N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday 6 August 2016

Spiritual Soup-12

Part-12 బుద్ధదేవుడి ఆలయం

నేను టాంజానియాలో ఉనప్పుడు ప్రతి ఆదివారము ఒక పెద్ద బుద్ధుడి ఆలయానికి వెళ్ళేవాడిని. మొట్టమొదటి సారిగా అనఘాష్టమీ వ్రత పూజకి పువ్వులు అవసరం ఏర్పడి మా మిత్రుడితో పాటు ఆలయానికి వెళ్ళడం జరిగింది, విశాలమయిన ప్రాంగణంలో రకరకాల పూల చెట్లతో చాల ఆహ్లాదకరంగా ఉంది. పువ్వులు కోసుకున్నాక బుద్ధుడి ఆలయంలోకి వెళ్ళాము. అక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం వర్ణించలేనంత అందంగా ఉంది. ఆలయ పరిసరప్రాంతాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. బుద్ధుడి ముందు సాధకులు పొద్దునే వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. వారిలో ఆఫ్రికాన్స్ కూడా ఉండటం విశేషం. ఆ బుద్ధుడి మోహంలో ఉన్న ప్రశాంతత మనలో ఏదో తెలియని, చెప్పలేని శాంతిని ప్రసాదిస్తుంది. 

అక్కడ ఏ  పూజ కార్యక్రమాలు లాంటి ఆర్భాటాలు ఉండవు. అక్కడే ఒక వట మహావృక్షం ఉన్నది, అది చాల పెద్ద పెద్ద ఊడలతో ఉంది. వచ్చినవారు దాని చుట్తో ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఆలయానికి ముందు ఒక విశాలమయిన ధ్యానమందిరం  ఉంది. అక్కడ జరగబోయే కార్యక్రమాల వివరాలు ఒక కాగితం మీద అంటించబడి ఉన్నాయి. రాబోయే ఆదివారము బెల్జియం బుద్ధిష్టు సన్యాసి ఒకరు ధ్యాన ప్రక్రియ గురించి, ఆయన సాధన గురించి చెప్పడానికి వస్తున్నారని చదివాను. ఆ ఆదివారము నేను బుద్ధ ఆలయానికి  వెళ్ళగా ఒక పది నిమిషాల తరువాత కారులో ఈ బుద్ధ సన్యాసి వచ్చారు.

ఈ బౌద్ధ సన్యాసి సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఎంతో హుందాగా మొహంలోఒక మంచి తేజస్సుతో కనిపించారు. ఆయనతో పాటుగా ఇంకొక బౌద్ధ సన్యాసి కూడా వచ్చారు, ఈయనకి చెవికి పోగులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా బెల్జియం వాస్తవ్యులని తెలిసింది. బౌద్ధ మతం బెల్జియం మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా దాని ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. ఈ రెండు దేశాలలో కూడా మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో బౌద్ధ మత ఆధ్యాత్మిక కేంద్రాలు శిక్షణా తరగతులని నిర్వహిస్తుంటాయని విని ఆశ్చర్యపోయాను. ఇద్దరు సన్యాసులు ధ్యాన మందిరంలోనికి ప్రవేశించాక చిన్న సన్యాసి తన జీన్ ప్యాంటును విప్పేసి లుంగి కట్టుకున్నాడు. మేమంతా ఆయన మధ్యలో ఉండగా ఎదురు ఎదురుగా 2 వరసలలో కూర్చున్నాము. దాదాపు మాలాగా వచ్చినటువంటి వాళ్ళు ఒక పదిమంది ఉంటారు. బౌద్ధ సన్యాసి పద్మాసనంలో ధ్యాన స్థితిలో ఉండి మమ్మల్ని కూడా అదే మాదిరిగా కూర్చోమని చెప్పారు. 

చక్కటి సంగీతం మొదలుకాగానే ఆయన కూర్చునే లయబద్ధంగా ముందుకి వెనక్కి శరీరాన్ని కదిలిస్తూ ధ్యానం చేస్సారు. వారిద్దరి కదలికలు చాల హ్యుద్యంగా రమ్యంగా ఉన్నాయి, ఆ సంగీతం కూడా మనసుకి ఎంతో హాయిగా ఉంది. మంచి అగరుబత్తీల వాసన, మధ్య మధ్యలో బుద్ధుడి ప్రవచనాలు, వాటికి ఆంగ్ల భాషలో అర్థాన్ని అక్కడే ఉన్న సింహళ దేశం నుంచి వచ్చిన బౌద్ధ మతగురువు చెప్పసాగారు. ఆ తరువాత బెల్జియం సన్యాసులు ఇద్దరూ కూడా మాకు ముందు ఉండి ఒక విచిత్రమయిన నాట్య భంగిమలతో సంగీతానికి లయ బద్ధంగా ముందుకి అడుగులు వేస్తుండగా మేము వారిని అనుసరించాము. వారు వేసే అడుగులు, వారి యొక్క కదలికలు  చాలా అందంగా, హుందాగా ఉన్నాయి. మనస్సునిండా ఒక విధమయిన ప్రశాంతత ఏర్పడింది  ఆ కార్యక్రమం అయ్యాక నేను పెద్ద సన్యాసిని పరిచయం చేసుకొని కొన్ని వివరాలు తెలుసుకున్నాను.

వాళ్ళిద్దరూ కూడా మోరోగోరో పట్టణములో ఒక పెద్ద NGO  సంస్థలో పని చేస్తున్నారుట. వారు ప్రత్యేకంగా ఒక జాతికి చెందిన ఎలుకలకి శిక్షణ ఇస్తూ ఉంటారుట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు, బాంబు దాడులు, శత్రువులు రాకుండా భూమి లోపల బాంబులు(landmines) పెట్టటం సర్వసాధారణం అయిపోయింది. తెలిసీతెలియని వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే అవి పేలి కొన్ని సార్లు కొన్ని వందలమంది చావుకి కారణం అవుతున్నాయి. ఎక్కడెక్కడ వీటిని పెట్టారో కనుక్కోవడం మనుషులకి కష్టం కాని జంతువులకి సులభం. వీరు ఆ ఎలుకలకి ఏ విధంగా శిక్షణ ఇస్తారు అని నేను అడిగినప్పుడు, ఎలుకల మీదకి సన్నటి, మెత్తటి, పొడవాటి తాళ్ళని కడతారు. ఒక ప్రాంతం ఎంచుకుని అక్కడే భూమిలోపల     పనిచెయ్యని డమ్మి landmines ని పాతిపెడతారు. ఈ ఎలుకల వెంట పొడవాటి తాడు చేతిలో పట్టుకుని వాటిని వెంబడిస్తూ ఉంటారు వీరు. ఆ ఎలుకలు సరిగ్గా ఈ land mines  పాతిన చోటికి వచ్చి, వాసన చూసి వాటిని పసిగడతాయి. ఎలుకల బరువు తక్కువగా ఉన్నందు వల్ల నిజమైన landmines మీద వెళ్ళిన వాటికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విధంగా ప్రపంచంలో వారు వివిధ దేశాలలో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలని పరిష్కరించటానికి ప్రత్యేకంగా వెళ్లి ఆ దేశాలకి సహాయం చేస్తుంటారు. 

నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న ఎలుక కొన్ని లక్షలమంది ప్రాణాలని ఎలా కాపాడుతున్నాయి, ఈ రోజుల్లో మనుషులు మనుష్యులని అతి దారుణంగా, రకరకాల మారణాయుధాలతో అతి క్రూరంగా చంపుతుంటే ఒక చిన్న ప్రాణి,ఒక అల్ప జీవిగా భావించే ఎలుక మనకి నిజంగా ప్రాణ దానం చేయటం అనేది అసలైన మానవత్వంగా, దైవత్వంగా మనం భావించాల్సి వస్తుంది. అహింసని బోధించే బుద్ధుడి యొక్క ఈ అనుచరిలద్దరూ ఎంతో ఓర్పు, సహనంతో ఎలుకలకి శిక్షణ ఇస్తున్నారంటే మరి వారిని మనం దైవ మానవులుగా పేర్కొనక తప్పదు. ఈ విధంగా మానవాళికి ఎన్నో రకాలుగా విచిత్రమయిన పద్ధతిలో ఎటువంటి ప్రచారం లేకుండా ఎంతో సహాయం కానీ, ప్రాణదానం చెయ్యడం కానీ సామాన్య విషయం కాదు. 

బుద్ధుడు బోధించే అహింస, కరుణ మరియు నిష్కల్మషమయిన ప్రేమలో అంతే బ్రహ్మాండమైనటువంటి విశ్వశ్రేయస్సు దాగి ఉందని నేను అనుకున్నాను. ఒక చిన్న సహాయం చేస్తేనే మనము మన పేర్లను శిలా ఫలకం మీద రాయించుకుని, ప్రచారము చేస్తాము కాని ఇటువంటి నిస్వార్దులయిన అజ్ఞాతంగా ఉండే ఎందరో మహానుభావులకి మనమంతా కూడా రుణపడి ఉంటాము. ఎన్నో విషయాలు ఇటువంటివి మననం చేసుకుంటూ నేను ఇంటికి చేరిపోయాను. మామూలు చిన్న చిన్న ప్రాణులలో మనం చూస్తున్న  పరస్పర సహకారం, ప్రేమ అనేది మనుష్యులలో ఎందుకు లేదు, మానవత్వం పోయి మనం ఎందుకు రాక్షసత్వంగా మారిపోయాము అని ఆలోచిస్తుండగా నా మనసులో గాడంగా ముద్ర వేసుకున్న ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది.

పక్షుల సంఘీభావం

నేను ఉద్యోగరిత్యా హనుమకొండలోని లస్కరు బజారులో ఒక ఇంట్లో ఉండేవాడిని. మేము భోజనం చేసే గదిలో ఒక సీలింగ్ ఫ్యాను ఉండేది. ఆ గదిలో ఒక మూల చిన్న సందులో ఒక ఊర పిచ్చుక కుటుంబం ఉండేది. అవి మెల్లగా అక్కడే గూడు కట్టుకుని వాటి మానన అవి ఉండేవి. అవి ఉన్నంత సేపు మేము ఫ్యాను వాడే వాళ్ళము కాదు. ఎందుకంటే ఇదివరలో ఆ పక్షులకు దెబ్బ తగలడం, అవి కింద పది బాధపడటం వాళ్ళ వాటి మీద జాలితో మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మేము మా నిత్య వ్యవహారంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు కాని నేను మాత్రం ఆ గదిలో ఉన్నంత సేపు వాటినే గమనిస్తూ ఉండేవాడిని. ఒకసారి వాటిలో ఆడ పక్షి గుడ్లు పెట్టింది, వాటిమీదే పొదగడానికి కూర్చుని ఉండేది. మగ పక్షి  ఆహరం తెచ్చేది. కొన్నిరోజులకి గుడ్లు పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాయి, వాటి అరుపులు మాకు వినిపిస్తూ ఉండేవి. ఇంతలో అనుకోని ఒక ప్రమాదం జరిగినిది, ఫ్యాను వెయ్యడం, ఆ మగపక్షి నోట్లో ఆహరం పట్టుకుని రావటం, అకస్మాత్తుగా ఫ్యాన్ రెక్క తగలడం, ఆ పక్షి కింద పడి గాయంతో విలవిలలాడి చనిపోవడం జరిగింది. 

ఇది గమనించిన నేను, మా కుటుంబం చాల బాధపడ్డాము. పాపం ఆ పిల్లల గతి ఏమిటా అని ఆందోళన చెందాము. ఇంతలో ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఇంకొక జంట పక్షులలోని మగ పక్షి నోట్లో ఆహరం పెట్టుకుని ఎంతో ప్రేమగా తల్లి పక్షికి, పిల్లలకి ఆహరం అందివ్వసాగింది. ఇది గమనించిన నాకు వాటి యొక్క సంఘీభావం, సహకారం చూసి ఒక విధమైనటువంటి సంతోషం కలిగింది.

ఇటువంటి ఉన్నతమైన సంస్కారం మన మనుషులలో లేకపోవటం చాల బాధ అనిపించింది. మానవులలో ఒక కుటుంబం అనాధ అయిపోతే తోటి మానవులు సహాయం చేసే సామర్థ్యం ఉండి కూడా ఏ మాత్రం సహాయం చేయకపోగా వారిని చాలా హీనంగా చూస్తుంటారు, ఆహా మానవత్వమా ఎక్కడ దాగి ఉన్నావు, మానవుని కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయనుకునే ఈ మూగ జీవులలో బ్రతికి ఉన్నావా. మరి మనం మంచి పుస్తకాలు  చదువుతూ కూడా, మంచి ఉదాహరణలు నలుగురుకి చెప్తుంటాం కానీ ఆచరణ మాత్రం శూన్యం కదా. ఓ దత్త బంధువులారా మనమందరం కూడా దత్తతత్వాన్ని అర్థం చేసుకుని కాంతిమయ శరీరధారులుగా మారదాము.  చీకటిని తిట్టుకునే బదులు ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిద్దాము.

ఒక సమూహంగా ఏర్పడి ఒక 100000 కొవ్వొత్తుల కాంతిని సమాజంలో విస్తరింపచేద్దాము. తోటి దరిద్రనారాయణుల పట్ల, అభాగ్యులపట్ల ఎంతో కొంత సామాజిక సేవ చేద్దాము. దత్త మహా ప్రభువు, "నాకు గుడులు గోపురాలు కట్టించండి, వెండి బంగారు తొడుగులు వెయ్యండి' అని ఎప్పుడు కూడా అడగలేదు. మానవ సేవయే మాధవ సేవ అని ఆయన మనకి నీతి వాక్యాన్ని అందించారు. దానికి ఉదాహరణ సాయిబాబా జీవితం. కాని మనమిప్పుడు ఏమి చేస్తున్నాం, ఆ స్వామికి ఇష్టంలేనటువంటి కానుకలని సమర్పించడం, స్వామిని భాగ్యవంతుడిని చెయ్యడం, మరల అధికారం కోసం దెబ్బలాడుకోవడం ప్రస్తుతం పరిపాటి అయిపొయింది. దీనికి తార్కాణంగా దత్త మహా ప్రభువు యొక్క ముఖ్యమయిన అవతారాలు, గుప్త అవతారాలు, అంశ అవతారాలు యొక్క జీవితమే మనకు ఆచరణీయము.