం ఎం. ఎఫ్.ఏ.(మాస్టర్ ఇన్ ఫైన్  ఆర్ట్స్) రెండవ  సంవత్సరం. మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తుంది. ఇంటర్లో ఉన్నప్పుడు మొత్తం మహారాష్ట్రను రిప్రెజెంట్ చేస్తూ బెస్ట్ ప్రెసిడెంట్"స్ గైడ్ పురస్కారాన్ని ప్రెసిడెంట్ ఆర్. వెంకట్రామన్ గారి నుంచి అందుకుంది. JBCN ఇంటర్ నేషనల్ స్కూల్ లో బెస్ట్ టీచర్ అవార్డు ప్రతి ఏడు గెలుచుకుంటుంది. దాని స్టూడెంట్ నేషనల్ లెవెల్ లో ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు నిరుడు బోర్డు పరీక్షల్లో. ఆ పిల్లవాడి తల్లిదండ్రులే కాకుండా స్కూల్ యాజమాన్యం ప్రశంసలు, అవార్డులు అందుకుంది. నీరజ కొడుకు వేదాంత్ అంటే లాలస మనమడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాడు ఇంటర్నేషనల్ లెవెల్ లో సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాడు. అల్లుడు నీలేష్ కూడా ఫైన్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేట్. ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్. బోరివలి , ముంబై లోనే ఉంటారు. అందరూ చక్కగా ముంబైలోనే స్థిర పడి పోయారు.

                               విజ్జి శ్రీకాంత్ తో                                         విజ్జి ,కొడుకు సుధీర్ తో


తరువాతి చెల్లెలు అంటే మా నాన్నగారి ఆరవ సంతానం, మూడవ కూతురు విజయలక్ష్మి. చాలా అందంగా బాపు గారు గీసిన  బొమ్మ లాగా ఉంటుంది. చామన ఛాయ రంగు. చాలా చురుకు అక్కయ్య లాగానే. విజ్జిని కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మ రెమీ టాల్కమ్ పౌడరు చాలా తింటూండేది. అందుకని మా విజ్జికి రెమీ అని మా సుశీల పిన్ని పేరు పెట్టింది. దాన్ని చిన్నప్పుడు మేమంతా రెమీ అని పిలిచేవాళ్ళం. చదువులో కూడా చాలా తెలివిగా ఉండేది. ఏకసంతాగ్రాహి. అందరితో తొందరగా కలిసిపోయేది. అది ఒక చైతన్య స్రవంతి. ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉండేది. చాలా చలాకీగా ఉండేది. సంగీతం మాస్టారు గారిని ఆట పట్టిస్తుండేది. నాకేమో మా భాస్కర్ రావు సర్ ని చూస్తే చాలా భయంగా ఉండేది. ఆయన మా ట్యూషన్ మాస్టారు గారు.  మా విజ్జేమో ఆయన్ని ఒక ఆట పట్టిస్తుండేది.  కానీ ఆయన ఎప్పుడూ కోప్పడేవారు కాదు. ఆటల్లో, పాటల్లో, స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో అన్నిట్లో అదే ఫస్ట్. స్కూల్లో అందరి ఫేవరెట్. ఊళ్ళో ఏ ప్రోగ్రాం అయినా అది పాల్గొనాల్సిందే. చదువులో ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్. అందుకని టీచర్స్ అందరు అదంటే ఇష్టపడేవాళ్లు. మా అమ్మ గాత్రం దానికి ఒక్కదానికే వచ్చినట్లుంది. చాలా  బాగా  పాడుతుందని సంగీతం కూడా నేర్పించారు. ఒకసారి హిందీ ప్రేమీ మండలి సంస్థ జిల్లా స్థాయి లెవెల్లో లో హిందీ పాటల పోటీ ఆయోజన వరంగల్లో చేశారు. అందులో పాల్గొని "జ్యోతి కలష్ చల్ కె అనే పాట పాడి (మా చిన్న వదిన ప్రమీల నేర్పించింది) వరంగల్ జిల్లా మొత్తంలో ప్రథమ పురస్కారాన్ని సంపాదించింది. భర్త బ్రహ్మాoడం  గోపాల కృష్ణ మాకు దగ్గర చుట్టమే మా అమ్మ తరఫునుంచి. మాకు బావ అవుతాడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఇంజనీర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఇక్కడే హిమాయత్నగర్ లో ఉంటారు. దాని కొడుకు సుధీర్ Metallurgy లో ఇంజనీరింగ్ చేసి బెంగళూరు సైన్స్ ఇంస్టుట్యూట్ లో Phd.


విజ్జి, స్మిత


(రీసెర్చ్) చేసి ప్రస్తుతం చికాగో U.S. లో ఉన్నాడు. వాడు మా ఇంటిలో ఫస్ట్ డాక్టరేట్. Dr. బి. సుధీర్ అన్నమాట వాడికి ఇద్దరు మగ పిల్లలు. అర్జున్, సిద్దార్థ్ , భార్య తుర్లపాటి రాధిక. కూతురు స్మిత ఎం.బి.ఏ. చేసింది పెళ్లి చేసుకుని హైద్రాబాదు లోనే ఉంది. వాళ్ళాయన విప్రో లో హై పొజిషన్ లో   ఉన్నారు. దానికి ఒక కూతురు అనన్య. అది పూనాలో చదువుకుంటుంది. 

దాని తర్వాత చెల్లెలు దుర్గేశ్ నందిని.  

          శ్రీకాంత్, దుర్గ

                  

రమణి, దుర్గ ,లహరికాంత్ (సాయిరాం కొడుకు),సుధ (చిన్న అన్నయ్య కూతురు), సుధీర్(విజ్జి కొడుకు)

ఇది కూడా B.A చేసింది. దీనికి మా బామ్మ పేరు పెట్టారు నాన్నగారు. దాన్ని బడిలో చేర్పించే సమయానికి చందమామ మాస పత్రికలో దుర్గేశనందిని అనే సీరియల్ వస్తుండేది. అప్పుడు చిన్న అన్నయ్య (ప్రశాంత్) దాని పేరు దుర్గేశ్ నందిని గా మార్చాడు. అప్పట్నుంచి అది దుర్గేశ్ నందిని అయింది. డిగ్రీ కాలేజీలో అందరూ దాన్ని నందిని అని పిలుస్తుండేవాళ్లు. తెల్లగా చాలా అందంగా ఉంటుంది. శాంత అత్తయ్య లాగా కాస్త పొట్టి అందరిలో. హిందీ పాటలు చాలా బాగా పాడుతుండేది. అది బొంబాయి కి మా పెద్ద చెల్లెలు లాలస ఇంటికి వెళ్ళినప్పుడు మా చిన్న బావగారు అంటే శైలేంద్ర గారు దానికిసజనా బర్ఖా బహార్ ఆయీ, జారే 

పరదేశి మై తో కబ్ సి ఖడీ.......” పాటలు వర్డింగ్స్ చెప్పి నేర్పించారు. రెండు పాటలు ఎంత బాగా పాడుతుండేదో చెప్పలేం. నేనే ఆశ్చర్యపోయాను. మా అమ్మ బుద్ధులు దీనికి ఎక్కువగా

వచ్చాయి. ఊళ్ళో ఎవరి అమ్మకైనా సరే ఒంట్లో బాగాలేదు అని అంటే తక్షణమే పరిచర్యలు చేయడానికి ఈవిడ హాజరు కావలసిందే. గార్డెనింగ్లో పెద్దన్నయ్యలాగే చాలా ఇంట్రెస్టు ఉండేది. జనగామలో నే కాకుండా పెళ్లయ్యాక నరసాపురం దాని ఇంట్లో కూడా పెద్ద గార్డెన్ మైంటైన్ చేసింది. దాని కొడుకు ఆరు నెలల చంటివాడుగా ఉన్నప్పుడు దాని ప్రాణం పోయింది. వాడు ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. 

ఇక ఆఖరి చెల్లెలు వెంకట రమణి. 

   

        కార్తీక్, డా. శాంతి, రమణి, శివరాం                                                      అభిషేక్ , శ్రావ్య   

అది కూడా ఎం.ఏ. తెలుగు లిట్ చేసింది. టీచర్స్ ట్రైనింగ్ చేసింది. చిన్నప్పట్నుంచి మా అందరిలాగే ఆటల్లో ఫస్టు. నాటకాలు కూడా వేస్తుండేది. విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్రలో జీవించింది అని చెప్పవచ్చును.  జనగామ లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ నాటక ప్రదర్శనలు ఇచ్చింది. రమణిని ఇవటూరి వంశం వారికి ఇచ్చి వివాహం చేసాం. నా భార్య సీతకి అన్న వరుస అంటే పిన్ని కొడుకు. సికింద్రాబాద్ వెస్లీ స్కూల్ తర్వాత అరవింద స్కూల్ లో పని చేసి, మంచి టీచర్ గా విద్యార్థులే కాకుండా మానేజ్మెంట్ ప్రశంసలు కూడా పొందింది ఇవటూరి వారికి భావరాజు వారికి దగ్గర సంబంధం ఉంది. మా భావరాజు సూర్యనారాయణ మామయ్యగారు, రమణి మామగారు ఇవటూరి సూరి శాస్త్రి గారు కజిన్స్ అన్నమాట.  భర్త శివరాం ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రికెట్ యంపైరింగ్  చేస్తుండేవారు. వీణ కూడా చాలా చక్కగా వాయిస్తారు. దీనికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అద్దె ఇంట్లో మారేడుపల్లి లో ఉన్నప్పుడు రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుతుండేది పైన టెర్రస్ మీద. అభిషేక్, కార్తిక్ వీరి పిల్లలు. అభిషేక్  కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేసి  M.S స్వీడన్ లో పూర్తి చేసి అక్కడే  స్వీడన్ లో స్థిర పడిపోయాడు. భార్య శ్రావ్య కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తాను కూడా America లో M.S. చేసింది కొడుకు రామ్. ఇంకా చిన్నవాడు. కార్తిక్ మటుకు నేను ఇక్కడే ఇండియా లో అమ్మా, నాన్న, నానమ్మలతో ఉంటాను అని హైదరాబాదులో నే ఉండి పోయాడు. ఐ. టి కంపెనీ లో మంచి ఉద్యోగం, భార్య శాంతి డెంటల్ డాక్టర్. Master in dental surgery.

మా పెద్ద అన్నయ్య నండూరి శివ ఫణి రాజ్.

అన్నయ్య 5 అడుగుల 10 అంగుళాల పొడుగుతో మంచి అందంతో, దృఢకాయంతో ఉండేవాడు. ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యాడు కానీ మా అమ్మ కన్నీళ్లు అందులో చేరడానికి అడ్డు కట్ట వేసింది. సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మా మురళీ బాబాయ్ గారు మంచి సలహా ఇచ్చి మాన్పించారు. మా పెద్దన్నయ్యకి మురళీ బాబాయ్, మీనాక్షి పిన్ని తో మంచి అనుబంధం ఉండేది. తరచూ కింగ్స్ వే లోని బాబాయ్ గారి ఇంటికి వెళ్ళుతుండే వాడు. బి.ఎస్.సి. పాస్ అయ్యాడు. మంచి భావ కవిత్వం రాస్తాడు. ఆయన వ్రాసిన కవిత్వాలు భారతి పత్రికలో ప్రచురించబడ్డాయి.పెన్సిల్ తో ఆర్ట్ వర్క్ చేస్తాడు. ఆయిల్ పెయింటింగ్స్ చేస్తాడు. అడవులన్నీ తిరిగి. ఒక ప్రత్యేకమైన చెట్టుకొమ్మలు తెచ్చి వాటిని అందమైన శిల్పాలుగా చెక్కుతుండేవాడు. చిన్నప్పట్నుంచి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. రకరకాల పూల చెట్లు, కూరగాయల మొక్కలు , ఆర్నమెంటల్ మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కల్ని ఏ ఊర్లో, ఏ ఇంట్లో ఉన్న పెంచుతుండేవాడు. వరంగల్ లో డెసర్ట్ మొక్కలని (desert plants-Xyrophytes) పెంచాడు. చిన్నప్పట్నుంచి కూడా స్టాంప్ కలెక్షన్, కరెన్సీ కలెక్షన్ హాబీ. అన్ని దేశాల కరెన్సీ నోట్స్, కాయిన్స్ అలాగే ఇండియన్ స్టాంప్స్ కాకుండా ఫారిన్ స్టాంప్స్ కూడా సేకరించాడు. ఆల్బమ్స్ తయారు చేసాడు. ఈ అలవాటుని మా నాన్నగారి దగ్గర్నుంచి వచ్చింది. స్వెట్టర్లు కూడా చాలా బాగా అల్లుతుండేవాడు. శాంత అత్తయ్య దగ్గర ఢిల్లీ లో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తుండేవాడు. అక్కడ బస్సులో ప్రయాణం చేస్తూ ఆడవాళ్లు స్వెట్టర్లు అల్లుతుండేవారు. ఆ      

పెద్దన్నయ్య శివరావు                               పెద్దన్నయ్య కొడుకు శివకుమార్ తో 

 

ఆ డిజైన్స్ ఒక్కసారి చూసినా చాలు,                    

ఇంటికి వచ్చి ఆ డిజైన్స్ చేస్తుండేవాడు. సూక్ష్మగ్రాహి అన్న మాట. చెస్ ఆట కూడా చాలా బాగా ఆడుతాడు. కొడుకు సాయి శివకుమార్ హార్ట్ ప్రాబ్లెమ్ వలన అవుట్ డోర్ గేమ్స్ ఆడలేడని వాడిని ఇన్డోర్ గేమ్స్ లో ఎక్స్పర్ట్ ని చేసాడు. వాడు కూడా చెస్ చాలా బాగా ఆడుతుండేవాడు. చాలా తెలివైన వాడు. వాడంతటి తెలివిగలవాడు ఈ జెనెరేషన్లో బహుశా లేడు. అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో చేరుదామని అనుకుంటే మా అమ్మ వద్దు అని వారించింది. దయాగుణం కాస్త ఎక్కువ. సిద్ధి సమాధి యోగ SSY లో చేరాడు. అంచెలంచెలుగా ప్రగతి సంపాదించుకుని యోగ టీచర్ రాజ్ గురు గా ప్రసిద్ధి చెందాడు. రెండు మూడు సార్లు యోగ ప్రచారం కోసం అమెరికా వెళ్లి వచ్చాడు. ఆయనకి లెక్కలేనంత మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. అందులో ముదిగొండ ఇందుశేఖర్ ఒకరు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్నయ్య దగ్గర సిద్ధి సమాధి యోగ నేర్చుకున్నారు. అన్నయ్య అంటే ఎనలేని అభిమానం వారిద్దరికీ. ఆయన కూడా శాస్త్రీయ పరిశోధన చేసి హైందవి అనే పుస్తకం రాసాడు. అందులో ఆయన మా అన్నయ్య గురించి ప్రస్తావించారు. 

అన్నయ్య లంబాడీ జాతి, బలహీన వర్గాల వారి సేవ : అన్నయ్య నిజామాబాదు, కామారెడ్డి  మొదలైన గ్రామ గ్రామాలలో తిరిగి లంబాడీ పిల్లలు, అంటరాని వారిగా చూసే నిమ్న వర్గాల వారి పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యపరమైన తరగతులు నిర్వహించే వాడు. సిద్ది సమాధి యోగాలో ప్రావీణ్యం సంపాదించుకుని ఒక యోగ ప్రక్రియ ద్వారా పిల్లలకు ప్రత్యేకంగా విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంచే క్రియలు నేర్పించాడు. ఆయన శిక్షణలో అనేక వందల మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అందరూ అన్నయ్యని "తాతయ్యా" అని పిలిచేవారు. వరంగల్,పాలమారు, ఖమ్మం, ఆదిలాబాదు అంటే మొత్తం ఆంధ్ర్ ప్రదేశ్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా యోగా తరగతులు మరియూ కార్పొరేట్ ఉద్యోగస్తులకు చాలా వర్క్ షాప్స్ నిర్వహించాడు. మా అన్నయ్య పోయినప్పుడు అచ్చంపేట, కామారెడ్డి, ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి బస్సులలో, కార్లలో, జనాలు విపరీతంగా ఆఖరి దర్శనం కోసం విపరీతంగా వచ్చారు.

అన్నయ్య మేనరికం చేసుకున్నాడు. మా రాణి వదిన శాంత అత్తయ్య పెద్ద కూతురు కానీ స్వరాజ్యం అత్తయ్య పెంచుకుంది. పెద్దన్నయ్య, వదిన కూడా పాటలు చాలా బాగా పాడతారు. అన్నయ్య హిందీలో ముఖేష్ పాటలు పాడితే వదిన తెలుగు , హిందీ రెండు భాషల్లో పాటలు పాడుతుంది. వీరికి ముగ్గురు పిల్లలు. సాయి శివ కుమార్, బిందుమాధవి, శిరీష్. ఇందులో పెద్దవాడైన శివకుమార్ కి చిన్నప్పుడే హార్ట్ ఎంలార్జ్ అయింది. మా చిన్న అన్నయ్య హోమియోపతి ట్రీట్మెంట్ మూలంగా జీవితాన్ని 25 ఏళ్ళు మాత్రమే పొడిగించుకోగలిగాడు. పెద్ద అన్నయ్య సారాభాయ్ కెమికల్స్ మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తుండేవాడు. కొడుకు ఆరోగ్యం గురించి ప్రమోషన్లు వదులుకుని మెడికల్ రెప్రజెంటేటివ్ గానే రిటైర్ అయి పోయాడు. కొడుకు పోయిన తర్వాత తన జీవితాన్ని సమాజ సిద్ధి యోగ కి అంకితం చేసుకున్నాడు. అండర్ ప్రివిలెజ్డ్ విద్యార్థులకి చదువు, ధ్యానక్రియలు నేర్పించి వాళ్ళందరూ 60-70 % మార్కులతో పాస్ అయ్యేటట్టుగా శిక్షణ ఇచ్చాడు. అన్నయ్య పోయాక అన్నయ్య పేరున అచ్చంపేట లో ధ్యాన కేంద్రం నిర్మించి ఆయన పేరు పెట్టారు. కూతురు బిందుమాధవి , చిన్న కొడుకు శిరీష్ B.E Instrumental engineering చేసి అమెరికాలో స్థిర పడిపోయారు. బిందు అక్కడ యూనివర్సిటీ లో అంచెలంచెలుగా ప్రమోషన్లతో ప్రస్తుతం ప్రొఫెసరుగా పని చేస్తుంది. రూర్కీలో ఎం.ఎస్.సి చేస్తున్నపుడు ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ తెచ్చుకుంది. చాలా తెలివైనది. దాని కొడుకు వేద్ అక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భర్త కూడా తనలాగే ప్రొఫెసర్.

మా రెండో అన్నయ్య డాక్టర్ నండూరి శివ ప్రశాంత్.  

ప్రశాంత్ అన్నయ్య మొదట హోమియో లో హాస్పిటల్ లో డాక్టరు, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హోమియో మెడికల్ సర్వీసెస్ లో పెద్ద హోదాలో ఉండగానే రిటైర్ అయ్యాడు . అతి క్లిష్టమైన డౌన్'స్ సిండ్రోమ్ తో బాధ పడుతున్న చిన్న పిల్లవాడు, allopathy డాక్టర్లు చేతులెత్తేసిన కేసుని తల్లిదండ్రులు అన్నయ్య పేరు ప్రఖ్యాతులు విని ఆశగా వచ్చారు.అప్పుడు వారికి ధైర్యం చెప్పి ఒక పదేళ్ల వరకూ క్వాలిటీ లైఫ్ ఇవ్వగలనని భరోసా ఇచ్చాడు. అలాగే ఆ పిల్లవాడు చక్కగా ఆరోగ్యాన్ని పుంజుకున్నాడు. ఆ పిల్లవాని తండ్రి శివరాం రెడ్డి గారు అన్నయ్య దంపతులని టాంజానియా కి ఆహ్వానించి, ఘన సత్కారాలు చేసి ప్రత్యేకంగా మాసాయిమారా మరియూ జింజిబార్ కి తీసుకెళ్లారు. అప్పుడు నేను టాంజానియా లోనే పని చేస్తుండేవాడిని. Multiple Scelerosis ఈ వ్యాధి అనేక లక్షల మందిలో ఏ ఒక్కరికో వస్తుంది. దీనికి ఏ వైద్యం పని చేయదు.అవయవాలన్నీ బిగదీసుకు పోతాయి. చందన్ అని మా మేనమామ కొడుకు ఈ వ్యాధి బారిన పడ్డాడు. డాక్టర్లు అందరు చేతులెత్తేశారు.అన్నయ్య వాడికి ధైర్యం చెప్పి ఒక సంవత్సరం పాటు వైద్యం చేసి కొత్త జీవితం ప్రసాదించాడు . ఇలాంటి ఎన్నో మొండి వ్యాధుల్ని నయం చేసి ఘనత సంపాదించాడు. మా నండూరి పార్థ సారథి బాబాయ్ కుటుంబం కూడా వైద్యం తీసుకున్నట్లు నాకు గుర్తు.

హోమియోపతి డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా  సంపాదించుకున్నాడు. భారతదేశంలోనే కాకుండా విదేశాలనుంచి ఎంతో మంది అన్నయ్య దగ్గర్నుంచి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేయడంలో ప్రథమ వ్యక్తి మా అన్నయ్యనే. హస్తవాసి  కూడా చాలా మంచిది. దియాగ్నోసిస్ లో ఎక్స్పర్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ ప్యానెల్ లో చీఫ్ అడ్వైసర్. మంచి వైద్యుడుగా, మంచి టీచర్ గా అవార్డ్స్ అందుకున్నాడు. గవర్నమెంట్ లో టాలెంట్ ఉండి అణగదొక్కబడిన ఫార్వర్డ్ క్లాస్ కి చెందిన  ఎంతోమంది ఎంప్లొయీలను వారి వారి అర్హతలను బట్టి వారికి  ఎంకరేజ్మెంట్ చేసి ప్రమోషన్లను ఇప్పించాడు. బ్యాక్ బెంచ్ విద్యార్థులను సైతం మార్చగలిగి, గోల్డ్ మెడల్స్ సంపాదించుకున్నట్టుగా చేసి విద్యార్థులందరికీ  అతిప్రియుడు అయ్యాడు. చాలా క్రమశిక్షణ గా ఉండేవాడు. కింద పని చేసే  ఉద్యోగులందరూ చాలా జాగ్రత్తగా పని చేస్తుండేవారు పనిలో మటుకు ఎవ్వరైనా సరే నో అడ్జస్ట్మెంట్.

         

డా.ప్రశాంత్ (చిన్న అన్నయ్య)                  సాయిరాం, లాలస, చిన్న అన్నయ్య, రమణి

మా తాతగారు, మా నాన్నగారి లాగానే అన్నయ్య కూడా ఎంతో మందికి (not less than 25 to 30) గుప్తదానాలు చేసి వారి చదువులకి, జీవనోపాధికి సహాయం చేసాడు. ఎవ్వరికీ తెలియవు. కానీ మా రామ్ అన్నయ్య కొన్నాళ్ళు ఆయన రిటైర్ అయిపోయినాక, అన్నయ్య దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ౩౦ వ  తారీఖు రాగానే రామ్ అన్నయ్య పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అందరికీ మనీ ఆర్డర్లు పంపుతుండేవాడు. ఆయన మూలంగా మాఅందరికీ తెలిసి చాలా ఆశ్చర్య పడ్డాం. బీదవాళ్ళకి అంటే డబ్బులు ఇవ్వలేని వాళ్లకి ఉచితంగా వైద్యం చేస్తుండేవాడు. ఇక పొతే పాటలు చాలా బాగా పాడుతుండేవాడు. దేవానంద్ ఫేవరెట్ ఆక్టర్.ఇద్దరు అన్నయ్యలు  హిందీ పాటలు చాలా  బాగా పాడుతుండేవారు. మేము ముగ్గురం మగపిల్లలం, విజ్జి, దుర్గ పాటలు పాడుతాం. మా అందరికీ ముఖేష్ ఫేవరెట్ సింగర్.

          అన్నయ్యకి డాక్టర్ అనిల్, సుధ అని ఇద్దరు పిల్లలు. అనిల్ నాల్గవ తరంలో డాక్టర్ , పై మూడు తరాల డాక్టర్లకి ఏమీ తీసిపోడు. మంచి డాక్టర్. హస్తవాసి కూడా మంచిది. సనాతన ధర్మం ఆంటే చాలా ఇష్టం. ఫార్మ్ హౌస్, అందులో చక్కగా ఆవుల్ని కూడా మైంటైన్ చేస్తున్నాడు. డా. అనిల్ లలితా శ్రీచక్ర ఉపాసన దీక్షని శ్రీమతి మణి ప్రసన్న గారి దగ్గరనుంచీ స్వీకరించి సాధన చేస్తుంటాడు. కూతురు సుధ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి సినిమా తీయటంలో శిక్షణ పొంది డాక్యూమెంటరీలు తీసింది. రేడియో మిర్చి కార్యక్రమాలు చాలా కాలం నిర్వహించింది. ఇంగ్లీష్ పత్రికల్లో చాలా వ్యాసాలూ రాస్తూ ఉంటుంది. ప్రస్తుతం మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. అలాగే మంచి జర్నలిస్ట్. సద్గురు ఇషా కేంద్రంలో రెగ్యులర్ గా అటెండ్ అవుతుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ రోజూ చక్కగా లలితా సహస్ర నామాలు, విష్ణు సహస్ర నామాలు చదువుతారు. శ్యామలా నవరాత్రులు, వారాహీ నవ రాత్రులు చేస్తుంటారు.  యోగ క్లాసెస్ అటెండ్ అవుతుంది, నేర్పిస్తుంది.

ఇక పొతే నేను నాన్నగారి నాల్గవ సంతానం, మగపిల్లల్లో మూడవ కొడుకుని పేరు సాయిరాం. నా గురించి చాలా అప్పుడే వివరించాను. బి.ఎస్.సి. చదివాను. మెడికల్ రిప్రెజెంటేటివ్ గా చేరి మార్కెటింగ్ మేనేజర్ గా ఇండియా లోనే కాకుండా East Africa లో కూడా పదిహేడేళ్లు పని చేసి రిటైర్ అయ్యాక ఇక్కడ మారెడ్ పల్లి లో స్థిర పడి పోయాను. చిన్నప్పట్నుంచి కూడా నాకు ఆధ్యాత్మికత అంటే ప్రీతి. చిన్నప్పట్నుంచి కూడా రచనలు చేయటం హాబీగా ఉండేది. ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలను 

 

సాయిరాం ఒడుగు ప్రోగ్రాం లో అమ్మా,నాన్నగారితో        హిందీ మాస్టారుగారి కుటుంబంత

హిందీ మాస్టారుగారు, నాన్నగారు, శర్మ,సాయిరాం, అమ్మ, మాస్టారుగారి భార్య, దుర్గ, సాయి, సుధ, అనిల్

చదువుతుండేవాడిని. రిటైర్ అయ్యాక నేను ఫుల్ టైంని ఆధ్యాత్మిక పరమైన, వైజ్ఞానికపరమైన ఆర్టికల్స్ రాసి నా వెబ్ సైటులో పోస్ట్ చేస్తుంటాను. ఎక్కువగా ఆడియో form లో ఉన్నాయి. నేను ఇంగ్లీష్ లో " Ancient Wisdom of India " చాలా అధ్యాయాలు రాసాను. దాదాపు 500 పేజీల పైనే ఉంది. ఇందులో నేను ప్రశ్నలు అడుగుతుంటే కణాద మహర్షి సమాధానాలు చెప్తున్నటుగా రాసాను. నేను డిక్టేట్ చేస్తుంటే  నా భార్య సీత అది రాసింది. దాని ఫోటోలు తీసి అమెరికాలో ఉన్న ప్రవీణ్ గారికి పంపితే ఆయన టైపు చేసి  మా వెబ్ సైటులోపోస్ట్ చేశారు. ఈ కాలంలో మన పిల్లలకి వచ్చే సందేహాలకు శాస్త్రపరంగా (with  scientific reason) సమాధానాలు చెప్పి వాళ్ళ అనుమానాలు తీర్చడానికి   ప్రయత్నం చేశాను. దీనికి మా అక్కయ్య సలహా, సహకారాలు కూడా వచ్చాయి. అలాగే మా చెల్లెలు సూర్యలాలస నాకోసం తెలుగు టైపింగ్ ప్రాక్టీసు చేసి "స్వామి నారాయణ జీవిత చరిత్ర" దగ్గర దగ్గరగా 98 అధ్యాయాలు దాదాపు 700 పేజీలు  తెలుగులో type  చేసింది. ఇవన్నీ మా వెబ్ సైటులో పారాయణ గ్రంథం లాగా పెట్టాము. ఇవేకాకుండా దాదాపు 15 మంది అవధూతల గురించి కూడా నేను చెప్పాను. అతీంద్రియ శక్తులు, ఆఫ్రికాలో నా అనుభవాలు, ఉపనిషత్కథలు, ఇలా ఎన్నో విషయాల మీద నేను రచనలు చేసి మా వెబ్ సైటు www sridatta.info లో పోస్ట్ చేసాను. దీనిలో టైపు చేయడానికి మా చెల్లెలు లాలస సహకారాలు 

లభించాయి.   


     

  నేను (సాయిరాం), నా భార్య సీతామహాలక్ష్మి               నేను, సీత, ఎడమవైపు నుంచి అపర్ణ (అక్కయ్య కూతురు),బిందుమాధవి,సుధా ప్రశాంత్ ,  (పెద్దన్నయ్య,చిన్నన్నయ్య కూతుర్లు)                                                                                                                        

నా భార్య సీతా మహా లక్ష్మి St.Anns స్కూల్లో టీచర్ గా పని చేసి రిటైర్ అయింది. స్వతహాగా మంచి గాయని. చిన్నప్పుడు బాలానందం రేడియో ప్రోగ్రాములలో పాల్గొంటుండేది. మంచి టీచరు గా పేరు తెచ్చుకుంది. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ స్కూల్లో చేస్తుండేది. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ హెల్ప్ చేయమని పిలుస్తుంటారు. అయితే నాకు వెబ్సైటులో అన్ని విధాలా సహాకారాలు చేస్తుంది. అన్నిఆడియోస్ కూడా తానే చదివి రికార్డు చేసింది.ఇవన్నీ కూడా చాలా మంది చాలా ఆసక్తిగా చదువుతుంటారు.  పెద్ద వాడు లాహిరికాంత్ జర్మనీ లో Breast Cancer లో డాక్టరేట్ చేసాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. మా పెద్ద కోడలు శ్రీలక్ష్మిM.C.A, automobiles లో ఇంజనీరింగ్ చేసింది. అక్కడే జాబ్ చేస్తుంది. GSK మెడికల్ కంపెనీలో మార్కెటింగ్ Adv Web Designer గా పని చేస్తుంది.వీరికి ఒక్కడే 

             

సాయిరాం పెద్దకొడుకు లహరికాంత్, శ్రీలక్ష్మి, క్షితిజ్   చిన్నకొడుకు కమలకాంత్, అవని, ఆదిత్,ధృవ్

కొడుకు సూర్య క్షితిజ్ ఇంకా చిన్నవాడు. రెండవ కొడుకు కమల్ కాంత్ ఇంజనీర్. అమెరికా లో ఎం. ఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కోడలు అవని. ఆవిడా కూడా కంప్యూటర్ గ్రాడ్యుయేట్, M.B.A చేసింది. Harward University లో M.S చేసింది. అమెరికా లోనే పని చేస్తుంది, వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఆదిత్, ధృవ్. ఇంకా చిన్న పిల్లలే

మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ప్రసన్నక్కయ్య వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆరుగొలనుకి వాళ్ళ చిన్నతనంలో వెళ్ళటం సంభవించింది. వైజాగ్ లో నాన్నగారి మెడికల్ కోర్సు పూర్తి అయ్యాక ఆయన మళ్ళీ ఆరుగొలనుకి వెళ్ళలేదు. మా నాన్నగారికి మంచి జ్ఞాపకాలంటూ ఏమీ లేవు. ఆరుగొలనులో మా తాతగారు నాన్నగారికి ఇచ్చింది ఏమీ లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. మా మెమోరీస్ అంటే రోజూ సాయంత్రం అందరు బాబాయ్ గార్లు, అత్తయ్యలు, అమ్మ కూర్చుని సరదాగా పాటలు పాడుకోవటం బాగా తెలుసు మా అందరికి. ఒక్కొక్కసారి మాకు ఆరుగొలను చూస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం? పూర్తిగా మేము అపరిచితులమే కదా ! ఆరుగొలను మా నాన్నగారు వదిలి వేశాక మొత్తం  రెండువాటాలుగా  ఉన్న ఇల్లుని, మా వాటావైపు ఉన్న ఇంటికి తాళం వేసి,  ఆ తాళంచెవులు స్వరాజ్యం అత్తయ్య దగ్గర ఉండేవి. అత్తయ్య అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి ఉండేది. మధ్య, మధ్యలో ఇంటికి మా అత్తయ్య మరమ్మత్తులు చేయిస్తుండేది. ప్రతీసారి అత్తయ్య పెట్టిన తాళం మళ్ళీ తాను వచ్చేసరికి విరగ్గొట్టి ఉండేది. అత్తయ్య మళ్ళీ వెళ్ళేటప్పుడు కొత్త తాళం వేస్తుండేది. మళ్ళీ వచ్చేసరికి షరా మామూలే. విద్యాభూషణ్ రావు  మామయ్యగారు పోయాక మా అత్తయ్య అక్కడే ఉంటానని వెళ్ళింది. అప్పటికే మా చిన్న బామ్మా వాళ్ళు మా వాటాలో ఉన్న కొంత భాగాన్ని వాళ్ళు వాడటం మొదలు పెట్టుకున్నారు, మా చిన్న బామ్మకి మా తాతగారి పిల్లలంటే పడదు అని అనిపిస్తుంది. మాకు తెలిసినవాటిలో ఒక్క విషయం లో  కూడా "ట" అనే అక్షరం లేదు. అన్నీ నిజాలే. ఊహాగానాలు, అర్ధసత్యాలు కావు అన్నీ పచ్చి నిజాలే. వల్లూరి శకుంతల భర్త ఒక సారి జనగామ కి మా ఇంటికి వచ్చారు. నండూరి కృష్ణమూర్తి బాబాయ్ గారు కూడా వచ్చారు. విజయవాడ కానీ, హైద్రాబాదు కానీ జనగామకు దూరం లో లేవు. అలాంటప్పుడు ఒక్కళ్ళు కూడా ఎందుకు రాలేదు? మురళీ బాబాయ్ గారు కూడా ఒకసారి వచ్చారు. శాంత అత్తయ్య కానీ, రాఘవ రావు మామయ్యగారు కానీ ఎప్పుడైనా ఆంధ్రాకి వస్తే తప్పకుండా ఆరుగొలనుకి వెళ్లి చిన్న తాతగారిని కలిసేవారు. అలాగే విజయవాడలో ఉన్న తమ్ముళ్ళని. చెల్లెళ్లని, హైదరాబాదులో ఉన్న మురళి బాబాయ్, మీనాక్షి పిన్నిని  అందరినీ కలుస్తుండేవారు. మా మేనత్తలకే కాదు మా నాన్నగారికి కూడా తాతగారన్నా, తమ్ముళ్ళన్నా చాలా ఇష్టమే కానీ ఆయన ఒక్క రోజు కూడా జనగామ వదిలి వెళ్ళ లేదు. (మా అందరికీ ఆరుగొలనులో మా చిన్న బామ్మ మా బామ్మ, అత్తయ్యలతో ప్రవర్తించిన తీరు, ముత్తాత గారు తన స్వంత మనమరాలికి(తండ్రి లేని కూతురుకి) ఎలా కాటికి వెళ్లే ముసలి వాడితో పెళ్లి ఏర్పాటు చేసారో ఇంకా ఇలా ఎన్నో తెలుసు. (వితౌట్ ట ) ఏనాడు మేము పట్టించుకో లేదు. మాకు అవసరం కూడా లేదు.) కానీ బాబాయ్ గారు రాసిన మా తాతగారి క్యారక్టర్ assassination చదివాక ఎక్కడో అట్టడుగున పోయిన విషయాలన్నీ పైకి పెల్లుబుకుతున్నాయి. మా నాన్న గారు 1981 లో పోయారు. దానికి ముందు ఇన్ఫర్మేషన్ గాథర్ చేయాల్సింది. ఆయన అయితే ఇంకా బాగా చెప్పేవారు. ప్రాథమికంగా మా తాతగారు నండూరి శివరావు వంశస్థుల గురించే కాకుండా మా సత్యం తాతగారి కుటుంబాల గురించి కూడా చెప్పటం జరిగింది. శివరావు గారు బొమ్మ అయితే సత్యం తాతగారు బొరుసు. ఆ రెండు కలిస్తేనే కదా విలువైన నాణెం  అవుతుంది. వీరిద్దరి చరిత్రలు కలిస్తేనే సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఎందరో మహానుభావులు, నారీమణులు అందరికీ మా ప్రణామములు.

                                                   ఒక చిన్న విన్నపం

ప్రియమైన శ్రోతలు, పాఠకులకి ఒక విన్నపం. వంశ చరిత్ర రాయడమనేది చాలా కష్టంతో కూడుకున్నది. ప్రస్తుతం నా వయస్సు 73 సంవత్సరాలు దాటాయి. కంటి దృష్టి అంతంత మాత్రంగానే ఉంది. కాకపొతే నాకు భగవంతుడి దయ వల్ల జ్ఞాపకశక్తి  చాలా బావుంది. ఎప్పుడో గతించిపోయిన 100 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలను సేకరించటం, నిజం నిర్ధారణ కోసం, మా తాతగారికి తెలిసిన శ్రేయోభిలాషుల ద్వారా విషయం సేకరణ చేసాము. నాలుగైదు సార్లు ఎడిటింగ్ కూడా చేయవలసి వచ్చింది. ఇది ఒక మహా యజ్ఞంలా సాగింది.

కొంత మంది వంశ చరిత్రలలో ఆడవారికి ఎటువంటి చోటు ఇవ్వరు. ఇది చాలా బాధాకరం. చనిపోయిన తల్లికి శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు మాతృ మూర్తి, వారి అత్తగారు, అత్తగారి అత్తగార్ల పేర్లు కూడా చెప్పవలసి వస్తుంది. అందుకే మేము విస్తారంగా మా ఇంటి ఆడపడుచులకు ప్రథమ స్థానం ఇచ్చాము. అయితే మేము పెట్టిన వంశ చరిత్ర వృక్షం నిజానికి నండూరి పార్థసారథి బాబాయ్ గారు తన మేనల్లుడు హరి కృష్ణ చేత రూపొందించారు. నేను బాబాయ్ గారిని అడిగినపుడు ఆడవారి పేర్లు ఉండవు అని చెప్పారు. మా వంశ వృక్షాన్ని (శివరావు తాతగారి శాఖ) మా లాలస తయారు చేస్తుంది. మరి గిడుగు గారి వంశవృక్షంలో, మరి ఇతర వంశ వృక్షాలలో కూడా స్త్రీలకు సముచిత స్థానం కల్పించారు.

         మొదటి అధ్యాయం పూర్తి అయింది. త్వరలోనే మరి రెండు భాగాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నాము. విశేషంగా ఆదరిస్తున్న మా వెబ్ ప్రేక్షకులు, శ్రోతలకు ప్రత్యేక కృతజ్ఞతలు

మా ముగ్గురికి ఈ వంశ చరిత్ర రాయడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది కేవలం మా వంశ చరిత్ర నే కాదు. ఇది చదివే నా వయసు వారికి , ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబంలోని వారికి  ఇటువంటి సంఘటనలే జరిగి ఉంటాయి. అప్పటి సమాజం వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, కట్టుబాట్లు, సంస్కృతులు, సంప్రదాయాలు, గ్రామాలలోని పరిస్థితులు, మంచీ, చెడు, వ్యక్తుల్లో ఉండే పోరాట పటిమ, ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజం లోని యువతకి స్ఫూర్తి దాయకంగా ఉంటుందని  భావిస్తున్నాం. జీవితంలో సమస్యలని ఎలా ధైర్యంగా ఎదుర్కొని, అడ్డంకుల్ని అధిగమించి, సవాళ్ళని అవకాశాలుగా మార్చుకుని ఏవిధంగా లక్ష్యాన్ని అప్పటి వారు ఎలా సాధించారో అని విన్నప్పుడు మనలో కూడా ఆత్మస్థైర్యం, ధైర్యం, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం తప్పకుండా కలుగుతాయి.

  నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే మనందరం తప్పనిసరిగా మన వంశ చరిత్ర రాయాలి.అది భావితరాల వారికి ఒక స్ఫూర్తిని కలిగిస్తాయి.

దయ చేసి మీ అభిప్రాయాలని తెలియజేయండి.

 

·      * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *