N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Monday 31 October 2016

Spiritual Soup-13 part-2

Part - 2
తెల్లవారుఝామునే మా గురువుగారు "మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి వచ్చేసాము, కనిపించే ఆ కొండ వెనుకే ఆ ప్రదేశం ఉంది" అని చూపగా మేము త్వరత్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ మాకు ఒక మూలగా ఒక పెద్ద రాయి కనపడింది. దాన్ని దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఏదో ఒక చిన్న సందులోంచి సన్నటి వెలుగు కనపడింది.మేము ఒక్కొక్కరం ఆ సన్నటి ఇరుకు సందులోంచి లోపలకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఒక అద్భుతదృశ్యం కనపడింది. ఆ గుహలోపల విశాలమయిన భవనం ఒకటి కనపడగా, మేమందరం ఆ భవనంలోకి  ప్రవేసించాము. అక్కడ చాలా వెలుతురు రావడం గమనించి మేము అంత వెలుగు ఎక్కడనుంచి వస్తోందా అని పైకి చూసాము. అక్కడ పైకప్పు ఒక వృత్తాకారపు ఆకారంలో (dome) ఉంది, దానిలోంచే ఆ  వెలుతురు వస్తోంది. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ నేను అప్రయత్నంగా ఒక ప్లాట్ ఫారం లాగ ఉన్న ఒక బండ ఎక్కడం జరిగింది. దాని మీద పట్టుకుని నుంచోడానికి ఒక రైలింగ్ కూడా ఉంది. అలా ఎక్కగానే ఆ బండ పైకి లేవడం మొదలుపెట్టింది. ఈ రోజుల్లో లిఫ్ట్ మాదిరిగా ఉన్న ఆ బండ చాలా విశాలంగా, ద్వారబంధాలు లేకుండా ఉంది. అది అలా కదలడంతో నేను చాలా భయపడ్డాను. నా కంగారుని గమనించిన మా గురువుగారు పకపకా నవ్వుతూ "నువ్వేమి భయపడకు, ఏమి కాదు. దూకే ప్రయత్నం మాత్రం చెయ్యకు" అని చెప్పారు. అది క్రమక్రమంగా పైకి వెళుతూ, ఆ భవనం పై భాగానికి నా తల తగులుతుందేమో అని అనుకుంటుండగా ఆ బండ సరిగా పైభాగానికి 3, 4 అడుగుల దూరంలో ఆగిపోయింది. నేను కాస్త తేరుకుని మెల్లగా ఆ వెలుతురు వస్తున్నా ఆ పైకప్పుని ముట్టుకోగా అది చాలా చల్లగా ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మామూలుగా మనం ఇళ్ళల్లో వాడే బల్బులు చాలా వేడిగా ఉంటాయి కాని ఇది మాత్రం చాలా చల్లగా ఉంది. ఆ వెలుతురు కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. నేనింక కిందకి వెళిపోతే బాగుండు అని అనుకుంటుండగా ఆ బండ మెల్లగా యధాస్థానానికి వెళ్ళిపోయింది. నేను వెంటనే కిందకి దిగిపోయాను. మా గురువుగారు "ఇలాంటి చాలా వింతలు ఉంటాయి ఇక్కడ, ముందుకు కదలండి" అని అనగా బయలుదేరాము.

మేము ఆ భవనపు రెండవ అంతర్భాగంలో ప్రవేసించాము, అక్కడ ఒక విశాలప్రాంగణంలో ఆడిటోరియంలాగ  ఉండి కుర్చీలు వేసి ఉన్నాయి. మేమందరం అక్కడ కాసేపు కూర్చుందామని నిర్ణయించుకుని కూర్చోగా ఎక్కడినుంచో ఒక స్వరం మాకు అర్థమయ్యే భాషలోనే ఇలా వినిపించింది "స్వాగతం మిత్రులారా, ఎప్పటికో ఒకసారు మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారని మాకు తెలుసు. నాగరికతలో మేమెంతో అభివృద్ధి సాధించాము, మీరు చూస్తున్నటువంటి కాంతి మేము మీరు ఉత్పాదన చేసే విధంగా కాకుండా వేరే ప్రక్రియద్వారా తయారు చేస్తాము, వాటి ద్వారా ఎన్నో యంత్రాలను నడుపుతున్నాము. అయితే మేము ఏ విధంగా అభివృద్ధి చెందామో అదే విధంగా మా పొరుగుదేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఇపుడు అవన్నీ మీరు చూడబోతున్నారు, దయచేసి అందరు నిశ్చింతగా కూర్చోండి అని ప్రార్ధిస్తున్నాను". మేము యాంత్రికంగా మా కుర్చీలలో స్థిరపడిపోయాము. వెంటనే మా ముందు ఒక తెర ప్రత్యక్షమయ్యింది, దాని మీద ఎన్నో అద్భుతమయిన దృశ్యాలు కనపడటం మొదలుపెట్టాయి.   

దాంట్లో ఒకతను ఒక రాజకీయ నాయకుడిలా పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు, ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అక్కడ చేరి అతను చెప్పేది శ్రద్ధగా వింటూ మధ్యమధ్యలో చాలా క్రోధంతో అరుస్తున్నట్లు కనిపించింది. మాకేమి అర్థమయ్యిందంటే ఏదో ఒక దేశానికి సంబంధించిన నాయకుడు ప్రజలని ఉద్రేకపరిచి మాట్లాడుతున్నాడు. మరలా ఇంకొక దృశ్యం కనిపించింది, అది ఇంకొక దేశమనుకుంటాను, అక్కడ కూడా ఇలానే ఒక రాజకీయ నాయకుడు తన ప్రసంగంతో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇంకొక  దృశ్యంలో  వారు  కనిపెట్టిన  అత్యాధునిక  మారణాయుధాలని   ఆ  రెండు  దేశాలవారు  పరస్పరం  ఒకరి  మీద  ఒకరు  ప్రయోగించుకోవడం కనిపించింది. అక్కడ జరిగే విధ్వంసాన్ని మేము చూడలేకపోయాము. ఎత్తైన భవనాలు ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈలోపల ఇంకో దృశ్యం తేరా మీదకి వచ్చింది. అదొక  ఒక పెద్ద ప్రయోగశాల లాగ ఉంది, దాంట్లో శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు అంతా హడావిడిగా కొన్ని పెట్టెల్లో వారు కనిపెట్టిన పరికరాలను సర్దుతున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సర్దిన పెట్టెలకు మూత బిగించి వాటిని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లుగా మాకు అర్థమయ్యింది. వారిలో నాయకుడిలా అనిపించిన అతను విచారవదనంతో "మనం సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, నాగరికత ఇలాంటి  యుద్ధాల వల్ల నాశనం అయిపోతున్నాయి. మనం కనిపెట్టిన పరికరాలన్నీ మనుష్యుల మరియు ప్రకృతి విధ్వంసానికే వాడుతున్నాం తప్ప మానవాళి ప్రయోజనానికి వాడట్లేదు. ఎప్పుడైతే మనం మనలోని మనోవికారాలని జయించలేదో, మానవాళికి ఇలాగే నాశనం తప్పదు" అని చెప్పడం జరిగింది. మా అందరి మనస్సు ఒకసారి విచారంతో నిండిపోయింది. మాటల్లో అర్థంకాని ఎన్నో విషయాలు మాకు బొమ్మల ద్వారా అర్థమయ్యాయి. మేమంతా మన నాగరికత శ్రేష్టమయినది అనుకుంటున్నాం కాని జరుగుతున్నది ఏమిటి అని అందరం ఒక్కసారిగా  మాలో మేము ప్రశ్నించుకోసాగాము. అపుడు మాకు ఒక గంభీరమయిన స్వరం ఇలా వినపడింది "ప్రియమయిన సోదరులారా, ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు మేము భౌతికంగా, శాస్త్రీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నాము. గొప్ప అస్త్రాలని, మనకి పనికొచ్చే పరికరాలను ఎన్నో కనుక్కున్నాము. అలాగే మా పొరుగుదేశాలు కూడా ఎన్నో కనుక్కున్నారు, కాని వాటిని ఒకరిని ఒకరు చంపుకోవడానికి మాత్రమే మేము వాడుకున్నాము. ఇక్కడి ఆధ్యాత్మిక గురువుల మాటలు మేమెవరూ పట్టించుకోలేదు. కొంతమంది స్వార్థరాజకీయ నాయకుల వల్ల, వాళ్ళ ప్రసంగాల వల్ల ప్రజల్లో ఉండే మంచితనం పోయి లోపల ఒక విధమయిన ఈర్ష్యాద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. అప్పుడు వారు మంచి చెడు ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు దాడి చెయ్యటం, కొన్నిసార్లు వారు ఉపయోగించిన మారణాయుధాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి మొత్తం దేశాన్నే క్షణంలో భస్మీపటలం చేస్తాయి. ఆ విషయం చెప్పడానికే మాలో కొంతమంది పెద్దలు రాబోయే తరాలు మేము చేసిన  తప్పు తెలుసుకుని, అదే తప్పును వారు చెయ్యకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము మా విజ్ఞానం నుంచి కనిపెట్టిన పరికరాలని కూడా పెట్టెల్లో పెట్టుకుని ఎటువంటి మనుష్యులు రాలేనటువంటి ప్రదేశంలో నిక్షిప్తం చేసాము. టిబెట్లో మతగురువులు కొంతమందికి ఈ ప్రదేశం గురించి భావప్రసారాల ద్వారా తెలియజేశాము. మీరందరూ కూడా ఈ గుహని సందర్శించడానికి ఎన్నుకోబడినవారే. మనిషి ఎప్పుడైతే తనని తాను జయించలేకపోతాడో, తన మనసుని ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతాడో, వాడు ప్రపంచానికి ఒక దుష్టశక్తిగా పరిణమిస్తాడు. ఒక దుష్టశక్తి వల్ల ఎంతోమంది నాశనం కాక తప్పదు. ఈ చిన్న సూత్రం మానుంచి రాబోయేతరాలవారు తెలుసుకుంటారని మేము ఈ ఏర్పాటు చేసాము. ఇక్కడకి మీరు రాగానే మీలో ఉన్న అయస్కాంత క్షేత్రం ద్వారా మేము సృష్టించిన పరికరాలన్నీ కూడా చైతన్యం పొంది పని చెయ్యటం ప్రారంభిస్తాయి. ఇపుడు మీరు చూస్తున్న వెలుతురు కూడా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఏ మాత్రం ప్రకాశం తగ్గకుండా అలాగే ఉన్నది. ఇటువంటి అద్భుతమయిన జ్ఞానాన్ని సంపాదించి చివరికి మేమంతా ఒకరినొకరం నాశనం చేసుకున్నాము" అని ఎంతో బాధతో చెప్పారు. తరువాత అక్కడ తెర  మీద దృశ్యం ఆగిపోయింది.

ఆ తరువాత గుహలో మాకన్నా ఎన్నో తరాల ముందువాళ్ళు కనిపెట్టిన అద్భుత ఆవిష్కారాలు ఎన్నో చూడటం జరిగింది. ఎన్ని వస్తువులు చూసామన్నది ముఖ్యం కాదు, మనిషి సృష్టింపబడినప్పటినుంచి జరుగుతున్నది ఏమిటంటే, కొంతమంది స్వార్థపరులు బలహీనమయిన దేశాలను ఆక్రమించుకుని వారి నాగరికతను పూర్తిగా తుడిచివెయ్యడం, వారి నాగరికత కన్నా మా నాగరికత గొప్పది, మేము తలచుకుంటే ఏమైనా చెయ్యగలం అనుకునే దుష్టులే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు, వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో నాగరికతలు ఈ భూమిమీద నుంచి తుడిచివేయబడ్డాయి. వీటన్నిటికి సరైన సమాధానం ఏమిటంటే మనం ఆధ్యాత్మికంగా పరిణితి చెందాలి, మన మనసులో ప్రేమ, దయ అనే గుణాలని పెంచుకోవాలి. అటువంటి మార్పు మనం ఆధ్యాత్మిక గురువులతో సంబంధం పెట్టుకున్నపుడే మనలో ఆ మార్పు వస్తుంది. కాబట్టి ఇది మానవ జాతికి ఇదొక హెచ్చరిక. ఇంత జరుగుతున్నా కూడా మనుషుల్లో మార్పు రావట్లేదని నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఈ విధంగా మేమెన్నో వస్తువులని చూసాము, వాటన్నిటిని నేను మాటల్లో చెప్పలేను కాని ఇపుడు మనం ఊరికే మనేమేదో గొప్ప విజ్ఞానాన్ని కనిపెట్టామని గర్వపడుతుంటాము కాని మనకన్నా ముందుతరాలవారు  ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందారు, అయితే దుశ్తశక్తులకి బలి అయిపోయారు. అయినా కూడా మనుషుల ప్రవృత్తిలో మార్పులేదు. ప్రకృతికి విరుద్ధంగానే మనుషులెపుడు వెళ్తూ ఉంటారు" అని ఆయన గంభీరంగా చెప్పారు. "ఆ తరువాత మేము ఆ గుహలోంచి బయటకు వచ్చేసి మా ఆశ్రమానికి చేరుకున్నాము. అయినా చైనా గూఢచారులు మేమేదో చేస్తున్నామని పసిగట్టారు. మా దేశం దురాక్రమణ అయినప్పటినుంచీ ఈ రోజు వరకు కూడా ఇలాంటి గుహ ఒకటి ఉందని వారికి తెలిసి వెతుకుతూనే ఉన్నారు కాని దాని స్థావరాన్ని తెలుసుకోలేకపోయారు. దాని యొక్క వివరాలని చెప్పమని ఎంతోమంది మతగురువులని వారు హింసించి, చంపెయ్యడం కూడా జరిగింది. ఈ విధంగా ఒకప్పుడు ప్రపంచానికే శాంతి దూతలుగా ఉండే మా టిబెట్ దేశంలో ప్రశాంతత, ఆధ్యాత్మికత మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అయితే మా ఆధ్యాత్మిక గురువులు ముందు జాగ్రత్తగా మా వద్ద ఉన్న టిబెటియన్ సంస్కృతికి సంబందించిన చిహ్నాలు, మా నాగరికతను గుర్తుతెచ్చే వస్తువులను గుప్తపరిచి మంచిపని చేసారు. ఏదో ఒకరోజు దురాక్రమణదారులకి పతనం తప్పదు. మా మతగురువులు చెప్పినట్లు మాకు మంచిరోజులు వస్తాయి, మళ్లీ టిబెట్ ఏదో ఒక రోజు స్వాతంత్రాన్ని పొందుతుందనే ఆశతో మేమంతా ఎదురు చూస్తున్నాము.

 పొరుగున ఉన్న మీ భారతదేశము మా మతగురువులకి ఆశ్రయమిచ్చి వారిని కాపాడింది, చైనా వారి బెదిరింపులకి లొంగకుండా భారతదేశము చాలా సహాయం చేసింది. మాకు మీ దేశము చాలా విలువయిన కానుకలనిచ్చింది, దానిలో బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని మాకు పంచి ఇవ్వడం అనేది ఎంతో అద్భుతమయిన విషయం. చూసావు కదా మనుషుల్లో మంచి మార్పు రావాలంటే ఆధ్యాత్మికతే శరణ్యం. మనం ఎప్పుడైతే మనసుని జాలి, కరుణ, దయ, ప్రేమ అనే మంచిగుణాలతో నింపుతామో అప్పుడే మనం మంచిని గ్రహించగలుగుతాము. లేకపోతే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఆ ప్రకృతే మనకు శత్రువుగా పరిణమిస్తుంది అనే విషయాన్ని ఈ మానవులు ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు. కాని మంచి రోజులు రాబోతున్నాయి, 1985వ సంవత్సరంలో దానికి నాంది పడింది. నీకు ఇదివరకే అనేక విషయాలు అయస్కాంత వ్యక్తి చెప్పారు కదా, మరి కొన్ని విషయాలు నీకు త్వరలో తెలుస్తాయి. 

1987 నుంచి సంధియుగం ప్రారంభమయ్యింది, అది సుమారు  25 సంవత్సరాలు ఉండచ్చు, లేదంటే ఇంకా కొన్ని రోజులు పొడిగింపబడచ్చు. సమస్త మానవ చైతన్యస్థాయి మంచిభావాలతో నిండి ఉంటుందో అపుడు మాత్రమే మంచిమార్పులు రావటానికి నాంది పడుతుంది. ముందు ఎన్నో ప్రకృతి విరుద్ధమయిన కార్యక్రమాలు జరుగుతుంటాయి, దానిని చూసి మానవాళి ఎంతో భయపడుతుంది, ఆ తరువాత మంచి రోజులు తప్పక వస్తాయి. మంచి రోజులు త్వరగా  రావాలా లేక ఆలస్యంగా రావాలా అనేది సమస్త మానవాళి  చేతుల్లోనే ఉంది. నాయనా వేళ మించిపోతున్నది, ఇంక నువ్వు వెళ్లిరా, ముందు ముందు నీకు నేను ఆలోచన రూపంలో వస్తుంటాను. ఏ విషయం మీద ప్రశాంతమయిన మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, వాటికి సమాధానాలు దొరుకుతాయి. నీకు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందికి ఇలాంటి సందేశాలనే మేము పంపిస్తుంటాము, ఎందుకంటే ప్రస్తుతం మానవాళి ఆధ్యాత్మిక స్థాయి కొంచెం పెరిగే సూచనలు కనపడుతున్నాయి. నేను చెప్పినట్లుగా 1985లో బీజాలు పడ్డాయి, 1987లో మహానుభావుల సమావేశం జరిగి కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ఎవరికైతే ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉంటుందో, వారికి భావప్రసారాల ద్వారా మా సందేశాలు ఇస్తుంటాము. చాలామంది వారికి తెలియకుండానే మా సూచనలను పాటిస్తూ ఉంటారు. కొద్దిగా స్థాయి పెంచుకున్నవారు మాత్రం స్పృహతో ఏం జరుగుతోందా, ఈ సందేశం ఎక్కడనుంచి వస్తోంద అనేది తెలుసుకుంటారు. మరి ఇంక సెలవు" అని ఆయన క్షణంలో అదృశ్యం అయిపోయారు. 

ఈ అద్భుతమయిన అనుభూతిని  తలచుకుంటూ నేను తిరిగి నా గదికి వెళ్ళిపోయాను. అయితే తరువాత నేను చదివిన పుస్తకాల ద్వారా తెలిసినది ఏమిటంటే లోకంలో చాలామంది వ్యక్తులకి ఇలాంటి భావప్రసారాలు వస్తుంటాయి ఎందుకంటే మరి ప్రస్తుతం ఈ సంధియుగంలో light workers  ఇటువంటి సంకేతాలని యాంత్రికంగా తీసుకుని వారు చేస్తున్నామనే అనుకుంటారు. వాళ్ళచేత, వారిని పనిముట్లుగా వాడుకుని అదృశ్యరూపములో ఉన్న మహా చైతన్యం ఇటువంటి పనులు చేయిస్తోందని వారికి తెలియదు. నేను ఇవన్నీ ఆలోచిస్తూ పడుకున్నాను.


Wisdom of the Ancient India (Inner Journey for Health and Peace)

Dear readers,
                    
You may be pleased to know that the book entitled 'Wisdom of Ancient India (inner journey to peace and health)' is available on amazon.com as an e-book. This book will help you to master powerful techniques to enjoy inner peace and health. This is for your information: You may type 'Wisdom of Ancient India by Nanduri' in the search box to search for this book.

Wishing you all a very happy diwali and also big thanks for your support for our website.

Love and Light,
Nanduri Sri Sairam

Saturday 22 October 2016

గాయత్రి మంత్రం మహిమ - దయానంద సరస్వతి - 2 (continuation of previous episode)



దయానంద సరస్వతి గారు గాయత్రి అనుష్టానం, ఎన్నో సాధనాలు, ఉపాసనలు, మహా పునశ్చరణలు చేశారు. దాని వల్ల ఆయనలో అద్భుతంగా ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి వివేకం మేల్కొన్నది. హిందూ మతంలో ఉన్న లోటుపాట్లు ముఖ్యంగా ఈ అష్టాదశ పురాణాల్లో ఉన్న చాలా అసంబద్ధమైన విషయాలు ఎత్తి  చూపించడం జరిగింది. వాటిలో పైన చెప్పినట్లుగా గందరగోళం, తికమకలు ఉన్నాయి. ఈ రోజు ఒక పురాణ ప్రవక్త చెప్పిన విషయాలు అదే శివపురాణం అనుకోండి ఇంకా ఏ పురాణమైనా అనుకోండి రెండు రోజుల తర్వాత మీరు ఇంకొక ఆధ్యాత్మిక ప్రవక్త చెప్పుతున్న విష్ణుపురాణం విన్నప్పుడు ఈ శివపురాణం చెప్పినతను శివున్ని  మించిన దైవం లేడు, మిగతా దేవుళ్ళు-దేవతలు ఇతని కన్నా తక్కువే అని వచ్చే భావంతో చెప్పుతూ ఉంటారు. 

Spiritual Soup-13

నేను టాంజానియాలో పని చేసేటప్పుడు ట్రైనింగ్ నిమిత్తం ఒకసారి నైరోబిలోని Amboseli నేషనల్ పార్క్ కి వెళ్ళడం జరిగింది. సుమారు ఏడుగురు సభ్యులతో ఛార్టర్డ్ విమానంలో నైరోబి నుంచి Amboseli నేషనల్ పార్క్ కి చేరుకున్నాము. సాధారణంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలన్నీ అడవి ప్రాంతాలలోనే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉన్నందు వల్ల, అందరు మనసు విప్పి మాట్లాడుకుంటారని. ఈ కార్యక్రమాలు జరిగినపుడు ట్రైనీస్ వారి వారి జాతీయ దుస్తుల్లో వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ మాకు కేటాయించిన వసతి చాలా బాగుంది. మాకు శిక్షణ ఇచ్చే జెర్మనీ మహిళ కూడా చక్కగా మాట్లాడుతూ  మాలో కలసిపోయింది. ఈ పార్కులో మాకు ఎన్నో రకాల జంతువులు కనపడేవి. ఇక్కడ సాధు జంతువులు, క్రూర మృగాలు అన్ని కలిసే ఉండేవి. రోజు అల్పాహారం తరువాత సుమారు ఒక గంట వ్యాన్ ఎక్కి ఆ అడవిలో తిరుగుతుండేవాళ్ళము.

ఆ వ్యాన్ నడిపే అతను మసాయి తెగకు చెందినవాడు. వారు చాలా పొడవుగా, సుమారు 6.5' అడుగులకు తక్కువ ఉండరు. వారి ముక్కు చాలా సూటిగా ఉంటుంది. వీరు ఎర్రటి దుస్తులు వేసుకుని, చేతిలో ఎప్పుడు ఒక బల్లెం పట్టుకుని ఉంటారు. అతను మాకు అక్కడ అనేక విశేషాలు చూపుతూ ఉండేవాడు. ఇలా రోజు మా శిక్షణ కార్యక్రమానికి ముందు ఒక గంట, అయిపోయాక ఒక గంట మేము అడవిలో తిరుగుతుండేవాళ్ళము. అదొక అత్యద్భుతమైన అనుభవంగా నా మదిలో ముద్ర వేసుకుపోయింది. మాకిచ్చే శిక్షణ కూడా చాలా సహజంగా ఉండేది. భోజనం అయిన తరువాత మనం సహజంగా ఒక మత్తులో ఉంటాము. ఆ మత్తు వదలగొట్టడానికి మా శిక్షకురాలు  మాతో రకరకాల ఆటలు ఆడించేది. మాతో కలిసి ఆమె కూడా ఆడుతుండేది.

ఇలా జరుగుతుండగా ఒక రోజు సాయంత్రం నేను నా గది బయటకు వచ్చి, అలా వ్యాహ్యాళికి వెళ్ళడం జరిగింది. కొంచెం దూరం అలా వెళ్ళాక అక్కడ ఉన్న ఒక చిన్న రాయి మీద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాను "ఆహా, ఇక్కడ ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంది, మరి మన భారతదేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన కాబోలు  ఇలాంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చెట్లు నరకడం నిషేధింపబడింది, అందుకనే ఇక్కడ ప్రకృతి చాలా సమతుల్యంగా ఉంటుంది.ఇక్కడ ప్రకృతి నియమాలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ జంతువుల సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే. అందువల్ల ఇక్కడ జంతువుల జనాభా పెరిగిపోయి, వాటి ఆహరం తక్కువ అయిపోవడం కారణంగా జంతువులు వాటి ఆహరం కోసం ఒక దాని మీద ఒకటి దాడి చెయ్యటం మూలంగా వాటిలో కొన్ని గాయపడటం, మరి కొన్ని చనిపోవడం కూడా జరుగుతుంది. వీటిని నియత్రించడానికి ప్రకృతి క్రూర మృగాలను సృష్టించింది. ఈ క్రూర మృగాలు వాటికి ఆకలి వేసినప్పుడే వేరే ప్రాణులను వేటాడి చంపి తింటాయి. వాటికి ఒక్కసారి కడుపునిండాక అవి వేరే జంతువుల జోలికి పోవు. అటువంటి సమయంలో చిన్న చిన్న ప్రాణులు కూడా వాటి ముందు నుంచి ధైర్యంగా తిరుగుతుంటాయి. అప్పుడు ఆ క్రూరమృగాలు వాటి వైపు కన్నెత్తైనా చూడవు. మామూలుగా ఆహరం కోసం కొట్టుకుని చనిపోయే జంతువుల సంఖ్య కన్నా ఈ క్రూర మృగాల ఆహరం కోసం చనిపోయే జంతువుల సంఖ్య తక్కువే ఉంటుంది. ఈ రకంగా ప్రకృతి అపరిమితమయిన సంఖ్యని పరిమితం చేయడం కోసం(limitation  of  law ) ఇటువంటి క్రూర మృగాలని సృష్టించింది.  మరి మన మనుషుల సంగతేమిటి, మనమెంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాము? ఎప్పుడు పడితే అప్పుడు ఆహరం తినటం, అలాగే అనారోగ్యం తెచ్చుకోవటం, చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడటం, కోపతాపాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. మనుషులం అయిఉండి ఎందుకు మంచిని నేర్చుకోలేకపోతున్నాము, జంతువులకన్నా ఉన్నతమయిన జీవిగా మనిషి భావిస్తున్నపుడు మరి మనం ప్రాధమిక ప్రకృతి నియమాలని కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? అడవులను నరికి వేసి వాతావరణ కాలుష్యం చేస్తున్నాం, ఇష్టానుసారం సమయం సందర్భం లేకుండా తింటున్నాం, ఏమిటిదంతా " అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఎదురుగా అద్భుతమయిన ఒక తేజో వలయం కనపడింది. నేను అటువైపు చూస్తుండగా నేననుకున్నట్లుగానే సాదుపురుషుడు అయిన lobsang rampa గారు దర్శనమిచ్చారు.

ఆయన  చిరునవ్వు చూసి నాలో కూడా ఆనందం అనే తరంగం ఉప్పొంగింది. నేను ఆయనతో "మహాశయా చాలా రోజులకి దర్శనమిచ్చారు" అని నమస్కరించగా ఆయన నవ్వుతూ "నాయనా నేను నీ దగ్గిరకి చాలాసార్లు వచ్చాను కాని నేను వచ్చినపుడల్లా నీ మనసు ప్రశాంతంగా లేదు. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో, అది నిశ్చలంగా ఉన్న నీళ్ళతో సమానము. అపుడు నీ ప్రతిబింబము, ఆ నీళ్ళల్లో ఉన్న వస్తువులు ఆ నీటిలో స్పష్టంగా కనిపిస్తాయి.  కాని ఎప్పుడైతే నీ మనసు చంచలంగా ఉంటుందో, మనం సరస్సులో ఒక రాయి వేస్తే తరంగాలు ఏర్పడి మన ప్రతిబింబము ఎట్లు కనపడదో అదే విధంగా నువ్వు ఆ పరిస్థితిలో ఉండి నన్ను చూడలేకపోయావు.  ఆహ్లాదకరమయిన ఈ వాతావరణము నీ స్వభావం మీద ప్రభావం చూపించడం వలన నీ మనస్సు ప్రశాంతంగా ఉంది. అందువల్లే నువ్వు నన్ను స్పష్టంగా చూడగలుగుతున్నావు. అందులో నేను నా తేజోమయ కాంతిని చాలావరకు తగ్గించుకునే వచ్చాను ఎందుకంటే ఆ కాంతిని మీ శరీరాలు భరించలేవు. ఇక్కడికి వచ్చినప్పటినుంచి నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, మరి భగవంతుడు సృష్టించిన ఎన్నో ప్రాణులకన్నా ఉన్నతమయిన జన్మ మానవ జన్మే. కాని మానవుడిలో ఎప్పుడైతే స్వార్ధం పెరిగిపోతుందో, దురాశ ఎక్కువవుతుందో అప్పుడు ఆ మానవుడు మృగాని కన్నా హీనంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ జంతువులు ఆకలివేసినపుడు మాత్రమే పరిమిత సంఖ్యలో వేరే జంతువులను చంపటం అనే సూత్రాన్ని పాటిస్తాయి. కాని ఈ లోకంలో మానవులు ఎంత దురాశాపరులంటే వాళ్ళ కడుపు నిండి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళ ముందు పదితరాల వరకు ఆస్తి సంపాదించుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. దాని మూలంగా ప్రకృతికి విరుద్ధంగా సంఘంలో సమతూకం అనే న్యాయం తగ్గిపోతుంది. ఆఖరికి వారి జీవితమంతా నిరాశ నిస్పృహలతో, ఆందోళనతో నిండిపోతుంది. వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ వారికి ఎటువంటి సుఖముండదు. వారు చనిపోయాక కూడా ఈ ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలని తీసుకుపోలేరు కదా. పోయాక కూడా వాళ్ళ గురించి జనం వారు తమకు చేసిన అన్యాయాల గురించి చెడుగానే చెప్పుకుంటారు. కాబట్టి మనుషుల్లో ముఖ్యంగా అహంకారం అనే గుణం చాపకింద నీరులానే ఉంటుంది. పూర్తిగా ఆ నీటిలో మీరు తడిసేదాక ఆ ప్రమాదస్థాయి మీకు తెలియదు. అటువంటి మనుషుల యొక్క body energy కూడా చాలా సాంద్రత (gross) కలిగి ఉంటాయి. అందుకనే ఈ మనుషులు ఏమనుకుంటారంటే "మేము చాలా శక్తివంతులం, చంద్రగ్రహానికి రాకెట్ పంపాము, వేరే గ్రహాలలోకి కూడా వెళ్తున్నాము, మేము ఏమైనా చెయ్యగలము" అని. కాని మీకన్నా ఎన్నో రెట్లు తెలివిగలవాళ్ళు, నాగరికులు, శక్తివంతులు ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి నాగరికతలు ఎన్నో అంతరించిపోయాయి కూడా. ఎందుకంటే వారు వస్తుసంపదను భౌతికంగా చూసారు కాని పారమార్ధికంగా ఆలోచించలేదు. వారు కనిపెట్టిన అత్యాధునికమయిన ఆయుధాలు మీరు కనిపెట్టిన ఆయుధాల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమయినవి. కాని వారు ఆ ఆయుధాలను అధికార దర్పం కోసం వేరే దేశాల మీద ప్రయోగించి దుర్వినియోగ పరచడం, ఎదుటి దేశం వారు కూడా ఉన్నతస్థాయిలో అభివృద్ధి చెందినవారు కావడం వల్ల, వారు తిరిగి వీరిపై దాడి చెయ్యటం, ఈ విధంగా ఈ ప్రపంచం అంతా తాము  సంపాదించిన జ్ఞానాన్ని వేరొకరిని మట్టుపెట్టడానికే ఉపయోగించారు. అలా నాగరికతలు అంతరించిపోతున్నా కూడా మానవుడు తాను చేస్తున్న తప్పును తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే ఈ అరిషడ్వర్గాలు అనేవి చాలా భయంకరంగా మనుషుల ప్రవృత్తిలో దాగుని ఉంటాయి. ఆ చెడు సంస్కారాలు ఉన్నంత కాలం వారు ఎంత భౌతికంగా ఎదిగినా, ఎంత గొప్పవారైన వారు తమ విజ్ఞానాన్ని విధ్వంసానికే వాడుకుంటారు. వాళ్ళల్లో ఆత్మజ్ఞానం లేనంత కాలం, సమాజం పట్ల, మానవుల పట్ల ప్రేమభావం లేనంత కాలం ఈ మానవులకి పురోగతి మాత్రం ఉండదు. వాటిని సాధించుకోవడానికి ఒకే ఒక మార్గం ఆధ్యాత్మిక మార్గం. అటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని బుద్ధ భగవానుడు ద్వారా మా టిబెట్ దేశం అంతా అంగీకరించి, ఆచరించింది. మేము అహింసావాదులం కాబట్టి మా వద్ద ఆయుధాల తయారి, వేరే దేశం మీద దండయాత్రలు చేయడం, తోటివారి మీద దాడి చేయడం అనేవి ఉండదు. ఆ బుద్ధుడు మాకు నేర్పిన అహింస, కరుణ, జాలి మాత్రమే మా నాగరికతలో ఉన్నాయి, కాని ఒక్కొక్కసారి దురాక్రమణ చేయాలని తలంపు ఉన్న దేశాలు మాలాంటి దేశాలమీద దాడి చేసినపుడు మా నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మా పెద్దవారు సంపాదించిన ఆధ్యాత్మిక విజ్ఞానము సమస్తం భూమిమీద లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఇదివరకు ఇలా చాలాసార్లు జరిగింది, ఈ భూమి మీద సృష్టి మొదలయినప్పటి నుండి ఎన్నో గొప్ప జాతులు, నాగరికతలు ఇక్కడ వెలిసాయి. అయితే కొంతమంది అహింసామార్గంలో వారి నాగరికతను వృద్ధి పరచుకున్నారు, కొన్ని నాగరికతలు హింసామార్గంలో వెళ్లి అహింసావాదుల నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చైనా చేతిలో టిబెట్ దేశం దురాక్రమణకు గురి అయ్యింది. దురదృష్టవశాత్తు ఏమి జరుగుతుందంటే మాలాంటి దేశాల్లో కూడా కొంతమంది విద్రోహులు ఉంటారు, వారు పొరుగున ఉన్న శత్రువులతో చేతులు కలిపి వారిని తమ దేశం మీద దాడి చేయడానికి సహాయపడతారు. బదులుగా ధనమో, లేక వారికి కావలసిన దాన్ని పొందుతారు. అయినా కూడా మేము అహింసా మార్గంలోనే వెళ్లిపోతుంటాము.

ఒకసారి నా చిన్నతనంలో నాకు మా గురువుగారు mingyar dondup దగ్గరనుండి రమ్మని కబురు రాగా నేను వెళ్ళడం జరిగింది. ఆయనే నాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నా 3వ కన్ను తెరిపించడం ద్వారా నాకున్న ప్రత్యేక శక్తులతో అపుడప్పుడు కొన్ని మంచి పనులు చేయిస్తుండేవారు. నేను ఎందుకింత అకస్మాత్తుగా నన్ను రమ్మన్నారా అని ఆలోచిస్తూ ఆయన వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి నుంచున్నాను. ఆయన నన్ను సాదరంగా "రా lobsang rampa, కూర్చో" అని తనకు దగ్గరలో ఉన్న ఆసనం మీద నన్ను కూర్చోమని, గంభీర స్వరంతో "lobsang rampa, మనం ఊహించినట్లుగానే మన పొరుగు దేశమయిన చైనా వారు మన దేశాన్ని ఏ క్షణంలోనైనా ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేమంతా కూడా మానసికశక్తి ద్వారా ఈ దురాక్రమణ ఇప్పుడే జరగదు, మరి కొంత కాలం పట్టచ్చు అనుకున్నాము కాని కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల వారు కొంచెం ముందుగానే దాడికి దిగుతున్నారని మాకు సమాచారం అందింది. 

వారి యొక్క భావతరంగాల ద్వారా మాకు వారి ఆలోచన తెలిసిపోయింది. దురదృష్టవశాత్తు మన ప్రజలంతా అహింసావాదులే, మనం ఎటువంటి ఆయుధాలని సృష్టించుకోలేదు. ఆధ్యాత్మికంగా మనమెంతో పురోగామించాము. మన నాగరికతను, మన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులను సేకరించి ఒక రహస్యప్రదేశంలో దాచుకోవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఇదివరకు కూడా మన పెద్దవారు, మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన జాతివారు కూడా ఈ విధంగానే చేసారు కాని ఇప్పటికి అవన్నీ ఎక్కడ దాచారో ఎంతమంది అన్వేషించినా తెలియరాలేదు.  అదృష్టవశాత్తు నేను చిన్న వయసులోనే మా గురువుగారి ఆశీర్వాదంతో అటువంటి ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో  వారు రాబోయే తరానికి ఇచ్చినటువంటి సంకేతాలు ఎన్నో ఉన్నాయి" అని చెప్పగా నేను చాలా ఆశ్చర్యపోయి గురువుగారు "మీరు ఎన్నో నమ్మశక్యంకాని విషయాలు చెప్తున్నారు, నాకేమి అర్థం కావట్లేదు. మీరు ఆ ప్రదేశాన్ని చూసారా, అది ఎక్కడ ఉంది" అని అడగ్గా "lobsang ఎందుకంత ఆదుర్దా పడతావు, నేను నీకు అంతా వివరంగా చెప్తాను, నిన్ను అందుకోసమే పిలిచాను. మనం చాలా రహస్యంగా అటువంటి  ప్రదేశానికి వెళ్ళవలసి ఉన్నది. ఆ ప్రదేశం ఏమిటి, ఎక్కడుంది ఆ రహస్యాలను మాత్రం బయటకు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన చుట్టూ కూడా పొరుగు దేశపు గూఢచారులు ఉన్నారు, వారు మన ప్రతి కదలికను గమనిస్తున్నారు. మనం వనమూలికలను సేకరించడానికి ఎత్తైన ప్రదేశాలకు వెడుతుంటాము కదా, అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నట్లు మనం వారిని ఏమార్చి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళవలిసి ఉన్నది. నేనన్ని సిద్దంచేసే ఉంచుతాను, నీకు కబురు చెయ్యగానే నువ్వు ఏమి తెలియనట్లు రావాలి" అని ఆజ్ఞాపించారు. ఆ తరువాత యధాప్రకారంగా ఆయన "థమ్సా" అనే పానీయాన్ని తెప్పించగా దానిని సేవిస్తూ కొన్ని క్షణాలు గడిపాము.

మా గురువుగారు ఎందుకో కొంత విచారంగా ఉన్నారు. "Lobsang నువ్వు వెళ్ళడానికి సమయం అయ్యింది, వెళ్లిరా" అని నన్ను పంపించి వేసారు. కొద్దిరోజుల తరువాత నేను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నాకు ఆ రహస్య ప్రదేశంలో ఏముంటుందో అనే కుతూహలం బాగా పెరిగిపోయింది. నేను గురువుగారి ఆదేశం ప్రకారం ఆయన చెప్పిన చోటుకి చేరుకున్నాను. అప్పటికే ఆయన అక్కడ ఒక బృందంతో సిద్ధంగా ఉన్నారు. మా వీపున చిన్న చిన్న బుట్టలు కట్టుకుని వనమూలికల సేకరణకు వెళ్తున్నట్లుగా మేము పర్వతప్రాంతాల వైపు ప్రయాణం మొదలుపెట్టాము. అలా ప్రయాణిస్తూ మేము చాల పైకి వెళ్ళిపోయాము. అక్కడ వాతావరణములో చాలా మార్పు వచ్చింది, చలి విపరీతంగా పెరిగిపోయింది.  ఎక్కడ చూసిన అగాధాలు, పర్వత శిఖరాలే  కనిపిస్తున్నాయి. మా గురువుగారు మా అందరికి ఆయన తెచ్చిన పానీయాన్నిఇచ్చి తాగమన్నారు, అది తాగగా ఆ చలిబాధ నుంచి మాకు విముక్తి లభించింది. ఇంకా అలా పైపైకి వెళితే అక్కడ ప్రాణ వాయువు తగ్గిపోతుంది, అటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ముందుగా ప్రత్యేకమయిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 

అవన్నీ నాకు మా గురువుగారు ముందే చెప్పడం మూలంగా, ఆ వాతావరణానికి తగ్గట్లుగా నా శరీరాన్ని సిద్ధపరచుకున్నాను. అయినా కూడా కొన్ని సందర్భాలలో ఆ చలిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అక్కడ వీచే చల్లటిగాలులు మన శరీరాన్ని కోసివేస్తున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే శరీరమంతా ఉన్ని దుస్తులతో కప్పుకోవాల్సి వస్తుంది. ఇలా మేము పది రోజులు ప్రయాణం చేసాక ఒక ఉన్నత శిఖరపు అంచుకు చేరుకున్నాము. అక్కడ కిందకు చూస్తే ఒక సెలయేరు భూమి మీద ప్రవహించడం మాకు కనిపిస్తోంది. మేమందరం ఒక తాడుని మా నడుములకు కట్టుకుని ఆ పర్వతం అధిరోహించడం మొదలు పెట్టాము. దీనిని నేను చాలా కష్టతరమయిన యాత్రగా భావించాను,కాకపోతే గురువుగారు ఉన్నారనే ధైర్యంతో పెద్దగా భయపడలేదు.  అతి కష్టం మీద మేము ఆ పర్వతానికి ఆవలి వైపుకి చేరుకున్నాము. ఆ రోజు రాత్రికి మేము అక్కడే గుడారం వేసుకుని విశ్రమించాము.





Friday 14 October 2016

అతీంద్రియ శక్తులు



భారతదేశానికి రాక ముందే పాల్ బ్రంటన్ (Paul Brunton) సాధువులు, మహాత్ములు, మహర్షులు, సిద్ధ పురుషులు, అగ్గోరీల గురించి కూడా ఎంతో కొంత చదివి వచ్చాడు. అతడు తాను ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడే ఉంటున్న ఒక అగోరీ గురించి విని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకతన్ని “ఇక్కడ అగోరీ ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “అవును ఇక్కడ ఒక అగోరీ ఉన్నాడు . కాని అతను పిచ్చి వాడు, ఎవర్ని దగ్గరకు రానీయడు, రాళ్ళు పెట్టి కొడతాడు” అని చెప్పాడు. పాల్ బ్రంటన్ (Paul Brunton) “నన్ను అతని దగ్గరకు తీసుకుని వెళ్ళు. నీవు దూరంగా ఉండి అతన్ని నాకు చూపించి, నీవు వెళ్ళిపో” అని అతనికి ఎంతో నచ్చ చెప్పాడు. 

Friday 7 October 2016

అతీంద్రియ శక్తులు



ముందు చెప్పిన పాల్ బ్రంటన్ (Paul Brunton) కథ లాంటిదే జరిగిన ఒక సంఘటన  “ఒక యోగి ఆత్మ కథ” (An autobiography of a yogi) పరమహంస యోగానంద గారు వ్రాసిన పుస్తకంలో ఉంది. పరమ హంస యోగానంద గారి గురువుగారైన శ్రీ యుక్తేశ్వరగిరి స్వామి గారు ఆయనకి కలిగిన అనుభవాన్ని శ్రీ పరమహంస యోగానంద గారికి చెప్పారు.

Sunday 2 October 2016

అతీంద్రియ శక్తులు



విదేశస్థులకి మన భారతదేశమంటే చాలా కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా  అతి పవిత్రమైన హిమాలయ పర్వతాలు, మహిమలు చేస్తుండే సిద్ధులు, సాధువులు వీళ్ళందరి పట్ల వాళ్లకి ఎంతో కుతూహలం ఉంటూ ఉండేది. అప్పుడు మన భారతదేశంలో ఉండేటటువంటి సాధువులలో ఎంతమంది నిజమైన సాధువులో, ఎంతమంది కపట సాధువులో అని తెలుసుకొనడం చాలా కష్టంగా ఉండేది. అందుకని పాల్ బ్రంటన్ (Paul Brunton) అనే జర్నలిస్టుని వాళ్ళు స్పాన్సర్ చేసి భారతదేశానికి పంపించారు. అతని రాకలో ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఆ సమయంలో పేరుప్రఖ్యాతులున్నమహాత్ములని దర్శించడం, దగ్గరగా ఉండి వాళ్ళని పరీక్షించడం వాళ్ళు నిజంగా మహిమ కల వాళ్ళా , మహాత్ములా లేక దొంగ సాధువులా అని తేల్చుకోవడం.  మొట్టమొదటగా అప్పట్లో అతను
బొంబాయి నగరానికి చేరినప్పుడు అప్పట్లో అక్కడ  బాగా ప్రఖ్యాతమైన తాజ్ మహల్ హోటల్లో బస చేయడం జరిగింది. అయితే విదేశస్థులు భారతదేశానికి వచ్చేముందు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని ముందే ఒక పథకం తయారు చేసుకుని దాని ప్రకారం ఒక క్రమశిక్షణతో వాటిని పాటిస్తూ ఉంటారు. తాజ్ మహల్ హోటల్లో మామూలుగా దిగాడు. అతను ఒక రోజు బయటకి వచ్చి నిల్చున్నప్పుడు ఆ వరండాలో చాలామంది ఉన్నారు.