Introduction to Chedu Nijalu
చేదు నిజాలు అనబడే శీర్షికలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి, నమ్మలేనటువంటి అసలుసిసలైన భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు పేర్కొనబడతాయి. మన భారతదేశానికి మరి స్వాతంత్య్రం వచ్చింది అని ప్రజలందరూ సంతోషపడుతున్నపుడు మహాత్మా గాంధీ ఆరోజు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు, కన్నీరు కార్చారు. కేవలం తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళకి అధికార బదలాయింపు జరిగింది కానీ మాన దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జవహర్ లాల్ నెహ్రు మొదటి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆ ఉత్సవానికి కూడా మహాత్మా గాంధీ దూరంగానే ఉండిపోయారు.